ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది

ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది

Written By news on Tuesday, December 31, 2013 | 12/31/2013

ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది: జగన్
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో  వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం కొనసాగుతోంది. డిసెంబర్‌ 27న మొదలైన రెండో విడత సమైక్య శంఖారావానికి  చిత్తూరు జిల్లా ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారు.  మహిళలు, యువత , విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు.  వృద్దులు  నడవలేని స్థితిలో కూడా మహానేత వైఎస్ఆర్ తనయుడ్ని చూడటానికి తరలి వస్తున్నారు. 
తనకోసం వచ్చిన  ప్రతి ఒక్కరితో జగన్‌ ఆప్యాయంగా మాట్లాడుతున్నారు.  పెద్దాయన ఉన్నప్పుడు పించన్ వచ్చేదని..ఆయన పోయిన తరువాత రావడంలేదని ఓ వృద్దురాలు  చెప్పటంతో......  మన ప్రభుత్వం వచ్చిన తరువాత అప్లికేషన్ పెట్టు..నీకు న్యాయం జరిగేటట్లు చూస్తానని జగన్‌ ఆవృద్దురాలికి మాట ఇచ్చారు.

ఇక మహిళలు హారతులు పడుతూ జగన్‌కు గ్రామగ్రామాన స్వాగతం పలుకుతున్నారు. ఓ వికలాంగ వృద్దురాలు తనకు  పింఛన్ రావడంలేదని...అధికారులు పింఛన్ ఇవ్వడానికి నిరాకరించారని ఆమె తన గోడును వెలిబుచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్దురాలుకు  జగన్‌ ధైర్యం చెప్పి పంపించారు.  నాలుగు నెలలు ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది అంటూ తనను కలవడానికి వచ్చిన వృద్దులకు జగన్ భరోసా చెప్పారు‌.  మరోవైపు మహిళలు చంటి పిల్లలను చంకన వేసుకుని  మహానేత తనయుడ్ని చూడటానికి వచ్చారు.
Share this article :

0 comments: