రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం తథ్యమని ఆపార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. 200లకు పైగా అసెంబ్లీ, 35 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. వైఎస్ జగన్ మద్దతు కోసం అన్ని పార్టీలు క్యూ కడతాయని మేకపాటి అన్నారు.
దేశ రాజకీయాల్లో జగన్ కీలక పాత్ర పోషిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని వైఎస్ఆర్ సీపీ కోరుకుంటుందని మేకపాటి తెలిపారు. శ్రీరంగ నీతులు చెబుతున్న చంద్రబాబు, ఆయన అవినీతిపై తెహల్కా రాసిన కథలు మరిచిపోయారని ఎద్దేవా చేశారు.
దేశ రాజకీయాల్లో జగన్ కీలక పాత్ర పోషిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని వైఎస్ఆర్ సీపీ కోరుకుంటుందని మేకపాటి తెలిపారు. శ్రీరంగ నీతులు చెబుతున్న చంద్రబాబు, ఆయన అవినీతిపై తెహల్కా రాసిన కథలు మరిచిపోయారని ఎద్దేవా చేశారు.