వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో దాడి వీరభద్రరావు చేరడం తమకెంతో సంతోషంగా ఉందని విశాఖ జిల్లా వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ గొల్ల బాబురావు అన్నారు. వచ్చ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తమ పార్టీ అన్నిస్థానాలు క్లీన్స్వీప్ చేస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.
|
|
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో దాడి వీరభద్రరావు చేరడం తమకెంతో సంతోషంగా ఉందని విశాఖ జిల్లా వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ గొల్ల బాబురావు అన్నారు. వచ్చ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తమ పార్టీ అన్నిస్థానాలు క్లీన్స్వీప్ చేస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.
|
|
|
చంద్రబాబుకు, కిరణ్కుమార్రెడ్డికి పెద్దగా తేడా లేదు: షర్మిల
![]() ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో సాగింది. జూలూరుపాడు మండల కేంద్రంలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఈ సందర్భంగా షర్మిల ప్రసంగించారు. ‘‘చంద్రబాబు 8 ఏళ్ల 8 నెలల పాలనలో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. కిరణ్కుమార్రెడ్డి నాలుగేళ్ల పాలనలో నాలుగు సార్లు కరెంటు చార్జీలు పెంచారు. ఆయన ఐదు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచితే... ఈయననాలుగేళ్ల పాలనలో మూడు సార్లు పెంచారు. ఆయన గ్యాస్ ధర రెట్టింపు చేసి పెంచితే, ఈయనా రెట్టింపు చేశాడు. ఈ ఇద్దరికీ ఏమీ తేడా లేదు. ప్రజలు కూడా ఇద్దరినీ ఒకే రకంగా చూస్తున్నారు. ఎట్లయితే చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపారో, అలాగే కిరణ్కుమార్రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజు త్వరలోనే వస్తుంది’’ అని షర్మిల అన్నారు. 12.4 కిలోమీటర్ల మేర యాత్ర: ![]() |
రాజన్నే నడిపిస్తున్నాడు
* 137 రోజులుగా షర్మిలతోపాటు వైఎస్ అభిమానుల పాదయాత్ర * జ్వరమొచ్చినా.. కాళ్లు బొబ్బలెక్కినా.. ఆగకుండా నడక * వైఎస్ కుటుంబానికి జరిగిన అన్యాయానికి నిరసనగా కొందరు * సాయం చేసిన మహానేత రుణాన్ని తీర్చుకోడానికి మరికొందరు * పాదయాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రైతు బాంధవుడు రాజశేఖరన్న... రచ్చబండకు పయనమై... చోదకుని తప్పిదమో... మానవ కుట్రయో మరణం వాటిల్లెనయా.. ఆంధ్రదేశ ప్రజలు అల్లాడిరి... కొందరు ఆహుతైరి... నువ్వు తెచ్చిన అధికారంతో నీ పుత్ర బాంధవుడిని జైలు పాలు చేసిరన్నా... ఆలకింపుడయ్యా...! ఇదెక్కడి న్యాయమో... ఆలకింపుడయ్యా ఆంధ్రదేశ ప్రజలారా... ఆంధ్రదేశ పౌరులారా... అమ్మా...! షర్మిలమ్మ ఏ నాడు నడిచినావు... ఈ గతుకుల రోడ్లలోనా... ఈ నాడు తల చూపితివి ప్రచండపుటెండకు.. నడిచావుతలశిల రఘురామ వేసిన బాటలోనా... ప్రజల, రైతుల కష్ట సుఖములను చెవిచేర్చితివి.. అమ్మా...! షర్మిలమ్మా.. నీ వెంటే మేమంత జగనన్న దారిలోనా.. షర్మిలమ్మా! అని మందలపు సత్తెన్న రాగమెత్తితే జనమంతా వంత పాడారు. ‘‘కుట్రేదో చేసి పులి లాంటి మహానేతను పొట్టనబెట్టుకున్నారు.. అదే కుట్రతో పులి బిడ్డను బంధించారు.. ఆడబిడ్డను ఇలా రోడ్డు మీద నిలబెట్టారు. ఆమెకు అండగా నిలబడాలనే పాదయాత్రలో మేము సైతం అంటూ పదం కలుపుతూ కదం తొక్కుతున్నాం. మహానేతపై ఉన్న అభిమానంతోనే ఇంత దూరం అలుపన్నదే లేకుండా అవలీలగా నడుస్తున్నాం. రాజన్నే మమ్మల్ని నడిపిస్తున్నాడు’’ అని ‘మరో ప్రజాప్రస్థానం’లో ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేస్తున్న పలువురు తమ మనోభావాలను వివరించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన పాదయాత్ర రెండు రోజులుగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో సాగింది. కాళ్లు బొబ్బలెక్కినా.. జ్వరమొచ్చినా.. ఆగకుండా ఏడు నెలలుగా తన అడుగులో అడుగువేసి కదం తొక్కుతున్న అలుపెరగని పాదయాత్రికులతో కలిసి షర్మిల వారి అభిప్రాయాలు పంచుకున్నారు. శుక్రవారం ఎన్కూరు మండలం రాజలింగాల గ్రామ శివారులో చెట్టుకింద కూర్చొని వారంతా మాట్లాడారు. వారి అభిప్రాయం వారి మాటల్లోనే.. ![]() - కాపు భారతి, రాయదుర్గం, అనంతపురం ![]() - దయామణి, బల్లెపల్లి, ప్రకాశం జిల్లా ![]() - అంజిరెడ్డి, పర్చూరు, ప్రకాశం జిల్లా ![]() - దవళ వెంకట గిరిబాబు, ఎన్ఆర్ఐ, టెక్కలి, శ్రీకాకుళం ![]() -ఉప్పు వరప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా ![]() - డాక్టర్ హరికృష్ణ, పుట్టపర్తి, అనంతపురం జిల్లా ![]() - కరుణాకర్, పులివెందుల, కడప జిల్లా ![]() - పేరమ్మ, పులివెందుల, కడప జిల్లా ![]() - లక్ష్మీరెడ్డి, జమ్మలమడుగు, కడప జిల్లా ![]() - కె.వెంకటనారాయణ, ఎర్రగుంట్ల కడప జిల్లా ![]() - జొన్నల శ్రీనివాసరెడ్డి, దేవరపల్లి, కృష్ణా జిల్లా ![]() - ఐలా వెంకట కోటిరెడ్డి, నర్సరావుపేట, గుంటూరు జిల్లా ![]() - ఇమాం బాష, పులివెందుల, కడప జిల్లా ![]() - నర్సింహ్మ, అనంతపురం ![]() - నాగలక్ష్మి, పులివెందుల, కడప జిల్లా |
|
|
ఖమ్మం జిల్లా ఏన్కూరులో జరిగిన బహిరంగ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై షర్మిల మండిపడ్డారు. సొంత మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుది అని షర్మిల అన్నారు. తొమ్మిదేళ్ల హయాంలో 8సార్లు చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచారని షర్మిల విమర్శించారు. బాబుకు పదవి మీద ఆశ లేదంటే భూమి గుండ్రంగా లేదన్నట్టే అని షర్మిల వ్యాఖ్యానించారు.
రంగులు మార్చడం బాబు రక్తంలోనే ఉందని, విలువలు, విశ్వసనీయత బాబు డిక్షనరీలోనే లేవని షర్మిల అన్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా అమ్మేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు నిజం చెప్పకూడదనే శాపం ఉన్నట్టుందన్నారు. కాంగ్రెస్కానీ సీబీఐని కానీ బాబు ఎందుకు ప్రశ్నించడంలేదని షర్మిల నిలదీశారు. |
|
|
|
విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ గురువారం విశాఖపట్నంలో ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలు చైతన్యవంతులైనందు వల్లే బాబును రెండుసార్లు ప్రతిపక్షనేతగా ఉంచారని ఈ సందర్భంగా కొణతల రామకృష్ణ గుర్తు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కాంగ్రెస్ కు సీల్డ్ కవర్ లా పనిచేస్తోందని ప్రజలకు అర్థమైందని ఆయన వివరించారు.
|
సికింద్రాబాద్: అడ్డగుట్ట రచ్చబండలో తమ బాధలు చెప్పుకున్న ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధైర్యం చెప్పారు. జగన్ వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తారని, అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడం ఈ రచ్చబండ ఉద్దేశమని చెప్పారు. పథకాలు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకోవడానికే పార్టీ ఈ రచ్చబండను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు తీరుతాయని చెప్పారు. జగన్ అధికారంలోకి వస్తే వృద్ధులకు 700 రూపాయల పించన్ ఇస్తారన్నారు. కార్మికులందరికీ విజయమ్మ మేడ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ సీపీ పేరులోనే శ్రామికులను చేర్చామని చెప్పారు. ఈ ప్రభుత్వం పాలనలో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యుత్ కోతలతో ఫ్యాక్టరీలు మూత పడటంతో 20 లక్షల మంది ఉపాధి కోల్పోయినట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండేళ్లుగా కుంటుపడుతున్నాయని బాధపడ్డారు. వైఎస్ కుటుంబాన్ని వేధించడమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఏ ప్రాతిపదికన ఈసీజీ కార్ల కంపెనీకి పెట్టుబడికి మించి రాయితీలు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రప్పించినట్లు, లక్ష మందికిపైగా ఉపాధి కల్పించినట్లు కిరణ్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. అన్ని పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయని, కనీసం ఒక్కరికైనా ప్రభుత్వరంగంలో ఉపాధి కల్పించారా? అని ఆమె ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు పెంచారని, ఆర్టీసీ ప్రైవేట్ పరం చేయాలని చూశారన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకులు రాష్ట్రంలో రావాలసిన అవసరం ఉందని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు 50 ప్రభుత్వ రంగ సంస్థలను టీడీపీ నేతలకు దారాదత్తం చేశారని చెప్పారు. దాంతో వేలాది కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. |
ఖమ్మం: ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కరెంట్ బిల్లులు విపరీతంగా పెరిగాయని, రైతులకు రుణాలు అందడంలేదని, పంటనష్ట పరిహారం అందడంలేదని గిరిజన మహిళలు సూర్యతండాలో షర్మిల నిర్వహించిన రచ్చబండలో కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ ప్రభుత్వ హయాంలో పావలావడ్డీ రుణాలు సక్రమంగా అందేవని..ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడంలేదంటూ మహిళలు షర్మిలతో అన్నారు. అయితే మహిళల బాధలకు స్పందించిన షర్మిల ..త్వరలోనే రాజన్నరాజ్యం వస్తుంది అని భరోసా నింపారు.
రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి అయితే కష్టాలు తీరుతాయని షర్మిల అన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా గిరిజనులకు 2లక్షల ఎకరాలకు యాజమాన్య హక్కు కల్పించిన ఘనత వైఎస్దేనని ఈ సందర్బంగా గుర్తు చేశారు. వైఎస్ బతికివుంటే మరో 6లక్షల ఎకరాలు భూపంపిణి జరిగి వుండేదని షర్మిల అన్నారు. నాడు వైఎస్ ప్రతి కుటుంబానికి 30కేజీల బియ్యం ఇవ్వాలనుకున్నారని.. కానీ నేడు కిరణ్ సర్కార్ 20కేజీలకే పరిమితం చేసిందని షర్మిల విమర్శించారు. మహిళలకు మేలు చేసేందుకు జగనన్న అమ్మఒడి వంటి పథకాన్ని ప్రకటించారని షర్మిల తెలిపారు. |
మహిళలకు ఒక్క బిందె మంచి నీళ్లు అందివ్వడం చేతకాని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. కొత్తగా ప్రకటించిన బంగారుతల్లి పథకానికి కొనసాగింపుగా ‘బూచోళ్లం వస్తున్నాం’ అని చేరిస్తే కిరణ్ ప్రభుత్వం చేస్తున్న పనులకు అతికినట్లు సరిపోయేదని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా తాగడానికి గుక్కెడు మంచినీళ్లు దొరకడంలేదు. మంచి నీటి కోసం మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టడంలేదు. అలాంటి వ్యక్తులు మహిళలకు మంచిచేస్తామంటే నమ్మెదెవరు? ఎన్నికల సమయం దగ్గరకొస్తోందని మహిళలను మచ్చిక చేసుకోవడానికి వారు ఆడుతున్న గిమ్మిక్కులు’’ అని దుయ్యబట్టారు.
|
![]() |
Subscribe to ysr congress |
Visit this group for YSR CONGRESS updates |