07 July 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఓటుతో ఆ పార్టీలకు బుద్ది చెప్పండి:వైఎస్ఆర్ సిపి

Written By news on Saturday, July 13, 2013 | 7/13/2013

ఓటు ద్వారా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బుద్ది చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ప్రజలకు పిలుపు ఇచ్చారు. పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్నాయని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు సుచరిత, బాలరాజు, బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. చంద్రబాబుని ఆదర్శంగా తీసుకున్న తెలుగుతమ్ముళ్ళు కాంగ్రెస్‌తో సయోధ్య కుదుర్చుకుంటున్నారన్నారు. 

టీడీపీ, కాంగ్రెస్ కుమ్ముక్కు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. పంచాయితీ ఎన్నికల్లో ఒప్పందాలు కుదుర్చుకుని మాకది-మీకిది అనే పద్దతిలో ఆ రెండు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని అడ్డుకోవడమే వారి ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్ముక్కు రాజకీయాలపై రాష్ట్రప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఓటు ద్వారా ఆ రెండు పార్టీలకు తగిన రీతిలో బుద్దిచెప్పాలన్నారు. 

YS Vijayamma calls upon cadre to unite to win Panchayat Polls

Sharmila fires at undavalli comments in padayatra

ప్రజాసంక్షేమం కోసం...జగనన్న అడుగుజాడల్లో నడుస్తాం

వేధింపులను భరించి, నిర్బంధాలను సహించి జగనన్న చేస్తున్న ఈ పోరాటం ఎవరి కోసం? తన కోసం కాదు. జనం కోసం. కన్న కలల్ని నిజం చేసుకోలేని ఓ పేద విద్యార్థి కోసం. నీరు కరువై కన్నీరు మింగుతున్న రైతు కోసం. జీవితకాలం కుటుంబ భారం మోసి అలసిపోయిన ఒక దిగువ మధ్యతరగతి సగటు మానవుడి భృతి కోసం. నా అన్నవారు, ఆదుకునేవారు అసలే లేని ఎందరో అనాథల కోసం. నేటి సమాజంలో మనుగడ కోసం మృగాళ్లతో పోరాడుతున్న ఆడకూతుళ్ల రక్షణ కోసం. ఒక కార్మికుడి కోసం, ఒక నిరుద్యోగి కోసం. కానీ ఏమైంది? మన ఉద్యమ నాయకుడిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన మధ్య లేకుండా చేసింది. 

జైలు బయటికి రానీయకుండా సీబీఐ చేత కాపలా కాయిస్తోంది. రాజన్న మరణం చూసి గుండె చెరువైపోయిన కోట్లాదిమంది అభిమానులలో నేనూ ఒకడిని. జగనన్నను బందీగా చేసి సామాన్యుడి ఆశలను ఈ పాలక, ప్రతిపక్షాలు చిదిమేస్తుంటే నిస్సహాయంగా ఉండిపోయినవారిలో నేనూ ఒకడిని. కానీ మాలాంటి యువకులెందరికో నేడు జగనన్న తన ధైర్యంతో, ఏమాత్రం సడలని గుండెనిబ్బరంతో ఆదర్శంగా నిలిచారు. జగనన్న రాక కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. ప్రజాసంక్షేమం కోసం ఆయన ఆడుగుజాడలలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నాం. 

- భరత్ అజాద్, ఇ-మెయిల్

జగన్‌ని జైల్లో పెట్టినందువల్ల జనానికి నష్టం జరుగుతోంది

జగనన్నను నిర్బంధించిన తీరును, ఆయన బయటకు రాకుండా జరుగుతున్న కుట్రలను చూస్తూంటే చట్టం ఇంత పక్షపాతంగా, న్యాయం ఇంత అన్యాయంగా ఉంటుందా అని ఆవేదన కలుగుతోంది. నిత్యం ప్రజల మధ్య ఉండే ఒక నాయకుడిని ఇలా కక్షకట్టి జైలుపాలు చేయడమంటే ప్రజలతో ఆయన గడపవలసిన అమూల్యమైన సమయాన్ని బూడిదపాలు చేయడమే. అసలు ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రతినిధిని ప్రజలను కలవనీయకుండా చేయడం ఎంత అప్రజాస్వామికం! జగనన్న బయట ఉండి ఉంటే కనుక ఈ ఏడాదికాలంలో ఎంతోమంది నిరుపేదలకు మేలు జరిగి వుండేది.

పాలకులు పట్టించుకోని ఎన్నో సమస్యలు ఆయన ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్లేవి. ఇప్పుడా అవకాశం లేదు. ఎప్పటికి వస్తుందో కూడా తెలియడం లేదు. దీన్నిబట్టి చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌ని నిర్బంధించిన ఫలితంగా ప్రజలకు నష్టం కలుగుతోందని స్పష్టమవుతోంది. ప్రజాసంక్షేమం గురించి ఆలోచించే ఏ ప్రభుత్వమైనా ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందా? ప్రభుత్వం తను చెయ్యవలసిన పనులు చెయ్యట్లేదు కాబట్టే జగనన్న ఓదార్పుయాత్రలో భాగంగా తెనాలి వచ్చినప్పుడు ఆయన్ని కలిసి స్థానిక సమస్యలపై వినతిపత్రం సమర్పించాం. దానికి జగనన్న ‘‘త్వరలోనే మంచి రోజులు వస్తాయి. రాజన్న రాజ్యం వస్తుంది. మొత్తం రాష్ట్రానికే స్వర్ణయుగం వస్తుంది’’ అని చెప్పారు. ఆ మాటలు నిజం కావాలంటే జగనన్న తక్షణం విడుదల కావాలి. ఈ వాస్తవాన్ని న్యాయాధీశులు గమనించాలి. 

- చింతపల్లి సాయికిరణ్, తెనాలి, గుంటూరు జిల్లా

బాబు గురించి మాట్లాడవేం ఉండవల్లీ ?

 మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల ధ్వజం
- ఎంపీగా గెలుస్తానని ఉండవల్లికే నమ్మకం లేదు.. కానీ, వైఎస్సార్ ఆయన్ని రెండుసార్లు ఎంపీని చేశారు
- ఇప్పుడు అదే ఉండవల్లి వైఎస్సార్‌పై క్విడ్‌ప్రోకో ఆరోపణలు చేస్తున్నారు
- జగన్‌పై విషంగక్కి.. బాబు గురించి ఒక్కమాటా మాట్లాడలేదు
- వైఎస్సార్ పథకాలకు తూట్లు పొడుస్తున్న కిరణ్‌నూ విమర్శించలేదు
- బొత్స కుటుంబానికి వైఎస్సార్ ఎంత మేలు చేశారో అందరికీ తెలుసు.. అయినా వైఎస్‌పై బొత్సకు కృతజ్ఞత లేదు
- విలువలు, విశ్వాసం, విశ్వసనీయత లేకపోతే మనిషికి, మృగానికి తేడా లేదు 

(మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి) : ‘బొత్సగారి కుటుంబానికి వైఎస్సార్ ఎంత మేలు చేశారో, ఆయన కుటుంబానికి ఎన్ని పదవులు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. కానీ సత్తిబాబు గారికి ఆ కృతజ్ఞత లేదు. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారికైతే ఎంపీగా గెలుస్తారని ఆయనకే నమ్మకం లేదు. కానీ, ఉండవల్లి గారిని వైఎస్సార్ ఒకసారి కాదు, రెండుసార్లు ఎంపీగా చేశారు. ఇప్పుడు ఆయన జగన్‌మోహన్‌రెడ్డి మీద విషం కక్కుతున్నారు. మనిషి అన్న తరువాత కృతజ్ఞత ఉండాలి. విలువలు, విశ్వాసం, విశ్వనీయత ఉండాలి. ఇవి లేకపోతే మనిషికి, మృగానికి తేడా లేదు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఘాటుగా విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం విజయనగరం నియోజకవర్గంలో సాగింది. జిల్లా కేంద్రంలోని మూడు లాంతర్ల సెంటర్లో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి షర్మిల మాట్లాడారు. ఈ ప్రసంగం సారాంశం ఆమె మాటల్లోనే...

మొన్న ఉండవల్లి అరుణ్‌కుమార్‌గారు రాజమండ్రిలో ఒక సభ పెట్టారు. జగన్‌మోహన్‌రెడ్డిగారిని ఇష్టమొచ్చినట్లు విమర్శించారు. వైఎస్సార్, జగనన్న క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. కానీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుగారి గురించి మాట్లాడలేదు. ఆయన మీద ఏ విమర్శా చేయలేదు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన మంచి పథకాలకు తూట్లు పొడుస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిగారి మీద కూడా ఎంపీ హోదాలో ఈ ఉండవల్లి అరుణ్‌కుమార్‌గారు ఏ విమర్శలూ చేయలేదు. అలాగే సీబీఐ కాంగ్రెస్ పెరట్లో కుక్క అని, కాంగ్రెస్ పంజరంలో చిలుక అని మన దేశంలోనే బొగ్గు కుంభకోణం కేసుతో సహా మొన్న రైల్వేమంత్రి బన్సల్‌గారి కేసు వరకు రుజువైన విషయాలను కూడా ఉండవల్లిగారు ప్రస్తావించలేదు. కానీ, జగన్‌మోహన్‌రెడ్డిగారి మీద మాత్రం విషంగక్కారు. మిగతా వాళ్లను ఎందుకు విమర్శించలేదు ఉండవల్లిగారూ అని అడిగితే.. ‘నా పక్కన ఉన్నాయనకు ట్రైన్ టైం అయిపోయింది. అందుకే బాబును విమర్శించలేదు. నా కింద కూర్చున్నాయనకు చాయ్ టైం అయింది. అందుకే టీడీపీని విమర్శించలేదు’ అంటూ సమాధానం చెప్పారు. రెండుసార్లు ఎంపీగా గెలిపించిన వైఎస్సార్‌పై ఉండవల్లిగారికి కృతజ్ఞత లేదు. వైఎస్సార్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తుంటే కళ్లప్పగించి చూశారు. ఈ రోజేమో వైఎస్సార్ క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్నారు.

రాజశేఖరరెడ్డిగారు, జగన్‌మోహన్‌రెడ్డిగారు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది అని బొత్సగారు అంటున్నారు. నిజానికి జగన్‌మోహన్‌రెడ్డిగారు దోషిగా ఈరోజు జైల్లో లేరు. కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న సీబీఐ అనే కీలుబొమ్మ.. జగన్‌మోహన్‌రెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారంటూ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే, విచారణ జరపడానికి ఇంకా సమయం కావాలని ఆ సంస్థ అడిగితే కోర్టు సమయం ఇచ్చింది. అంతే. జగనన్న మీద ఇంకా ట్రయలే మొదలుకాలేదు. ట్రయల్ కూడా ప్రారంభం కాకపోతే ఏ కోర్టైనా జగన్‌మోహన్‌రెడ్డి గారిని ఎలా దోషి అంటుందనే ఇంగితం కూడా మీకు లేదా బొత్సగారూ అని అడుగుతున్నాం. జగన్‌మోహన్‌రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ కేసులు వేసింది ప్రజలు కాదు. మీ పార్టీకే చెందిన శంకర్‌రావు అనే వ్యక్తి. ఆ తరువాతే ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇది క్విడ్ ప్రోకో కాదా బొత్సగారూ అని అడుగుతున్నాం. 

బొత్సగారు మన రాష్ట్రంలోనే పెద్ద లిక్కర్ మాఫియా డాన్ అని, రాష్ట్రమంతటా ఆయన బినామీలే మద్యం వ్యాపారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో ఇలాంటి ఆరోపణలు వస్తే ఆయనే స్వయంగా విచారణకు ఆదేశించుకునేవారు. ఈ బొత్సగారు ఆయనపై వస్తున్న ఆరోపణలకు విచారణ వేసుకోవడంలేదు. పైగా, సీఎంతో బేరాలు చేసుకొని, విచారణ చేస్తున్న అధికారులను బదిలీ చేయించిన చరిత్ర బొత్సగారిది. వైఎస్సార్ మన రాష్ర్టంలో ప్రతి ఒక్కరికీ మేలు చేశారు. వైఎస్సార్ ఎంత మంచి వారో, బొత్సగారి కుటుంబానికి ఎంత మేలు చేశారో, ఆయనకు గుర్తులేకపోతే ఆయన కుటుంబంలోనే పదవులు అనుభవిస్తున్న ఆయన భార్య గారిని, తమ్ముడిని, బావమరిదిని అడిగితే చెప్తారు.

మన ఖర్మకొద్దీ ఇలాంటి నాయకులు ఉన్నారు. వారి చేతిలో ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంతో కుమ్మక్కైన ఇంకో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు ఒకప్పుడు సొంత మామకు వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం సాక్షిగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. అన్ని పార్టీలు అవిశ్వాసం పెడితే చంద్రబాబుగారు రెండు చేతులూ అడ్డంపెట్టి కాపాడారు. ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే కనీసం 148 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారుకు ఉన్న ఎమ్మెల్యేల బలం కేవలం 146 మంది మాత్రమే. మైనార్టీలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఎలా ఉంది? ఎవరి మద్దతుతో కొనసాగుతోంది? చంద్రబాబుగారి మద్దతుతో కాదా? ప్రజలు చాలా తెలివైన వారు, అన్నీ గమనిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు జగనన్నను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు.

13.1 కిలోమీటర్లు నడిచిన షర్మిల
శుక్రవారం 207వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలోని రామవరం గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి కారక వలస, అయ్యన్నపాలెం మీదుగా విజయనగరం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మూడు లాంతర్ల సెంటర్లో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి కొత్తపేట మీదుగా పూల్‌బాగ్ సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.15 గంటలకు చేరుకున్నారు. మొత్తం 13.1 కిలోమీటర్లు నడిచారు. షర్మిల వెంట విజయనగరం జిల్లా పార్టీ కన్వీనర్, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు, తాజా మాజీ ఎమ్మెల్యేలు సుజయ్ కృష్ణ రంగారావు, విజయనగరం సమన్వయకర్తలు అవినాపు విజయ్, గురాన అయ్యలు, గజపతినగరం సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, స్థానిక నాయకులు కాళ్ల గౌరీశంకర్, పెన్మత్స వీవీ సూర్యనారాయణరాజు, కొయ్య ప్రసాదరెడ్డి, గుంటిరెడ్డి రమాదేవి తదితరులు ఉన్నారు.

జనాన్ని తప్పుదారి పట్టిస్తున్న ఎల్లో మీడియా

- జనాన్ని తప్పుదారి పట్టిస్తున్న ఎల్లో మీడియా
- సత్తెనపల్లి సాక్షి చైతన్య పథంలో మేధావులు, వక్తల అభిప్రాయం

సాక్షి, గుంటూరు: ‘ప్రజాస్వామ్య చక్రాలు పట్టాలు తప్పితే దేశ భవిష్యత్తుకే ప్రమాదం.. ప్రతి మార్పునకు ప్రజా చైతన్యమే తుది తీర్పు.. ఎల్లో మీడియా జన చైతన్యాన్ని పక్కదోవ పట్టిస్తోంది.. వాటి సహకారంతో సీబీఐ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు పెట్టి ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది’ అని మేధావులు, విద్యావంతులు అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని గోసంరక్షణ శాల కల్యాణ మంటపంలో స్వప్న వ్యాఖ్యానంతో సాక్షి చైతన్య పథం సదస్సు శుక్రవారం జరిగింది. జనాభిమానం కలిగిన జగన్‌పై వ్యవస్థలన్నీ కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఉల్లం శేషగిరిరావు, విశ్రాంత వ్యవసాయశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌కు బెయిలిచ్చే విషయంలో సీబీఐ చెబుతున్న వాదనలు విశ్వసనీయంగా లేవన్నారు.

వైద్యుడు పమిడిమళ్ళ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలకు అస్త్రంగా మారిన సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారి ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు పాలన మరిచి జగన్ లక్ష్యంగా సంక్షేమాన్ని విస్మరించాయని బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ కరీమున్నీసా నిందించారు. చంద్రబాబు పలు భూ కుంభకోణాల్లో ఇరుక్కున్నా సీబీఐ విచారించేందుకు సిబ్బంది లేరని నిస్సిగ్గుగా చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రముఖ చిత్ర కళాకారుడు జింకా రామారావు ప్రశ్నించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు సలగా ల మృత్యుంజయరావు మాట్లాడుతూ సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా, కేంద్ర మాజీ మంత్రి బన్సల్ మేనల్లుడుపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ ఎలా క్లీన్‌చిట్ ఇచ్చిందో దేశ ప్రజలందరికీ అర్ధమైందన్నారు. సదస్సుకు విద్యార్థులు, మహిళలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 208వ రోజు(జిల్లాలో ఆరో రోజు) సాగే వివరాలను పాదయాత్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు శుక్రవారం ప్రకటించారు. శని వారం ఉదయం మిమ్స్ మెడికల్ కళాశాల జంక్షన్, నెల్లిమర్లలో పాదయాత్ర చేసిన తరువాత నెల్లిమర్లలో బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్న భోజన విరామం కోసం ఆగుతారు. విరామం తరువాత నెల్లిమర్ల రైల్వే స్టేషన్, గుర్ల, కెల్ల జంక్షన్, గుజ్జింగ వలసల్లో పాదయాత్ర చేసిన అనంతరం రాత్రి బస చేస్తారు.

జిల్లాలో ఆరో రోజు పర్యటించే ప్రాంతాలు

మిమ్స్ కళాశాల జంక్షన్, నెల్లిమర్ల,
నెల్లిమర్ల రైల్వేస్టేషన్, గుర్ల, కెల్ల జంక్షన్, గుజ్జింగవలస

Judicial overreach-ఆ తీర్పును కొట్టేయాలి


Judicial overreach

However well-intentioned the Supreme Court might be in its efforts to cleanse the political system of criminals, its decision to bar any person who is in jail or in police custody from contesting an election to legislative bodies is a case of the remedy being worse than the disease. By extending the curtailment of the right to vote of a person in prison or lawful police custody to the right of the person to stand in an election, the Supreme Court has, in effect, left the door open for the practice of vendetta politics by ruling parties. All that politicians in power now need to do to prevent rivals from contesting an election is to ask the police to file a case and effect arrest. 

ఆ తీర్పును కొట్టేయాలి

జైల్లో ఉండే వ్యక్తులు పోటీకి అనర్హులన్న సుప్రీం ఉత్తర్వులపై సీపీఎం
కేసుల్లో దోషిగా తేలితే అనర్హులేనన్న తీర్పును సమీక్షించాలని సూచన

న్యూఢిల్లీ/సహర్సా (బీహార్): జైలు లేదా పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులు చట్టసభలకు పోటీ చేసేందుకు అనర్హులన్న సుప్రీంకోర్టు తీర్పుపై సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పుతో సర్వోన్నత న్యాయస్థానం తన పరిధిని అతిక్రమించిందని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించేదిగా ఉన్న ఈ తీర్పును కొట్టేయాలని కోరింది. ఈ మేరకు పార్టీ పొలిట్‌బ్యూరో శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత తీర్పు వల్ల విచారణ ఖైదీలతోపాటు దోష నిర్ధారణ జరగని వ్యక్తులు, విచారణ లేకుండా పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసే హక్కుకు దూరమవుతారని తెలిపింది. ముఖ్యంగా రాజకీయ నాయకులపై ఎన్నో తప్పుడు కేసులు నమోదవుతున్నాయని...లక్షలాది మంది విచారణ ఖైదీలు జైళ్లలో మగ్గుతూ న్యాయ వ్యవస్థ అసమర్థత, వివక్ష కారణంగా ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని సీపీఎం పేర్కొంది. పైగా ఈ తీర్పు అమలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని వివరించింది. రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీలు లేదా ప్రభుత్వాలు వ్యక్తులను జైళ్లలో పెట్టించవచ్చని తెలిపింది. 


ఎగువ కోర్టుల్లో నిర్దోషిగా తేలితే...

క్రిమినల్ కేసుల్లో శిక్షకు గురైన చట్టసభ సభ్యులు తక్షణమే అనర్హతకు గురవుతారంటూ బుధవారం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని విజ్ఞప్తి చేసింది. ఆ తీర్పు హర్షణీయమైనప్పటికీ చట్టసభ సభ్యులు ఎగువ కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా మూడు నెలలపాటు వారి సభ్యత్వాన్ని కొనసాగించేందుకు వీలు కల్పించే ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 (4)ను సర్వోన్నత న్యాయస్థానం చట్టవిరుద్ధమంటూ కొట్టేయడంలో కొన్ని సమస్యలు ఉన్నాయని సీపీఎం వివరించింది. ప్రస్తుత న్యాయ వ్యవస్థలో కింది కోర్టుల తీర్పులను ఎగువ కోర్టులు కొట్టేసిన సందర్భాలు ఉంటున్నాయని గుర్తుచేసింది. ఒకవేళ ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యేను దిగువ కోర్టు తీర్పు ప్రకారం తక్షణమే అనర్హుడిగా ప్రకటించాక అతను లేదా ఆమె ఎగువ కోర్టులో నిర్దోషిగా బయటపడితే అప్పుడు పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. అందువల్ల ఈ తీర్పును సమీక్షించాలని కోరుతున్నట్లు తెలిపింది. 

మంచినీరొద్దు.. మద్యమే ముద్దు..

Written By news on Friday, July 12, 2013 | 7/12/2013

మరో ప్రజాప్రస్థానం 12-07-2013మూడులాంతర్ల సెంటర్(విజయనగరం) 12 జూలై 2013: మంచినీరు వద్దు.. మద్యమే ముద్దు అనే విధానంతో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం సాగుతోందని శ్రీమతి వైయస్ షర్మిల మండిపడ్డారు. విజయనగరం జిల్లా మూడు లాంతర్ల సెంటర్లో  శుక్రవారం సాయంత్రం ఏర్పాటైన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె విజయనగరం జిల్లాలో  పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జిల్లాలో బొత్స కుటుంబం నుంచి నలుగురు రాజకీయాలలో ఉన్నారని ఆమె చెప్పారు. బొత్స సత్యనారాయణ మంత్రి కాగా.. ఆయన భార్య ఝాన్సీలక్ష్మి ఎమ్.పి.గా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇంతమంది ఉన్నా విజయనగరం పట్టణానికి కూడా మంచినీరు అందడం లేదన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో తారకరామ సాగర్ నుంచి మంచినీళ్లివ్వాలని భావించారనీ, రూ. 70 కోట్లు మంజూరు చేసి పనులు కూడా ప్రారంభించారనీ శ్రీమతి షర్మిల చెప్పారు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని తెలిపారు. ఆయనుండుంటే ఈ పాటికి పనులు పూర్తయ్యి ప్రజలకు మంచినీరు అంది ఉండేవన్నారు. బొత్సకు చిత్తశుద్ధి కొరవడడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆమె విమర్శించారు. ఆయన చిత్తశుద్ధి ఎంతో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. ఆయన నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. మంచినీరు వద్దు.. మద్యమే ముద్దు అనే విధానాన్ని ఆయన అవలంబిస్తున్నారని ఆరోపించారు.

ప్రస్తుత ముఖ్మమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారులో ఆరోగ్యశ్రీకి జబ్బు చేసిందన్నారు. ఫీజు రీయింబర్సుమెంటు కుంటుపడిందన్నారు. పక్కా ఇళ్ళ పథకానికి పాడె కట్టారన్నారు. పింఛన్లను పెంచకపోగా ఉన్న వాటిని  తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సంక్షేమ కార్యక్రమాలకు గోరీ కడుతున్న వీరిని నాయకులనాలా.. రాక్షసులనాలా అని ఆమె ఆవేశంగా ప్రశ్నించారు. 

డాక్టర్ వైయస్ఆర్ ఉండి ఉంటే ఇప్పుడు రైతులకు తొమ్మిదిగంటల విద్యుత్తు ఇచ్చి ఉండేవారు. గతంలో ఆయన నిరంతరాయంగా ఏడు గంటల విద్యుత్తు సరఫరా ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇప్పడు మూడు గంటలు కూడా ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. కరెంటు సరఫరా లేక వేల పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఈ పాపం కాంగ్రెస్ సర్కారుదేనని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు.
కరెంటు లేదు మహాప్రభో అంటే కిటికీలు తెరుచుకోండీ, గాలి బాగా వస్తుందని కిరణ్ సలహా ఇస్తున్నారన్నారు.  కరెంటు సరఫరా నిల్లు బిల్లులు ఫుల్లుగా ప్రభుత్వ విధానం మారిపోయిందన్నారు. గ్యాస్ ధర విపరీతంగా పెరిగిందన్నారు. సబ్సిడీ లేకపోతే వెయ్యి రూపాయలు పెట్టి సిలిండర్ కొనాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.  ఆర్టీసీ చార్జీలను నాలుగు సార్లు ప్రభుత్వం పెంచిందన్నారు. అన్ని పన్నులు పెరిగాయని ప్రజలు వాపోతున్నారని చెప్పారు. విద్యుత్తు అదనపు చార్జీల రూపేణా ప్రభుత్వం 30వేల కోట్ల  రూపాయల భారాన్ని ప్రభుత్వం ప్రజలపై మోపిందని ఆమె తెలిపారు.

ఇలాంటి ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దానికి మద్దతు పలకవద్దని విప్ జారీ చేశారన్నారు. మద్దతు పలికుంటే ఈ ప్రభుత్వం కూలిపోయేదనీ, ప్రజలకు  బాధలు తప్పేవని చెప్పారు. చిరంజీవి కేంద్ర మంత్రి పదవి కోసం తనకు ఓటేసిన 70 లక్షల మంది ఓటర్లను పిచ్చోళ్ళను చేసి  ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ కు రాసిచ్చేశారని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీరామారావుగారు పెట్టిన టీడీపీ పార్టీని కూడా చంద్రబాబు ప్రజలను పిచ్చోళ్ళను చేసి తాకట్టు పెట్టారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మైనారిటీ లో ఉంది. మైనారిటీ ప్రభుత్వం ఎలా అధికారంలో ఉందని ప్రశ్నించారు. ఇది చంద్రబాబు వల్లే సాధ్యమైందన్నారు. 

మంచి వాడనుకుని పిల్లనిచ్చిన ఎన్టీ రామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రయ్యారనీ, ఆయన కుమారులలో ఒకర్ని సీఎం చేస్తానని మాటమాత్రంగానైనా అనలేదని చెప్ఆరు. పార్టీ స్థాపించిన ఎన్టీఆర్నే వెలేశాడంటే చంద్రబాబు ఎంత నీచుడో తెలుస్తుందన్నారు. వ్యవసాయం దండగనీ,  సబ్సిడీలిస్తే ప్రజలు  సోమరులవుతారని చెప్పింది ఈ చంద్రబాబేనన్నారు. ఉపకారవేతనాలు అడిగిన విద్యార్థులపై లాఠీచార్జీ చేయించారని చెప్పారు. పింఛను అడిగితే ఊళ్ళో ఎవరైనా చనిపోతే ఇస్తానని చెప్పేవాడని తెలిపారు. ఆయన హయాంలో గ్యాస్ ధర 130 నుంచి 305కు పెరిగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. రాజన్న ఇస్తానన్న ఉచిత విద్యుత్తుని హేళన చేశారన్నారు. ఏటా కరెంటు చార్జీలు పెంచుతానని ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం  చేసుకుని చంద్రబాబు రాష్ట్రానికి రుణం తెచ్చారని చెప్పారు. కరెంటు బిల్లలు చెల్లించాలని ప్రబుత్వం పెట్టిన వేధింపులు తట్టుకోలేక వేలాదిమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయాన్ని శ్రీమత షర్మిల గుర్తుచేశారు. రెండెకరాలతో మొదలైన చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఎక్కడ చూసిన హెరిటేజే దుకాణాలే అనే రీతిలో పెరిగిందన్నారు. దేశ విదేశాలలో హెరిటేజ్ దుకాణాలు తెరిచారని చెప్పారు. ఐఎమ̴్జీ సంస్థకు 2500 కోట్ల రూపాయల విలువైన భూమిని రూ. 4 కోట్లకే అప్పగించిన ఘనత చంద్రబాబు సొంతమని చెప్పారు. కమ్యూనిస్టులు ఆయనపై చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అనే పుస్తకాన్ని రాసిన విషయాన్ని గుర్తుచేశారు.  ఇలాంటివి ఆయన ఎన్నో చేశారనీ అయినా ఆయనపై కేసులుండవనీ, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కవడమే దీనికి కారణమని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు ఏఏ అంశాల్లో కుమ్మక్కయ్యారో శ్రీమతి షర్మిల సభలో వివరించారు.


http://www.ysrcongress.com/news/top_stories/sharmila-hasted-botsa-liquor-policy.html

వైఎస్ విజయమ్మ ఫీజు దీక్ష వాయిదా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్. విజయమ్మ చేపట్టనున్న ఫీజు దీక్ష వాయిదా పడింది. ఈ నెల 14, 15 తేదీల్లో విజయమ్మ ఫీజు దీక్ష చేస్తారని వైఎస్సార్ సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల దృష్టా వాయిదా దీక్షను వేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది.



‘కాంగ్రెస్ నాటకం మరోసారి బయటపడింది’

హైదరాబాద్: కాంగ్రెస్ కోర్ కమిటీ నాటకం మరోసారి బయటపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తెలంగాణ అంశంపై నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు బాజిరెడ్డి, గట్టు రామచంద్రరావులు మండిపడ్డారు. మూడు ప్రాంతాలను ప్రజలను మభ్య పెట్టి పబ్బం గడుపుకునేందుకు కాంగ్రెస్ చూస్తోందన్నారు. ఇలాంటి మోసం జరుగుతుందని ముందే ఊహించామని వారు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కోర్ కమిటీ కాదు.. చోర్ కమిటీ అని వైఎస్సార్‌సీపీ నేతలు అభిప్రాయపడ్డారు.

కిరణ్ కుమార్ రెడ్డి కి సొంతనియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షాక్

Written by Parvathi On 12/7/2013 14:32:00 PM
ఓవైపు ఎన్నికల సంఘం హెచ్చరిస్తోన్నా సర్పంచ్ పదవుల వేలం పాటలు ఆగడం లేదు. ప్రతీ జిల్లాలోనూ రిజర్వేషన్ల ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీల్లో లేని సామాజిక వర్గాల పేరిట రిజర్వేషన్లు చేయడంతో ఇదేం పద్దతంటూ ప్రజలు నిలదీస్తున్నారు. అధికారుల దగ్గర వీటికి సమాధానాలు దొరకడం లేదు. ఇక పంచాయతీ ఎన్నికల వేళ సమస్యలను జనం ఏకరవు పెడుతున్నారు.

ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంతనియోజకవర్గం చిత్తూరు జిల్లా పీలేరు పరిధిలోని అన్ని సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసి.. స్వామిభక్తి ప్రదర్శించాలనుకొన్న ఆయన అనుచర గణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. అన్ని స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు పోటీకి దిగడంతో కాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పోశాయి.

సొంత నియోజకవర్గంలో ఓటమి పాలైతే తలెత్తుకోవడం కష్టమని భావించిన అధికారపార్టీ నేతలు వ్యూహాలు మార్చారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఎక్కెడెక్కడ బలంగా ఉన్నారో ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా నివేదికలు తెచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులుగా పోటీ చేస్తున్న వారికి నజరాలు ప్రకటించారు. ఇందుకు వారు ససేమిరా అనడంతో బెదిరింపులకు దిగారు. అయినా ఫలితం లేకపోవడంతో రాత్రికి రాత్రే కాంగ్రెస్ నేతలు ఓటర్ల జాబితాల నుంచి పేర్లను తొలగించేలా చేయగలిగారు.

కనీసం పీలేరు పంచాయతీని అయినా ఏకగ్రీవం అయ్యేలా చేసి అధినాయకుడిని సంతృప్తి పరచాలని భావించిన ముఖ్యమంత్రి అనుచరులు ..టీడీపీ తరపున డమ్మీ అభ్యర్ధి ఉండేలా పావులు కదిపారు. అయితే వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడిగా ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మహమ్మద్ షఫి బరిలోకి దిగడంతో కాంగ్రెస్ నేతలు షాక్ తిన్నారు.

పీలేరులో అధిక శాతం ఓట్లు ముస్లిం మైనార్టీలకు ఉన్నాయి. దీంతో ఆ ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీకే ఖాయంగా పడతాయని భావించిన కాంగ్రెస్ నేతలు పథకం ప్రకారం వారి ఓట్లను తొలగించేలా చేశారు. అధికారపార్టీ తీరుపై మైనార్టీలు మండిపడుతున్నారు. గత సహకార ఎన్నికల తరహాలోనే ఇప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కురాజకీయాలకు పాల్పడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేతలు ఆరోపించారు.

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=65467&Categoryid=28&subcatid=0

రామవరం నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర

 షర్మిల పాదయాత్ర శుక్రవారం రామవరం నుంచి ప్రారంభం. కరకవలస, అయ్యన్నపేట, జ్యూట్ మిల్ రోడ్, బాలాజీ మార్కెట్, కన్యకాపరమేశ్వరీ దేవాలయం, పెద్ద చెరువు రోడ్డు, గంటా స్తంభం, లాంతర్ల సెంటర్, కొత్తపేట మీదగా ఆమె పాదయాత్ర కొనసాగుతుంది. అయితే షర్మిల చేపట్టిన పాదయాత్ర శుక్రవారం 207వ రోజుకు చేరింది.

ఉండవల్లి, బాబులపై కేసులు పెట్టండి

విజయవాడ: ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో సదస్సు, కాంగ్రెస్‌పార్టీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ రాజమండ్రిలో సభ నిర్వహించారని, వీరిపై తక్షణమే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పూనూరి గౌతమ్‌రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. గురువారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

రెండు ప్రసవాల్లో ఎందరు పిల్లలున్నా పోటీకి అర్హులే

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదనే నిబంధన కొందరికే వర్తించనుంది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి తొలి ప్రసవంలో ఒక బిడ్డ పుట్టిన వారికి రెండో ప్రసవంలో ఇద్దరు, ముగ్గురు పిల్లలు పుట్టినా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే భాగ్యం లభించనుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. ప్రస్తుత పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇద్దరు పిల్లలు మించి ఉన్నవారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు.

అయితే, రెండో ప్రసవంలో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే అందులో ఆ పిల్లల తల్లిదండ్రుల తప్పిదం లేదని, అందువల్ల ఇలాంటివారిని ఎన్నికల్లో పోటీకి అర్హులుగా పరిగణించాలని గతంలో బలగ సావిత్రమ్మ వర్సెస్ సత్యనారాయణ, ఇతరులు కేసులో హైకోర్టు స్పష్టం చేసింది. దీని ప్రకారం పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. పంచాయతీరాజ్ శాఖలో ఇంకా చట్ట సవరణ చేయలేదు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం చట్టసవరణ చేసే సమయం లేనందున హైకోర్టు తీర్పును జిల్లా స్థాయిలో కలెక్టర్లే అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా రెండు ప్రసవాల్లో ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్న వారు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించినట్లయింది.


ముగ్గురు పిల్లలున్నా ‘పంచాయతీ’కి అనుమతి

 పోరాడి సాధించుకున్న రాములు
- కు.ని. ఆపరేషన్ విఫలమై మూడో బిడ్డ పుట్టిందని వినతి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేటకు చెందిన టి.రాములు ముగ్గురు పిల్లలున్నా సర్పంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ ప్రభుత్వంపై పోరాడి పంతం నెగ్గించుకున్నారు. పూర్వాపరాలిలా.. రాములు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన భార్య శాంతకుమారికి ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ (కు.ని.) ఆపరేషన్ చేయిం చారు. ఈ ఆపరేషన్ విఫలం కావడం వల్ల ఆమె మూడో బిడ్డను కనింది. ఇందులో తమ తప్పిదం లేదని, ఇది సర్కారు ఆస్పత్రి వైఫల్యం కనుక ‘ఇద్దరు పిల్లల’ నిబంధన నుంచి తనకు మినహాయింపు ఇచ్చి సర్పంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అన్ని పత్రాలు పరిశీలించిన ప్రభుత్వం ఆయనకు ఇద్దరు పిల్లల నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చి ముగ్గురు పిల్లలున్నా పోటీ చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు రాములును ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వి. నాగిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పుడెందుకు మాట మార్చావు?

- జగన్ సంపాదన చట్టబద్ధమని చెప్పలేదా... ఇప్పుడెందుకు మాట మార్చావు? 
- ఉండవల్లిపై అంబటి ధ్వజం
- జగన్‌కు వ్యాపార సలహాలిచ్చేందుకు నువ్వు కడప వెళ్లింది నిజంకాదా?
- సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా ఆస్తులపై చర్చకు సిద్ధమా?
- చంద్రబాబు, రామోజీల గురించి మాట్లాడటానికి ధైర్యం చాల్లేదా?
- వైఎస్‌ను మీ పార్టీ నేతలే నానా మాటలుఅంటుంటే నీ అభిమానం ఏమైంది? 

సాక్షి, హైదరాబాద్: వార్షిక నివేదిక వెల్లడి పేరుతో రాజమండ్రిలో సభ నిర్వహించిన ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై బురద జల్లి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, సీఈసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఢిల్లీ ఏది ఆదేశిస్తే అది మాట్లాడిన ఉండవల్లి తన ప్రసంగంలో ఎక్కువభాగం జగన్‌నే లక్ష్యంగా చేసుకున్నారని తప్పుబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడుతూ... జగన్ ఆస్తులు చట్టబద్ధమైనవేనని గతంలో టీవీ ఇంటర్వ్యూ లో వెల్లడించిన అరుణ్‌కుమార్ బుధవారం రాజమండ్రిలో జరిగిన సభలో మాత్రం మాటమార్చి ఆయనపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. 

దీనికి సంబంధించి అప్పట్లో టీవీ-9 ఇంటర్వ్యూలో ఏం చెప్పారో, ఇప్పుడు రాజమండ్రి సభలో ఎలా మాట మార్చారో తెలియజేసే వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు.వీహెచ్, మధుయాష్కీలాంటి వారు జగన్‌ను విమర్శించినా తాము బాధపడలేదని, కానీ వైఎస్ ప్రాపకంతో రాజకీయాల్లో ఎదిగి, రెండుసార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన ఉండవల్లి అన్యాయంగా, అక్రమంగా జగన్‌ను విమర్శించడం బాధేసిందని చెప్పారు. మంత్రివర్గమంటే ముఖ్యమంత్రేనని, జీవోలపై మంత్రివర్గానికి ఉమ్మడి బాధ్యత లేదని అన్వయించడాన్ని తప్పుబట్టారు. జగన్‌పై ఇప్పుడు బురద జల్లుతున్న ఉండవల్లి వైఎస్ జీవించి ఉన్నప్పుడు ఆయనకు వ్యాపార సలహాలు ఇచ్చేందుకు స్వయంగా కడపకు వెళ్లింది నిజంకాదా? అని ప్రశ్నించారు. జగన్ ఆస్తులపై మాట్లాడుతున్న ఉండవల్లి సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా ఆస్తులపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. 

చంద్రబాబు, రామోజీలపై మాట్లాడరేం?
రాజకీయాల్లో ఉన్న వారు వ్యాపారాలు చేయకూడదంటున్న ఉండవల్లికి తమ పార్టీ ఎంపీలు చేస్తున్న వ్యాపారాలు గుర్తుకు రావా? అని అంబటి సూటిగా ప్రశ్నించారు. దర్యాప్తు జరుగుతున్న జగన్‌పై మాట్లాడుతున్న ఉండవల్లి, దర్యాప్తులు తప్పించుకుంటున్న చంద్రబాబుపై ఎందుకు మాట్లాడ్డం లేదని ప్రశ్నించారు. జగన్‌పై తీవ్రమైన విమర్శలు చేసి... చంద్రబాబు, మోడీ గురించి చెప్పాలనుకున్నా రైలుకు సమయం అయిపోతుందని ఉండవల్లి తప్పించుకుపోవడాన్ని తప్పుబట్టారు. ‘‘సమయం ఉండి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విప్ జారీ చేసి మరీ కాపాడినందుకు చంద్రబాబుకు జేజేలు పలికే వారా? లేదంటే చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను అనుమతించే బిల్లుపై రాజ్యసభలో అండగా నిలిచి పరువు కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పేవారా? మార్గదర్శి కేసులో మీ ప్రోగ్రెస్ రిపోర్టు ఏమైంది? రామోజీరావు మిమ్మల్ని బెదిరించారా? లేదంటే మీరే వారితో కుమ్మక్కయ్యారా? రామోజీ గురించి మాట్లాడితే మీ నాలుక కోసేస్తామని ఢిల్లీ పెద్దలు మిమ్మల్ని బెదిరించారా?’’ అని నిప్పులు చెరిగారు. వైఎస్ అనే బంగారుబాతును కోసుకు తింటున్నారని వ్యాఖ్యానించిన ఉండవల్లికి వైఎస్‌ను అవమానిస్తున్నది ఎవరో తెలియదా అని ప్రశ్నించారు. వీహెచ్, మధు యాష్కీ, జేడీ శీలం, సర్వే సత్యనారాయణ, హర్షకుమార్‌వంటి వారంతా వైఎస్‌ను నానా మాటలు అంటుంటే మీ అభిమానం ఏమైపోయింది? అని నిలదీశారు.

వైఎస్ మరణంపై రాష్ట్ర ప్రజలకు చాలా అనుమానాలున్నాయని తామంటే సోనియాగాంధీ కారణమని ఆయన అభిప్రాయాన్ని తమపై రుద్దటానికి ప్రయత్నించారని చెప్పారు. సీబీఐ చాలా పవిత్రమైన సంస్థ అని ఎపుడో వైఎస్ చెప్పిన దానిని ఉదహరిస్తున్న ఉండవల్లికి తాజాగా సీబీఐని పంజరంలో చిలుక అని సుప్రీంకోర్టు చెప్పింది వినిపించలేదా అని అంబటి ప్రశ్నించారు. సీఆర్‌పీసీ ప్రకారం ఒక నిందితుడిని 90 రోజుల కన్నా ఎక్కువగా జైల్లో ఉంచడానికి వీల్లేదు కదా? అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న సీబీఐ వ్యవహారశైలి మీకు తప్పనిపించడంలేదా? అని అంబటి నిలదీశారు.

వీరికి జగన్ తప్ప చంద్రబాబు కనిపించడేం?

- మద్యం సహా ప్రతి మాఫియాతోనూ బొత్స కుటుంబానికి సంబంధం
- ఈ విషయాన్ని ఆయన జిల్లా ప్రజలే చెప్తున్నారు: షర్మిల
- వైఎస్ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ చేస్తే.. ఇలాంటి నాయకులు మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తున్నారు
- ఇలాంటి నేతను పీసీసీ అధ్యక్షుడిని చేసిన కాంగ్రెస్‌ది గాంధేయవాదమా? లేక బ్రాందేయ వాదమా? 
- కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జగన్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి
- అందుకే ఆ పార్టీ నేతలు ఒకరినొకరు విమర్శించుకోవడం మానేశారు.. 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘లిక్కర్ వ్యాపారంతో ప్రజలు మద్యానికి బానిసలైపోయి, వారి కుటుంబాలు ఛిన్నాభిన్నమైపోతున్నాయి. కానీ మద్యం వ్యాపారంలో తలమునకలైన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకుగాని, ఆయన కుటుంబానికిగాని ఇవేమీ పట్టవు. వాళ్లకు కావాల్సింది వ్యాపారం, దాని మీద వచ్చే ఆదాయం. అది ఏ పద్ధతిలో వచ్చినా సరే వాళ్లకు అవసరం లేదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ‘‘‘అమ్మా.. ఈ వ్యాపారం.. ఆ వ్యాపారం అనే తేడా లేదమ్మా, అన్ని వ్యాపారాల్లో బొత్స కుటుంబమే ఉంది. మద్యం మాఫియా నుంచి ప్రతి మాఫియాతోనూ బొత్స కుటుంబానికి సంబంధం ఉంది. బొత్స కుటుంబం అంటే దోచుకోవడం, దాచుకోవడం’ అని ఆయన జిల్లా ప్రజలే చెప్తున్నారు. 

ఇలాంటి వాళ్లను నాయకులు అనాలా? ఖల్‌నాయక్‌లు అనాలా? వైఎస్సార్ మన రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా చేస్తే ఇలాంటి నీచమైన కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో సాగింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంలో తడుస్తూనే షర్మిల పాదయాత్ర కొనసాగించారు. ఈ నియోజకవర్గంలోని కొటారుబిల్లి జంక్షన్‌లో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

కిరణ్ కాళ్లు పట్టుకొని కేసులు మాఫీ చేయించుకున్నారు
‘‘రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది.. ఎందుకని? మహాత్మాగాంధీ మాకు ఆదర్శం అని చెప్పుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ ఒక మద్యం మాఫియా డాన్‌ను తీసుకొచ్చి బొత్స అనే ఆయన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టుకుంది. ఇక మన రాష్ట్రంలో మద్యం ఏరులై పారక మరేమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అనుకరిస్తుంది గాంధేయ వాదమా? లేక బ్రాందేయ వాదమా? బొత్స సత్యనారాయణ మన రాష్ట్రంలోనే అతిపెద్ద మాఫియా డాన్ అని, మద్యం వ్యాపారంలో ఈయన్ను మించినవారే లేరని రాష్ర్టంలో అందరికీ తెలుసు. ఈ నాయకులకు మద్యం వ్యాపారం మీద ఉన్న శ్రద్ధలో పదో వంతు ప్రజల మీదుంటే ఈ ప్రాంత ప్రజలు ఎంతో బాగుపడేవారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఏమిటని ఆయనకు వ్యతిరేకంగా బొత్స ఓ క్యాంపు కూడా పెట్టారు. అందుకు లిక్కర్ కింగైన సత్తిబాబు మీద కిరణ్‌కుమార్‌రెడ్డి ఏసీబీ కేసులు అనే ఆయుధం ప్రయోగించారు. అప్పటివరకు క్యాంపులు పెట్టి ఆయనకు వ్యతిరేకంగా పావులు కదిపిన బొత్స వెంటనే కిరణ్‌కుమార్‌రెడ్డి దగ్గరకు వెళ్లి, ఆయనకు లొంగిపోయి, ఆయన కాళ్లు పట్టుకొన్నారు. అధికారులను బదిలీ చేయించుకుని కేసులు లేకుండా చూసుకున్నారు. అదీ బొత్స మార్కు రాజకీయం.

వీరికి జగన్ తప్ప చంద్రబాబు కనిపించడేం?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఈ రెండు పార్టీల నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడమే మానేశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడినా.. విమర్శించేది జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్‌మోహన్‌రెడ్డిని. మొన్న దిగ్విజయ్ సింగ్ అని ఢిల్లీ నుంచి కాంగ్రెస్ నాయకుడొకరు వచ్చారు. హైదరాబాద్‌లో, విశాఖపట్టణంలో ఆయన బస చేశారు. సమావేశాలు పెట్టి జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించారు. చంద్రబాబు గురించి ఆయన ఒక్కటంటే ఒక్క మాట కూడా అనలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలబెడుతుంది చంద్రబాబే కనుక ఆయన్ను విమర్శించే ఉద్దేశం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఎప్పుడూ లేదు.

నిన్న రాజమండ్రిలో ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఒక సభ పెట్టారు. గంటల తరబడి మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డదిడ్డంగా విమర్శించారు. కానీ చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదు. ఎందుకంటే ఆయనకు సమయం సరిపోలేదట! ఇక విజయనగరం జిల్లాను భ్రష్టు పట్టించిన బొత్స.. చంద్రబాబు నాయుడును ఒక్క మాట కూడా అనరు. అలాగే చంద్రబాబు కూడా బొత్సను ఏమీ అనరు. ఇదంతా వారి కుమ్మక్కు రాజకీయంలో భాగం. కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడం లేదనే విషయం ఎందుకు చర్చిస్తున్నాం అంటే ఒకరిది అధికార పక్షం, ఇంకొకరిది ప్రధాన ప్రతిపక్షం. కానీ వాళ్లిద్దరూ కుమ్మక్కయింది మాత్రం ఒకే ఒక వ్యక్తి కోసం. వాళ్ల ఎజెండా, వాళ్ల లక్ష్యం, వాళ్ల గురి జగన్‌మోహన్‌రెడ్డే.

13.7 కిలోమీటర్ల మేర నడక..
పాదయాత్ర 206వ రోజు గురువారం విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలోని వసంత గ్రామం నుంచి ప్రారంభమయింది. అక్కడి నుంచి లక్కిడాం, కొటారుబిల్లి, నరవ గ్రామాల మీదుగా సాగింది. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. గురువారం మొత్తం 13.7 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,745.4 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో విజయనగరం జిల్లా పార్టీ కన్వీనర్, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు, తాజా మాజీ ఎమ్మెల్యేలు సుజయ్ కృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, గజపతినగరం సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పెన్మత్స వీవీ సూర్యనారాయణరాజు, కొయ్య ప్రసాదరెడ్డి తదితరులు ఉన్నారు. 

ఊరంతా కన్నీరు..
షర్మిలతో పాటు వసంత ఊరు ఊరంతా కన్నీరుపెట్టిన సంఘటన ఇది. 2,000 మంది ఓటర్లు ఉన్న మారుమూల పల్లె వసంత. షర్మిల తమ పల్లెకు వస్తుందని ప్రతి ఇంటికో మహిళ ఆమెకు స్వాగతం పలికేందుకు వచ్చారు. దాదాపు 1,000 మందికి పైగా మహిళలు తడుస్తూనే వీధుల్లోకి వచ్చి నిలబడ్డారు. ఉండ్రాజ కుమారి అనే గృహిణి షర్మిలతో మాట్లాడుతూ.. ‘‘అమ్మా..! నా బిడ్డకు గుండె నొప్పి.. వైఎస్సార్ నా బిడ్డకు ఆపరేషన్ చేయించాడు. ఇప్పుడు నా బిడ్డ పెళ్లి చేసుకొని ఇంకో బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ప్రాణం పోసిన దేవుడు మాత్రం లేడు.. నా మనవడి నవ్వులో ఆ దేవుణ్ణి చూసుకుంటున్నామమ్మా’’ అని బిగ్గరగా ఏడవటంతో షర్మిల కూడా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టారు. ఆమె కన్నీళ్లను చూసి ఆ గ్రామ సర్పంచ్‌తో పాటు అక్కడి మహిళలంతా కన్నీళ్లు పెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. భారమైన హృదయంతో మహిళలంతా కలిసి షర్మిలను ఊరు చివర వరకు సాగనంపి వచ్చారు.

ఉండవల్లివి చిలుక పలుకులు: గోనె


ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ సోనియా నివాసం టెన్‌జన్‌పథ్ బంట్రోతులా, పంజరంలో చిలకలా విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. ఆయన గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ... వార్షిక నివేదిక పేరిట ఉండవల్లి రాజమండ్రిలో పెట్టిన సభలో తనకు వచ్చే రూ.5 కోట్ల నిధులు ఎలా ఖర్చయ్యాయో సమీక్షించే బదులు జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలకే ఎక్కువ సమయం కేటాయించారని తప్పుబట్టారు. ‘‘వైఎస్ జగన్ 2009లో రూ.77 కోట్లు ఆదాయం చూపించారని, 2011లో అది రూ.427 కోట్లకు ఎలా పెరిగిందని అరుణకుమార్ అడుగుతున్నారు.

భారతి సిమెంట్స్ ఉత్పత్తి ప్రారంభించి నాణ్యమైన సిమెంటును మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించాక దాని విలువ ఎంతో పెరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన కంపెనీ 50 శాతం షేర్లను రూ.2,600 కోట్లకు కొనుగోలు చేసింది. అందులో వచ్చిన రూ.434 కోట్ల లాభానికి కే పిటల్ గెయిన్ కింద జగన్ రూ.84 కోట్లు కట్టారు. ఇంగితజ్ఞానం లేకుండా దానిపైనా విషప్రచారం చేస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. తెలంగాణపైనా అరుణకుమార్ అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఏకాభిప్రాయం కావాలన్నది ఎక్కడా లేదని గోనె స్పష్టంచేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్రానికి పూర్తి అధికారముందని చెప్పారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేయకుండా ఇరుప్రాంతాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సముచిత నిర్ణయం తీసుకోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టంచేసిందని తెలిపారు.

జైలు గోడలు బద్దలయ్యేలా ప్రజాతీర్పు వెలువడుతుంది


ఎన్ని అవరోధాలు ఎదురైనా లెక్కచేయకుండా తాము విశ్వసించే న్యాయమైన విలువల కోసం ఒంటరి పోరాటం సాగించిన ప్రజానాయకులు, యోధులు చరిత్రలో అతి కొద్దిమందే కనిపిస్తారు. ఆ కోవకు చెందే లీడరే జగనన్న. ఎవరెన్ని అవాంతరాలు సృష్టించినా సహిస్తూ ముందుకు సాగిపోయే గుణమే ఆయన ఓదార్పుయాత్రను విజయవంతం చేసింది. ఆయన విరోధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. తప్పుచేసిన నాయకులు ఎంతోమంది బయట తిరుగుతుండగా, ప్రజానాయకుడిని తీసుకెళ్లి బలవంతంగా నిర్బంధించిన కాంగ్రెస్‌పార్టీకి రాష్ట్రప్రజలు తప్పక గుణపాఠం నేర్పుతారు. 2014లో జైలుగోడలు బద్దలయ్యేలా తీర్పు ఇస్తారు. జగనన్నని సి.ఎం.ని చేస్తారు.
- పి.మనోహరం, పులిదిండి, ఆత్రేయపురం (మం), తూ.గో.జిల్లా 

ఈరోజు ఇన్ని మాటలు అంటున్నవారికి...రేపు ఇక మాట్లాడేందుకు ఏమీ ఉండదు 

జగన్‌ని జైల్లో పెట్టి పదమూడు నెలలు దాటాయి. తలచుకుంటేనే గుండె బరువెక్కుతోంది. ఎందుకు ఆయనకు ఇంత పెద్ద శిక్ష? రాష్ట్రంలో మరణశయ్యపై ఉన్న కాంగ్రెస్‌పార్టీని వరుసగా రెండుసార్లు ఆయన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి తెచ్చినందుకా? పాదయాత్ర ద్వారా ప్రతి పేదవాడి కష్టం తెలుసుకుని సంక్షేమపథకాల అమలుతో ఆదుకున్నందుకా? వై.ఎస్.గారు ఎంతసేపూ రాష్ట్రప్రజల అభ్యున్నతి గురించే ఆలోచించారు తప్ప జగన్‌కోసం ఆయన చేసింది ఏమీ లేదు. పెపైచ్చు రాహుల్ ప్రధానిని చేయాలని పరితపించారు. అటువంటిది ఆ మహానేత తనయుడిపై కాంగ్రెస్ ఎందుకింత కక్ష కట్టింది? జగన్ నిజాయితీపరుడు కాబట్టి ఇంతకాలం జైల్లో ఉన్నా చెక్కుచెదరని నిబ్బరంతో ఉన్నారు. అదే తప్పు చేసి ఉంటే ఏనాడో సోనియాకి సరెండర్ అయివుండేవారు తప్ప ఇలా ప్రజలవైపు, ప్రజలకోసం నిలబడేవారు కారు. ఆ విధంగా చూస్తే జగన్‌దే అన్నివిధాలా నైతిక విజయం. రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్ సచ్ఛీలతే ఆయన్ని ముఖ్యమంత్రిగా నిలబెడుతుంది. ఈరోజు ఇన్ని మాటలు అంటున్న వారికి ఆరోజున ఇక మాట్లాడేందుకు ఏమీ ఉండదు.

- ఎస్.ఎం.బేగం, రాజమండ్రి

చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com

అందరి టార్గెట్‌.. జగనన్నే

Written By news on Thursday, July 11, 2013 | 7/11/2013

మరో ప్రజాప్రస్థానం 11-07-2013కొటారుబిల్లి (విజయనగరం జిల్లా), 11 జూలై 2013: వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల విజయనగరం జిల్లాలో చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. మరో ప్రజాప్రస్థానం 206వ రోజు పాదయాత్రలో భాగంగా ఆమె గజపతినగరం నియోజకవర్గంలో పర్యటించారు. శ్రీమతి షర్మిలకు వైయస్‌ అభిమానులు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. నియోజకవర్గంలోని కొటారుబిల్లి జంక్షన్‌లో ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఆమె నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల అక్కడ చేరిన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు.

కాంగ్రెస్‌ ఎం.పి. ఉండవల్లి అరుణ్‌కుమార్ బుధవారం రాజమండ్రిలో నిర్వహించిన సభ‌లో జగనన్నను ఉద్దేశించి చేసిన విమర్శలపై శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఒక్క మాట కూడా అనలేదేమని ప్రశ్నించారు. ఆ సభలో జగనన్నను ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అడ్డదిడ్డంగా విమర్శించారని శ్రీమతి షర్మిల తెలిపారు. చంద్రబాబును విమర్శించడానికి ఆయనకు సమయం చాల్లేదట అని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ మొన్న రాష్ట్రానికి వచ్చి.. శ్రీ జగన్మోహన్‌రెడ్డినే విమర్శించారు కాని ప్రత్యర్థి చంద్రబాబుని కాదని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. ఈ ప్రభుత్వాన్ని నిలబెడుతోందే చంద్రబాబు గనుక ఆయనను విమర్శించే ఉద్దేశం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎప్పుడూ లేదన్నారు. విజయనగరం జిల్లాను భ్రష్టు పట్టించిన బొత్స ఒక్క మాట కూడా చంద్రబాబును విమర్శించరు.. అలాగే చంద్రబాబు కూడా బొత్సను, కాంగ్రెస్‌ పార్టీని పల్లెత్తు మాట అనరని అన్నారు. కానీ, వీళ్ళందరి టార్గెట్‌ కేవలం జగనన్నే అన్నారు.

‌రూ. 130 కోట్ల విద్యుత్ బకాయిలు, రూ. 1200 కోట్ల రుణ మాఫీలు చేసిన ఘనత దివంగత మహానేత వైయస్‌ఆర్‌దేనని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. పెన్షన్లు, సాగునీటి ప్రాజెక్టులు, నిరుపేదలకు పక్కాఇళ్ళు వంటి పథకాలు అమలు చేస్తూనే.. ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీ‌లు ఒక్క పైసా కూడా వైయస్‌ఆర్ పెంచలేదని శ్రీమతి ‌షర్మిల తెలిపారు. ప్రస్తుత కిరణ్ ప్ర‌భుత్వంలో రైతులకు కరెంటు లేదు, ఎరువులు లేవన్నారు. భీమసింగి చక్కెర కర్మాగారం పరిధిలో 12 వేల ఎకరాలున్నా చెరుకుకు మద్దతు ధర లేకపోవడంతో 8 వేల ఎకరాలకు పడిపోయిందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. కిరణ్‌ ప్రభుత్వం హయాంలో పంటలకు గిల్లుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

రాష్ట్రానికి అభివృద్ది లేదు, ప్రజలకు మనశ్శాంతి లేదు గానీ, మద్యం మాత్రం ఏరులై పారుతోందని కిరణ్‌ ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు. మహాత్మా గాంధీ తమకు ఆదర్శం అని చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ మద్యం‌ మాఫియా డాన్ బొత్స సత్యనారాయణకు పిసిసి అధ్యక్షుడి పదవి కట్టబెట్టడం దారుణమని శ్రీమతి షర్మిల విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్నది గాంధేయా వాదమా లేక బ్రాందేయ వాదమా? అని ఎద్దేవా చేశారు. మద్యం వ్యాపారంలో బొత్సకు మించిన వారే లేరని ప్రజలందరికీ తెలుసన్నారు. ఈ ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న శ్రద్ధలో పదో వంతైనా ప్రజల మీద ఉంటే ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడో బాగుపడేవారన్నారు. బొత్స కుటుంబానికి ప్రజల బాగోగులు పట్టలేదని దుయ్యబట్టారు. మద్యం మాఫియా నుంచి అన్ని మాఫియాల్లోనూ బొత్స కుటుంబమే ఉందని జిల్లాలోని ప్రతి ఒక్కరూ చెబుతున్నారన్నారు. దోచుకోవడం, దాచుకోవడమే బొత్స కుటుంబం తీరు అని స్థానిక ప్రజలే చెబుతున్నారన్నారు. వీళ్ళను నాయకులు అనాలా లేక ఖల్‌ నాయకులు అనాలా అని ప్రశ్నించారు. మన రాష్ట్రాన్ని మహానేత రాజశేఖరరెడ్డి హరితాంధ్రప్రదేశ్‌గా చేస్తే.. ఇలాంటి నీచమైన నాయకులు మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని శ్రీమతి షర్మిల విమర్శించారు.

ఈ దుర్మార్గమైన ప్రభుత్వంపై ప్రతిపక్షాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాత్రం విప్‌ జారీ చేసి మరీ కూలిపోకుండా కాపాడారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. ఈ ప్రభుత్వం కూలిపోయి ఉంటే ఈ కరెంటు కోత, చార్జీల బాదుడు మన నెత్తిన పడేది కాదన్నారు. ప్రజల పక్షాన నిలబడకుండా కాంగ్రెస్‌కు అమ్ముడుపోయిన చంద్రబాబును నాయకుడనాలా లేక దుర్మార్గుడనాలా అని ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కుమ్మక్కైన అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఒకదాన్ని మరొకటి విమర్శించుకోవడంలేదని, అవి రెండూ శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శిస్తున్నాయని అన్నారు.

లిక్కర్‌ కింగ్‌ సత్తిబాబు మీద కేసులు అనే ఆయుధాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయోగించారు. కిరణ్‌కు వ్యతిరేకంగా శిబిరం పెట్టిన బొత్స వెంటనే వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని బొత్స లొంగిపోయారని శ్రీమతి షర్మిల విమర్శించారు. అధికారులను బదిలీ చేసి తన మీద కేసులు లేకుండా చూసుకున్నారన్నారు. ఇదీ బొత్సగారి మార్కు రాజకీయం అని ఎద్దేవా చేశారు. కానీ బోనులో ఉన్నా సింహం సింహమే అన్నారు. ఉదయించే సూర్యుడ్ని ఆపలేనట్లే జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరని ధీమాగా చెప్పారు.

త్వరలోనే జగనన్న వస్తారని, మనందర్నీ రాజన్న రాజ్యం దిశగా నడిపిస్తారన్నారు. జగనన్న నేతృత్వంలో రాజన్న రాజ్యం వచ్చాక రాజన్న ప్రతి కలనూ నెరవేరుస్తారన్నారు. రైతులు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇలా ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో పయనించేలా చేస్తారన్నారు. జగనన్న సిఎం అయ్యాక అమలు చేసే సంక్షేమ పథకాల గురించి శ్రీమతి షర్మిల వివరించారు. రాబోయే రాజన్న రాజ్యం మళ్ళీ ఒక సువర్ణ యుగం అవుతుందని, అది ఒక్క జగనన్న వల్లే సాధ్యమవుతుందన్నారు. కొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు, మరి కొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు వస్తున్నాయని, ఏ ఎన్నికలు వచ్చినా ప్రజా వ్యతిరేక కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, దానితో కుమ్మక్కయిన చంద్రబాబుకు గట్టిగి బుద్ధి చెప్పి, జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని శ్రీమతి షర్మిల ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

http://www.ysrcongress.com/news/top_stories/smt-sharmila-slamed-on-congress-tdp.html

Sharmila's Speech in Gajapathinagaram

'ఫ్లైఓవర్ బ్రిడ్జికి వైఎస్ పేరు పెట్టాలి'

విశాఖపట్నం: నగరంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జికి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలని వైఎస్‌ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. వైఎస్‌ఆర్‌సీపీ నేత వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఈ రోజు జివిఎంసి కమిషనర్ ను కలిశారు. ఫ్లైఓవర్ బ్రిడ్జికి వైఎస్ పేరు పెట్టమని కోరుతూ ఒక వినతి పత్రం అందజేశారు.

ఉండవల్లిపై మండిపడ్డ షర్మిల

విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల జిల్లాలో చేపట్టిన పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. షర్మిల 206వ రోజు పాదయాత్రలో భాగంగా గజపతినగరం నియోజకవర్గంలో పర్యటించిన ఆమెకు పజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా కొటారిబిల్లి జంక్షన్ లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరంఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బుధవారం రాజమండ్రిలో ఏర్పాటు సభను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. నిన్నటి సభలో జగనన్నపైనే ఉండవల్లి విమర్శలు గుప్పించారని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడ్ని ఒక్క మాట అనకుండా సభ ముగించారని ఆమె దుయ్యబట్టారు. ఉదయించే సూర్యుణ్ని ఎవరూ ఆపలేరని, జగనన్న త్వరలోనే బయటకు వస్తారని షర్మిల అన్నారు.

130 కోట్ల విద్యుత్ బకాయిలు, 1200 కోట్ల రుణ మాఫీలు చేసిన ఘనత దివంగత నేత వైఎస్సార్‌దేనని ఆమె స్పష్టం చేశారు. పెన్షన్లు, సాగునీటి ప్రాజెక్టులు, నిరుపేదలకు ఇళ్ల వంటి పథకాలు అమలు చేస్తూనే..ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను ఒక్క పైసా కూడా వైఎస్సార్ పెంచలేదని షర్మిల తెలిపారు. ప్రస్తుత కిరణ్ సర్కారులో రైతులకు కరెంటు లేదు, ఎరువులు లేవన్నారు. భీమ్‌సింగ్ చక్కెర కర్మాగారం పరిధిలో 12 వేల ఎకరాలున్న చెరుకుసాగుకు మద్దతు ధర లేకపోవడంతో 8 వేల ఎకరాలకు పడిపోయిందని షర్మిల తెలిపారు. 

రాష్ట్రానికి అభివృద్ది లేదు, ప్రజలకు మనశాంతి లేదుగానీ, మద్యం మాత్రం ఏరులై పారుతోందని అన్నారు. మద్యం డాన్ బొత్స సత్యనారాయణకు పీసీసీ అధ్యక్షుడి పదవి కట్టబెట్టడం దారుణమని షర్మిల విమర్శించారు.





తిరుపతి: వైఎస్ఆర్ అభిమానించి చేరదీసిన వారిలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ చీడ పురుగు అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ కుటుంబీకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం నమ్మకద్రోహమని పేర్కొన్నారు. ఉండవల్లి వెనకాల కాంగ్రెస్‌ శక్తులు పనిచేస్తున్నాయని ఆరోపించారు.

రాజమండ్రిలో ఉండవల్లికి ఇక రాజకీయ సమాధేనని ఆయన హెచ్చరించారు. రాజీవ్‌గాంధీ మరణించినప్పుడు వైజాగ్‌లో ఉండవల్లి మద్యం సేవించి చిందులు వేశాడని వెల్లడించారు. వైఎస్‌ఆర్ భిక్ష ద్వారా పదవులు అనుభవించి ఇప్పుడు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

'రామోజీపై ఉండవల్లి పోరాటం ఎందుకు ఆపారు?'

'రామోజీపై ఉండవల్లి పోరాటం ఎందుకు ఆపారు?'

ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుపై కాంగ్రెస్ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాటం ఎందుకు ఆపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉండవల్లి దిగజారుడు తనం చూస్తే బాధేస్తోందన్నారు. రామోజీరావుకు చెందిన మార్గదర్శి అంశం వెలుగులోకి తెచ్చిన తరువాత ఆయన పాపులర్ అయ్యాడని తెలిపారు. రామోజీ విషయంలో ఉండవల్లి అస్త్ర సన్యాసం చేశారా? అని అడిగారు. లేకపోపే ఉండవల్లిని రామోజీ బెదిరించారా అన్న అనుమానం ఆయన వ్యక్తం చేశారు. రామోజీరావును ఉండవల్లి క్షమాపణలు కోరారా? అని అడిగారు.

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై రాష్ట్ర ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని అంబటి చెప్పారు. వైఎస్ఆర్ మరణానికి సోనియానే కారణం అని ఎవరన్నారో ఉండవల్లి చెప్పాలన్నారు. కాంగ్రెస్ నేతలు రాజశేఖర రెడ్డిని
విమర్శించినప్పుడు ఉండవల్లి ఎందుకు మాట్లాడలేదని అడిగారు. తోటి నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే ఎక్కడ దాక్కున్నావని ప్రశ్నించారు. వి.హనుమంతరావు, మధుయాష్కీ, సర్వే సత్యనారాయణ, శీలం, పాల్వాయి విమర్శించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని అడిగారు. ఉండవల్లి నమ్మక ద్రోహిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు వాద్రా ఆస్తుల గురించి చర్చించడానికి సిద్దంగా ఉన్నారా? అని ఉండవల్లకి ఆయన సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, ఎంపిలు లగడపాటి రాజగోపాల్ , వివేక్ లు వ్యాపారాలు చేయడంలేదా? వారికి వేల కోట్ల రూపాయలు లేవా? అని అడిగారు. జగన్మోహన రెడ్డి వ్యాపారాలు చేయకూడదా? ఆయన ఆస్తులు సంపాదించుకోకూడదా? అని ప్రశ్నించారు. సిబిఐపై సుప్రీం కోర్టు అన్న వ్యాఖ్యలు ఉండవల్లి ఎందుకు ప్రస్తావించలేదని అడిగారు.

maro praja prasthanam 11/07/2013

వర్షంలోనూ తరగని అభిమానం

Popular Posts

Topics :