28 July 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

బాబును నమ్మితే గొయ్యి తవ్వుకున్నట్టే

Written By news on Saturday, August 3, 2013 | 8/03/2013

మరో ప్రజప్రస్థానం 03-08-2013
ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా) : 'చంద్రబాబును నమ్ముకుంటే మన గొయ్యిని మనమే తవ్వుకున్నట్టు’ అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల హెచ్చరించారు. ప్రజా ‌కంటక కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, ప్రజల పక్షాన నిలబడకుండా కాంగ్రెస్‌తో‌నే అంటకాగుతున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తీరుకు నిరసనగా శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోకి శుక్రవారం ప్రవేశించింది. ఇరవై కిలోమీటర్లకు పైగా కొనసాగిన ఈ పాదయాత్రలో పలు గ్రామాల ప్రజలు తమ అభిమాన నాయకుడు రాజన్న తనయను కలిశారు. వారి సమస్యలు చెప్పుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విన్న శ్రీమతి షర్మిల ధైర్యంగా ఉండాలంటూ వారికి భరోసానిచ్చారు.

‘చంద్రబాబు 1999 ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వస్తే మహిళలకు బంగారు మంగళ సూత్రాలు ఇస్తానని, ఆడపిల్లలు పుడితే వారికి రూ.5 వేలు, స్కూలుకు వెళ్లేందుకు సైకిల్, వాళ్లు చదివినంత వరకు పెద్ద చదువులు చదివిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను మరిచిపోయారు. అడ్డగోలు కరెంటు చార్జీల వసూళ్ల పేరుతో సంసారాలు కూల్చారు. రైతులను పట్టుకొచ్చి జైలుకు పంపారు. ఇంట్లో మగవాళ్లు లేకపోతే ఆడవాళ్లను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో నిలబెట్టారు.‌ ఇలాంటి అవమానం భరించలేక మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు అధికారం కట్టబెడితే రైతు రుణాలను మాఫీ చేస్తానని చెబుతున్నారు' అని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. 
మరో ప్రజప్రస్థానం 03-08-2013
కన్న తండ్రిలా పరిపాలించిన వైయస్ఆర్ :
‘వైయస్ఆర్ కంటే ముందు, ఆ తరువాత చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. ముందు తొమ్మిదేళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ మూడేళ్ల నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైయస్ఆర్ సువర్ణ‌ పాలన కొనసాగింది. ఒక్క వైయస్ఆర్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్ట‌ం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఈ రోజు వైయస్ఆర్ సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారు. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వై‌యస్ఆర్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా ‌ఆయన పింఛన్లు ఇచ్చారు. పెన్షన్లే కాదు.. అరోగ్యశ్రీ, 108, 104. పావలా వడ్డీ రుణాలు, ఉచిత విద్యుత్, పక్కా ఇళ్లు ఇలా అన్ని సంక్షేమ పథకాలు అమలుచేసి చూపెట్టారు. అన్ని సంక్షేమ పథకాలు అమలుచేసి ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచని రికార్డు ముఖ్యమంత్రి వై‌యస్ఆర్. కానీ మన దురదృష్టం కొద్దీ ఆ కాలం పోయింది. ఇప్పుడు మన ‌కర్మకొద్దీ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు.

కిరణ్‌ది బాబు పాలనకు కొనసాగింపే :
చంద్రబాబు నాయుడు పాలనంతా ఒక చీకటి అధ్యాయం.. ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్ ప్రభుత్వం నడుస్తోంది. వై‌యస్ఆర్ ఇచ్చిన పింఛన్లకు ఇవ్వాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఏనాడో అటకెక్కించారు. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల‌ రూపాయలు ఖర్చుచేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళలను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ.3 వడ్డీ తీసుకుంటున్నారని చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు. ఇప్పటికే ఎరువుల ధరలు 300 శాతం నుంచి 800 శాతానికి పెంచారు. ఆర్టీసీ చార్జీలు మూడుసార్లు పెంచారు. రూ.305 ఉన్న వంటగ్యాస్ ధర రూ.440 చేశారు. అదీ సబ్సిడీ ఉంటే.. సబ్సిడీ లేకుంటే రూ.1000 ఒక్క గ్యా‌స్ సిలిండ‌ర్‌కు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ చార్జీలు, వ్యాట్, కరెంటు చార్జీలు ప్రతి ఒక్కటీ పెంచేశారు’ అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

శుక్రవారం పాదయాత్ర 20.1 కి.మీ. :
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 228వ రోజు శుక్రవారంనాడు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం రంగోయ్ జంక్ష‌న్ నుంచి ప్రారంభమైంది. అక్క‌డి నుంచి మకరాజువాక, హరిపురం, మందస, కొత్తపల్లి, పాలవలస, కొర్లాం, లక్కవరం, బూర్గాంల మీదుగా కొనసాగింది. బూర్గాం శివారులో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8 గంటలకు శ్రీమతి షర్మిల చేరుకున్నారు. మొత్తం 20.1 కిలోమీటర్ల దూరాన్ని ఆమె నడిచారు.

వేగంగా ‘విజయ ప్రస్థానం’ స్తూప నిర్మాణం :
‘విజయ ప్రస్థానం’ స్తూపం నిర్మాణం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. పదమూడున్నర అడుగుల స్థలంలో చేపట్టిన ఈ నిర్మాణంలో ఐదడుగుల పెడస్టల్‌పై పది అడుగుల వైయస్ఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహానికి రెండు వైపులా రెండు ఆ‌ర్చిలను పదిహేను అడుగుల ఎత్తులో నిర్మించారు. పెడస్టల్‌పై శ్రీమతి షర్మిల ఫొటోతో ఉన్న గ్రానైట్ పలకను అమర్చనున్నారు. ఈ రెండు ఆ‌ర్చిల మధ్య వైయస్ఆర్‌ కాంగ్రెస్ గుర్తు ఉండేలా ఏర్పాటు చేశారు. ఆ‌ర్చి, ప్రవేశద్వారం, గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు పూ‌ర్తయ్యాయి. ఆదివారం ఇక్కడ జరగనున్న శ్రీమతి షర్మిల పాదయాత్ర ముగింపు బహిరంగసభకు ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నాయి. లక్షల సంఖ్యలో వచ్చే అభిమానులకు ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.
http://www.ysrcongress.com/news/top_stories/smt-sharmila-slams-chandrababu-naidu.html

షర్మిల పాదయాత్ర అపూర్వ ఘట్టం

షర్మిల పాదయాత్ర అపూర్వ ఘట్టం : ఎమ్మెల్యే భూమన
హైదరాబాద్:  వైఎస్ఆర్ సిపి నాయకురాలు షర్మిల మరోప్రజా ప్రస్థానం పాదయాత్ర ఓ అపూర్వ చారిత్రక ఘట్టం అని ఆ పార్టీ ఎమ్మెల్యే  భూమన కరుణాకర రెడ్డి అన్నారు. షర్మిల పాదయాత్ర  ప్రపంచ రాజకీయ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదగిన ఘట్టం అని పేర్కొన్నారు. దాదాపు మూడున్నర కోట్ల మంది తెలుగు ప్రజలను పలకరిస్తూ సాగిన పాదయాత్ర రేపటితో ముగియబోతుందని చెప్పారు.  

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నిశాచరుడుగా రాత్రిళ్లు అవహేళన పాదయాత్ర చేశారన్నారు. భారతదేశంలోనే ఏ మహిళా 3113 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రికార్డు లేదని తెలిపారు. కోట్లాది మంది తెలుగు ప్రజల ఆత్మీయ అనుబంధాల మధ్య సాగిన పాదయాత్ర ప్రజల్లో ఒక బరోసా, నమ్మకాన్ని కలిగించిందని పేర్కొన్నారు.

వైఎస్ఆర్ ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి ఉండేది కాదు

వైఎస్ ఆర్ ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి ఉండేది కాదువైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శోభానాగిరెడ్డి
హైదరాబాద్: : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడి ఉండేది కాదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శోభానాగిరెడ్డి శనివారం ఆ పార్టీ కేంద్రకార్యాలయంలో వెల్లడించారు. ఆ మహానేత మరణించిన నాటి నుంచి రాష్ట ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు భరోసాతోనే కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని శోభానాగిరెడ్డి ఆరోపించారు.
 
చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు రాష్ట విభజన ఓ ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్ గురించి ఎందుకు ఆలోచించలేదని ఆమె ఈ సందర్బంగా బాబును ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అంశంపై మాట్లాడకుండా సీమాంధ్ర టీడీపీ నేతల గొంతును బాబు నొక్కుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు భయపడి కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీలు రాజీనామా నాటకాలడుతున్నాయన్నారు.
 
రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ అధిష్టానాన్ని గట్టిగా ప్రశ్నించే పరిస్థితి రాష్ట్ర నాయకులలో లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరితో విభజించు పాలించు అన్న బ్రిటిష్ సిద్ధాంతాన్ని గుర్తుకు తెస్తుందన్నారు. తెలంగాణ రాష్ట సమితి అధినేత కేసీఆర్ శుక్రవారం చేసిన ప్రకటనలకు కాంగ్రెస్ పార్టీనే అవకాశం ఇచ్చిందని తెలిపారు. హైదరాబాద్ నగరంపై ఏకపక్షంగా ఏలా నిర్ణయం తీసుకున్నారని శోభానాగిరెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు.
 
15 మంది ఎంపీల కోసం రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. భవిష్యత్తులో రాజధాని గురించి ఇరుప్రాంతలవారు ఘర్షణ పడే పరిస్థితి ఉందని ఆమె జోస్యం చెప్పారు. ఏ ప్రాంతం నుంచి రాష్ట్రానికి సీఎం అయిన హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేసిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే వల్లే రాష్టంలో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయని శోభానాగిరెడ్డి తెలిపారు.

విభజన జరిగితే నీటికోసం యుద్ధాలు

హైదరాబాద్: రాష్ట్రవిభజన జరిగితే నీటి కోసం యుద్దాలు జరిగే పరిస్థితులు ఏర్పడతాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత మైసూరారెడ్డి హెచ్చరించారు.  కృష్ణానది వరద నీటి మిగులు జలాలపై నిర్మించిన ప్రాజెక్ట్‌లు కాస్త చారిత్రక కట్టడాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిని ఆయన తప్పుబట్టారు.
విభజన జరిగితే నీటికోసం యుద్ధాలు: మైసూరా రెడ్డి
రాష్ట్రరాజధానితో పాటు అనేక అంశాలపై స్పష్టత లేకుండా కాంగ్రెస్‌పార్టీ తీసుకున్న విభజన నిర్ణయం రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని తీవ్రసంక్షోభంలోకి నెట్టివేసే ప్రమాదముందని  మైసూరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నదీ జలాలపై పోరుగురాష్ట్రాలతో వివాదాలు కొనసాగుతున్న నేపధ్యంలో తాజాగా విభజన పేరుతో తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలకు తీవ్ర సమస్యలు తెచ్చిపెడుతుందన్నారు. కృష్ణానది వరద నీటి మిగులుజలాలపై ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు, ఇప్పడు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్ల ప్రజలు నీటి కోసం యుద్దాలు చేసుకోవాల్సిన పరిస్ధితులేర్పడతాయని పేర్కొన్నారు. ఒకవేళ విభజనకు నిజంగా సిద్దపడితే మరి సొంత పార్టీ నేతలతో చంద్రబాబు ఎందుకు ఉద్యమాలు, ఆందోళనలు చేయిస్తున్నారో 
సమాధానం చెప్పాలన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నేతలు రాజీనామాల పేరుతో డ్రామాలాడుతున్నారని మైసూరా మండిపడ్డారు. నిజంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు చిత్తశుద్ది ఉంటే గవర్నర్‌ను కలిసి తమ రాజీనామా లేఖలివ్వాలి కానీ ఇలా సీఎంకు, పీసీసీ ఛీఫ్‌కు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ స్వార్ధం కోసం చేసిన అనాలోచిత చర్యకు సోనియా, చంద్రబాబులు బాధ్యత వహించాలన్నారు. దేశాన్ని పాలించే కాంగ్రెస్‌ పార్టీకి కనీస ఇంగిత జానం లేకపోవడం బాధాకరమని మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Ambati holds Cong , TDP responsible for the present crisis

ఇచ్చాపురంలో మరోప్రజాప్రస్థానం


చిన్నారిని మనసారా హత్తుకుంటూ.. రాజన్న బిడ్డతో కరచాలనం కోసం అభిమానుల ఆరాటం
రంగోయి జంక్షన్ వద్ద గ్రామస్తుల సమస్యలను ఆలకిస్తూ..
పాదయాత్రలో పాల్గొన్న వికలాంగ సోదరుని పలకరిస్తూ..
మఖరజోల వద్ద తాతను ఆప్యాయంగా పలకరిస్తూ...

కుమ్మక్కు పార్టీల కొత్త డ్రామా


కుమ్మక్కు పార్టీల కొత్త డ్రామా
హైదరాబాద్: : కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు తీరని ద్రోహం తలపెట్టిన కాంగ్రెస్, టీడీపీ నేతలు, రాజీనామాల పేరుతో మరో కొత్త డ్రామాకు తెర తీశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ‘‘సీమాంధ్రకు అన్యాయం తలపెట్టిన రెండు పార్టీల నేతలు దొంగ ముసుగు వేసుకుని, ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంలోకి ప్రవేశించి, దాన్ని అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిపట్ల ప్రజలు, ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలి’’ అన్నారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమాన్ని చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయటం చాలా ఆశ్చర్యకరం. పైగా రాజీనామాలను కొందరు పీసీసీ అధ్యక్షుడికి, మరికొందరు సీఎంకు అందజేయడాన్ని బట్టే వారి చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది’’ అని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనకు వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించడం వల్లే ఆ మేరకు నిర్ణయం జరిగిందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల పట్ల అంబటి అభ్యంతరం వ్యక్తంచేశారు.
 
 కేంద్ర హోంమంత్రి నిర్వహించిన అఖిలపక్ష భేటీలో వైఎస్సార్‌సీపీ చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. ‘‘తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తున్నాం. రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం ఒక రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా సర్వాధికారాలూ కేంద్రానికే ఉన్నాయి. అయినా మా జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మేము అడిగేదల్లా అన్ని విషయాలను, సమస్యలను పరిగణనలోకి తీసుకొని త్వరతగతిన ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలి’’ అని వివరించారు. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన విభజన అందరికీ ఆమోదయోగ్యమైనదేనా అని అంబటి సూటిగా ప్రశ్నించారు. ‘‘విభజన సమస్య పుట్టినప్పుడు ఉన్న పార్టీ కాకపోయినా విజ్ఞతతో, ముందుచూపుతో మేం చెప్పినదాన్నే ప్రస్తుతం అందరూ అనుసరిస్తున్నారు.
 
  మేం చెప్పిన విషయాలనే కాంగ్రెస్, టీడీపీ నేతలు చెబుతున్నారు’’ అని అన్నారు. రాష్ట్ర ప్రజలను మోసగించేందుకు కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా డ్రామాలాడుతున్నారని అంబటి ధ్వజమెత్తారు. ‘‘కాంగ్రెస్ ఇలాంటి ప్రకటన చేస్తుందని భావించలేదంటూ కేంద్ర మంత్రి ఒకాయన మొసలి కన్నీరు కారుస్తున్నారు. విభజన అనివార్యమని పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నా కాంగ్రెస్ నేతలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. మీడియా కథనాలకు స్పందించి, బాధ్యతాయుతమైన పార్టీగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు జూలై 17న కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు లేఖ రాశారు. తెలంగాణపై ముందు కేంద్రం తన అభిప్రాయం చెప్పి, అన్ని పార్టీలను పిలిచి చర్చించాలని అందులో స్పష్టంగా కోరాం. వాటిని పరిగణనలోకి తీసుకుని ఉంటే రాష్ట్రం ఇలా అగ్నిగుండంలా మారేదే కాదు’’ అన్నారు.
 
 బ్రిటిషోళ్లలా కాంగ్రెస్ తీరు: రాష్ట్రంలో చిచ్చుపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం మరో దుర్మార్గమైన ఆలోచన చేస్తోందని అంబటి నిప్పులు చెరిగారు. బ్రిటిష్ వారి మాదిరిగా విభజించు, పాలించు విధానాన్ని అనుసరిస్తోందని ఆరోపించారు. ‘‘గుంటూరు, ఒంగోలు, కర్నూలుల్లో మరో రాజధాని తెచ్చుకోవచ్చని సీమాంధ్ర నేతలతో దిగ్విజయ్‌సింగ్ చెబుతూ ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమాన్ని చీల్చి మరో కొత్త చిచ్చు పెడుతున్నారు. విభజనకు చంద్రబాబు రెడ్‌కార్పెట్ పరిచి సీమాంధ్రులకు తీరని ద్రోహం చేశారు. ఆ పార్టీ నేతలేమో తీరిగ్గా మూడు రోజుల తర్వాత  ‘రాజీ డ్రామా’లు చేస్తున్నారు.
 
 రాష్ట్ర విభజనకు టీడీపీ కట్టుబడి ఉందని, కొత్త రాజధాని కోసం రూ.4, 5 లక్షల కోట్లిస్తే  సర్దుకొని వెళ్లిపోతామంటూ చంద్రబాబు దౌర్భాగ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేసరికి అందులో ప్రవేశించి నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. సీమాంధ్ర టీడీపీ నేతలు కన్నీరు కార్చడం మాని, ఇలా ఎందుకు చేశారంటూ బాబును గట్టిగా నిలదీయాలి. బాబుకు విజన్ 2020 లేదు. ఆయన విలన్ 2013!సీమాంధ్రలో ఉద్యమం ఎగసిపడుతుంటే నీరో చక్రవర్తిలా ఆయన ఫిడేల్ వాయిస్తున్నారు’’ అన్నారు. అన్ని ప్రాంతాలకు, ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం వైఎస్సార్‌సీపీ వద్ద ఉందని, కేంద్రం అడిగితే కచ్చితంగా చెబుతామని ఒక ప్రశ్నకు బదులుగా అంబటి చెప్పారు. న్యాయమైన తెలంగాణ విభజనను తమ పార్టీ ఆహ్వానిస్తోందన్నారు.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 229వ రోజు (జిల్లాలో 14వ రోజు) కార్యక్రమ వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తల శిల రఘురాం, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు శుక్రవారం ప్రకటించారు. శనివారం ఉదయం బూరగాం సమీపంలోని బస నుంచి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర.. జలంత్రకోట జంక్షన్, కంచిలి, బైరిపురం  గ్రామాల మీదుగా సాగుతుంది. భోజన విరామం తర్వాత   షర్మిల..  సంత, జాడుపూడి, గొర్లెపాడు, ఆర్.కరాపాడు, కవిటి జంక్షన్‌ల మీదుగా గుడ్డిభద్ర గ్రామం చేరుకుంటారు. అనంతరం అక్కడ రాత్రి బస చేస్తారు.
 
 జిల్లాలో 14వ రోజు పర్యటించే ప్రాంతాలు
 జలంత్రకోట జంక్షన్, కంచిలి, బైరిపురం, సంత, జాడుపూడి, గొర్లెపాడు, ఆర్.కరాపాడు, కవిటి జంక్షన్, గుడ్డిభద్ర

మాట తప్పడం బాబు నైజం: షర్మిల

మరో ప్రజాప్రస్థానం 02-08-2013
ఆయన్ను నమ్మితే మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే
  మరో ప్రజాప్రస్థానంలో షర్మిల మండిపాటు
  రాష్ట్రంలో బాబు పాలన ఓ చీకటి అధ్యాయం

  అడ్డగోలు కరెంటు చార్జీలతో రైతులను వేధించారు.. అన్నదాతలను జైల్లో పెట్టారు
  ఆ అవమానాలు తట్టుకోలేక 3 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు

 
 మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి:‘‘చంద్రబాబు 1999 ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వస్తే మహిళలకు బంగారు మంగళ సూత్రాలు ఇస్తానని, ఆడపిల్లలు పుడితే వారికి రూ.5 వేలు, స్కూలుకు వెళ్లేందుకు సైకిల్, వాళ్లు చదివినంత వరకు పెద్ద చదువులు చదివిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను మరిచిపోయారు. అడ్డగోలు కరెంటు చార్జీల వసూళ్ల పేరుతో సంసారాలను కూల్చారు. రైతులను పట్టుకొచ్చి జైలుకు పంపారు. ఇంట్లో మగవాళ్లు లేకుంటే ఆడవాళ్లను తీసుకొచ్చి పోలీస్‌స్టేషన్లలో నిలబెట్టారు.
 
 ఈ అవమానం భరించలేక మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు అధికారం కట్టబెడితే రైతు రుణాలను మాఫీ చేస్తానని చెబుతున్నాడు. చంద్రబాబును నమ్ముకుంటే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. 20 కిలోమీటర్లకు పైగా సాగిన ఈ పాదయాత్రలో పలు గ్రామాల ప్రజలు షర్మిలను కలిశారు. వారి సమస్యలను చెప్పుకున్నారు. ధైర్యంగా ఉండాలంటూ వారికి షర్మిల భరోసానిచ్చారు. ఈ సందర్భంగా పలుచోట్ల షర్మిల ప్రజలతో ఏమన్నారో ఆమె మాటల్లోనే..
మరో ప్రజాప్రస్థానం 02-08-2013 
 వైఎస్ ఓ తండ్రిలా పాలించారు..
 ‘‘వైఎస్సార్ కంటే ముందు, ఆయన తరువాత చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు. ముందు తొమ్మిదేళ్లు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈ మూడేళ్ల నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టమ్మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఈరోజు వైఎస్సార్ సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారు. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్లు ఇచ్చారు. పెన్షన్లే కాదు.. అరోగ్యశ్రీ, 108, 104. పావలా వడ్డీ రుణాలు, ఉచిత విద్యుత్తు, పక్కా ఇళ్లు ఇలా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి చూపెట్టారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచని రికార్డు ముఖ్యమంత్రి వైఎస్సార్. కానీ మన దురదృష్టం కొద్దీ ఆ కాలం పోయింది. ఇప్పుడు మన ఖర్మకొద్ది కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు.
 
 ఇది బాబు పాలనకు కొనసాగింపే..
 చంద్రబాబు నాయుడు పాలనంతా ఒక చీకటి అధ్యాయం.. ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్ ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవ్వాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఏనాడో అటకెక్కించారు. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళలను పలకరించినా ఏ ఒక్కరికి కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ.3 వడ్డీ తీసుకుంటున్నారని చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు. ఇప్పటికే ఎరువుల ధరలు 300 శాతం నుంచి 800 శాతానికి పెంచారు. ఆర్టీసీ చార్జీలు 3 సార్లు పెంచారు. రూ.305 ఉన్న వంటగ్యాస్ ధర రూ.440 చేశారు. అదీ సబ్సిడీ ఉంటే.. సబ్సిడీ లేకుంటే రూ.1000 ఒక్క గ్యాస్ సిలిండర్‌కు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ చార్జీలు, వ్యాట్, కరెంటు చార్జీలు ప్రతి ఒక్కటీ పెంచేశారు’’
 మరో ప్రజాప్రస్థానం 02-08-2013
 20.1 కి.మీ. పాదయాత్ర..
 శుక్రవారం 228వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం రంగోయ్ జంక్షన్ నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి మకరాజువాక, హరిపురం, మందస, కొత్తపల్లి, పాలవలస, కొర్లాం, లక్కవరం, బుర్గాం గ్రామాల మీదుగా సాగింది. బుర్గాం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు షర్మిల చేరుకున్నారు. మొత్తం 20.1 కిలోమీటర్లు నడిచారు. షర్మిల వెంట నడిచిన వారిలో పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాసు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, తాజా మాజీ ఎమ్మెల్యేలు సుజయ కృష్ణారంగారావు, పిరియా సాయిరాజు, మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం, మాజీ ఎమ్మెల్యేలు బగ్గు లక్ష్మణరావు, ముదునూరి ప్రసాదరాజు, కుంభ రవిబాబు, పలాస కో ఆర్డినేటర్ వజ్జె బాబూరావు, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు కల్మట వెంకటరమణ, వరుధు కళ్యాణి, గొర్లె కిరణ్, దువ్వాడ శ్రీనివాసు, కిల్లి రామ్మోహన్‌రావు, వైవీ సూర్యనారాయణ, పీఎంజే బాబు, బొడ్డేపల్లి మాధురి, నాయకులు తిప్పల నాగిరెడ్డి, సిద్ధమూర్తి నారాయణరెడ్డి, కందుల రంగారెడ్డి, కొయ్య ప్రసాదరెడ్డి, కిలపర్తి జానకి, స్థానిక నాయకులు దుప్పల రవీంద్ర, హన్మంతు కిరణ్‌కుమార్, బొడ్డేపల్లి పద్మజ, ధవళ వెంకటగిరిబాబు ఉన్నారు. ప్రతిరోజు షర్మిలతో నడుస్తున్న వారిలో తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, ఆర్కే, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, అందూరి రాజగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
 
 వడివడిగా ‘విజయ ప్రస్థానం’ పనులు
 ‘విజయ ప్రస్థానం’ స్తూపం నిర్మాణం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పదమూడున్నర అడుగుల స్థలంలో చేపట్టిన ఈ నిర్మాణంలో ఐదడుగుల పెడస్టల్‌పై పది అడుగుల వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహానికి రెండు వైపులా రెండు ఆర్చ్‌లను పదిహేను అడుగుల ఎత్తులో నిర్మించారు. పెడస్టల్‌పై షర్మిల ఫొటోతో ఉన్న గ్రానైట్ పలకను అమర్చనున్నారు. ఈ రెండు ఆర్చ్‌ల మధ్య వైఎస్సార్‌సీపీ గుర్తు ఉండేలా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆర్చ్, ప్రవేశ ద్వారం, గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు పూర్తి చేశారు. శనివారం రాత్రి నాటికి విజయప్రస్థానం స్తూపం పనులు పూర్తి అవుతాయని వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం చెప్పారు. బహిరంగ సభ ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నాయి. లక్షల సంఖ్యలో వచ్చే జనం ఇబ్బంది పడకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.

రోజుకో మాట..ఇదే చంద్రబాబు బాట...

రోజుకో మాట..ఇదే చంద్రబాబు బాట...
హైదరాబాద్: :
రాష్ర్ట విభజన అంశంపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రోజుకో మాట.. పూటకో పాట పాడుతున్నారని ఆ పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ర్ట విభజనకు సంబంధించి తన వద్ద పూర్తి సమాచారం ఉన్నా ఏమీ తెలియనట్టు అస్సలు పెదవే విప్పని చంద్రబాబు.. తీరా సీమాంధ్ర ప్రాంతంలో ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగడంతో వెంటనే వైఖరి మార్చేశారు. ఈ రకంగా పూటకో వైఖరి మార్చడం వల్ల ప్రజల్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నామని ఇరు ప్రాంతాల నేతలు అంతర్గత చర్చల్లో వాపోతున్నారు. జూలై 1న హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ర్ట వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు చర్యలు తీసుకుంటున్నామని, పార్టీ సీనియర్ నేతలకు రోడ్ మ్యాప్ తయారు చేయాల్సిందిగా చెప్పారు. విభజన ప్రక్రియపై ఆ తర్వాత జూలై 12, 26 తేదీల్లో ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై తెలంగాణ అంశంపైనే చర్చించింది. రాష్ర్టంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ ఢిల్లీలోనే మకాం వేశారు. ఎంతో హడావిడి నడిచింది. ఇదంతా జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఏమాత్రం స్పందించలేదు. ఆ విషయాలేవీ తనకు పట్టనట్లు ఇంటికే పరిమితమయ్యారు. తొలి దశ పంచాయతీ ఎన్నికలు గతనెల 23న జరగ్గా ఆ ఎన్నికలకు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ వ్యవహారాలుగానీ, తెలంగాణపై ఢిల్లీలో జరుగుతున్న హడావుడిపైగానీ నోరు విప్పలేదు. పంచాయతీ ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడారు. తమ హయాంలో పంచాయతీలను ఎలా అభివృద్ధి చేసింది, ఒకవేళ అధికారంలోకి వస్తే ఏమి చేసేది చెప్పారే తప్ప రాష్ట్ర విభజనపై మాట్లాడనన్నారు. తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చిన త ర్వాత మరోసారి విలేకరులతో మాట్లాడారు. అప్పుడు తమ గెలుపు గురించి వివరించారు. ఇదే సమయంలో విలేకరులు తెలంగాణ అంశం గురించి ప్రస్తావిస్తే... తాను ఇప్పుడు ఆ అంశం గురించి మాట్లాడనని చెప్పారు. ఆ తరువాత కూడా పంచాయతీ ఎన్నికల ఫలితాలపైనే ప్రసంగించారు. తెలంగాణ గురించి ఎక్కడా మాట్లాడలేదు. 
 
నిర్ణయం ప్రకటించినా అదే మౌనం: గతనెల 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ సమావేశాల్లో కీలకమైన తెలంగాణపై నిర్ణయం ప్రకటించినా.. అప్పుడు కూడా ఏమాత్రం స్పందించకుండా చంద్రబాబు ఇంటికే పరిమితమయ్యారు. అదే రోజు సాయంత్రం కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు మాట్లాడతారని మీడియాకు సమాచారం పంపినా చివరి నిమిషంలో ఆయన విలేకరుల సమావేశానికి రాకుండా పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిని పంపించారు. ఆ మరుసటి రోజు మూడోదశ పంచాయతీ ఎన్నికలు జరిగిన 31వ తేదీ చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. అప్పుడూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై ఏమీ మాట్లాడకుండా తెలంగాణకు అనుకూలంగా పార్టీ గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్ అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం నిర్మాణం ఆషామాషీ వ్యవహారం కాదని, అందుకు నాలుగు లక్షల కోట్ల నుంచి అయిదు లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 
 అధిష్టానంతో ఆసాంతం ‘టచ్’లోనే: కొత్త రాజధాని ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని, తెలంగాణకు అనుకూలంగా ఇదివరకిచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని సీడబ్ల్యూసీ సమావేశం నిర్ణయం ప్రకటించిన తర్వాత చెప్పిన చంద్రబాబు... ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ మళ్లీ మాట మార్చారు. కాంగ్రెస్ అధిష్టానంతో చంద్రబాబు ప్రతినిత్యం టచ్‌లో ఉన్నట్టు అందరికీ తెలిసిందే. తాజాగా హిందుస్థాన్ టైమ్స్ గురువారం ప్రచురించినవార్త కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. కాంగ్రెస్ అధిష్టానం నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న చంద్రబాబు ఢిల్లీలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నారని తెలిసినా రెండు ప్రాంతాల్లో రాజకీయ లబ్ధి పొందుతానని తనకేమీ పట్టనట్టు, సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు. పైగా ఎవరూ నోరు విప్పొద్దని నేతలకు చెప్పారు.
 
 వెనుకపడిపోతామని రాజీనామాల డ్రామా: సమైక్యం కోసం సీమాంధ్రలో ఇంతపెద్ద ఎత్తున ఉద్యమం వస్తుందని చంద్రబాబు ఊహించలేదని, అందుకే కాంగ్రెస్ తెలంగాణపై ప్రకటన చేసిన రోజే సీమాంధ్రలో రాజధాని నిర్మాణం కోసం నాలుగు లక్షల కోట్ల రూపాయలివ్వాలని మాట్లాడారని కోస్తా ప్రాంతానికి చెందిన పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చంద్రబాబుకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయని, అయితే సీమాంధ్ర ప్రజల్లో తీవ్రస్థాయి నిరసనలు వ్యక్తమవడం, ఉద్యమం ఉవ్వెత్తున ఎగియడంతో ఏం చేయాలో అర్థంకాక తెరవెనక నేతలను రాజీనామాకు పురమాయించారని ఆ నేత వివరించారు. ఉద్యమంలో పాల్గొనకపోతే రాజకీయంగా వెనుకబడిపోతామన్న భయంతో ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలను రాజీనామా చేయాలని చెబుతున్నారని, ఈ రకంగా పూటకో వైఖరి అనుసరించడం వల్లే చంద్రబాబు ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయారని పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్నీ తెలిసినప్పుడే స్పష్టంగా ఒక వైఖరి తీసుకోవడం, దానికి కట్టుబడి ఉండకపోవడం, ప్రతి విషయంలోనూ రాజకీయంగా పార్టీకి ఉపయోగమా? కాదా? అని బేరీజు వేసుకోవడం వంటి రంగులు మార్చే చర్యల వల్ల పార్టీ ఇరు ప్రాంతాల్లో పూర్తిగా అభాసుపాలైందని తాజా పరిణామాలపై పార్టీ నేతలు తలలు బాదుకుంటున్నారు.

ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కన్నుమూత

ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కన్నుమూత
హైదరాబాద్ : మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో ఆయన ఈరోజు ఉదయం 5 గంటల 15 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా పురుషోత్తం రెడ్డి బ్రెయిన్‌స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. మే 1న ఆయనను చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఉప్పునూతల కోమాలోనే ఉన్నారు.

ఉప్పునూతల స్వగ్రామం నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం అడ్డగూడూరు. కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాలంలో పురుషోత్తం రెడ్డి మంత్రిగా పనిచేశారు. రామన్నపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, తెలంగాణ అభివృద్ధి మండలి ఛైర్మన్‌గా, ఎపిఐఐసీకి చైర్మన్‌గా ఉప్పునూతల పనిచేశారు. ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి మృతి పట్ల పలువురు దిగ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్ నేతను కోల్పోయామని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి అన్నారు

ఇచ్ఛాపురం సభ జయప్రదానికి పిలుపు

Written By news on Friday, August 2, 2013 | 8/02/2013

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత  శ్రీ వై.యస్. జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రపంచ రికార్డు సృష్టించిందని పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయకృష్ణ రంగారావు చెప్పారు. ఇచ్చాపురంలో ఆదివారం నాడు ఏర్పాటవుతున్న బహిరంగ సభను అదే స్థాయిలోనే నిర్వహిస్తున్నామనీ,  ముగింపు సభను విజయవంతం చేయాలనీ  బొబ్బిలి తాజా మాజీ ఎమ్మెల్యే కూడా అయిన రంగారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  పాదయాత్ర ముగింపు సభపై ఆయన పలాస గాలిమేడ ఆవరణలో పార్టీ సీజీసీ, సీఈసీల సభ్యులు, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజవర్గ పార్టీ ఇన్‌చార్జి కుంభా రవిబాబు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్లు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 230 రోజులపాటు 3 వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేయటం ద్వారా, ప్రపంచంలోనే ఇంతదూరం పాదయాత్ర చేసిన తొలి మహిళగా శ్రీమతి షర్మిల అందరి మన్ననలు పొందుతున్నారని చెప్పారు. తొలిరోజు వేసిన అడుగు మొదలుకొని ఇప్పటివరకు అలుపెరగకుండా దారిపొడవునా కనిపించిన ప్రతి ఒక్కరికి ధైర్యం చెబుతూ దూసుకుపోయారన్నారు. 

నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ తెలంగాణ లోని  లోక్‌సభ సీట్ల కోసం రాష్ట్రాన్ని విడదీసేందుకు కాంగ్రెస్ కుటిలయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి అతిత్వరలోనే కాంగ్రెస్ సర్కార్ కూలి అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నెల 4న ఇచ్ఛాపురంలో మరో ప్రజాప్రస్థానం చారిత్రాత్మక ఘట్టం ముగియనున్నందున అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున హాజరై దివంగత మహానేత రాజశేఖరరెడ్డి తనయ షర్మిలమ్మను ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో కేంద్రపాలక మండలి సభ్యులు డాక్టర్ కణితి విశ్వనాథం, ఎం.వి.కృష్ణారావు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు వరుదు కల్యాణి, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పిరియా సాయిరాజ్, వజ్జ బాబూరావు, కలమట వెంకటరమణ, దువ్వాడ శ్రీనివాస్, బొడ్డేపల్లి మాధురి, పాలవలస విక్రాంత్, పి.ఎం.జె.బాబు, స్థానిక నాయకులు ధవళ గిరిబాబు, దువ్వాడ శ్రీకాంత్, దువ్వాడ శ్రీధర్, పాలవలస వైకుంఠరావు, డబ్బీరు భవానీశంకర్, బళ్ల గిరిబాబు, నర్తు ప్రేమ్‌కుమార్, యవ్వారి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

http://www.ysrcongress.com/news/news_updates/sujaya-appeals-people-to-make-ichapuram-meeting-a-grand-success.html

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు

ఆనాడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు నేడు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించి ఆ నిందను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వేయటానికి ప్రయత్నిస్తున్నారని ఆయన శుక్రవారమిక్కడ విమర్శించారు. వైఎస్ఆర్ సమైక్యవాదో...కాదో ఒక్కసారి అసెంబ్లీ రికార్డులు తిరగేస్తే తెలుస్తుందని ఆయన అన్నారు. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి....సోనియాగాంధీ కాళ్లు మొక్కి తిరిగి వచ్చారని ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఎద్దేవా చేశారు.

మరోవైపు విజభనను నిరసిస్తూ  వైఎస్‌ఆర్‌ జిల్లా పోరుమామిళ్లలో ఓ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేయగా, తోటి విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా పులివెందులలో మహిళలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి, సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యవాదులు తహసీల్దారు కార్యాయం ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగారు. రాజంపేటలోనూ రాజకీయ వర్గాలు ర్యాలీ చేపట్టాయి. నేడు కూడా దుకాణాలు స్వచ్చందంగా మూతపడ్డాయి.

చిరంజీవిని రాళ్లతో కొట్టాలి: శోభారాణి

చిరంజీవిని రాళ్లతో కొట్టాలి: శోభారాణి
హైదరాబాద్ : కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి కుటుంబసభ్యులు నటించిన సినిమాలను అడ్డుకుంటామని మాజీ పీఆర్పీ నాయకురాలు శోభారాణి హెచ్చరించారు. పైసల కోసం చిరంజీవి పార్టీని అమ్ముకున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్ర విభజనపై నోరెత్తని చిరంజీవి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ శోభారాణి శుక్రవారం హైదరాబాదులోని శ్రీనగర్‌ కాలనీలో ఉన్న తన ఇంట్లో స్వచ్చంధ గృహ నిర్భంధం విధించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిరంజీవిని రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారు. చిరంజీవి సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోను నటుడే అని ధ్వజమెత్తారు.

రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్.. రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని చూస్తోందని ఆమె ధ్వజమెత్తారు. సోనియా గాంధీ దేశం విడిచి వెళ్లాలని ఆమె డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమేనని శోభారాణి ప్రకటించారు. గతంలో కూడా శోభారాణి గృహ నిర్భంధం విధించుకుని హడావుడి చేశారు. తెలంగాణ వాదులు ఆమె ఇంటిపై దాడి చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణపై కాంగ్రెస్, టీడీపీ డబుల్ గేమ్: షర్మిల

తెలంగాణపై కాంగ్రెస్, టీడీపీ డబుల్ గేమ్: షర్మిల
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్, టీడీపీ డబుల్ గేమ్ ఆడుతున్నాయని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నారు. తమ పార్టీ ఒక్కటే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతోందని చెప్పారు. తెలంగాణ అంశం ఎన్నికలు లేదా రాజకీయ అంశం కాదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ సెంటిమెంట్ ను తామెప్పుడూ గౌరవిస్తామన్నారు. నిష్పక్షపాతంగా, న్యాయబద్దంగా రాష్ట్ర విభజన జరిగితే తమకు అభ్యంతరం లేదని 'హెడ్ లైన్స్ టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తూనే 'హెడ్ లైన్స్ టుడే'కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. వైఎస్సార్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేశారని, దీంతో ఆయన హయాంలో తెలంగాణ, నక్సలిజం సమస్య సమసిపోయిందని షర్మిల తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాల్లో విఫలమవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం జనాభా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తోందని తెలిపారు. నదుల దిగువన ఉన్న కోస్తాంధ్రకు విభజన కారణంగా నీళ్లు అందకుంటే ఏడారిగా మారే ప్రమాదముందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం లేదా ఉమ్మడిగా రాజధానిగా ప్రకటించాలని షర్మిల అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు సరిపోవని చెప్పారు. ఆదాయం పంపిణీ సహా పలు అంశాలు రాష్ట్ర విభజనతో ముడిపడివున్నాయని తెలిపారు. హైదరాబాద్ లోని ఆంధ్రావాసుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వలేదని ఆమె విమర్శించారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైఎస్సార్ సీపీ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ మాత్రం గోడ మీద పిల్లివాటం ప్రదర్శిస్తున్నాయని దుయ్యబట్టారు.

రాష్ట్ర విభజన అంశం ఎన్నికలు లేదా రాజకీయాలకు సంబంధం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని తన తండ్రి వైఎస్సార్ విశ్వసించారని తెలిపారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోలేదన్న దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ... ఇది క్విక్ ప్రో కో కాక మరేమిటని నిలదీశారు. తెలంగాణపై కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని ఆమె ఆరోపించారు. నాలుగేళ్ల పాటు సాగదీసి, ఇంత హడావుడిగా తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం హాస్యాస్పదమన్నారు.

తెలంగాణ సెంటిమెంట్ ను తామెల్లప్పుడూ గౌరవిస్తామని షర్మిల చెప్పారు. ఇరు ప్రాంతాల వారికి అన్యాయం జరగకుండా రాష్ట్ర విభజన జరిగితే వ్యతిరేకించబోమని స్పష్టం చేశారు. విభజన విషయంలో తాము అడిగిన అంశాలపై కాంగ్రెస్ వివరణ ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్ స్పందిస్తే తామ కూడా స్పందిస్తామన్నారు. ఎవరితోనూ సంప్రదించకుండా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల వారితో కాంగ్రెస్ చర్చలు జరపాలని షర్మిల సూచించారు.

వైఎస్సార్ ప్రభుత్వం కాదిది!

మరో ప్రజాప్రస్థానం 01-08-2013
‘‘వైఎస్సార్ స్వతహాగా డాక్టర్ కావడంతో పేదలకు అందాల్సిన ఆరోగ్యం గురించి ఆలోచన చేశారు. తాను అనారోగ్యం పాలైనప్పుడు ఏ విధంగానైతే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంటానో, అలాగే పేదవాడు అనారోగ్యం పాలైనప్పుడు ధైర్యంగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి తన మంచం పక్కనే అతను కూడా మంచం వేయించుకొని లక్షల రూపాయల విలువైన వైద్యాన్ని ఉచితంగానే చేయించుకోవాలనే గొప్ప ఆలోచనతో వైఎస్ ఆరోగ్యశ్రీకి జీవం పోశారు. ఆసుపత్రికి సకాలంలో రాలేక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదనే గొప్ప మనసుతో 108-అంబులెన్స్‌లు తెచ్చారు. కానీ మనుసు లేని ఈ పాలకుల ఏలుబడిలో 108 కనుమరుగైపోయింది, 104 సర్వీసు కనపడకుండా పోయింది. ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే అంబులెన్స్‌లు ఇలా నెలల తరబడి షెడ్డులో పడి ఉన్నాయంటే మిగిలిన జిల్లాల్లో 108 అంబులెన్స్‌ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో సాగింది. ఆరోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళి సొంత జిల్లా శ్రీకాకుళంలోని పలాస నియోజకవర్గంలో మొత్తం నాలుగు 108 అంబులెన్స్‌లు ఉండగా వాటిలో మూడు అంబులెన్స్‌లు పూర్తిగా చెడిపోయి చినబాడాం గ్రామం వద్ద రోడ్డు పక్కన షెడ్డులో పడి ఉన్నాయి. ఇదే దారి మీదుగా వెళ్తున్న షర్మిల వాటిని గమనించి పరిశీలించారు. ‘‘ఏడాది కాలంగా ఇవి షెడ్డులోనే పడి ఉన్నాయమ్మా, ఇప్పటి వరకు వీటిని పట్టించుకునేవారే లేరు.. మంత్రి ఈ జిల్లా వారే అయినప్పటికీ మాకు ఎలాంటి ఉపకారం లేదమ్మా’’ అని స్థానికులు చెప్పిన సందర్భంలో షర్మిల పై విధంగా స్పందించారు.
సమ్మె చేస్తుంటే కేసులు పెడుతున్నారు..
 ‘‘అమ్మా.. నెలల తరబడి మాకు జీతాలు లేవు. ఉద్యోగ భద్రత లేదు. మాతో రోజుకు 14 నుంచి 16 గంటల వరకు పని చేయించుకుంటున్నారు. మాకు నెల నెలా జీతాలు అందించాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని కోరుతూ గత నెల 18 నుంచి సమ్మె  చేస్తున్నాం. సమ్మెకు ముందే మా సమస్యలు పభుత్వానికి చెప్పాం. జిల్లాలో మొత్తం క్షేత్రస్థాయి సిబ్బంది 150 మంది సమ్మె చేస్తున్నాం. ఆరోగ్యశాఖ మంత్రి ఈ జిల్లాకు చెందిన వాడయినప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదు. ఎందుకు సమ్మె చేస్తున్నారు, మీ సమస్యలు ఏమిటని కూడా అడగలేదు’’ అని 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ డి.శ్రీనివాసరావు, పైలట్ (డ్రైవరు) బి.శ్రీనివాసరావు తదితరులు షర్మిలతో చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పట్టించుకోకపోగా.. సమ్మెచేస్తున్నందుకు కక్షగట్టి 27 మందిపై కేసులు పెట్టి జైల్లో పెట్టిందని దుయ్యబట్టారు.
అపర సంజీవని 108..మరో ప్రజాప్రస్థానం 01-08-2013
108 సిబ్బందితో షర్మిల మాట్లాడుతూ ‘‘ఆపదలో ఉన్నవారు ఎవరైనా ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో కుయ్...కుయ్..కుయ్ అనుకుంటూ వచ్చి వారిని తీసుకొని పోయి పెద్దాసుపత్రిలో వైద్యం చేయించి తిరిగి వారిని పూర్తి ఆరోగ్యంతో ఇంటి  దగ్గర దించే ‘అపర సంజీవని’ 108 అంబులెన్స్‌ను ఇలా నిర్జీవంగా చూస్తుంటే మనసుకు చాలా బాధనిపిస్తుంది. అంబులెన్స్‌ల పరిస్థితి ఇలా ఉంటే మరోపక్క 108  ఉద్యోగులు మాకు జీతాలు లేవు అని నెలల తరబడి దీక్షలు చేస్తున్నా ఈ పాలకులకు కనీసం పట్టడం లేదు. ఇందుకోసమేనా వైఎస్సార్ తన రెక్కలు ముక్కలు చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆధికారంలోకి తెచ్చారా అని బాధనిపిస్తోంది’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఇది వైఎస్సార్ అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వమే కాని వైఎస్సార్ ప్రభుత్వం కాదు. అందుకే ఈ పాలకులు వైఎస్సార్ ఆశయాలకు, సిద్ధాంతాలకు భిన్నంగా పనిచేస్తున్నారు. ఆరోగ్యశ్రీ నుంచి ఈ ప్రభుత్వం 133 వ్యాధులను, 97 ఆసుపత్రులను తొలగించింది. పేద వాడికి జబ్బు చేస్తే మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమని ఈ నాయకులు చెప్తున్నారు’’ అని విమర్శించారు.
ఫీజుల పథకాన్నీ కుదించారు..
కాశీబుగ్గలో తనను కలిసి సమస్యలు చెప్పుకున్న విద్యార్థులనుద్దేశించి షర్మిల మాట్లాడుతూ ‘‘పేదలకు ఉన్నత విద్య అందించాలని వైఎస్సార్ ఆకాంక్షించారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారు. ఈ ట్రిపుల్ ఐటీల ద్వారా ఇవాళ అనేక మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పథకం వల్ల లబ్ధిపొందిన అనేక మంది విద్యార్థులు ఇప్పుడు ఉన్నత ఉద్యోగాలు చేస్తూ గుర్తింపు పొందారు. ప్రస్తుత ప్రభుత్వం రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని కుదించారు. ఏవేవో ఆంక్షలుపెట్టి క్రమంగా ఈ పథకాన్ని విద్యార్థులకు దూరం చేయాలని ఈ పాలకులు ప్రయత్నిస్తున్నారు. ‘ఈ ప్రభుత్వం ట్రిపుల్ ఐటీలో సరైన సౌకర్యాలు కల్పించలేకపోతోందమ్మా’ అని కొందరు విద్యార్థులు చెప్తున్నప్పుడు బాధనిపిస్తుంది’’ అని షర్మిల అన్నారు.
‘‘మీరు భయపడవద్దు. కొద్దిగా ఓపిక పట్టండి. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు, రాజన్న రాజ్యం తెస్తారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ఆరోగ్యశ్రీకి, అపర సంజీవనికి జీవం పోస్తారు. అక్కాచెల్లెళ్లు వాళ్ల పిల్లలను చదివించేటట్లు ప్రోత్సహించడం కోసం ఇద్దరు పిల్లలకు పదోతరగతి వరకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఏడాదికి రూ.6 వేలు అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఇంటర్మీడియట్ చదివితే రూ.8,400, డిగ్రీ చదివితే రూ 12,000 అమ్మ అకౌంట్లోనే పడుతాయి. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ఎలాగూ ఉండనే ఉంది’’ అని భరోసా ఇచ్చారు.
19.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర
పాదయాత్ర 227వ రోజు గురువారం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం గరుడఖండి గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి గరుడఖండి, చినబాడాం, కాశీబుగ్గ, రామకృష్ణాపురం, కొబ్బరి ఊరు గ్రామాల మీదుగా యాత్ర సాగింది. కొబ్బరి ఊరు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన  బస కేంద్రానికి షర్మిల రాత్రి 7.00 గంటలకు చేరుకున్నారు. మొత్తం 19.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 3,069 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు, జిల్లా పార్టీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, తాజా మాజీ ఎమ్మెల్యేలు సుజయ కృష్ణ రంగారావు, పి.సాయిరాజు, మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం, మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు, కుంభా రవిబాబు, పలాస కో ఆర్డినేటర్ వజ్జ బాబూరావు, వివిధ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు కల్మట వెంకటరమణ, వరదు కళ్యాణి, గొర్లె కిరణ్, దువ్వాడ శ్రీనివాసు, స్థానిక నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి, దుప్పల రవీంద్ర, హన్మంతు కిరణ్‌కుమార్, కిమిడి జానకి, ధవళ వెంకట గిరిబాబుఉన్నారు. ప్రతిరోజు షర్మిల వెన్నంటే ఉంటున్న వారిలో తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, ఆర్కే, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ తదితరులు ఉన్నారు.
చదువులు ఆగిపోతున్నాయి
‘‘రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టి నిరపేద విద్యార్థులకు విద్యాదానం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి తూట్లు పొడుస్తోంది. దీంతో మాబోటి మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్నారు’’ అని పలువురు బీఈడీ విద్యార్థులు షర్మిల వద్ద వాపోయారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని చినబాడాం సమీపంలోగల ‘అమర్ బీఈడీ ఎడ్యుకేషన్ ఆఫ్ కాలేజెస్’ విద్యార్థులు షర్మిలను కలిశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడంతో తాము పడుతున్న కష్టాలను వివరించారు.
షర్మిల రాక సందర్భంగా వారంతా రోడ్డుపైకి వచ్చి బారులు తీరారు. దీంతో ఆమె వారిని పిలిచి సమస్యలు చెప్పాలని సూచించారు. కె.ఈశ్వరరావు, ఎ.మురళీకృష్ణ, జీవిత, సుజాత తదితర విద్యార్థులు మాట్లాడుతూ బీఈడీ పూర్తిచేసే వారికి సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టుకు అవకాశం కల్పించేలా చూడాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము సక్రమంగా అందడంలేదని, దీని వల్ల తమ చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయని వివరించారు. దీనికి షర్మిల స్పందిస్తూ త్వరలోనే జగనన్న వస్తారు.. విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు.

సీఎం జిల్లాలో బోల్తాకొట్టిన కాంగ్రెస్

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ బోల్తాకొట్టింది. సింగిల్ విండో ఎన్నికల్లో అధికార బలంతో, దౌర్జన్యంగా డీసీసీబీ పీఠం దక్కించుకున్న కాంగ్రెస్‌కు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్పా రు. చాలా చోట్ల తెలుగు కాంగ్రెస్ కలిసి అభ్యర్థులను పెట్టినా వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారుల ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయారు. ఎక్కువ మండలాల్లో ఇదే ఫలితాలు మొదటి, రెండు, మూడవ విడతల్లో ప్రతిఫలించాయి.
 
 జిల్లాలో 1,357 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా ఇందులో ఏకగ్రీవాలు 293 ఉన్నాయి. ఏకగ్రీవాలు కలుపుకుని వైఎస్‌ఆర్‌సీపీ 596 పంచాయతీలు కైవసం చేసుకుని అగ్రస్థానంలో నిలిచింది. తెలుగుదేశం 398 స్థానాలతో రెండోస్థానంలో నూ, కాంగ్రెస్ పార్టీ 229 స్థానాల్లో గెలిచి మూ డవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో 123మంది స్వతంత్రులు గెలిచారు. వీరి లో ఎక్కువమంది వైఎస్‌ఆర్ సీపీలోకి వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మద్యం, డబ్బులు, తాయిలాలు విచ్చలవిడిగా పంచినా, స్థానికంగా చిన్న, చిన్న కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభపెట్టినా పంచాయతీ ఎన్నికల్లో వారి పాచిక పారలేదు. ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులకే పట్టం కట్టారు. ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో పైచేయి సాధించాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పార్థసారథి, మంత్రి గల్లా అరుణకుమారి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, సీఎం సోదరుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
 
 తొలి నుంచి కుమ్మక్కు
 సింగిల్ విండోల్లో ఒకే పడవపై ప్రయాణం చేసి న కాంగ్రెస్ టీడీపీలు అదే ఒరవడిని పంచాయ తీ ఎన్నికల్లోనూ కొనసాగించాయి. ముఖ్యంగా సీఎం ప్రాతనిథ్యంవహిస్తున్న పీలేరు నియోజ కవర్గంలోనూ, చంద్రబాబు ప్రాతినిథ్యం వహి స్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈ కుమ్మక్కు బహిర్గతమైంది. పుంగనూరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో చాలా పంచాయతీల్లో ఉమ్మడిగా అభ్యర్థిని వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారులపై పోటీకి నిలబెట్టారు. ఇంతచేసినా మూడో విడతలో 199 స్థానాల్లో వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ 122 స్థానాల్లో, 104 స్థానాలు సాధించా యి. 14 నియోజకవర్గాల్లో కనీసం ఆరు నియోజకవర్గాల్లో మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో పడింది. కొన్నిచోట్ల తెలుగుదేశం అభ్యర్థులనే తమ అభ్యర్థులుగా ప్రకటించి ఓట్లేయమన్నారు.
 
 సీఎం నియోజకవర్గం పీలేరులో కేవీ పల్లె, కలికిరి, వాయల్పాడు, పీలేరు మండలాల్లో వైఎస్‌ఆర్ సీపీ పాగా వేసింది. వాయల్పాడు మండలంలో కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న చింతపర్తి, గండబోయినపల్లె, కూరపర్తి, చింతలవారిపల్లె, నగరి మడుగు, మాధవరం వంటి 8 పంచాయతీల్లో వైఎస్‌ఆర్ సీపీ జెండా రెపరెపలాడింది. కలకడలో మూడు పంచాయతీల్లో, కేవీపల్లె మండలంలో ఒక పంచాయతీలో వైఎస్‌ఆర్ సీపీ సత్తా చాటింది. కలికిరి మండలంలో మేడికుర్తిలో గెలిచారు. చంద్రబాబు ప్రాతిని థ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో 17 పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగురవేసింది. కేవీపల్లె మండలంలో ఒక్క పం చాయతీ కూడా టీడీపీ సాధించకపోవడం గమనార్హం. పీలేరు మేజర్ పంచాయతీలో కూడా ఐదు వార్డులను వైఎస్‌ఆర్ సీపీ గెలుచుకుంది.
 
 మంత్రి గల్లాకు పరాభవం
 మంత్రి గల్లా అరుణకుమారి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాళెంలో 12 పంచాయతీల్లో 4 వైఎస్‌ఆర్ సీపీ గెలవగా, ఒకటి టీడీపీ, కాంగ్రెస్ ఒకటి గెలిచారు. ఆరుగురు స్వతంత్రులు విజయం సాధించారు. చిన్నగొట్టిగల్లు మండలంలో 12 పంచాయతీల్లో ఐదు వైఎస్‌ఆర్ సీపీ గెలవగా, మూడు కాంగ్రెస్, నాలుగు టీడీపీ గెలిచాయి. చంద్రగిరి, పాకాల మండలాల్లో వైఎస్‌ఆర్ సీపీ, తెలుగుదేశం పోటీపడగా, కాంగ్రెస్‌కు అవకాశం లేకుండాపోయింది. తిరుపతి రూరల్‌లోనూ ఇదే పరిస్థితి. రామచంద్రాపురంలోనూ వైఎస్‌ఆర్ సీపీ విజయకేతనం ఎగురవేసింది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పునర్విభజన

పంచాయతీ ఎన్నికల పర్వం ముగియగానే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికల కసరత్తు మొదలైంది. పునర్విభజనతోపాటు ఆయా స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ జారీ చేసింది. ఇందులో భాగంగా ముందుగా మండల ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నెల 14వ తేదీన పునర్విభజన ముసాయిదాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత వారం రోజులపాటు.. అంటే 21వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. వచ్చిన అభ్యంతరాలపై 22 నుంచి కసరత్తు మొదలుపెట్టి 26న నిర్ణయం తీసుకోనున్నారు. 27వ తేదీన ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు.
 
  అదే రోజున  పంచాయతీరాజ్ కమిషనర్‌కు నివేదించి జిల్లా గెజిట్‌లో ప్రచురించనున్నారు. ఈ మొత్తం  బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ పంచాయతీరాజ్ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. పునర్విభజనకు పాటించాల్సిన మార్గదర్శకాలను సైతం ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించారు. కొత్త నిబంధనల ప్రకారం పునర్విభజనకు 2011 జనాభా లెక్కల ను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఒక్కో ఎంపీటీసీ (మండల ప్రాదేశిక నియోజకవర్గం) పరిధిలో ఓటర్ల సంఖ్య కనీసం మూడు వేలకు తక్కువ కాకుండా నాలుగు వేలకు ఎక్కువ కాకుండా ఉండేలా చూడాలి. ఎంపీటీసీల పరిధి విభజనలో వార్డు మొత్తం, గ్రామ పంచాయతీలు మొత్తంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వార్డు విలీనంతో ఓటర్లు పెరిగినా... తగ్గినా పంచాయతీరాజ్ కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
 
 రెండేళ్ల క్రితం ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగిసిన విషయం విదితమే. అప్పటినుంచీ ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. అప్పటి లెక్కప్రకారం జిల్లాలో 50 జెడ్పీటీసీలు, 760 ఎంపీటీసీ స్థానాలున్నాయి. గ్రేటర్ వరంగల్‌లో పరిసర గ్రామాలు విలీనం కావడంతో హన్మకొండ మండలం రద్దయింది.  నేపథ్యంలో జెడ్పీటీసీ స్థానాల సంఖ్య 49కి పరిమితమవనుంది. కొత్తగా పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నగర పంచాయతీలుగా మారడం, మహబూబాబాద్ మునిసిపాలిటీ హోదాలో ఉండడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య సైతం మారిపోనుంది.  దీనికి తోడు కొత్త మార్గదర్శకాలతో ఈ సంఖ్య మరింత తగ్గిపోయే అవకాశాలున్నారుు.
 
 ఇటీవలి పంచాయతీ ఎన్నికల సమయంలో ఉన్న ఓటర్ల జాబితాల ప్రకారం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 17.62 లక్షలు. ఈ లెక్కన కొత్త మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో గరిష్ఠంగా 587,  కనిష్ఠంగా 440 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడనున్నాయి. పునర్విభజనతో ఈ సంఖ్య తేలిపోతుంది. తర్వాతే రొటేషన్ పద్ధతి ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. రెండేళ్ల కిందట 2011లో ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ స్థానాలకు చేసిన రిజర్వేషన్లు తాజా ప్రక్రియతో రద్దయినట్లే. కొత్తగా ఖరారయ్యే రిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికలు నిర్వహించనున్నారు.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

శ్రీకాకుళం :
 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 228వ రోజు (జిల్లాలో 13వ రోజు) కార్యక్రమ వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తల శిల రఘురాం, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు గురు వారం ప్రకటించారు. శుక్రవారం ఉదయం కొబ్బరిఊరుకు సమీపం లోని బస నుంచి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర.. రంగోయి జంక్షన్, మకరజ్వాల, హరిపురం జంక్షన్, మందస గ్రామాల మీదుగా సాగుతుంది. భోజన విరామం తర్వాత   షర్మిల.. కొత్తపల్లి, పాలవలస, కొర్లాం, లక్కవరం మీదుగా బూరగాం చేరుకుంటారు. అనంతరం అక్కడికి సమీపంలో రాత్రి బస చేస్తారు.
 
 జిల్లాలో 13వ రోజు పర్యటించే ప్రాంతాలు
 రంగోయి జంక్షన్, మకరజ్వాల, హరిపురం జంక్షన్, మందస, కొత్తపల్లి, పాలవలస, కొర్లాం, లక్కవరం, బూరగాం

రాష్ట్రానికి నాయకుడు జగనన్న ఒక్కడేనని తేలిపోయింది

రాష్ట్రానికి నాయకుడు జగనన్న ఒక్కడేనని తేలిపోయింది
 జగన్ కోసం - 432 రోజులు :  ప్రజానీకం పడుతున్నది జగన్ కోసం ఆరాటం.  జగన్ చేస్తున్నది ప్రజల కోసం పోరాటం.     అధికారం చేస్తున్నది అన్యాయపు తీర్మానం. జగన్‌లో ఉన్నది అలుపెరుగని సహనం. అవినీతి అక్రమాల చిరునామా ఈ సర్కారు. మళ్లీ మాదే విజయం అంటే జనం ఎలా నమ్ముతారు?   జగనన్న చుడతాడు కొత్త పాలనకు శ్రీకారం.    ఆ పాలన చూపుతుంది ప్రజలపైన మమకారం.  పంచాయితీ పోరులో తెలిసింది జగనన్న బలం. రాష్ట్రానికి నాయకుడు జగనేనని తెలిపింది ఈ ఫలితం.
 - సి.వి.వర్థన్, పరకాల, వరంగల్
 యువనాయకుడికున్న విజ్ఞత
 తలపండిన వృద్ధులకు లేకపోయింది!
 
 దేశ రాజకీయాలలో జగన్‌గారి జైలు నిర్బంధం ఒక సంచలనం. దేశంలోనే భారీ మెజారీటీతో గెలిచిన ఒక ఎంపీని, అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక ముఖ్యమంత్రి తనయుడిని అకారణంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా జైలుకు పంపడం, ఏడాది దాటినా ఆయనకు బెయిలు రాకపోవడం అన్నివర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. మేధావులు, న్యాయనిపుణులు, రాజకీయాలలో తలపండినవారు, ఆఖరికి సీబీఐలోని కొందరు అత్యున్నతస్థాయి మాజీ అధికారులు సైతం జగన్ అరెస్టులో రాజకీయ కక్షసాధింపు కోణం ఉందని, ఒక ప్రజాస్వామిక దేశంలో ఇలా జరగడం దురదృష్టకరమని అనేక సందర్భాలలో వ్యాఖ్యానించారు. నిరూపణ కాని ఆరోపణలతో జగన్ జైలుకెళ్లితే, నిరూపించలేని ఆధారాలతో సీబీఐ న్యాయస్థానాలను తప్పుదారి పట్టిస్తోంది! యువనాయకుడైన జగన్‌కు ఉన్నంత విజ్ఞత... కాంగ్రెస్‌లోని ఈ పెద్దలకు, తలపండిన తెలుగుదేశం నాయకులకు లేకపోయింది. దేవుడు అన్నీ చూస్తున్నాడంటారు. చూస్తే ఆయన ప్రజల కళ్లతోనే చూడాలి. పాలక, ప్రతిపక్షాలు పాల్పడుతున్న ఇన్ని ఘాతుకాలకు దేవుడే ప్రజల ద్వారా తీర్పు చెప్పిస్తాడు. జగన్‌ను, ఆయన కుటుంబాన్ని, వాళ్ల ద్వారా ప్రజల్నీ గట్టెక్కిస్తాడు.
 - శ్రీనివాసరావు, వేమవరం, గుంటూరు జిల్లా
 
 త్వరలోనే విడుదలై వస్తాడు
 ప్రజల తరఫున ప్రతిధ్వనిస్తాడు
 రాజన్న ప్రజల్ని వదిలి వెళ్లాక, జగనన్నను ఈ ప్రభుత్వం ప్రజలకు దూరం చేశాక రాష్ట్రం అస్తవ్యస్తం అయింది. ఛిన్నాభిన్నం అయింది. రాజకీయాలు తప్ప రైతులను పట్టించుకున్నవారే లేదు. ప్రగల్భాలు తప్ప నిరుపేదలకు ఒరిగిందేమీ లేదు. రాజన్న దయతో గెలిచినవారు నాడు పిల్లులుగా పడివుండి, నేడు పులులై జనంపై పంజా విసురుతున్నారు. జగనన్నని విమర్శిస్తున్నారు. రాజన్న రాజ్యం గుర్తుకొస్తేనే ఒక కలలా అనిపిస్తోంది. ఎంత మంచికాలం? ఆయన గనుక ఇప్పుడు ఉండి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలమై ఉండేది. రైతులకు కోట్ల రూపాయల రుణాల మాఫీ జరిగేది. రాష్ట్రం కూడా రెండు ముక్కలయ్యేది కాదు. ఆయన చనిపోయాక ఆయన తనయుడొచ్చాడు, మాకిక దిగులేమిటి? భయమేమిటి? అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపన్ని, తెలుగుదేశం సహకారం తీసుకుని, సీబీఐని ఉసిగొలిపి జగన్‌ను అక్రమంగా జైలు పాలు చేసింది. ప్రజా సంక్షేమానికి పాటుపడగల ఒక సమర్థుడైన నాయకుడిని ప్రజల దరి చేరకుండా చేసింది. జనానికి, జగన్‌కి మధ్య ఏర్పడిన ఈ ఎడబాటు తాత్కాలికమే. త్వరలోనే ఆయన విడుదలై వస్తారు. ఆయనే తమ నాయకుడని ప్రజలంతా దిక్కులు పిక్కటిల్లేలా ప్రకటిస్తారు.  
 
 - ఉదయగిరి సుబ్బారావు, దాచారం పోస్టు, ఖమ్మం జిల్లా

ముస్లింల గుండెల్లో వైఎస్: విజయమ్మ

ముస్లింల గుండెల్లో వైఎస్: విజయమ్మ
హైదరాబాద్ : ముస్లిం సోదరుల అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. గురువారమిక్కడ కింగ్‌కోఠి ఈడెన్ గార్డెన్‌లో పార్టీ మైనార్టీ విభాగం కన్వీనర్ హెచ్.ఎ.రెహమాన్ ఆధ్వర్యంలో ఇచ్చిన ఇఫ్తార్ విందుకు విజయమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి వైఎస్ 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ... తెలంగాణ భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇఫ్తార్ విందులో పార్టీ నేతలు గట్టు రామచంద్రరావు, జనక్‌ప్రసాద్, రోజా, శోభానాగిరెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, విజయారెడ్డి, ఆదం విజయ్‌కుమార్, వెల్లాల రామ్మోహన్, మత పెద్దలు అలీఖాద్రీ, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. విజయమ్మ రాకతో పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఈడెన్ గార్డెన్ కిటకిటలాడింది.

తెలంగాణకు వ్యతిరేకం కాదు-ఇరు ప్రాంతాలకూ సమన్యాయం జరగాలి

Written By news on Thursday, August 1, 2013 | 8/01/2013

శ్రీకాకుళం, 1 ఆగస్టు 2013: వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, రాష్ట్ర విభజనపై అభ్యంతరాలు లేవని.. ఇరు ప్రాంతాలకూ సమన్యాయం జరగాలన్నదే తమ విధానం అని శ్రీమతి వైయస్ షర్మిల‌ అన్నారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం అధికారంలో ఉన్న పాలకులు సంక్షేమం, అభివృద్ధిలో సమతూకం పాటించకపోవడం వల్లనే రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. జాతీయ చానల్‌ 'హెడ్‌లైన్సు టుడే' తో శ్రీమతి షర్మిల గురువారంనాడు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో నడుస్తూనే మాట్లాడారు. వైయస్ఆర్ ఆలోచనా విధానం నుంచి బయటికి వచ్చి, ఆయన అమలు చేసిన పథకాలను తుంగలో తొక్కడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి గాడి తప్పకుండా ఉంటే బాగుండేదన్నారు.

డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి బ్రతికి ఉన్నప్పుడు సంక్షేమం, అభివృద్ఙి మధ్య సమతూకాన్ని చక్కగా పాటించారని అందువల్ల తెలంగాణ, నక్సలిజం వంటి సమస్యలు అణిగిపోయాయని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆయనలా సమర్థవంతంగా పనిచేయడంలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 70 శాతం గ్రామీణ ప్రాంతమేనని, ఎక్కువ శాతం మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి బ్రతుకుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని నదీజలాలను కరువు ప్రాంతాలకు మళ్ళించాల్సిన ఆవశ్యకతను ఆమె వివరించారు. నదీజలాలను వినియోగించుకోకపోతే కరువు వస్తుందని చెప్పారు. అలా కరువు రావడాన్ని ఎవరూ స్వాగతించబోరన్నారు. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం హైదరాబాద్‌ నుంచే వస్తుందని, సాఫ్టువేర్‌తో పాటు అనే మల్టీ నేషనల్‌ కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని శ్రీమతి షర్మిల తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా మార్చివేసిందని శ్రీమతి షర్మిల విమర్శించారు. ఆ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఆరోపించారు. కాంగ్రెస్, టిడిపి రెండూ కలిసి డ్రామాలాడాయని, తమ స్వార్థం కోసం ఆ రెండు పార్టీలు డబుల్‌గేమ్ రాజకీయాలు చేస్తున్నాయని ఆమె విమర్శించారు. ఆ పార్టీలది 'మేనేజ్‌ షో' అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ తీరును నిరసిస్తూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజా పక్షం అని, ఇలాంటి కష్టకాలంలో తాము ప్రజలతోనే ఉంటామన్నారు. ప్రజలకు న్యాయం జరిగేలా తమ పార్టీ ఒక్కటే పోరాటం చేస్తుందని శ్రీమతి షర్మిల తెలిపారు. టిఆర్ఎస్‌తో కాంగ్రెస్‌ పార్టీ క్విడ్‌ ప్రో కో కు పాల్పడిందని, వాటి మధ్య డీల్‌ కుదిరిందని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

రాజధాని, నీటి వనరులు లాంటి అనేక  సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని శ్రీమతి షర్మిల అన్నారు. ఈ సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ మిగతా అన్ని పార్టీలతో కలిసి కూర్చొని చర్చించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామని తాము ముందే చెప్పామన్నారు. రాష్ట్ర విభజన పారదర్శకంగా ఉండాలనే తాము కోరుతున్నామన్నారు. మూడుసార్లు అఖిలపక్ష సమావేశాలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం తన విధానాన్ని వెల్లడించలేదని ఆమె అన్నారు. కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి అనుగుణంగా లేదని దుయ్యబట్టారు. ఏ నిర్ణయమైనా ప్రజలకు మంచి జరిగేలా ఉండాలని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు.

రాష్ట్ర విభజన తెలుగుజాతికే అవమానకరం

రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా చేయడం తెలుగుజాతికే అవమానకరం అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు దాడి వీరభద్రరావు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం ఇలా ముక్కలైపోవడానికి ప్రధానంగా చంద్రబాబునాయుడు, కాంగ్రెస్‌ పార్టీ, సోనియా గాంధీ అని ఆయన మండిపడ్డారు. టిటిడి దర్శనాల కోసం రాసే ఉత్తరాల మాదిరిగా లేఖల మీద లేఖలను చంద్రబాబు నాయుడు కేంద్రానికి రాశారని దుయ్యబట్టారు. బలీయమైన సమైక్యాంధ్రను రాజకీయంగా బలహీనం చేయాలన్న దురుద్దేశంతోనే కేంద్రం ఈ దుశ్చర్యకు పాల్పడుతోందని విమర్శించారు. విశాఖపట్నంలోని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారంనాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, టిడిపి, చంద్రబాబు, సోనియాగాంధీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు, తెలంగాణవాళ్ళు కూర్చుని మాట్లాడుకుని తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి ఉత్తరాల మీద ఉత్తరాలు ఇచ్చిపారేశారని దాడి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని విడగొట్టడంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంత ద్రోహం చేసిందో తెలుగుదేశం కూడా అంతే చేసిందన్నారు.

కాంగ్రెస్ మంటలకు బాబు ఆజ్యం

కాంగ్రెస్ మంటలకు బాబు ఆజ్యం: జూపూడి
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ పెట్టిన మంటలకు చంద్రబాబు నాయుడు ఆజ్యం పోస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు  రాష్ట్రం గురించి  మాట్లాకుండా.. రాజధాని గురించి మాత్రమే మాట్లాడుతున్నారని జూపూడి ప్రభాకర రావు, భూమా నాగిరెడ్డి విమర్శించారు.  రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు నాయుడు డ్రామాలాడుతున్నారని వారు  మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నేతలు ఈ సందర్భంగా బాబును దుయ్యబట్టారు.
 
 రాష్ట్ర విభజనపై చంద్రబాబు మౌనానికి అర్ధమేమిటని  జూపూడి ప్రశ్నించారు.  విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంలో చంద్రబాబు పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రాబాబు లేఖతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సివచ్చిందని వైఎస్‌ఆర కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి అన్నారు.
ఆయన  కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో కలసి చంద్రబాబు నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఆయన హితవు పలికారు. సమైక్య రాష్ట్రం గురించి మాట్లాడం వదిలేసి.. రాజధాని గురించి రగడ చేయడం వెనుకు అర్ధం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

YSSharmila Interview with Headlines Today

ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే చోట ఉండచ్చా ?

10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని జరిగే పనేనా ? కేంద్రపాలిత ప్రాంతం కాకుండా  ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే చోట ఉండచ్చా ?రాజ్యాంగం ప్రకారం ఆ వెసులుబాటు ఉందా ? రెండు రాష్ట్రాల మధ్య వివాదం జరిగితే హైదరాబాద్ కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు,నాయకులూ ఎలా వస్తారు ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం ఒక ఆఫీసు కట్టుకోవాలంటే తెలంగాణా రాష్ట్రము లో మున్సిపల్ అధికారి ని ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాలా ?ఏమి తెలియకుండా ప్రతివాడు మీడియా లో మాట్లాడుతున్నాడా ?తక్షణమే నీటి వనరులు,రాజధాని  మరియు ఆర్ధిక కేటాయింపులు  మిగతా విషయాలు  తేల్చేసి తెలంగాణ ప్రకటిస్తే బాగుండేది .కాని  వారికీ కావాల్సింది మనం మనలో మనం తిట్టుకోవడం ,కోట్టుకోవడం . అప్పుడే కదా మనం ఢిల్లీ లో అధికారాం గురించి,మిగతా మనకి జరిగిన చెడు గురించి మర్చిపొయెది . 

చరిత్ర సృష్టించే దిశగా..


మరో ప్రజాప్రస్థానం 31-07-2013 శ్రీకాకుళం: : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర చరిత్ర సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. జగన్ వదిలిన బాణం.. లక్షలాదిమంది అభిమానుల తోడుతో లక్ష్యం దిశగా వడివడిగా కదులుతోంది. ఎక్కడికక్కడ ప్రజాసమస్యలు వింటూ, వారికి భరోసా కల్పిస్తూ ప్రజల అభిమానం, ఆప్యాయతలు మూటగట్టుకుని చరిత్ర సృష్టించడానికి సమాయత్తమవుతోంది.‘‘అన్నా..అమ్మా..ధైర్యంగా ఉండండి.. బాధపడొద్దు..జగనన్న వస్తాడు..మీ సమస్యలు తీరుస్తారు.. మీకు ఇళ్లొస్తాయి..పింఛన్లు వస్తాయి..మీ గ్రామానికి రోడ్లు వస్తాయి.. రానున్న రాజన్న రాజ్యంలో మీ పల్లె సమస్యలన్నీ పరిష్కారమవుతాయి’’అంటూ షర్మిల ప్రజలకు ధైర్యం చెబుతూ.. వారిలో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. కష్టాల్లో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాంత్వన చేకూరుస్తోంది.
 
జిల్లాలో మరోప్రజాప్రస్థానం సాగుతోన్న ప్రతి గ్రామంలో ప్రజలు మహానేత గారాలపట్టికి ఘనస్వాగతం పలుకూతూనే తమ సమస్యలను ఏకరువుపెడుతున్నారు. ఆమదాలవలస, పాలకొండ ప్రాంతాలకు చెందిన ప్రజలను పాదయాత్రలో ఉన్న జగన్ సోదరిని కలిసి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. పాతపట్నం నియోజవర్గం పరిధి శివారు ప్రాంతానికి చెందిన గ్రామాల ప్రజలు తమ ఊళ్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంపై బుధవారం షర్మిల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మెళియాపుట్టిలో 70 ఏళ్ల వృద్ధురాలు తమ గ్రామంలో కనీసం రోడ్లు లేవని, ఎంతోమందికి పింఛన్లు అందడం లేదని వాపోయింది.
 
దీనికి షర్మిల స్పందిస్తూ.. జగనన్న వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు. గిరిజన ప్రాంతంలోని ప్రజలైతే అంతులేని అభిమానం ప్రదర్శిస్తున్నారు. ఎక్కడికక్కడ పూలతో స్వాగతం పలుకుతూ రాజన్న బిడ్డను అక్కున చేర్చుకుంటున్నారు. గ్రామం మీదుగా సాగే పాదయాత్రలో షర్మిలను చూస్తున్న ప్రజలు ఆమెతో కరచలనం చేసేందుకు, పలకరించేందుకు పోటాపోటీగా వెంట నడుస్తున్నారు. తమ మండలం పరిధిలో సమస్యలు వివరించడానికి అవకాశం దొరకని యువకులు, కార్మికులు, అన్నదాతలు వెంట నడుస్తూ వీలుకుదిరినప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడంలేదని చెబుతూ.. తమ సమస్యలకు పరిష్కారం మీరేచూపాలంటూ వేడుకుంటున్నారు. దీంతో రాజన్న బిడ్డ ప్రతి ఒక్కరికి ధైర్యం చెబుతూ ముందుకు కదులుతున్నారు.
 మరో ప్రజాప్రస్థానం 31-07-2013
 
విజయవాటికకు జనం బారులు
 మరో ప్రజాప్రస్థాన పాదయాత్ర బుధవారం సాయంత్రం పలాస నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించింది. ఇప్పటివరకు యాత్ర పాలకొండ, ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో పూర్తయింది. మొత్తం ఏడు నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఐదు పూర్తవ్వగా, ఆరో నియోజకవర్గమైన పలాసలో కొనసాగునుంది.
 
అక్కడికి ఇచ్ఛాపురం ఒక్కటే మిగిలిఉంది. అయితే చివరి మూడు రోజులు ఇచ్ఛాపురం వరకు పూర్తిగా జాతీయరహదారిమీదుగానే యాత్ర సాగనుండడంతో..సమీప గ్రామాల ప్రజలు పాదయాత్ర చివరి దశకు చేరుకుంటుండడంతో తమ అభిమాన రాజన్న పుత్రికను చూసి శుభాకాంక్షలు తెలిపేం దుకు భారీ ఎత్తున తరలివచ్చేందుకు సన్నద్ధమవుతున్నా రు. మరోపక్క మరోప్రజాప్రస్థాన పాదయాత్రకు గుర్తుగా ఇచ్ఛాపురంలో విజయవాటిక సిద్ధమవుతుండడం, ఇప్పటికే మరోప్రజాప్రస్థానం రికార్డులు సృష్టించడంతో ఈ చిహ్నాం పనులు చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి అభిమాన జనం భారీగా తరలివస్తున్నారు.
 
 సైడ్‌లైట్స్
 పర్లాకిమిడి-పాతపట్నం రహదారిలో కిక్కిరిసిన జనాలతో పాదయాత్రకు ఎదురుగా వస్తున్న ఓప్రైవేటు వాహనం చోదకుడ్ని షర్మిల ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేయడంతో డ్రైవర్ పి.శ్రీనివాసరావు ఆనందానికి అంతేలేకుండా పోయింది. అక్కా మేమంతా మీవైపే అంటూ బిగ్గరగా అరిచాడు.

 పదనాపురానికి చెందిన తాడేల మంగ మ్మ జగనన్న సోదరిని కలిసి తమ గ్రామసమస్యలు వివరించారు. రోడ్డునేదు, తాగడానికి నీరునేదు ఇబ్బంది పడుతున్నామంటూ వివరించారు. జగనన్నను ఆశీర్వదించండి మంచి రోజలు వస్తాయని షర్మిల చెప్పడంతో.. ఇదే విషయాన్నితోటివారికి చెప్పడం వినిపించింది.

 పదనాపురం గ్రామానికి చెందిన కొల్లి రోజా, నిక్కల భార్గవిలతోపాటు మరో ఐదుగురు మహిళలు తూంకొండ వరకు పాదయాత్రలో సుమారు ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చారు.

 మెళియాపుట్టి నుంచి పలాస వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ కుటుంబం షర్మిలను చూసేందుకు రోడ్డుపక్కన బండిని ఆపే క్రమంలో అదుపు తప్పడంతో షర్మిల భద్రత సిబ్బంది అప్రమత్తమై పడకుండా ఆపారు.

 ఆకులఅమ్మతల్లి గ్రామం వద్ద షర్మిల ను చూసేందుకు మీసాల లక్ష్మీనారాయ ణ అనే వికలాంగుడు ఇబ్బంది పడుతుం డగా ఆయన్ని చూసిన ఆమె అన్నా బాగున్నావా అంటూ పలకరించి జగనన్న వ స్తాడు.. వికలాంగులకు నెలకు వెయ్యి రూపాయలు పింఛను ఇస్తారని ధైర్యం చెప్పారు.
మరో ప్రజాప్రస్థానం 31-07-2013
 రాజన్న చనిపోయాక పేదోళ్ల బతుకులు ఇట్టాగా ఉండిపోనాయి. ఆ బాబు తరువాత వచ్చినోళ్లు ఏటీ చేయడం లేదు. ఆయన బిడ్డ నడిచొస్తుంటే కడుపు తరుక్కుపోతుందని టీకెఆర్‌పురానికి చెందిన దొర అచ్చమ్మ కన్నీరుకార్చింది.

 రాజన్న తనయ షర్మిలను చూసేందుకు పెద్దమడి ఆశ్రమ పాఠశాల వద్ద వందలాదిగా విద్యార్థినీ విద్యార్థులు బారులు తీరి వంగ పండు ఉష జానపదగేయాలకు చిందులు వేశారు.

 రేగులపాడు సమీపంలో మహానేత తనయకి అంబటి చిట్టమ్మ, ధనలక్ష్మిలు హారతి పట్టి ఆమెతో వారి ఆనందాన్ని పంచుకున్నారు.
 మహానేత తనయను చూసి చీపురుపల్లి గ్రామం వద్ద అప్పలమ్మ అనే వృద్ధురాలి ఉద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. షర్మిల ఈమెను అవ్వా... బాగున్నా అని హత్తుకోవడంతో ఆమె ఆనందానికి అంతులేకుండా పోయింది.

 టెక్కలిపట్నం వద్ద ఫాదర్ ఎన్.ప్రసాద్, డేవిడ్‌లు క్రైస్తవ ప్రార్థనలు చేస్తూ షర్మిలను ఆశీర్వాదం ఇచ్చారు.
 
 దాసుపురం వద్ద చిన్నారి సవర జయమ్మ షర్మిలకు కండువా వేయడానికి రాగా ఆ కండువాను తిరిగి ఆమెకే వేసి అభినందించారు.

Popular Posts

Topics :