29 September 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

మనకు కావలసింది ముజఫర్ నగర్లు కాదు.. మొహబత్ నగర్లు: ఎన్డిటివితో వైఎస్ జగన్

Written By news on Saturday, October 5, 2013 | 10/05/2013

వైఎస్ జగన్ ప్రధాని పోస్టుకే పోటీలో?

Photoసోనియాకి రాయపాటి లేఖ వ్రాశాడు అని కధనం.

వైఎస్ జగన్ ప్రధాని పోస్టుకే పోటీలో ఉన్నాడు, అవుతాడు కూడా అన్నది ఆ లేఖ సారాంశం అని చెప్తున్నారు .

ఎందుకంటే కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకం అన్న విషయాన్ని లేటేస్టుగా సర్వేలు, రాజకీయ విశ్లేషకులు అంటున్న మాటే కదా.. సోనియాకు లేఖ ద్వారా తెలియచేసాడు ఎంపీ రాయపాటి సాంబశివరావు.


జగన్ 20 ఎంపి సీట్లు గెలుచుకోవడం ఖాయం, అప్పుడు మీరే ఆయనకు మద్దతుగా నిలచి ప్రధానిని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అప్పట్లో దేవగౌడ కూడా 20 మంది ఎంపీలతోనే ప్రధాని అయ్యాడు, గుర్తుంచుకోండి అంటూ రాయపాటి చక్కటి రాయితో సోనియాను కొట్టినంత పనిచేసాడు. అంతే కాదు, బిజేపి సీమాంద్రలో పుంజుకుంటుంది, మీరు కాదన్నా ఆ అవకాశం బిజేపి జగన్ కు ఇచ్చినా ఇస్తుంది జాగ్రత్త అన్నాడు.


http://www.apherald.com/Politics/ViewArticle/35350/National-politics-Soniya-Devagouda-Jagan-PM-Rayapa/

State divided because someone wants son as PM: Jagan

http://www.ndtv.com/article/india/state-divided-because-someone-wants-son-as-pm-jagan-mohan-reddy-428183?pfrom=home-lateststories



HyderabadJagan Mohan Reddy, who began an indefinite fast today to protest against the Centre's decision to bifurcate Andhra Pradesh, amped up his attack considerably against the Congress.(Track live updates)

"Someone wanted their son to become PM and divided the state," Mr Reddy said referring to Congress president Sonia Gandhi, and her son Rahul, who is No. 2 in the party.

The government's decision earlier this week to carve out one of the three regions in Andhra Pradesh as a new state has left the other two parts, jointly referred to as 'Seemandhra', seething with protests. Today was the second day of the strike in the 13 districts in the region.

Mr Reddy and his party, the YSR Congress, draw their support from Seemandhra.

Yesterday, Mr Reddy challenged the Congress to explain why it cannot reverse the decision on Telangana given that just last week it withdrew a contentious executive order designed to protest convicted MPs after Mr Gandhi described it as 'nonsense.'

Mr Reddy's father, YSR Reddy, was a senior Congressman and Chief Minister of the state when he died in a chopper crash in 2009. Mr Reddy exited the party, claiming he had been sidelined by the Congress.

He left jail just 11 days ago after spending more than a year in prison on corruption charges. The case against him is still being investigated.

http://www.ndtv.com/article/india/state-divided-because-someone-wants-son-as-pm-jagan-mohan-reddy-428183?pfrom=home-lateststories

వైఎస్ జగన్ సమైక్య దీక్ష ఫోటోలు

https://www.facebook.com/ysrcpofficial


అత్యంత నిరంకుశంగా జరిగిన విభజన నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టారు. శనివారం(05-10-13) ఉదయం ఆయన లోటస్ పాండ్ వద్ద దీక్ష ప్రారంభించారు. జగన్ దీక్షకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంఘీభావం తెలిపారు. సమైక్య దీక్షా ప్రాంగణం అభిమానులతో కిటకిటలాడుతోంది.











సుప్రీం కోర్టుకు వెళ్ళి, న్యాయపరంగా పోరాటం చేస్తాo

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తూ.. కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా, నిరంకుశంగా తీసుకున్న నిర్ణయంపై తప్పకుండా సుప్రీం కోర్టుకు వెళ్ళి, న్యాయపరంగా పోరాటం చేస్తామని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. దానికి సంబంధించిన అన్ని అంశాలను తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా విభజన నిర్ణయం తీసుకోవడం ఏమిటని నిలదీశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ లోటస్‌పాండ్‌లోని తన క్యాంపు కార్యాలయం ఆవరణలో శనివారం ఉదయం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
Sri Jagan speaking to media from Samaikya deekhsa stageఈ సందర్భంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను పట్టించుకోకుండా కేంద్రం ఇలా నిరంకుశంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. సమస్యలపై మంత్రుల బృందా (జిఒఎం)నికి ఆరు వారాలే సమయం ఇస్తే.. ఏ విధంగా పరిష్కరించగలుగుతుందని ప్రశ్నించారు. అధికారం తన చేతిలో ఉంది కదా అని కేంద్రం నిరంకుశంగా, ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించడానికి అసెంబ్లీలో తీర్మానం చేయాలన్న సంప్రదాయాన్ని కాంగ్రెస్‌ పార్టీ గాలికి వదిలేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బోడోలాండ్, గూర్ఖాలాండ్, ఇప్పటికే అసెంబ్లీ తీర్మానం చేసిన విదర్భ గురించి పట్టించుకోకుండా కేవలం ఆంధ్రప్రదేశ్‌ను మాత్రమే విభజించడంలోని ఔచిత్యాన్ని శ్రీ జగన్‌ ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించే విధానం ఇదేనా అని నిలదీశారు.

సమైక్యాంధ్రకు తాను కట్టుబడి ఉన్నానంటూ చంద్రబాబు నాయుడు వెంటనే కేంద్రానికి లేఖ ఇవ్వాలని ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‌ఢిల్లీలో తాను చేపట్టే నిరాహార దీక్షకు ముందే చంద్రబాబు ఆ పని చేయాలని శ్రీ జగన్‌ డిమాండ్‌ చేశారు. సమైక్యాంధ్ర డిమాండ్‌తో చంద్రబాబు నాయుడు లేఖ ఎందుకు ఇవ్వటంలేదో మీడియా ఆయననే అడగాలని శ్రీ జగన్ సూచించారు.

‌ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలపై అధ్యయనం చేయడానికి పది మంది కేంద్ర మంత్రులతో బృందం ఏర్పాటైన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయం, నదీ జలాలు, ఆస్తుల పంపకం తదితర అంశాలపై ఈ బృందం సిఫారసులు చేయాల్సి ఉంటుంది. ఈ మంత్రుల బృందంనిలో హోం, ఆర్థిక, న్యాయ, జల వనరుల మంత్రులు కూడా ఉంటారు. ఆరు వారాల్లో ఈ బృందం సిఫారసులు సమర్పించాలని కేంద్రం నిర్ణయించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసమే సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజిస్తున్నారు

హైదరాబాద్, 5 అక్టోబర్ 2013: ఓట్లు, సీట్ల కోసం, తన కొడుకు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసమే సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రంలోని వాళ్ళు బుద్ధి లేకుండా విభజిస్తుంటే.. మీరెందుకయ్యా మద్దతిస్తున్నారని చంద్రబాబు నాయుడిని ఆయన ప్రశ్నించారు. సమస్యకు పరిష్కారం ఎప్పుడూ కన్న తండ్రిలా ఆలోచించి చేయాలని సూచించారు. అలా పరిష్కరించలేనప్పుడు యధాతథ స్థితినే కొనసాగించాలన్నారు. లోటస్‌పాండ్‌లోని తన క్యాంపు కార్యాలయం ఆవరణలో శనివారం ఉదయం 'సమైక్య దీక్ష' ప్రారంభించారు. అనంతరం శ్రీ జగన్‌ మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారని శ్రీ జగన్మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇదే ప్రశ్నను చంద్రబాబును అడగాలని మీడియాకు ఆయన విజ్థప్తి చేశారు. విభజనకు వ్యతిరేకమని చెబుతూ.. సమైక్యాంధ్రకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తరువాతే దీక్ష చేయాలని చంద్రబాబు నాయుడికి ఆయన సూచించారు. అలా చేస్తే తాను కూడా ముందుకు వచ్చి చంద్రబాబుకు మద్దతు ఇస్తానని చెప్పారు.

రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే మహారాష్ట్ర అవసరాలు తీరిన తరువాత కానీ మన రాష్ట్రానికి నీళ్ళు రావడంలేదని, కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలు నిండితేనే తప్ప నీరు కిందికి రాని పరిస్థితి ఉందని శ్రీ జగన్‌ గుర్తుచేశారు. మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే.. శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్ళెలా వస్తాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. దాని దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు కూడా నీళ్ళెలా వస్తాయన్నారు. కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీళ్ళు తప్ప మంచినీళ్ళెక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.

ఇలాంటి పరిస్థితుల మధ్యలో మంత్రుల బృందం (జిఒఎం) ఆరు వారాల్లో పరిష్కారం చూపుతారట! అని శ్రీ జగన్‌ వ్యాఖ్యానించారు. ఆరు వారాల్లో చూపించే పరిష్కారం ఎలా ఉంటుందంటే.. ట్రిబ్యునల్‌ను వేస్తారని, ఆ ట్రిబ్యునల్‌ ఉంటుంది కాబట్టి ఇక సమస్య ఉండదని అంటారన్నారు. ఇప్పటికే ట్రిబ్యునల్సు లేవా అని ఆయన ప్రశ్నించారు. ట్రిబ్యునల్సు ఉండగానే కావేరి నదీ జలాల విషయంలో తమిళనాడు - కర్నాటక ప్రతి సంవత్సరమూ కొట్టుకుంటున్నాయని శ్రీ జగన్మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. అదే విధంగా ట్రిబ్యునల్సు ఉండగానే మహారాష్ట్ర అవసరాలు తీరితేనే కాని కృష్ణా జలాలు మన రాష్ట్రానికి రావన్నారు. ఈ ట్రిబ్యునల్సు ఉండగానే ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలు నిండితేనే కానీ శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండబోదని ఆందోళన వ్యక్తంచేశారు.

ఓట్లు, సీట్ల కోసం, తన కొడుకును ప్రధానమంత్రిని చేయడం కొరకు రాష్ట్రంలోని బిడ్డలతో చెలగాటం ఆడుతున్న సోనియాగాంధీగారిని కూడా ప్రశ్నించదలచుకున్నాం అని శ్రీ జగన్‌ అన్నారు. అయ్యా! వాళ్ళు బుద్ధి లేకుండా విభజిస్తుంటే.. మీరెందుకయ్యా మద్దతిస్తున్నారని చంద్రబాబును కూడా అడగదలచుకున్నాం అన్నారు. ఎప్పుడైనా సమస్యకు పరిష్కారం ఎలా ఉండాలంటే.. ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉంటారు. నాన్నా నీ పరిష్కారం వల్ల నాకు అన్యాయం జరుగుతోందని కూతురు వచ్చి అడిగినప్పుడు.. లేదా కొడుకు వచ్చి తనకు అన్యాయం జరుగుతోందని తండ్రిని అడిగినప్పుడు.. ఆ తండ్రి ఏం చేయాలి? పరిష్కారం చూపలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. ఆ పరిస్థితిని తండ్రి యధాతథంగా వదిలేయాలని శ్రీ జగన్‌ అన్నారు. సమస్యను సామరస్యంగా, న్యాయంగా పరిష్కరించాలనుకున్న తండ్రే అయితే ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తాడని, ఆస్తిని ఎవరూ అమ్ముకోకుండా.. కలిసే ఉండండని అంటాడని అన్నారు.

కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు విభజిస్తున్నారని శ్రీ జగన్‌ విమర్శించారు. తాగడానికి పరిస్థితుల్లో కూడా మేమున్నామంటే పట్టించుకునే వారే లేరని ఆరోపించారు. కృష్ణా ఆయకట్టులో నీటి కోసం రోజూ గొడవలు జరుగుతాయంటే వినే నాథుడే లేడన్నారు. కృష్ణా ఆయకట్టు అంటే దిగువన ఉన్న కేవలం 8 జిల్లాలు మాత్రమే కాదని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అటు వైపున మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు కూడా ఉన్నాయన్నారు. ఈ ఆయకట్టులో రోజూ తన్నుకునే, కొట్టుకునే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే ఇలా ఉందన్నారు. రాష్ట్రం ఒక్కటిగా ఉంటేనే పోలవరానికి నీళ్ళు వస్తాయన్నారు. మన రాష్ట్రాన్ని రెండుగా విడగొడితే పోలవరానికి నీళ్ళెక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. రోజూ కొట్టుకునే పరిస్థితి రాదా? అన్నారు.

హైదరాబాద్‌ విషయానికి వస్తే.. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి పిల్లవాడూ ఉద్యోగం కోసం ఇక్కడికే రావాల్సిన పరిస్థితి ఉందని శ్రీ జగన్‌ అన్నారు. ఇలాంటి హైదరాబాద్‌ నుంచి పదేళ్ళలో వెళ్ళిపోవాలని చెబితే.. ఎలా పోగలుగుతాం? ఎక్కడికి పోతాం? ఎలా బ్రతకగలుగుతాం? అని ఆయన ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడం సమంజసమేనా? అన్నారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకం, సమైక్యానికి కట్టుబడి ఉన్నానంటూ ఒక్క లేఖ చంద్రబాబు నాయుడు ఇవ్వాలని శ్రీ జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు నిరాహార దీక్షకు కూర్చుంటే.. తాను కూడా మద్దతు ఇస్తానని అన్నారు. 'అమ్మా! సోనియా గాంధీగారూ.. మీ కొడుకును ప్రధానమంత్రిని చేయడానికి ఇక్కడ మా అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు' ఇలా చేయడం తగదని అన్నారు. మేమంతా కూడా ఈ దేశానికి సంబంధించిన పిల్లలమే అన్నారు. తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఇవాళ వీధులకెక్కి ఉద్యమాలు చేస్తున్నామని ఆయన గుర్తుచేశారు. కాస్త మా గురించి కూడా ఆలోచించమని సోనియాకు శ్రీ జగన్‌ విజ్ఞప్తిచేశారు. కాస్త ఆలోచన చేయమని చంద్రబాబు నాయుడిని, బిజెపిని కూడా కోరుతున్నామన్నారు.

అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టే పరిస్థితి దేశంలో మరెక్కడా లేదని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. బోడోలాండ్‌ కోసం, గూర్ఖాలాండ్‌ కోసం గొడవలు జరుగుతున్నా పట్టించుకోరని, విదర్భం కోసం అసెంబ్లీ తీర్మానం చేసినా పట్టించుకోరని కానీ మన రాష్ట్రానికి వచ్చేసరికే అడ్డగోలుగా ముక్కలు చేయడానికి సిద్ధమైపోయారని శ్రీ జగన్‌ విమర్శించారు. అసెంబ్లీ తీర్మానం లేకపోయినా.. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని తెలిసినా.. ఓట్లు, సీట్ల కోసం మన రాష్ట్రాన్ని విడగొడతారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆంధ్రప్రదేశ్‌ విభజనకు పొరపాటున కూడా మద్దు ఇవ్వవద్దని బిజెపి సహా అన్ని పార్టీల ఎంపీలకూ చేతులు జోడించి మరీ విజ్ఞప్తిచేస్తున్నానని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి సీమాంధ్రలో వస్తుందన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన విభజనను ఒప్పుకుంటే.. ఓట్లు, సీట్ల కోసం మన దేశాన్నే ముక్కలు ముక్కలు చేసే పరిస్థితి ఎదురవుతుందని పార్లమెంటులోని అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లకూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. మా జీవితాలను నాశనం చేయొద్దండీ అని కోరారు.

కేబినెట్‌ నోట్‌ కన్నా ముందు మన రాష్ట్ర అసెంబ్లీలో సమైక్య తీర్మానం ఆమోదించి ఉంటే.. దేశం మొత్తం చూసేదని.. ప్రజల మనోభావాలను ప్రతిస్పందిస్తూ.. తీర్మానం చేసి ఉంటే.. ఈ సమస్య దేశం మొత్తానికి తెలిసేది అన్నారు. కేబినెట్‌ నోట్‌ అనేది తొలి ప్రక్రియ అని, దానికి ముందే అసెంబ్లీ తీర్మానం చేసి ఉంటే బాగుండేదన్నారు. విభజన ప్రక్రియలో కేంద్రం తొలి అడుగు వేసింది కాబట్టి.. మిగతా కార్యక్రమాలు కూడా జరిగిపోతాయేమో.. ఇప్పటికైనా ముందుకు రండి అని తాను అన్ని పార్టీలకూ కోరుతున్నానన్నారు. రాష్ట్ర విభజన జరిగితే.. తాగడానికి నీళ్ళు లేక ఈ రాష్ట్రమే అల్లకల్లోలం అయిపోతుందని శ్రీ జగన్‌ ఆందోళన వ్యక్తంచేశారు.





YS Jagan Mohan Reddy talks to Times Now, says AP division will bring water wars

How can the state be divided without assembly resolution, asks YS Jagan Mohan

ఆరువారాల్లో సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారు: జగన్

ఆరువారాల్లో సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారు: జగన్
హైదరాబాద్ : విభజన సమస్యలను ఆరు వారాల్లో మంత్రుల బృందం ఎలా పరిష్కరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రం కోసం ఆయన శనివారం లోటస్ పాండ్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అధికారముంది కదా అని.... కేంద్రం నిరంకుశంగా రాష్ట్రాన్ని విభజిస్తోందన్నారు. విభజనపై అసెంబ్లీ తీర్మాన సంప్రదాయాన్ని గాలికొదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర నిరంకుశ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు జగన్ తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని అంశాలను తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని చెప్పారు.  సమైక్యాంధ్ర కోరుతూ చంద్రబాబు నాయుడు వెంటనే కేంద్రానికి లేఖ ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు.  దీక్షకు ముందే చంద్రబాబు ఆ పనిచేయాలని అన్నారు.  సమైక్యాంధ్ర కోరుతూ చంద్రబాబు ఎందుకు లేఖ ఇవ్వటం లేదో ....మీడియానే ఆయన్ని అడగాలన్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌ విభజన కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలపై అధ్యయనం చేయడానికి మంత్రుల బృందం ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. సరిహద్దుల నిర్ణయం, నదీ జలాలు, ఆస్తుల పంపకం తదితర అంశాలపై ఈ బృందం సిఫారసులు చేయనుంది. పదిమంది మంత్రుల బృందంతో ఏర్పాటు కాగా,  దీనిలో హోం, ఆర్థిక, న్యాయ, జల వనరుల మంత్రులు కూడా ఉంటారు. ఆరు వారాల్లో ఈ బృందం సిఫారసులు సమర్పిస్తుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది

సమైక్య రాష్ట్రం కోసం జగన్ ఆమరణ దీక్ష ప్రారంభం

వైఎస్ జగన్ సమైక్య దీక్ష ప్రారంభం
హైదరాబాద్ :  సమైక్య రాష్ట్రం కోసం లోటస్ పాండ్ నివాసంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఉదయం 11.30గంటలకు ఆయన దీక్ష ప్రారంభించారు. దీక్షావేదికతో పాటు, దీక్షకు మద్దతుగా తరలివచ్చే అభిమానులు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పార్టీనేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఎజెండాలు పక్కన పెట్టి ఎవరి జెండాలు వారు పట్టుకొని సమైక్య రాష్ట్రమే ఎజెండాగా  అందరూ ముందుకు ఉరకాల్సిన సందర్భమిది. రాష్ట్రం ముక్కలు కాకుండా కాపాడుకోవడానికి రాజకీయాలకతీతంగా కదలాల్సిన చారిత్రక సందర్భమిది.  జగన్‌ ఇచ్చిన ఈ పిలుపుతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం మహోధృతంగా కొనసాగుతోంది. ప్రాణం కాదు ప్రజలు ముఖ్యమంటూ జగన్‌ ఆమరణ దీక్ష ప్రారంభించారు

అడ్డగోలు విభజనపై యావద్దేశం ఆలోచించాలి: వైఎస్ జగన్

అడ్డగోలు విభజనపై యావద్దేశం ఆలోచించాలి: వైఎస్ జగన్
హైదరాబాద్ :
‘‘ఇంత అడ్డగోలుగా జరుగుతున్న విభజనపై యావత్ దేశమూ ఆలోచించాలని నేను కోరుతున్నాను. మార్పు రావాలి. ఇవాళ ఒక్క ఆంధ్రప్రదేశే కాదు. ఓట్ల కోసం, సీట్ల కోసం రేపు కర్ణాటకను, తమిళనాడును విభజించే పరిస్థితి రావచ్చు. ఇంకా ఎక్కడైనా విభజన చేయవచ్చు. దీనికొక విధానం ఉండాలి. ఒక నిబద్ధత (సాంక్టిటీ) ఉండాలి. ఒక హేతుబద్ధత ఉండాలి’’ అని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. రాహుల్‌గాంధీకి కూడా విజ్ఞప్తి చేస్తారా అని ప్రశ్నించగా, ‘ఎందుకు ఒక్క రాహుల్ గురించే అడుగుతారు? ఇక్కడి పరిస్థితులను చూడాల్సిందిగా, జోక్యం చేసుకోవాల్సిందిగా దేశం మొత్తాన్ని నేను కోరుతున్నాను. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను అడుగుతున్నాను. నేనిది అన్యాయమంటున్నాను. మన భావితరాల దుస్థితిని ఊహించమని కోరుతున్నాను. మనకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది నిజం, ఇది ఎక్కడైనా జరగొచ్చు. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు. వాళ్లు వద్దని, వీళ్లు రావాలని నేననడం లేదు. అందరినీ, అన్ని పార్టీలనూ రమ్మని అడుగుతున్నాను. మాకు జరుగుతున్న ఈ అన్యాయంపై యావత్ దేశం మన వెనుక నిలబడి పోరాడాలని కోరుతున్నాను. అందరూ ఒత్తిడి పెంచాలని కోరుతున్నాను. ఈ అన్యాయమైన నిర్ణయం తీసుకున్న వాళ్లు దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను. నిర్ణయం తీసుకున్న వాళ్లు ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవాలని అంటున్నాను. ఇలా చేయడం సరికాదని వాళ్లు భావించాలంటున్నాను. ఈ రోజు దీన్ని అంగీకరిస్తే ఇంతటితో ఆగదు. ఓట్ల కోసం, సీట్ల కోసం రేపు దేశంలో ఇంకెక్కడైనా చేస్తారు’’ అని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ఉద్దేశించి జగన్ అన్నారు.
 
సోనియాను ఎందుకు విమర్శించడం లేదన్న చంద్రబాబు విమర్శలను ఓ విలేకరి ప్రస్తావించగా, ‘ఏం ప్రశ్న ఇది? ఇక్కడ మనమెందుకు కూర్చున్నాం? ఒక ప్రధానమైన లక్ష్యం కోసం ఉన్నామిక్కడ. మీరేం ప్రశ్న అడుగుతున్నారు?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ రాష్ట్రాన్ని కొందరు అడ్డగోలుగా విభజిస్తున్నారు. ఇంకొందరు దానికి మద్దతిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాన్ని నేను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్నాను. అది ఎఫ్‌డీఐ విషయంలో రాజ్యసభలో ఓటింగ్ సందర్భంగా కావచ్చు. నేను వ్యతిరేకించాను. చంద్రబాబు దాన్ని బలపర్చారు. రాష్ట్ర ప్రజలపై రూ.32 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం వేసినప్పుడు రాష్ట్ర ప్రభత్వంపై అవిశ్వాస తీర్మానం వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పార్టీ ఓట్లేసింది. కానీ చంద్రబాబు మాత్రం విప్ జారీ చేసి మరీ ప్రభుత్వానికి మద్దతిచ్చారు. ఎవరు, ఎవరితో కలిసిపోయి ఉన్నారు? రాష్ట్రంలో అందరికీ తెలుసు ఇది జరుగుతోందని. అయినా ప్రస్తుత సమస్య నుంచి దారి మళ్లించేందుకే ఈ ప్రయత్నమంతా జరుగుతోంది. దయచేసి అలా చేయొద్దు’ అన్నారు. 

దేనికో భయపడే సీఎం రమేష్‌తో రాయబారం

సీమాంధ్రకు బాబు ద్రోహం
టీడీపీ అధ్యక్షుడిపై అంబటి ఆగ్రహం
 త్వరగా విభజించాలని దీక్ష చేయడం అన్యాయం
దేనికో భయపడే సీఎం రమేష్‌తో రాయబారం
 సీడబ్ల్యూసీ నిర్ణయం అమలుకు అప్పుడే ఒప్పందం
మీరు కాంగ్రెస్‌తో కుమ్మక్కై మమ్మల్ని అంటారా?

 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి నిరసనగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్షను చేపడుతుంటే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని త్వరగా విభజించాలని కోరుతూ ఢిల్లీలో నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించడం అన్యాయం, దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సీమాంధ్ర అంతా ఆందోళనలతో భగ్గుమంటోంటే రాష్ట్ర విభజన త్వరగా చేయాలని దీక్ష చేయడం ఆ ప్రాంత ప్రజలకు ద్రోహం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 చంద్రబాబు దేనికో భయపడి తన షాడో అయిన సీఎం రమేష్‌ను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇంటికి కాళ్లబేరానికి పంపారని అంబటి విమర్శించారు. సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి సహకరిస్తామని బాబు ఈ సందర్భంగా ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ‘అలాంటి చంద్రబాబు.. కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారని మమ్మల్ని అంటారా?’ అని అంబటి మండిపడ్డారు. ఆయన శుక్రవారం ఇక్కడ ‘సాక్షి’తో మాట్లాడారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాజకీయ పార్టీ పెట్టినందుకు అన్యాయంగా, అక్రమంగా 16 నెలలు జైల్లో ఉండి, ఎన్నో కష్టాలు పడిన జగన్.. బయటకు వచ్చిన తరువాత కూడా రాష్ట్ర ప్రజానీకం కష్టాల కన్నా తన కష్టాలు ఎక్కువకాదనే భావనతో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడుతున్నారని ఆయన అన్నారు. ‘అలాంటి జగన్ కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారా? సీడ బ్ల్యూసీ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఆత్రత పడుతున్న చంద్రబాబు కుమ్మక్కయ్యాడా?..’ అని ప్రశ్నించారు. బాబు చెప్పే బుర్రకథలు, హరికథలు వినడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా లేరన్నారు.
 
  తెలంగాణ, సీమాంధ్ర నాయకులిద్దరినీ వెంటబెట్టుకుని వెళ్లి విభజన త్వరితగతిన కావాలని, జగన్‌కు బెయిల్ రాకూడదని రాష్ట్రపతితో సహా ఎంతోమంది నేతలకు చెప్పినటువంటి చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారా, లేక జగన్ కుమ్మక్కయ్యారా? అని ప్రశ్నించారు. ‘టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు, ఎరబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి వంటి నాయకులంతా తెలంగాణ ప్రక్రియ ప్రారంభం అయిందని కేకులు కట్ చేసుకుని ఓ వైపు సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి రాష్ట్ర విభజన త్వరగా జరగాలని దీక్ష చేయడం తెలుగు జాతికి ద్రోహం చేయడం కాదా?’ అని ప్రశ్నించారు. సీమాంధ్రలో పుట్టి, ఇక్కడే పెరిగి, సీమాంధ్రుల దయాదాక్షిణ్యాలతో ఎమ్మెల్యే, సీఎం అయిన బాబు, సీమాంధ్ర రోదనలను పట్టించుకోకుండా ప్రత్యేక తెలంగాణ కోసం దీక్ష చేయడం దారుణమనీ, చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారని అంబటి విమర్శించారు.

అసెంబ్లీ తీర్మానం లేనిదే రాష్ట్రాలను విడగొట్టరాదంటూ చట్టం తేవాలి

సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ జగన్ ఆమరణ దీక్ష!
సాక్షి, హైదరాబాద్ :
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నందుకు నిరసనగా, విభజన విషయంలో అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. రాష్ట్ర విభజనకు ఆమోదముద్ర వేస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై ఆయన శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి పరిణామాలపై సమీక్షించారు. విభజన విషయంలో కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, అందుకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సంకల్పించారు. సమావేశానంతరం పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, జూపూడి ప్రభాకరరావు, దాడి వీరభద్రరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి పద్మలతో కలిసి జగన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్యాయం జరుగుతున్న ప్రాంతంలో చెలరేగుతున్న ఆందోళనలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఎంత నిరంకుశంగా ఈ విభజన కార్యక్రమాన్ని చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
 నోట్‌ను ఆమోదించాక ఏర్పాటు చేయబోయే కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) ఆరు వారాల్లో విభజన సమస్యలకు పరిష్కారం చూపగలుగుతుందా అని సూటిగా ప్రశ్నించారు. ‘మా ఇష్టం వచ్చినట్టు మేం చేసేస్తాం, మీ చావు మీరు చావండి’ అన్న చందంగా విభజన చేస్తున్న వారు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజనను అడ్డుకోవడానికి అన్ని పార్టీలూ తమ జెండాలతోనే కార్యాచరణలోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా చరిత్రహీనుడిగా మిగిలి పోకుండా, ఈ అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని హైలైట్ చేయాలని జాతీయ మీడియాను కోరారు. యావత్ దేశంలోని అన్ని రాజకీయాల పార్టీల వారూ ఇందులో జోక్యం చేసుకోవాలన్నారు. ఇంత అప్రజాస్వామికంగా, అడ్డగోలుగా విభజన చేస్తున్నా దేశంలో ఎవరూ పట్టించుకోవడం లేదంటే ఆంధ్రప్రదేశ్ అంటే అంత చులకన అయిపోయిందా అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ విభజన కార్యక్రమాన్ని వీళ్లు ఎంత నిరంకుశంగా చేస్తున్నారంటే గతంలో ఎక్కడా, ఎప్పుడూ కనీవినీ ఎరగని విధంగా అసెంబ్లీ తీర్మానం చేయాలన్న సంప్రదాయాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోని అంశమన్నట్టుగా పక్కన పెట్టి, అధికారం ఉంది కదా అని వాళ్లిష్టం వచ్చినట్టుగా విభజన కార్యక్రమం చేపట్టారు.
 
దీనిపై మా పార్టీలో ఈ రోజు (శుక్రవారం) సుదీర్ఘంగా చర్చ జరిగింది. కేంద్ర మంత్రుల బృందం వివిధ అంశాలపై ఆరు వారాల్లో పరిష్కారం చూపుతుందట. అంటే దానర్థం వాళ్లిష్టం వచ్చింది వాళ్లు చేసేస్తారు, మీ చావు మీరు చావండి అని చెప్పకనే చెబుతున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇవాళ ఒకటే అడుగుతున్నా. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్... ఇలా ఎక్కడ చూసినా అసెంబ్లీ తీర్మానం లేకుండా గతంలో ఎప్పుడూ విభజన చేయలేదు. విదర్భ విషయంలోనైతే తీర్మానం చేసినా పక్కన పెట్టారు. కానీ మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఎందుకిలా అన్నీ పక్కనపెట్టి, అసెంబ్లీ తీర్మానం అనే ప్రస్తావనను కూడా పూర్తిగా పక్కన పెట్టేసి, ఇంత అడ్డగోలుగా ఎందుకు విభజిస్తున్నారని మాత్రం నేను అడగదల్చుకున్నా’’ అని జగన్ అన్నారు. 
 
 ఈ శాస్త్రీయ ప్రక్రియను పక్కన పెట్టి కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం మా అందరి జీవితాలతో ఇలా చెలగాటం ఆడుతున్నందుకు నిరసనగా శనివారం నుంచి హైదరాబాద్‌లో తమ కార్యాలయం ఎదురుగానే ఆమరణ నిరాహార దీక్షకు తాను కూర్చుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ‘దేవుడు అనుకూలిస్తే, మీ అందరి మంచి మనసులు తోడయితే, దేవుడి దయ వల్ల మీ అందరి మంచి మనసుల వల్ల పరిష్కారం వస్తుందని ఆశిస్తూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న ఈ అన్యాయం గురించి చెప్పడానికి త్వరలో తమ పార్టీ నేతలతో ఒక బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్టు వివరించారు. వారు ఢిల్లీ పెద్దలందరితో పాటు పలు పార్టీల ఫ్లోర్ లీడర్లందరినీ కలుస్తారన్నారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిసి, రాష్ట్రం విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తారని వెల్లడించారు. అన్యాయం జరుగుతున్న ప్రతి ప్రాంతంలోనూ ఇప్పుడు జరుగుతున్న బంద్‌లు, ధర్నాలు పూర్తిగా కొనసాగుతాయని జగన్ వివరించారు. ఎందుకింత ఆరాటపడుతున్నాం, ఎందుకింత బాధ పడుతున్నామన్న విషయాన్ని కేంద్ర పెద్దల నుంచి రాష్ట్ర పెద్దల దాకా అందరూ ఆలోచన చేయాలని కోరారు.
 
 నీళ్ల సంగతేంటి?
 ‘‘ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది? రాష్ట్రం ఒక్కటిగా ఉన్నపుడే కృష్ణా నీళ్లు మహారాష్ట్ర దాటుకుని కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ దాటుకుని, అవి నిండాకే వాటిని కిందికి వదిలే పరిస్థితి ఉంది. ఇలాంటప్పుడు మధ్యలో ఇంకో రాష్ట్రం వస్తే శ్రీశైలం డ్యామ్ పరిస్థితి ఏమిటి? నాగార్జునసాగర్‌కు నీళ్లెలా ఇస్తారు? ఇలాంటి అంశాల మీద మాట కూడా చెప్పరు. ట్రిబ్యునళ్లున్నాయి, అవి చూసుకుంటాయని నోటికొచ్చినట్టుగా ఏదో అనేస్తున్నారు. నేను ఒక్క మాట అడగదల్చుకున్నా. నిజంగానే ట్రిబ్యునళ్లకు ఇంత పలుకుబడి ఉంటే ఇవాళ మహారాష్ట్ర ఈ విధంగా చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? కర్ణాటకలో ఆలమట్టి, నారాయణపూర్ నిండితే తప్ప కిందకు నీళ్లు వదలని పరిస్థితి ఎందుకుంది? అడిగే వాడు లేడు. పేరుకు మాత్రం, ‘ట్రిబ్యునళ్లున్నాయి, అవి చూసుకుంటాయ’ంటారు. 
 
 అవి నిజ ంగానే ఉంటే కావేరీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు ఇవాళ్టికి కూడా రోజూ కొట్టుకునే పరిస్థితి ఎందుకుంది? ఏటా గొడవలు పడే పరిస్థితి ఎందుకు వస్తుంది? అవసరం వచ్చినపుడు మాత్రం, ‘ట్రిబ్యునళ్లున్నాయి’ అంటూ వాటిమీద నెట్టేస్తారు. ఆ తరువాత మీరు కొట్టుకోండని చెప్పి సంవత్సరం, సంవత్సరం మీరే చావండని చెబుతారు. కృష్ణా ఆయకట్టులో రోజూ గొడవలు జరుగుతాయి. కృష్ణా ఆయకట్టంటే కేవలం ఇటువైపున్న ఎనిమిదిన్నర జిల్లాలు మాత్రమే కాదు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరే కాదు. అటువైపు మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం ఉన్నాయి. రోజూ కొట్టుకునే, తన్నుకునే పరిస్థితి వస్తుంది. ఇదా మీరు చేయాల్సిన పని? ఓట్ల కోసం, సీట్ల కోసం మా జీవితాలతో చెలగాటం ఆడటం ఎంతవరకు సబబని అడుగుతున్నాను. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే పదేళ్లలో వెళ్లిపోవాలంటున్నారు. ఆరు వారాల్లో జీఓఎం పరిష్కారం చూపుతుందట. నేను అడగదల్చుకున్నా. నిర్మించడానికి 60 ఏళ్లు పట్టిన ఈ నగరాన్ని పదేళ్లలో ఎక్కడైనా, ఎవరైనా కట్టగలరా? చదువు అయిపోయిన వెంటనే, ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే, డిగ్రీ అయిపోయిన వెంటనే ఆ పిల్లాడు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలని అడగదల్చుకున్నా! పరిష్కారాలుండవు. వాళ్లిష్టం వచ్చింది చేసేస్తున్నారు. మీ చావు మీరు చావండంటున్నారు’ అంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. స్పందించాల్సిన వారేమో ఓట్లు, సీట్లు పోతాయని స్పందించకుండా గమ్ముగా ఉండిపోతున్నారు. ఇది మారాలి! 
 
ఎక్కడైనా రాష్ట్రాలను విడగొట్టాలి అనంటే ఒక పద్ధతి ఉండాలి. అసెంబ్లీ తీర్మానం లేనిదే రాష్ట్రాలను విడగొట్టరాదంటూ చట్టం తేవాలి’ అని జగన్ డిమాండ్ చేశారు. ఈ పరిస్థితులు మారడం కోసమే ఆమరణ దీక్షకు  శ్రీకారం చుడుతున్నానన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై బీజేపీని కూడా కలిసి అడుగుతారా అని ప్రశ్నించగా, ‘బంగారంగా’ అని బదులిచ్చారు. ‘ప్రతి పార్టీనీ రమ్మని నేను చెబుతున్నా. మూడు పార్టీలు, ఐదు పార్టీల నుంచి సంఖ్య మారాలి. చంద్రబాబునాయుడు గారిని కూడా ఇవాళ రిక్వెస్ట్ చేస్తున్నా... అయ్యా చరిత్రహీనుడిగా మిగిలి పోవద్దు, రండి, మూడు పార్టీల వైపునకు రండని. ప్రతి పార్టీనీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరమూ కలవాల్సిన అంశం ఇది. పొరపాటు చేశాము అంటే ముందు తరాలకు మనం అన్యాయం చేసినవాళ్లం అవుతాము. అది తెలుసుకోమని ఇవాళ ప్రతి ఒక్కరినీ వేడుకుంటూ అడుగుతున్నాను’ అన్నారు.
 
తీర్మానాన్ని కావాలనే విస్మరిస్తున్నారు
‘‘అసెంబ్లీ తీర్మానం లేకుండా ఇలా విభజించాలనుకోవడం న్యాయమా అని అడుగుతున్నాను. ఈ మౌలికమైన అంశాన్ని, ఈ అన్యాయాన్ని హైలైట్ చేయాలని జాతీయ మీడియాను కోరుతున్నా. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజనకు పూనుకోవడమంటే మనం ఎలాంటి ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం? విభజన చేయాలనుకుంటున్న వాళ్లు అసెంబ్లీ తీర్మానాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారు. కొద్దిరోజుల్లో సాధారణ ఎన్నికలకు పోతున్నాం. ఈ దశలో విభజన సరైన చర్య అవుతుందా? ఓట్లు, సీట్ల కోసమే తప్ప ఇందులో ఏదైనా ఆచరణయోగ్యత ఉందా? ఆరు వారాల్లో కేంద్ర మంత్రుల బృందం సమస్యలకు పరిష్కారం చూపగలుగుతుందా?’’ అని జగన్ ప్రశ్నించారు.
 
సమైక్యం కోసం అంతా జెండాలు పట్టుకుని రావాలి
పార్టీ జెండాలు వద్దని జేఏసీ చెప్పడాన్ని విలేకరులు ప్రస్తావించగా, ‘‘లేదు. నేను పార్టీ జెండాలతోనే రమ్మంటున్నా. ప్రతి ఒక్కరూ జెండాలు పట్టుకుని ధైర్యంగా రండి. తప్పేముందమ్మా. నేనే చెబుతున్నా. బీజేపీ వాళ్లను కూడా జెండాలు పట్టుకునే రమ్మంటున్నాను. చంద్రబాబు నాయుడు గారిని కూడా జెండాలు పట్టుకునే రమ్మంటున్నాను. వైఎస్సార్‌సీపీ వాళ్లను కూడా జెండాలు పట్టుకునే రమ్మని చెబుతున్నాను. పార్టీ అధ్యక్షులు ముందుకు కదలాలి. పార్టీల్లో నిజాయితీ ఉండాలి. పార్టీ అధ్యక్షుల్లో నిజాయితీ ఉండాలి. మనం జెండాలు పట్టుకుని ఉన్నప్పుడే ఆ పరిస్థితి తీసుకురాగలం’ అని జగన్ బదులిచ్చారు. 
 
 ఇంత పెద్ద లక్ష్యంతో ఉద్యమిస్తున్నప్పుడు అసలు అంశాన్ని తప్పుదోవ పట్టించొద్దని మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ‘ నేను వాస్తవం చెబుతున్నా. రేప్పొద్దున నీళ్లు లేకపోతే కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ట్రిబ్యునళ్ల గురించి మీరే చూస్తున్నారు. కర్ణాటకలో ఏం జరుగుతా ఉంది? తమిళనాడులో ఏం జరుగుతా ఉంది? నేను చెప్పేదాంట్లో ఒక్క దాన్లో కూడా అబద్ధముంటే, అవాస్తవముంటే మీరే చెప్పండి. రాష్ట్రంలో మనందరమూ ఉన్నాం. ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనమింకా పార్టీ రాజకీయాలను పెంచి పెద్ద చేయాలన్న ఆలోచనతో తప్పుదారి పట్టించొద్దు. భవిష్యత్ తరాల గురించి కనీసం కొంతైనా ఆలోచన చేయాల్సిందిగా సవినయంగా చేతులు జోడించి రాజకీయాలకు అతీతంగా ఆలోచనలు చేయమని సవినయంగా ప్రార్థిస్తున్నాను’’ అన్నారు.

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా
న్యూఢిల్లీ :
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమర భేరీ మోగింది. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. 2014 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 11, 19న రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 25, రాజస్థాన్‌లో డిసెంబర్ 1, ఢిల్లీ, మిజోరాంలో డిసెంబర్ 4న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్(సీఈసీ) వీఎస్ సంపత్ తెలిపారు. డిసెంబర్ 8న ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడతామని చెప్పారు.
 
సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పునకు అనుగుణంగా నచ్చని అభ్యర్థులను తిరస్కరించే హక్కును మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికల్లో ఓటరుకు కల్పించనున్నారు. ఈవీఎం మిషన్లలో ‘పైవారు ఎవరూ కాదు’ అన్న మీటను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో 630కిపైగా నియోజకవర్గాల్లో సుమారు 11 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వీఎస్ సంపత్ వివరించారు. ఇందుకు 1.30 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. వివిధ కేసుల్లో దోషులుగా తేలి అనర్హతకు గురైన ఎంపీల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఆయా స్థానాలను నోటిఫై చేసిన తర్వాతే తాము ఖాళీలను ప్రకటిస్తామని చెప్పారు.

ఎల్బీ స్టేడియంలో 19న సమైక్య శంఖారావం: వైఎస్ఆర్సీపీ

Written By news on Friday, October 4, 2013 | 10/04/2013

ఎల్బీ స్టేడియంలో 19న సమైక్య శంఖారావం: వైఎస్ఆర్సీపీ
హైదరాబాద్‌ :
ఎల్బీ స్టేడియం వేదికగా సమైక్య శంఖారావం సభను నిర్వహించేందుకు అక్టోబరు 19న వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సమైక్యరాష్ట్రం కోసం వైఎస్సార్‌సీపీ భారీ సభను ఈనెల 19న నిర్వహించనుంది. 
 
ఈనెల 19న హైదరాబాద్‌లో చేపట్టబోయే సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వాలని డీజీపీ ప్రసాదరావుని కలిసిన వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు కలిశారు. డీజీపీని కలిసిన తర్వాత మీడియాతో వైఎస్ఆర్ సీపీ నేతలు జూపూడి ప్రభాకర్ రావు, గట్టు రామచందర్ రావు, జనక్‌ప్రసాద్‌, శివకుమార్‌ మాట్లాడుతూ.. సభకు అనుమతివ్వాలని డీజీపీని కోరాం అని అన్నారు. 
 
స్థానిక డీసీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డీజీపీ అన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. గత మూడేళ్లుగా ఎక్కడ పర్యటించినా..శాంతిభద్రతల సమస్యలు తలెత్తలేదు. శాంతియుత పంథాలోనే  వైఎస్ఆర్ కాంగ్రెస్ పయనిస్తోంది అని జూపూడి అన్నారు. రాజ్యాంగం ప్రకారం..విభజన, సమైక్యం ఎదైనా అభిప్రాయాన్ని..చెప్పుకునే హక్కు అందరికీ ఉంది అని గట్టు అన్నారు. 

జననేత దీక్షకు సంఘీభావం తెలపండి

జననేత దీక్షకు సంఘీభావం తెలపండి
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. సమన్యాయం పాటించకుండా రాష్ట్రాన్ని దారుణంగా విభజించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు విభజిస్తే భవిష్యత్ లో నీటి యుద్ధాలు తప్పవని ఆయన హెచ్చరించారు.

విభజనకు వ్యతిరేకంగా తాను రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట చేపట్టబోతున్న ఆమరణ నిరాహార దీక్షకు అన్ని పార్టీలూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని పార్టీల నాయకులూ వాళ్ల జెండాలు పట్టుకునే ఈ ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. జగన్ దీక్షపై మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. జననేత దీక్షకు సంఘీభావం ప్రకటించండి.

డీజీపీని కలిసిన వైఎస్సార్ సీపీ నాయకులు

ఈ నెల 19న హైదరాబాద్ లో నిర్వహించదలచిన సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వాలని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు డీజీపీ ప్రసాద్ రావును కోరారు. శుక్రవారం సాయంత్రం వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు జూపూడి ప్రభాకరరావు, గట్టు రామచంద్రరావు తదితరులు డీజీపీని కలిశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. స్థానిక డీసీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని డీజీపీ చెప్పినట్టు తెలిపారు.

 వైఎస్‌ఆర్‌ సీపీ శాంతియుత పంథాలోనే పయనిస్తోందని గట్టు రామచంద్రరావు అన్నారు. గత మూడేళ్లుగా ఎక్కడ పర్యటించినా శాంతిభద్రతల సమస్యలు తలెత్తలేదని జూపూడి చెప్పారు. ఇదిలావుండగా కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు డీజీపీని కలసి సభకు అనుమతి ఇవ్వరాదని కోరారు.

Jagan to go on indefinite hunger strike from Saturday


I request Chandrababu Naidu to support our protest against bifurcation: Jagan

అన్ని పార్టీల వాళ్లూ జెండాలు పట్టుకుని ఉద్యమంలోకి రండి

పార్టీ జెండాలు పట్టుకునే ఉద్యమంలోకి రండి
పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ ను ఇంత దారుణంగా విభజిస్తుంటే దేశం మొత్తం చూస్తూ ఊరుకుందని, రాష్ట్రమంటే అంత చులకనా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన రెడ్డి ప్రశ్నించారు. ఇది మారాలని, రాష్ట్రాన్ని విభజించాలంటే అసెంబ్లీ తీర్మానం తప్పనిసరన్న చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. లోటస్ పాండ్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు విభజిస్తే రేపు కృష్ణా ఆయకట్టులో అనేక గొడవలు రోజూ జరుగుతాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా ఆయకట్టు అంటే కేవలం అవతలివైపున్న జిల్లాలు మాత్రమే కాదని, ఇవతలవైపు మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు కూడా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. పదేళ్లలో హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలంటున్నారని, హైదరాబాద్ నగరాన్ని నిర్మించడానికి 60 ఏళ్లు పట్టినప్పుడు కేవలం పదేళ్లలో మరో హైదరాబాద్ లాంటి నగరాన్ని అక్కడ నిర్మించగలరా అని జగన్ నిలదీశారు.

విభజనకు వ్యతిరేకంగా తాను రేపటినుంచి చేపట్టబోతున్న ఆమరణ నిరాహార దీక్షకు అన్ని పార్టీలూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేవలం మూడు పార్టీలు మాత్రమే సమైక్యాంధ్రకు పూర్తి అనుకూలంగా ఉన్నాయని, మిగిలిన వాళ్లు కూడా ముందుకు రావాలని కోరారు. అన్ని పార్టీల నాయకులూ వాళ్ల జెండాలు పట్టుకునే ఈ ఉద్యమంలో పాల్గొనాలని అన్నారు. ఇలాంటి తరుణంలో చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దని, ఉద్యమంలో పాల్గొనాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా ఆయన కోరారు. పార్టీలు, అధ్యక్షులలో నిజాయితీ ఉండాలని స్పష్టం చేశారు.

రేపు ఇదే పరిస్థితి కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా రావచ్చని, కేవలం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం ఇలా హృదయాలను చీల్చడం సరికాదని జగన్ చెప్పారు. చదువుకున్న పిల్లలు రేపు ఉద్యోగాల కోసం ఎక్కడికెళ్లాలని నిలదీశారు. భావి తరాలు సర్వనాశనం కాకుండా ఉండాలంటే మనమంతా పోరాడాలని పిలుపునిచ్చారు.

Watch Live:అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజనా?:వైఎస్ జగన్

రేపటి నుంచి జగన్ ఆమరణ నిరాహార దీక్ష

కనివినీ ఎరగని రీతిలో రాష్ట్ర విభజన జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం లోటస్ పాండ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ  మీ చావు మీరు చావండి అన్న రీతిలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిందన్నారు. కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట శనివారం నుంచి ఆమరణ దీక్షకు దిగనున్నట్లు  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.

పార్టీ ముఖ్యనేతలతో జగన్ సమావేశం

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం లోటస్ పాండ్ లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.  ఈ సమావేశంలో వైఎస్ విజయమ్మ, మైసూరారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సోమయాజులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈరోజు మధ్యాహ్నం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు

అనంతలో గుర్నాథరెడ్డి దీక్షా శిబిరంపై టీడీపీ దాడి

అనంతలో గుర్నాథరెడ్డి దీక్షా శిబిరంపై టీడీపీ దాడి
అనంతపురం :  అనంతపురంలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు తెలుగుదేశం పార్టీ  కొత్త ఎత్తుగడ వేసింది. అంతే కాకుండా సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలు, ఆందోళనలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ దాడులకు యత్నించింది. టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షిగా ఆపార్టీ కార్యకర్తలు దాడులుకు దిగారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను చించివేసిన ఎమ్మెల్యేల అనుచరులు, అనంతరం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి దీక్షా శిబిరంపై రాళ్లదాడి చేశారు. ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పార్థసారధి, మహాలక్ష్మి శ్రీనివాస్ అక్కడ ఉన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొడుతున్నారు.

కుట్ర చేసి ఏకంగా రాష్ట్రాన్నే అమ్మేశారు

https://www.facebook.com/ysrcpofficial

Photo: రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా 72 గంటల బంద్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది.
బీహార్‌ నుంచి జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను విభజించినపుడు కూడా మూడు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీలో తీర్మానాలు చేసిన తర్వాతే విభజనకు శ్రీకారం చుట్టారు. కానీ ఇవాళ అసెంబ్లీ తీర్మానం చేయకుండా పక్కన పెట్టడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ...ఈ రెండూ కూడా కలిసిపోయాయి కాబట్టే, కుట్ర చే సి ఏకంగా రాష్ట్రాన్నే అమ్మేశారు.
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మేం శత విధాల ప్రయత్నించాం. అసెంబ్లీని సమావేశపర్చండి అన్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసి పంపించాలన్నాం. అందులో భాగంగానే రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చాం. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశాం..  అని జగన్‌ పేర్కొన్నారు.
ఎంపీలందరూ రాజీనామా చేస్తే, ఇప్పటికే మైనార్టీలో ఉన్న యూపీఏ ప్రభుత్వం పడిపోతుందని అప్పుడు విభజన ప్రక్రియ ఆగిపోతుందని జగన్‌ అభిప్రాయపడ్డారు. .రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా 72 గంటల బంద్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది.
బీహార్‌ నుంచి జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను విభజించినపుడు కూడా మూడు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీలో తీర్మానాలు చేసిన తర్వాతే విభజనకు శ్రీకారం చుట్టారు. కానీ ఇవాళ అసెంబ్లీ తీర్మానం చేయకుండా పక్కన పెట్టడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ...ఈ రెండూ కూడా కలిసిపోయాయి కాబట్టే, కుట్ర చే సి ఏకంగా రాష్ట్రాన్నే అమ్మేశారు.
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మేం శత విధాల ప్రయత్నించాం. అసెంబ్లీని సమావేశపర్చండి అన్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసి పంపించాలన్నాం. అందులో భాగంగానే రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చాం. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశాం..  అని జగన్‌ పేర్కొన్నారు.
ఎంపీలందరూ రాజీనామా చేస్తే, ఇప్పటికే మైనార్టీలో ఉన్న యూపీఏ ప్రభుత్వం పడిపోతుందని అప్పుడు విభజన ప్రక్రియ ఆగిపోతుందని జగన్‌ అభిప్రాయపడ్డారు. .

చంద్రబాబుకు జగన్ ఫోబియా

చంద్రబాబుకు జగన్ ఫోబియా: మైసూరారెడ్డి
వైఎస్సార్ సీపీ నేత మైసూరారెడ్డి ధ్వజం
ప్రతీ విషయాన్ని జగన్‌కు ముడిపెట్టడం
చంద్రబాబు దివాలాకోరు తనానికి నిదర్శనం
రాష్ట్రమంతా ఢిల్లీ వైపు చూస్తుంటే ఆయన మీడియాలో కనిపించేందుకు ఆరాటపడుతున్నారు
మాజీ సీఎంగా బాధ్యతారహితంగా మాట్లాడటం తగదు

 
 సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. జగన్ ఫోబియా పట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి మండిపడ్డారు. ప్రతీ విషయాన్ని జగన్‌కు ముడిపెడుతూ విమర్శలు చేయడం చూస్తుంటే చంద్రబాబు దివాలాకోరుతనం స్పష్టంగా అర్థమవుతోందని దుయ్యబట్టారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మైసూరారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రమంతా ఢిల్లీ వైపు ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే చంద్రబాబు మాత్రం మీడియాలో కనిపించేందుకు ఆరాటపడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన వ్యక్తిగా, బాధ్యత గల ప్రతిపక్ష నేతగా రాష్ట్ర ప్రజలకు ఒక సందేశం ఇవ్వాల్సిన వ్యక్తి, దాన్నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ, అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దిగ్విజయ్‌సింగ్‌ను సీబీఐ డెరైక్టర్ కలిసిన విషయంపై కూడా అర్థం లేకుండా జగన్‌పై విమర్శలు చేయడం చంద్రబాబు దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. ‘‘సీఆర్‌పీసీ సెక్షన్ 173 ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాత కేసును వీలైనంత త్వరగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థ మీద ఉంటుంది. ఏ వ్యక్తినైనా అరెస్టు చేసిన తర్వాత 90 రోజుల  లోగా చార్జిషీట్ వేయకపోతే కూడా స్టాట్యుటరీ బెయిల్ వస్తుంది.
 
 ఈ నిబంధనలను తుంగలో తొక్కి వక్రమార్గాలు పట్టి, చట్టాన్ని వక్రీకరించి, సుప్రీంకోర్టు ఆదేశాలను అడ్డుపెట్టుకుని సీబీఐ ఇష్ట ప్రకారం దర్యాప్తు చేసినా చంద్రబాబు పల్లెత్తు మాట మాట్లాడకపోగా సంతోషించారు. సుప్రీంకోర్టు ఒకమారు 4 నెలలు గడువు ఇస్తే.. ఆరు నెలలైనా సీబీఐ చార్జిషీట్ వేయలేదు. మరోసారి నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి తుది చార్జిషీట్ వేయమని సుప్రీంకోర్టు కచ్చితంగా ఆదేశించడంతో తుది చార్జీషీట్ వేసింది. దీనిని కూడా చంద్రబాబు తప్పుపట్టడం సరైంది కాదు’’ అని అన్నారు. ‘ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయండి’ అన్నట్టు అసత్య ఆరోపణలతో చంద్రబాబు.. జగన్ మీద అభాండాలు వేస్తున్నారన్నారు. కోర్టు విచారణలో ఉన్న అంశాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మంచి సంప్రదాయం కాదన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
 
 కేంద్రం 10 జన్‌పథ్ పంజరంలో చిలుక..
 సున్నితమైన రాష్ట్ర విభజన సమస్యపై కేంద్రం ఒంటెత్తు పోకడలతో నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని మైసూరా పేర్కొన్నారు. స్వార్థ రాజకీయ లబ్ధికోసం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దోషులైన ప్రజాప్రతినిధులను రక్షించే ఆర్డినెన్సును రాహుల్‌గాంధీ చెబితేనే ఉపసంహరించుకోవడం సిగ్గుచేటన్నారు. ఆ ఆర్డినెన్సును వైఎస్సార్ కాంగ్రెస్ తప్పు పడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం.. 10 జన్‌పథ్ పంజరంలో చిలుకలా తయారైందని ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తి కనుసన్నల్లో కేంద్రప్రభుత్వం పనిచేయడం మంచి సంప్రదాయం కాదన్నారు.

తత్తరపడిన బొత్స.. దాక్కున్న రమేష్‌

బాబు రాయ‘బేరం’: బొత్సతో టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ రహస్య భేటీ!
సాక్షి, న్యూఢిల్లీ :
టీడీపీ-కాంగ్రెస్‌ల మ్యాచ్‌ఫిక్సింగ్‌లో మరో అంకానికి తెరలేచింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా సాగిస్తున్న కుమ్మక్కు కుట్రను మరింత తీవ్రం చేయడానికి రంగం సిద్ధమైంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి కేసులూ తన దరిదాపుల్లోకి రాకుండా కాంగ్రెస్‌ అధిష్టానం చూసుకునేలా, అలాగే జగన్‌ విషయంలో పన్నిన ఉచ్చును మరింత బిగించేలా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యూహం రూపొందించారు. ఈ మేరకు రాయ‘బేరాల’తో కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. గతంలో తాను నేరుగా కాంగ్రెస్‌ పెద్దలను కలిసినప్పటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, మీడియా కంటబడినా, మరోవిధంగా బయటకు పొక్కినా పుట్టగతులుండవనే ఉద్దేశంతో ఫిక్సింగ్‌ వ్యవహారం దొడ్డిదారిన ముందుకువెళ్లేలా బాబు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా పార్టీ ముఖ్యులు కొందరిని రహస్యంగా ఇటీవలి కొద్దిరోజులుగా కాంగ్రెస్‌ కీలక నేతల వద్దకు రాయ‘బేరాల’కు పంపుతున్నారు. వీటికి కొనసాగింపుగానే పార్టీలో తనకు అత్యంత సన్నిహితుడైన నేత ఒకరిని తాజాగా ఢిల్లీలోని రాష్ట్ర పీసీసీ అధƒ్యక్షుడి నివాసానికి పంపారు. దేశ రాజధానిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో బుధవారం రోజంతా వేదికను పంచుకున్న బాబు మరుసటి రోజే టీడీపీ రాజ్యసభ సభ్యుడు, తన ‘షాడో’ల్లో ఒకరైన సీఎం రమేష్‌ను రంగంలోకి దింపారు.
 
గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రమేష్‌ అత్యంత రహస్యంగా గురుద్వారా రకాబ్‌గంజ్‌ రోడ్డులోని 30వ నంబరు బంగళాకు వెళ్లి బొత్స సత్యనారాయణతో భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు బొత్స నివాసంలో గడిపిన రమేష్‌ బయట మీడియా ప్రతినిధులు కన్పించడంతో ఖంగుతిని ముఖం కనిపించకుండా కారులో నక్కికూర్చొని మరీ అక్కడినుంచి జారుకున్నారు. బొత్స, రమేష్‌ల భేటీలో అనేక ‘ముఖ్యమైన’ అంశాలపై చర్చజరిగినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వరకు పకడ్బందీ వ్యూహంతో కొనసాగిస్తున్న మ్యాచ్‌ఫిక్సింగ్‌ను.. రాజకీయ సమీకరణాలు, పొత్తు ప్రాధాన్యాలు మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇక మీదట ఏ తీరున కొనసాగించాలనే దానిపై చంద్రబాబు ఇచ్చిన సూచనల ప్రకారం రమేష్‌, బొత్సతో మంతనాలు కొనసాగించారని ఆ వర్గాలు వెల్లడించాయి. తన కేసుల జోలికి రావద్దనే: చంద్రబాబు గుజరాత్‌ సీఎం మోడీతో వేదిక పంచుకున్న బుధవారం రోజే సీబీఐ డెరైక్టర్‌ రంజిత్‌ సిన్హా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్‌‌జ దిగ్విజయ్‌ సింగ్‌ను కలిశారని మీడియాలో వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి. సీబీఐ డెరైక్టర్‌ స్వయంగా దిగ్విజయ్‌ నివాసానికి వెళ్లడం గురించి పత్రికల ద్వారా తెలుసుకున్న చంద్రబాబు బుధవారం రాత్రి పార్టీ ముఖ్య నేతలు కొందరిని పిలిచి ఆ భేటీపై లోతుగా ఆరా తీశారు. అనంతరం సీఎం రమేష్‌కు నిర్దిష్ట సూచనలు చేసి ఫిక్సింగ్‌ను ముందుకు తీసుకెళ్లే బృహత్తర బాధ్యతను అప్పచెప్పారని సమాచారం.
 
బీజేపీతో దోస్తీ, మోడీతో మంతనాల నేపథ్యంలో కాంగ్రెస్‌ తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందేమోనన్న అనుమానం, భయంతోనే చంద్రబాబు ముందు జాగ్రత్తగా తన కేసుల జోలికి వెళ్లొద్దనే తన వేడుకోలును రమేష్‌ ద్వారా బొత్సకు, ఆయన నుంచి కాంగ్రెస్‌ హైకమాండ్‌కు చేరేలా చేశారని టీడీపీ వర్గాలు తెలిపాయి. అలాగే జగన్‌పై పెట్టిన కేసుల విచారణను వేగవంతం చేయడంతో పాటు ఆయన హైదరాబాద్‌లో తలపెట్టిన సమైక్య శంఖారావం సభ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా చూడాలన్న బాబు వర్తమానాన్ని కూడా బొత్సకు రమేష్‌ చేరవేశారని, తన వర్తమానం కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలకు చేరేలా చూసి ‘అవసరమైన చర్యలు’ సత్వరమే చేపట్టేలా చూడాల్సిందిగా కోరారని ఆ వర్గాలు వెల్లడించాయి. బెయిల్‌పై బయటకు వచ్చిన జగన్‌తో కాంగ్రెస్‌, టీడీపీలు రెండింటికీ ముప్పు ఉందని, ఇరుపార్టీలు ఘోరంగా దెబ్బతినే అవకాశాలు కళ్లముందు స్పష్టంగా కనిపిస్తున్నందున ఆయన కట్టడికి సాధ్యమైనంత గట్టి చర్యలు తీసుకోవాలని బాబు తరఫున రమేష్‌ కోరినట్టు బొత్స సన్నిహిత వర్గాలు కూడా తెలిపాయి. మొత్తం మీద జగన్‌ విషయంలో కలిసి కొనసాగిస్తున్న కుట్రను ముందుకు తీసుకెళ్లే విషయంలో పునరాలోచన చేయవద్దని, యధాతథంగా ఫిక్సింగ్‌ వ్యవహారంతో ముందుకెళితే రెండు పార్టీలకు గుడ్డిలో మెల్ల చందాన కాస్తంతైనా ఊరట ఉంటుందన్నది బాబు ఆలోచనగా ఆ వర్గాలు చెప్పాయి. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ అవసరాలరీత్యా టీడీపీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ రాష్ట్రం వరకు మాత్రం జగన్‌ లక్ష్యంగా మ్యాచ్‌ఫిక్సింగ్‌తో, పరస్పర సహకారంతో ముందుకు సాగడం అవసరమని రమేష్‌ పీసీసీ అధినేతకు వివరించినట్టు తెలుస్తోంది. రమేష్‌ చెప్పినదంతా సావధానంగా విన్న పీసీసీ అధ్యక్షుడు బాబు మనోగతాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తెలియజేసి వారి స్పందనను వీలువెంబడి తెలియపరుస్తానని చెప్పినట్టు సమాచారం.
 
తత్తరపడిన బొత్స.. దాక్కున్న రమేష్‌
 
బొత్స నివాసంలో సీఎం రమేష్‌ ఉన్నారనే సమాచారం బయటకు పొక్కడంతో కొందరు మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. ఒకరిద్దరు ప్రతినిధులు బొత్స నివాసంలోకి రావడం గమనించిన రమేష్‌ ఓ మూల గదిలో దాక్కోగా, బొత్స తత్తరపాటుగా ‘ఏంటి ఇలావచ్చారంటూ’ బయటకు వచ్చి మీడియా ప్రతినిధులను అడిగారు. బొత్స వ్యక్తిగత సిబ్బంది కూడా ఇక్కడ దేనికి ఉన్నారంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. ఇదంతా అయ్యాక బొత్స నివాసం నుంచి రమేష్‌ సినీఫక్కీలో బయటకు వెళ్లారు. ముందుగా తన సొంత కారును బయటకు పంపించేసి మరో చిన్న కారును లోపలికి రప్పించారు. అందులో రమేష్‌ తన ముఖం బయటివారెవరికీ కనిపించని రీతిలో నక్కి కూర్చోగా, శరవేగంగా కారును నడిపించిన డ్రైవర్‌ విలేకరుల ఫోటోలకు సైతం చిక్కకుండా బయటకు దూసుకుపోయాడు.సీఎం రమేష్‌ ః జీఆర్‌జీ-30 : ఇన్‌.. డీఎల్‌ 3సీ ఏవై 8433
 
గురుద్వారా రకాబ్‌ గంజ్‌ (జీఆర్‌జీ) రోడ్డులోని 30వ నంబరు బంగళా కాంగ్రెస్‌ ఎంపీ, బొత్స సతీమణి బొత్స ఝాన్సీ అధికారిక నివాసం. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో డీఎల్‌ 3సీ ఏవై 8433 నంబరు కారు ఒకటి వేగంగా ఆ ఇంటికి వచ్చింది.
 
తానెప్పుడూ ఉపయోగించే ఆ కారులోంచి దిగిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ వడివడిగా ఆ క్వార్టర్‌లోకి వెళ్లారు. కొద్దిరోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి ఉన్న పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నారు. కాంగ్రెస్‌-టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్‌పై దాదాపు గంటసేపు ఇద్దరి మంతనాలు కొనసాగాయి. బయట మీడియా హడావుడితో రమేష్‌ చాలాసేపు ఆ ఇంట్లోనే ఉండిపోయారు.
చివరకు మీడియా కన్నుగప్పి వెళ్లిపోయే ప్రయత్నంలో మరో కారు తెప్పించుకుని అందులో నక్కి కూర్చొని బొత్స నివాసం నుంచి నిష్ర్కమించారు.

రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే...

72 గంటల బంద్‌కు వైసీపీ పిలుపు
సాక్షి, హైదరాబాద్‌ :
రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా 72 గంటల బంద్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. గురువారం రాత్రి కేంద్ర మంత్రివర్గ నిర్ణయం వెలువడిన కొద్దిసేపటికే పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, డీఏ సోమయాజులుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా 72 గంటల బంద్‌ పాటించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. విభజన వల్ల అన్యాయం జరిగే ప్రాంతాల్లో బంద్‌ శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై 72 గంటల పాటు సాగుతుందన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. 42 లోక్‌సభ స్థానాలున్న ఒక బలమైన రాష్ట్రాన్ని బలహీనపర్చాలని చూడటం అన్యాయమని అన్నారు.
 
కాంగ్రెస్‌, టీడీపీ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అమ్మేశాయని, ఆ పార్టీ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోయారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా సీమాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యులందరూ రాజీనామా చేసి యూపీఏ ప్రభుత్వాన్ని మైనార్టీలో పడేస్తే విభజన ప్రక్రియను నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఇప్పటికే తమ పార్టీకి చెందిన తనతో పాటు మరో ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్‌, టీడీపీకి చెందిన మిగతా 23 మంది కూడా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రులందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని, అప్పుడైనా విభజనను అడ్డుకోవచ్చని జగన్‌ అన్నారు. ‘‘బహుశ ఈరోజు కలిగినంత బాధ... నా 16 నెలల జైలు జీవితంలో కూడా కలగలేదు. 42 లోక్‌సభ స్థానాలు కలిగిన ఆంధ్రప్రదేశ్‌ను బలహీనపర్చడం కోసం ఓట్లు, సీట్లు లెక్కలేసుకొని విడగొట్టిన ఇంతటి అన్యాయపు పరిస్థితులు చూస్తూ ఉంటే.. వీళ్లు అసలు మనుషులేనా అని బాధ కలుగుతోంది. గతంలో రెండు రాష్ట్రాలు కలిపినప్పుడు కూడా రెండు అసెంబ్లీలలో తీర్మానాలు చేశారు.
 
అంతేకాదు.. డిసెంబర్‌ 9, 2009న సోనియాగాంధీ పుట్టిన రోజు కానుక అంటూ అప్పటి కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం ప్రకటన చేసినƒ ప్పుడు కూడా ఆరోజు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతే ప్రక్రియ మొదలవుతుందని చెప్పి.. ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టారు. బీహార్‌ నుంచి జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను విభజించినపుడు కూడా మూడు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీలో తీర్మానాలు చేసిన తర్వాతే విభజనకు శ్రీకారం చుట్టారు. కానీ ఇవాళ అసెంబ్లీ తీర్మానం చేయకుండా పక్కన పెట్టడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ...ఈ రెండూ కూడా కలిసిపోయాయి కాబట్టే, కుట్ర చే సి ఏకంగా రాష్ట్రాన్నే అమ్మేశారు.
 
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మేం శత విధాల ప్రయత్నించాం. అసెంబ్లీని సమావేశపర్చండి అన్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసి పంపించాలన్నాం. అందులో భాగంగానే రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చాం. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశాం.. అయ్యా కేబినెట్‌ నోట్‌ రాకముందే అసెంబ్లీని సమావేశపరిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తీర్మానం చేసి పంపిస్తే కేంద్రంపై ఒత్తిడి పెరగడమే కాకుండా, ఈ పరిణామాలన్నీ దేశం మొత్తం గమనించడంతో విభజన ప్రక్రియ ఆగుతుందని బతిమిలాడాం. అదేవిధంగా చంద్రబాబుకు కూడా చెప్పాం. రాష్ట్రంలో మూడు పార్టీలు విభజనకు వ్యతిరేకంగా, ఐదు పార్టీలు అనుకూలంగా ఉన్నాయని, చంద్రబాబు గారిని మీరు కూడా మూడు పార్టీల వైపు రావాలని కోరాం. విభజనకు వ్యతిరేకంగా లేఖ ఇవ్వాలని విన్నవించాం. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని బతిమిలాడాం. అందుకోసం లెటర్ల మీద లెటర్లు రాశాం. మీటింగ్‌లలో కూడా నిలదీశాం. అన్ని చేసినా రెండూ కలిసిపోయాయి. ఒకరేమో ఓట్లు, సీట్ల కోసం, మరొకరేమో ఓట్లు రావేమో, సీట్లు రావేమోనని కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. ఈ ఇద్దరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇవాళ ఇటువంటి దారుణమైన పరిస్థితులపై మాట్లాడాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. అందుకే పార్టీ తరఫున 72 గంటల పాటు బంద్‌కు పిలుపు నిస్తున్నాం’’ అని జగన్‌ పేర్కొన్నారు.
 
రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే...
ఎంపీలందరూ రాజీనామా చేస్తే, ఇప్పటికే మైనార్టీలో ఉన్న యూపీఏ ప్రభుత్వం పడిపోతుందని అప్పుడు విభజన ప్రక్రియ ఆగిపోతుందని జగన్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన కాంగ్రెస్‌, టీడీపీలకు ఆ పార్టీలకు చెందిన వారంతా రాజీనామా చేసి బుద్ధి చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. తమ పార్టీ నుంచి లోక్‌సభలో ఉన్న ఇద్దరు ఎంపీలమూ రాజీనామాలు చేశామని, వాటిని ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను మళ్లీ కోరామని జగన్‌ వివరించారు.
 
మంత్రులంతా రాజీనామా చేయాలి..
 
‘‘అసెంబ్లీలో ఇప్పటికైనా తీర్మానం చేయలేకపోయినందుకు మంత్రులందరూ రాజీనామా చేయాలి. ఇక్కడ కూడా సంక్షోభం సృష్టిస్తే విభజన ప్రక్రియ ఆగిపోతుంది. ఇక్కడ రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని డిమాండ్‌ చేస్తున్నా’’ అని జగన్‌ అన్నారు. ఈ విభజన ప్రక్రియపై న్యాయస్థానాలకు కూడా వెళ్లి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో తలపెట్టిన సమైక్య శంఖారావం సభ జరుగుతుందా అని విలేకరులు ప్రశ్నించినపుడు తమ పార్టీ ముఖ్యనేతలతో శుక్రవారం సమావేశమవుతున్నామని, అందులో అన్నీ చర్చిస్తామని జగన్‌ సమాధానమిచ్చారు. మరిన్ని ప్రశ్నలు అడగడానికి విలేకరులు ప్రయత్నించగా.. ‘‘ప్లీజ్‌ విషయాన్ని పక్కదోవ పట్టించొద్దు.. మీ అందరి తరఫున సమైక్యానికే పోరాడుతున్నా.. మద్దతివ్వండి. ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ మన తరంలోనే, మన కళ్లముందే నాశనమవుతా ఉంటే బాధగా ఉంది’’ అని జగన్‌ అన్నారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయా అని ప్రశ్నించగా.. మేం చేసే ప్రతి డిమాండ్‌, ప్రతి ప్రయత్నం అదేదిశగా ఉందని బదులిచ్చారు. సమన్వయకర్తలు దీక్షలు విరమించాలి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే నిరాహారదీక్షలు చేస్తున్న 175 అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు తక్షణమే దీక్షలు విరమించి బంద్‌లో పాల్గొనాలని పార్టీ కేంద్ర కార్యాలయం సూచించింది. కో-ఆర్డినేటర్లంతా వారి స్థానంలో పార్టీ కార్యకర్తలతో యధావిధిగా దీక్షలు కొనసాగింపజేయాలని, వారు బంద్‌ను పర్యవేక్షించాలని పార్టీ వర్గాలు కోరాయి.

బొత్స తో సి.ఎమ్.రమేష్ భేటీ ఆంతర్యం

Written By news on Thursday, October 3, 2013 | 10/03/2013

డిల్లీలోని జిఆర్ జి రోడ్డులోని క్వార్టర్ నెంబరు 30 బొత్స సత్యనారాయణ సతీమణి ఎంపి ఝాన్సీ అధికార నివాసం. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సిఎం రమేష్ ఆ ఇంట్లో ఉండగా మీడియా ప్రతినిధులు చూశారు.బెంజి కారులో వచ్చిన ఆయన మీడియా కంటపడకుండా వెళ్లడానికి విశ్వప్రయత్నం చేశారు. ఆ ఇంటి నుంచి 5 గంటల ప్రాంతంలో స్విప్ట్ కారులో అయిదుగురు బయటకు వెళ్లారని, ఆ కారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లిందని చెబుతున్నారు.ఖచ్చితంగా కేంద్ర మంత్రి మండలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపే సమయంలోనే వీరిద్దరు సమావేశం కావడంలో ఆంతర్యం ఏమిటని  వర్గాలు ప్రశ్నలోస్తున్నాయి.

http://kommineni.info/articles/dailyarticles/content_20131003_35.php

జగన్ కు సహకరించని కిరణ్, చంద్రబాబు

జగన్ కు సహకరించని కిరణ్, చంద్రబాబు
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి  సహకరించకపోవడంతో రాష్ట్ర విభజకు ఆ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రాష్ట్రాన్ని విభజిస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఈ రోజు ఆమోదం తెలిపింది. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైఎస్ఆర్ సిపి ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాష్ట్ర విభజన ప్రతిపాదనకు నిరసనగా ఈ పార్టీ ఎమ్మెల్యేలే మొట్టమొదటిసారిగా రాజీనామాలు చేశారు. అందరినీ రాజీనామా చేయమని కోరారు. అందుకు కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు ముందుకు రాలేదు. వారు రాజీనామా చేయలేదు. అప్పుడే వారు రాజీనామా చేసి ఉంటే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడి విభజన ప్రక్రియ ఆగి ఉండేది.

 విభజనకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోమని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ కోరారు. ఆయన ఆ లేఖను వెనక్కు తీసుకోలేదు. రాష్ట్రాన్ని విభజించడానికే చంద్రబాబు ప్రాముఖ్యత ఇచ్చారు. పార్టీ వైఖరి స్పష్టంగా చెప్పకుండా, లేఖను వెనక్కు తీసుకోకుండా కాలం వెళ్లబుచ్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని ఎవరు లేఖరాసినా పార్టీ అధ్యక్షుడుగా తాను మొదటి సంతకం పెడతానని వైఎస్ జగన్మోహన రెడ్డి చెప్పారు. దానికి కూడా చంద్రబాబు నాయుడు ముందుకు రాలేదు. వైఎస్ఆర్ సిపితోపాటు సిపిఎం, ఎంఐఎం కూడా విభజనను వ్యతిరేకిస్తున్నాయి. వాటికి తోడు  ప్రధాన రాజకీయ పార్టీలు కలిసి లేఖ రాసినా కొంతవరకు విభజన ప్రక్రియ ఆగి ఉండేది.

ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వైఎస్ఆర్ సిపి సలహాను పాటించలేదు. శాసనసభను సమావేశపరచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. కేంద్రం ఆమోదించిన తరువాత అటువంటి తీర్మానం చేసినా అంతగా ప్రయోజనం ఉండదని, ముందే తీర్మానం చేయాలని జగన్మోహన రెడ్డి కూడా కోరారు. శాసనసభను సమావేశపరచడానికి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ విధంగా ఆయన కూడా విభజనను ఆపడానికి సహకరించలేదు.

రాష్ట్ర విభజనను ఆపడానికి వైఎస్ఆర్ సిపి చేసిన ప్రయత్నాలకు సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపి ప్రజాప్రనిధులు సహకరించకపోవడంతో కేంద్రం రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన తరువాత వైఎస్ జగన్ చాలా ఉద్వేగాని లోనయ్యారు. ఆయనే మొదటిసారిగా స్పందించారు.  ఈ రోజు తనకు కలిగిన బాధ 16 నెలల జైలు జీవితంలో కూడా కలగలేదని చెప్పారు.  కాంగ్రెస్‌, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కుమ్మక్కై రాష్ట్రాన్ని అమ్మేశారని బాధపడ్డారు.  విభజనకు నిరసనగా పార్టీ తరఫున 72 గంటల బంద్‌కు పిలుపు ఇచ్చారు.

ఇప్పటికైనా సీమాంధ్రకు చెందిన మొత్తం 25 మంది లోక్‌సభ్యులు రాజీనామా చేస్తే తద్వారా కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు. అప్పుడైనా ప్రక్రియ ఆగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయంపై కోర్టులను ఆశ్రయిస్తామని జగన్ చెప్పారు. ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కూడా వైఎస్ఆర్ సిపి నిర్ణయించింది. ఇప్పటికైనా కాంగ్రెస్, టిడిపికి చెందిన సీమాంధ్ర  నేతలు జగన్ కు సహకరించి రాష్ట్రం విడిపోకుండా  సహకరిస్తారని ఆశిద్ధాం.

People will teach the Congress a fitting lesson, Jagan in payback mode

YSR Congress President YS Jaganmohan Reddy is his confident self, invoking the name of his father and God's grace, as he braces himself to lead the party to the 2014 General Elections. In an hour long conversation at his Lotus Pond home in Hyderabad, Jagan, 41, as he is popularly known, spoke to India Today Senior Editor Amarnath K. Menon on his party, poll plan and political rivals. Excerpts:

Q. What are the challenges you face as President of the YSR Congress on coming out after spending 16 months in jail?

A. We are pledged to carry out the goals in providing for a better life of people as enshrined in the policies and programmes that were initiated in the days of my father Dr YS Rajasekhara Reddy. Whether I am in or out of jail our party is working towards it and our opportunity to serve better will come soon. We are waiting for the 2014 elections.

Q. How do you propose to step up the Samaikyandhra campaign?
A. We have been in the forefront of the campaign against division of Andhra Pradesh. The CPI (M) and the All India Majlis-e-Ittehadul Muslimeen are the other parties that have consistently opposed division. We want more parties to come on board and will continuously strive for it. For this we are mounting pressure on other parties that matter in the Seemandhra region. (The 13 districts of coastal Andhra Pradesh and Rayalaseema regions are collectively called Seemandhra.) If there are more parties on our side there are better chances of stalling the plan to divide the state. For this we are taking up our own campaign as a political party. We have announced a detailed programme for October. At the same time, we are asking presidents of all political parties to sign a common letter which can be presented as our joint opposition to the proposed bifurcation. Unfortunately, the Congress has got into this as it is eager to get votes and seats while the TDP is apprehensive of losing votes and seats if it does not be with the Congress on its side. Everybody is ignoring the mass outpouring of protests by people from different walks of life onto the streets. We have sensed the people's mood and, therefore, demanded that the central government shelve the proposal even when the idea was mooted more than three years ago. Our MLAs resigned in protest, we appealed to the President of India and I sat on a hunger strike. We will do everything we can. But the most important thing is that we will need God on our side. I am not big enough to pull it off myself. We need God's blessings for help to shelve the proposal.

Q. What can this ultimately achieve for your party?
A. We were always ahead of all other parties in Seemandhra and that has been confirmed by internal and independent surveys. Our stand is based on our conscience. We believe division of the state brings with it issues relating to sharing of resources and possibly bitter inter - state conflicts. Sharing of water between riparian states will be one vexatious issue.  No matter what tribunals may order there will be continuous conflicts between states.  No less serious is finding funds after division considering sixty per cent of the current budget of Andhra Pradesh is raised as revenue in Hyderabad. From where will the money come for paying salaries and running establishments leave alone the several social welfare schemes. Without giving any thought to such issues, political gains and losses have propelled parties to favour bifurcation.

Q. Will you continue with the populist and subsidy schemes initiated by your father?

A. Yes. We will continue with everything and do it even better.

Q. In what time frame will you put a party structure in place?

A. It is already there. Did not NTR launch the party some seven months before the 1983 election? Tell me what party structure did NTR have when he was catapulted to power on sweeping the polls? Basically, structure is a byproduct of people's mood and people's support. Once that is there to be tapped all that you need is an election symbol they identify with. When compared to those days, the YSR Congress is better placed as we are able to sense the sentiments in each constituency. We have spent the last three and a half years tracking it and to bring the party where it is now.

Q. Are you open to welcome migrants in a big way from the Congress and the TDP?

A.  I am against inducting anybody and everybody. I will pick and choose when I think somebody is going to add value to my party.  Only then I will pick him or her. For me, any fresh face is always better because these aspirants do not come with any baggage but an internal desire to outperform others. But, at times, depending on the situation, we will have to field experienced persons. Considering God's grace is helping us ride a distinct wave in our favour we have already picked a few candidates.  Of them, we have also found some turn complacent. So, we are continuously tracking constituencies to identify popular and potential winners who work and will deliver. We are and will continue to be choosy.

Q. With whom will you have a pre - poll alliance?

A. (Smiles) None. By God's grace we do not have to depend on anybody .We will consider what like - minded parties like the CPI (M) and the AIMIM are interested in. We may accommodate them at some stage.

Q. Will you keep options about a post poll alliance open after the results are known?
A. I am secular. I have no doubt about it. Whatever other secular parties like the Communists, the JD (U) and others do I will also do. I will keep my options open. Why should I commit myself now?

Q. So, you are ruling out Narendar Modi, the BJP and the NDA?
A. Modi is to be appreciated for his administrative and governance skills. He needs to come on to the secular platform. That is the kind of politics my generation and the next generation knows and like. My dream is to see that every political party is secular. We are a maturing democracy. Religion is personal persuasion be it for a Muslim, a Christian, a Sikh, a Hindu or follower of any other. We have to wipe out the feeling of insecurity because of religion in anyone. This is why I would like to see Modi on a secular platform.

Q. Will you, if necessary, after the elections, join hands with the Congress?
A. Why don't you ask the Communists the same question? Why do we have to get into the arena which means nothing today?

Q. Do you still nurse the grouse against the Congress for the way the party treated you after your father's death?
A. Yes. The Congress party did not treat me well. I believe strongly in God. I read the Bible everyday. I pray twice. Every day when I finish reading and say the Lord's Prayer I am reminded that seeking vengeance is not ours. It is not right to nurse any heart burns. Let God in his wisdom show the way on forgiveness.

Q. Do you hold anyone in that party responsible for it?
A. I stopped holding anyone responsible or blaming anyone. I had no bad intent when I left the Congress. I had no other option but to leave.  Just because I am out of that party I will not even say that I was not offered power. The party did convey to me that I will be first inducted as a central minister and at some stage be made chief minister. I should be true to myself.  Where we differed was when they failed to comprehend and appreciate why I was going out to meet bereaved families in different districts. It was an emotional decision that I took soon after visiting the crash site twenty days after my father's death. There was no ulterior motive. But it led to misunderstanding and friction followed by cautions by many, including some well wishers, about being forced into political oblivion. They told me in no uncertain terms remember those words. They told me that they will also get my uncle to contest against me. They did. I stayed away from it for about six months. I was told everything will be done for me in political terms. I was at the crossroads and I decided to keep my word to the bereaved families. I discussed with my family - my mom, sister and my wife - and unmindful of repercussions decided to break out. I just pursued what my conscience told me and what my family endorsed whether others liked it or not. I resumed the visits. I realized that it will give me the satisfaction of having kept my word. Well that is what my father taught me. I did not imagine that it will bring me this far. Character and credibility is important in politics. I am sticking by it. God gave me the 5,45,000 vote majority - the highest in the 14th Lok Sabha -  though twenty ministers from the state did their best to get me defeated in the by - election. Earlier, when my father was chief minister I won with a much smaller 1, 80,000 margin. What I have always done is to follow my heart. It may be unconventional in politics but it will be so. Votes and seats should be a by-product of what you do.

Q. What would you do if the TDP pursues its plan to get your bail cancelled?

A. Basically, why is the TDP doing this? It is a politically inspired move. A Congress MLA who was later made a minister files a PIL in the Andhra Pradesh High Court just two months after I left the party and some 18 months after my father's death. Then, TDP joins in and files a petition. It is a case where they are striking at a dead man and his son who was then not in politics. It was because he left the Congress that the party along with the TDP pursued him by filing the PIL in court. Is this not political witch hunting? Both parties used different agencies to create a sensation each time I applied for bail.

Q. How will you counter allegations of corruption when they become shrill during electioneering?

A. It is simple. There is no case in what is being made a case in my case. Both the Congress and the TDP have come together to do this. The CBI files a case raids my house in 14 days and files a preliminary report. In a case against Chandrababu Naidu the CBI is probing the allotment of prime land in the heart of Hyderabad to build villas and a golf course not for any industry or to create any jobs. Literally it was to develop a private venture by a single entity and called the Emaar township. Yet, CBI which investigated Emaar did not summon Naidu. Then, you have the IMG Bharata Academy saga which is even worse. Chandrababu Naidu, though a caretaker chief minister at that time, without even referring to the state cabinet allots 800 acres of land in Hyderabad city at thruway prices to a dummy company. In that case, the Andhra Pradesh High Court ordered a CBI inquiry.  Even  when it was on for a four months Chandrababu Naidu went in appeal against it to the Supreme Court which referred it back to the High Court where he got it transferred to another bench and ultimately struck down. Though CBI had plenty of time it did not even summon Naidu even once before he could get all this done. Congress and Chandrababu Naidu have come together to share posts of RTI Commissioners. When it came to voting on the FDI legislation in the Rajya Sabha Chandrababu Naidu colluded with the Congress by getting its MPs to abstain. He supports the Congress party whenever it wants help. Even on the issue of dividing Andhra Pradesh the Congress took the decision and Naidu is supporting it while we are opposing it.  Their credibility is so low that people will teach them a fitting lesson.

Q. What is it that you promise the people of the state ahead of the elections?

A. What people want from me and I definitely see in it is that the system should change. They want politics with sincerity, politics with credibility. It is missing today. That they believe will come only from some who will challenge and change and also has character. By God's grace in every situation we faced, our credibility is not tarnished even though we were in difficulties and while I was in jail. We always showcased credible leadership.  We will do what we say. This what people appreciate in me. We will do it in such a way that we live after death. Believe me my dream is to have a photograph of my father adorn every home, I want to stay alive till then. This is what is driving me now. I have this passion. God will help me.

http://indiatoday.intoday.in/story/jagan-mohan-reddy-interview-people-will-teach-congress-a-lesson/1/312940.html







Popular Posts

Topics :