03 November 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Ambati Rambabu press meet on 09-11-13

Written By news on Saturday, November 9, 2013 | 11/09/2013

Jupudi Prabhakar press meet on 09-11-13

'సమైక్యాంధ్ర కోసం పోరాడుతోంది వైఎస్ ఆర్ సీపీ మాత్రమే'-గాదె

గుంటూరు : సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేస్తోంది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అన్ని పార్టీలు కలసి రావాలని కోరారు.
పార్టీలకు అతీతంగా నాన్ పొలిటికల్ జేఏసీగా ఏర్పడాలని గాదె వెంకటరెడ్డి పేర్కొన్నారు. అందరూ కలసి కట్టుగా ఉద్యమం కొనసాగిస్తే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అప్పుడు కావూరి, ఇప్పడు నల్లారి: అంబటి

అప్పుడు కావూరి, ఇప్పడు నల్లారి: అంబటివిస్తరించు & ప్లే క్లిక్ చేయండి
హైదరాబాద్: అప్పుడు కావూరి సాంబశివరావు  మంత్రి పదవి కోసం సమైక్యవాదం వినిపించినట్లే ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన సెటిల్మెంట్ కోసం ఈ వాదనను వినిపిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీఎం నిజంగా సమైక్యవాది అయితే సమైక్యరాష్ట్రం కోసం ఈ వంద రోజులు ఏం చేశారు? అని ప్రశ్నించారు.  కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని, జీవోఎం ఏర్పాటును ఎందుకు అడ్డుకోలేకపోయారు? అని అడిగారు. విభజన డ్రామాలో అన్ని పాత్రలు కాంగ్రెస్ పార్టీయే పోషిస్తుందని విమర్శించారు.

సీఎం కిరణ్ చేత పార్టీ పెట్టించి మళ్లీ కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని ఆశిస్తుందన్నారు. ఈ డ్రామానంతటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, తగిన బుద్ధి చెబుతారని అంబటి హెచ్చరించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్, కిరణ్ లు విభజన డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. విభజనకు కిరణ్ ఆమోదించినట్లు ఒక పక్క దిగ్విజయ్ చెబుతుంటే, మరో పక్క సీఎం మాత్రం ఇంకా తాను సమైక్యవాదినేనని చెబుతున్నారని విమర్శించారు.

పదవి ముఖ్యం కాదంటున్న సీఎం కిరణ్ జులై 30న ఎందుకు రాజీనామా చేయలేదు? అని  అంబటి ప్రశ్నించారు.  ఆ రోజే సీఎం పదవికి రాజీనామా చేసుంటే  రాష్ట్ర విభజన ప్రకటన వచ్చేదా? అని అడిగారు. వార్ రూమ్ లో పదవి కోసం కన్వీన్స్ అయిన సీఎం బయటకొచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నల్లారి నాటకంతో ప్రజలు క్షోభిస్తున్నారన్నారు.  కాంగ్రెస్ తెలుగు ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jagan, Bharathi pay tributes to YSR at Idupulapaya

చంద్రబాబుకు రాజకీయంగా యావజ్జీవ శిక్ష

'చంద్రబాబుకు రాజకీయంగా యావజ్జీవ శిక్ష'
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ప్రజలు రాజకీయంగా యావజ్జీవ శిక్ష విధించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు అన్నారు. ఆయన ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ రెండుసార్లు ప్రజలు తిరస్కరించిన చంద్రబాబు మళ్లీ అధికారం కావాలనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఆయనను అధికారానికి దూరంగా ఉంచడం వల్ల ఆయన  రాజకీయపరంగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నిజస్వరూపం దేశం మొత్తానికీ తెలిసిపోయిందని, అందుకే ఆయన దీక్షను ఢిల్లీలో ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు.

లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ చంద్రబాబుకు తబలా కొట్టడం సరికాదన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలను జేపీ ఎందుకు ప్రశ్నించడంలేదు? అని అడిగారు. రాష్ట్ర విభజనపై నిజాయతీ ఉంటే చంద్రబాబు, జేపీలు అసెంబ్లీని సమావేశపరచమని ఎందుకు అడగరు? సమైక్యాంధ్ర గురించి మాట్లాడటానికి చంద్రబాబూ నీకు దమ్ముందా? ఇంత మంది ప్రజలు వ్యతిరేకిస్తున్న విభజన నిర్ణయాన్ని నీవు ఎందుకు వ్యతిరేకించవు? అని జూపూడి ప్రశ్నించారు.

''చంద్రబాబుకు పిచ్చి ముదిరింది. అందుకే జగన్ పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూసి ప్రజలంతా బాబుకు పిచ్చి పట్టిందని నమ్ముతున్నారు. రోజూ కాంగ్రెస్ కొంగు చాటున రాజకీయాలు చేస్తున్నారు. జగన్ ప్రజాదరణ చూసి ఉలిక్కి పడుతున్నారు. నిజాయతీ రాజకీయాలు గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. నిజాయతీ రాజకీయాల కోసం జగన్ ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటున్నారు. అందుకే  జైల్లో ఉండి కూడా ప్రజల కోసం దీక్ష చేశారు. సమైక్యాంధ్ర కోసం నిజాయతీగా పోరాటం చేస్తున్నారు'' అని చెప్పారు.

ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద జగన్ నివాళులు

తండ్రి సమాధి వద్ద జగన్ ప్రత్యేక ప్రార్థనలు
ఇడుపులపాయ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జగన్, ఆయన సతీమణి భారతి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.  జగన్ రాక సందర్భంగా అక్కడకు వచ్చిన పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలను ఆయన పేరు పేరునా పలకరించారు. అనంతరం పులివెందుల బయల్దేరారు.  కాగా  సుదీర్ఘ విరామం తర్వాత జిల్లాకు వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో ఎర్రగుంట్లలో దిగిన ఆయన అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకున్నారు.

జననేతకు పాలమూరు జిల్లా ప్రజలు ఘనస్వాగతం

మహబూబ్‌నగర్ అర్బన్/షాద్‌నగర్ టౌన్, న్యూస్‌లైన్: జననేతకు పాలమూరు జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి పులివెందులకు రైల్లో బయలుదేరిన వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నీరా‘జనం’ పలికారు. శుక్రవారం రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో తమ అభిమాన నేత వస్తున్నారని తెలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు సాయంత్రం 8 గంటల నుంచే ఆయా రైల్వేస్టేషన్ల వద్ద ఆయన రాకకోసం నిరీక్షించారు. రైల్వేబోగీ నుంచి బయటికి వ చ్చిన జననేత జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలకు అభివాదం చేశారు. తనదైన శైలిలో చిరునవ్వుతో ఆయన కనిపించగానే జగన్నినాదాలతో రైల్వేస్టేషన్లు మార్మోగాయి. జిల్లాలోని షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్  తదితర ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు కలవగా వారి పట్ల తనకున్న ఆప్యాయత, అనురాగాన్ని వ్యక్తం చేశారు.
 
 పాలమూరు పట్టణంలో జగన్‌మోహన్‌రెడ్డి రాక కోసం పార్టీ నాయకులతో పాటు సామాన్య జనం కూడా భారీసంఖ్యలో తరలి వచ్చి ఘన స్వాగత ం పలికారు. జిల్లాకేంద్రానికి రాత్రి 10.25 గంటలకు జగన్‌మోహన్‌రెడ్డి రాగా, ఆయనకు పలువురు నేతలు బొకేలు, పుష్చగుచ్ఛాలు అందించి తమ అభిమానం చాటుకున్నారు. ‘జై జగన్, వచ్చాడు.. వచ్చాడు పులిబిడ్డ వచ్చాడు’ అంటూ చేసిన నినాదాలు , కేరింతలతో రైల్వేస్టేషన్ దద్దరిల్లింది. హైదారాబాద్ నుంచి అదే రైలులో వచ్చిన ప్రయాణికులు జగన్నను చూసేందుకు పోటీపడ్డారు.
 
 అంతకుముందు శంషాబాద్ నుంచి షాద్‌నగర్ వరకు వైఎస్‌ఆర్ సీపీ షాద్‌నగర్ నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, నాయకులు శేఖర్ పంతులు జగన్‌తో వెంట రైల్లో ప్రయాణించారు. షాద్‌నగర్‌లో వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రచారకులు రమాదేవి, నాయకులు ఖాదర్‌ఘోరీ, ఇబ్రహీం, జంగయ్య, శర్ఫోద్దీన్, షఫీ, అద్నమ్, అంజి, దామోదర్ యాదవ్ తదితరులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ నేతలు రవిప్రకాశ్,  మహ్మద్ వాజిద్, రాశెద్ ఖాన్ , హైదర్ అలీ, సర్దార్, అంతయ్య,  కురుమూర్తి, అంజాద్ అలీ, ముజాహిద్, మహమూద్ అలీ సనా, చిన్నా, సాదిఖ్ ఖురేషీ, సురేశ్, కామేశ్ తదితరులు పాల్గొన్నారు.

16 నుంచి 26 దాకా దేశమంతా పర్యటిస్తా

దేశవ్యాప్తంగా సమైక్య యాత్ర: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
*16 నుంచి 26 దాకా దేశమంతా పర్యటిస్తా: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ముఖ్య రాష్ట్రాలకు వెళ్లి పార్టీల మద్దతు కోరతాం
వాటినీ విభజించే ప్రమాదముందని చెబుతాం
 వైఖరి మార్చుకోవాలని బీజేపీ తదితరాలను కోరతాం
సహకరించాలని లెఫ్ట్ పార్టీలకు విజ్ఞప్తి చేస్తాం
జీవోఎం భేటీకి మా పార్టీ నుంచి మైసూరా వెళ్తారు
నాలుగు తిట్లు తిట్టి, వాళ్లకు గట్టిగా గడ్డి పెట్టి వస్తారు
సమైక్య తీర్మానం చేసిన 9,368 పంచాయతీలకు సలామ్
26 నుంచి జగన్ ‘సమైక్యాంధ్రప్రదేశ్’ యాత్ర
తెలంగాణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి దేశవ్యాప్తంగా పర్యటించి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నవంబర్ 16 నుంచి 26 వరకు ఆయా రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ పర్యటించనున్నట్టు తెలిపారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు మైసూరారెడ్డి, జూపూడి ప్రభాకరరావు, దాడి వీరభద్రరావు, గట్టు రామచంద్రరావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి ప్రతి ముఖ్యమైన రాష్ట్రానికీ వెళ్లి.. అక్కడి రాజకీయ పక్షాలన్నింటినీ కలుస్తామని చెప్పారు.
 
  బీజేపీ వంటి ప్రతి ముఖ్య పార్టీనీ కలిసి రాష్ట్ర విభజనపై వారి వైఖరిని మార్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామని వెల్లడించారు. అలాగే కమ్యూనిస్టుల వంటి ముఖ్యమైన పార్టీలను కూడా తమకు సహకరించాల్సిందిగా కోరతామన్నారు. దేశంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లు, ఆ తర్వాతి ఎన్నికల్లో ఏదైనా రాష్ట్రం తమకు రాదని భావిస్తే, దాన్ని విడదీసే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘ఇలాంటి అడ్డగోలు ప్రక్రియ మన రాష్ట్రంతోనే ప్రారంభమైంది. ఇదిక్కడితోనే ఆగదు.
  

ఢిల్లీలో అధికారం చేపట్టినవారు తర్వాత ఏ రాష్ట్రంలోనైతే వారికి సీట్లు రావని, బలహీనంగా ఉన్నామని భావిస్తారో అక్కడల్లా ఇలాంటి అడ్డగోలు కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకుంటే.. రేపటి రోజున కేంద్రంలో అధికారంలో ఉన్నవారు తమ ప్రయోజనాల కోసం ఇలాంటి విధానాన్నే ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసే ప్రమాదం ఉందన్న విషయాన్ని అన్ని రాష్ట్రాల నేతలకు వివరిస్తా. ఇవాళ మీరు వ్యతిరేకించకపోతే మీ వరకు వచ్చేసరికి ఎవరూ కనపడరని నచ్చజెబుతా’’ అని వివరించారు. అదేవిధంగా నవంబర్ 26 నుంచి సమైక్యాంధ్రప్రదేశ్ నినాదంతో రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. ఏయే ప్రాంతాల్లో పర్యటిస్తానన్న వివరాలను పార్టీ నేతలు తర్వాత వెల్లడిస్తారని పేర్కొన్నారు. తెలంగాణలోనూ పర్యటన కొనసాగుతుందా అని విలేకరులు ప్రశ్నించగా కచ్చితంగా ఉంటుందని బదులిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమైక్యాన్ని చాటుతూనే ఓదార్పు కుటుంబాలను పరామర్శిస్తూ పర్యటన సాగుతుందని వెల్లడించారు.
 
 జీవోఎం భేటీకి ఆహ్వానం అందింది
 వివిధ రాజకీయ పార్టీలతో జీవోఎం తలపెట్టిన సమావేశానికి వైఎస్సార్‌సీపీని ఆహ్వానిస్తూ పంపిన లేఖ శుక్రవారం తమకు అందిందని జగన్ తెలిపారు. తాము కచ్చితంగా ఆ భేటీకి వెళతామని, పార్టీ ప్రతినిధిగా మైసూరారెడ్డిని పంపుతున్నామని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న పార్టీ వాదననే ఆ సమావేశంలో గట్టిగా చెప్పమని మైసూరా అన్నకు చెబుతా. అంతేకాదు నాలుగు తిట్లు తిట్టి.. వారికి బుద్ధి వచ్చేలా కాస్త గడ్డి పెట్టి రమ్మని కూడా చెప్పి పంపుతా’’ అని వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గ్రామసభల్లో తీర్మానం చేసి కేంద్ర హోం శాఖకు పంపిన 9,368 గ్రామ పంచాయతీల సభ్యులకు జగన్  కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సమైక్యానికి మద్దతుగా 48 గంటల పాటు నిర్వహించిన రహదారుల దిగ్బంధన కార్యక్రమాన్ని పోలీసుల జులం మధ్య కూడా విజయవంతం చేసినవారికీ, సహకరించిన ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
 
 నిమిషాల్లోనే విభజన నిర్ణయాలా?: విభజన ప్రక్రియకు సంబంధించి నివేదికల పేరుతో ఢిల్లీ నుంచి రోజుకోలా లీకులు వెలువడుతుండటంపై జగన్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారి తీరు బాధ్యతారాహిత్యంతో.. ‘మాకు ఓట్లూ, సీట్లూ కావాలి, వాటి కోసం ఏదైనా చేస్తాం, ఆ తర్వాత మీ చావు మీరు చావండి’ అన్నట్టుగా ఉందని దుయ్యబట్టారు. విభజన ప్రక్రియకు సంబంధించిన కీలక నిర్ణయాలకు కూడా నిమిషాల్లో పరిష్కారం చూపిస్తోంటే ఆశ్చర్యమేస్తోందన్నారు. జల వనరులకు సం బంధించి జైరాం రమేశ్ ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. ‘‘సాగునీటికి సంబంధించి జైరాం రమేశ్ ఇచ్చిన నివేదికను పేపర్లో చదివా. జల వనరుల మంత్రి అధ్యక్షతన ఒక మండలి పెడతారట. వాటిలో రెండు రాష్ట్రాలకు చెందిన సీఎంలు, సెక్రటరీలు ఉంటారట. ఆ మం డలి కింద బోర్డులు వేస్తారట. ఈ సందర్భంగా వారిని ఒకటి అడగదలుచుకున్నా. దేశంలో 28 రాష్ట్రాల్లో ఏ ఒక్కరికీ లేనిది మా రాష్ట్రంలోనే ఇలా ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పటికే కృష్ణా నదీజలాల వినియోగంలో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక తమ ప్రాజెక్టుల అవసరాలు తీరాకే కిం దకు వదులుతున్నాయి.
 
  రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడే నీరు వదలడం లేదు. మీరు చెబుతున్న మండలిని ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో పెట్టి నీళ్లెం దుకు ఇవ్వడం లేదు?’’ అని ప్రశ్నించారు. మన రాష్ట్రంలోనే మండలి ఏర్పాటు చేసి దాని కింద బోర్డులంటే ఇకపై మిగులు జలాలు వాడుకునే పరిస్థితి ఉండదని, వాటిపై కట్టిన ప్రాజెక్టులన్నీ శూన్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పై రాష్ట్రాలు మాత్రం మిగులు జలాలతో ప్రాజెక్టులు పూర్తి చేసుకుం టాయి. మన రాష్ట్రంలో మాత్రం ఈ మండలి ఉంటుంది కాబట్టి దీని ఆధ్వర్యంలోనే అన్నీ జరగాలనే షరతుతో ప్రాజెక్టు నిలిపేస్తారు. దీంతో రాష్ట్రం ఎడారి అవుతున్నా చూస్తూ ఊరుకోవాల్సిందే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉత్పన్నం కానుంది. నిజంగా వీళ్లు ఇస్తున్న తీర్పును చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది’’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
 
 బాబూ.. విభజన లేఖను వెనక్కి తీసుకో!
 రాష్ట్రం విడిపోతే అన్ని రకాలుగా నష్టపోయే ప్రమాదమున్నందున టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి, విభజనకు అనుకూలంగా గతంలో ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు. ఈ విషయంలో చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దని హితవు పలికారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఏకం కావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం నష్టపోయే పరిస్థితి ఉన్న ఈ సమయంలో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ‘‘అందరం ఏకమైతేనే విభజనను ఆపగలుగుతాం.
 
 రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నా. అంతా ఒక్కటవాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అందరం బాగుపడతాం. దేశంలో హిందీ తర్వాత రెండో అతి పెద్ద జాతిగా ఉన్న తెలుగువారం విచ్ఛిన్నమైతే ఎవరూ పట్టించుకునే పరిస్థితి ఉండదు. రూ.1.75 లక్షల కోట్ల బడ్జెట్‌తో దేశంలో మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న రాష్ట్రాన్ని విడగొడితే భవిష్యత్తు అంధకారమవుతుంది’’ అని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటనకు కోర్టు నుంచి అనుమతి రాలేదు కదా అని విలేకరులు ప్రస్తావించగా.. కాంగ్రెస్, సీబీఐ ఒక్కటై అడ్డుకోవచ్చు గానీ న్యాయస్థానాలు వాళ్ల చేతుల్లో లేవని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. న్యాయస్థానాల పట్ల తనకు నమ్మకముందని, వారు అనుమతి ఇస్తారనే భావిస్తున్నట్టు చెప్పారు.

ఇడుపులపాయ చేరుకున్న జగన్

ఇడుపులపాయ చేరుకున్న జగన్
ఇడుపులపాయ : జననేతకు వైఎస్ఆర్  జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి పులివెందులకు  వచ్చిన వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నీరా'జనం' పలికారు. 20 నెలల సుదీర్ఘ ఎడబాటు అనంతరం జగన్ శనివారం పులివెందులలో అడుగుపెట్టారు. సరిగ్గా 2012 ఫిబ్రవరి 11న రెండురోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇడుపులపాయ, పులివెందులలో గడిపారు. తర్వాత సీబీఐ కేసుల నేపథ్యంలో అరెస్ట్ కావటం.... ఈ ఏడాది సెప్టెంబర్ 24న కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం జగన్ ఈరోజు ఉదయం పులివెందుల విచ్చేశారు. హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో ఎర్రగుంట్లలో దిగి అక్కడ నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. అనంతరం వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించి ఆ తర్వాత పులివెందులకు వస్తారు. ఆదివారం కూడా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారు.

వైఎస్ఆర్ సీపీ టీం చేసిన ఒక పోస్ట్ అర్థాన్నే మార్చిన లోకేష్

Written By news on Friday, November 8, 2013 | 11/08/2013

ప్రజలవద్దకు వెళ్ళడం కంటే ట్విట్టర్ లోనే ఎక్కువగా సమయం గడిపే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పేస్ బుక్ లో వైఎస్ఆర్ సీపీ టీం చేసిన ఒక పోస్ట్ అర్థాన్నే లోకేష్ మార్చినట్టుగా స్పష్టంగా అర్ధమవుతుంది.

వైఎస్ఆర్ సీపీ టీం చేసిన పోస్ట్ ఇలా ఉంది: “చంద్రబాబు సోనియా కోసం ఇటలీ భాష లో ఒక పదాన్ని వాడారు. దాని అర్ధం ‘కదలిక లేక ఉండడటం’. అసలు ఆ పదం చంద్రబాబు నాయుడుకు సరిగ్గా సూట్ అవుతుంది ఎందుకంటే 100 రోజులుగా ఉద్యమం జరుగుతున్నా చలనంలేకుండా ఉన్నాడు కాబట్టి”.

లోకేష్ దీనికి విపరీత అర్ధాలు తీసినట్టుగా ఉంది. ట్విట్టర్ లో ఈ విధంగా కామెంట్ చేశాడు “తెలుగుదేశం పార్టీ ఆరోపణల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీని సమర్ధించారు. తమ నాయకుడికి బెయిల్ పొందడానికి వారు తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని సోనియా వద్ద తాకట్టు పెట్టారు”.

అయితే పేస్ బుక్ పోస్టులో లోకేష్ చివరివరకు చదివితే అతనికి బాగా అర్ధం అయి ఉండేదని వైఎస్ఆర్ సీపీ పేస్ బుక్ శ్రేణులు అంటున్నారు. ‘ఆంధ్రపదేశ్ ను అడ్డంగా నరికింది కాంగ్రెస్, చంద్రబాబు లేఖే గండ్ర గొడ్డలి, అడ్డుకుందాం ఈ దుర్మార్గాన్ని”. మరి ఇందులో సోనియా గాంధీని వైఎస్ఆర్ సీపీ వాళ్ళు ఏ విధంగా సమర్ధించారో లోకేష్ కే తెలియాలి!


వైఎస్ఆర్ సీపీ టీం చేసిన పోస్ట్:


YS Jagan press meet on 08-11-13

రాష్ట్ర సమైక్యత కోసం 16 నుంచి 26 వరకు దేశవ్యాప్త పర్యటన: జగన్

రాష్ట్ర సమైక్యత కోసం 16 నుంచి 26 వరకు దేశవ్యాప్త పర్యటన: జగన్విస్తరించు & ప్లే క్లిక్ చేయండి
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే లక్ష్యంతో ఈనెల 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. 26వ తేదీ నుంచి రాష్ట్రంలో పర్యటిస్తామన్నారు. అత్యంత బాధ్యతారహితంగా రాష్ట్రాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, కేవలం వారం రోజుల్లోనే పరిష్కారాలు కూడా చూపించేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో అధికారం ఉన్నవాళ్లు, తమకు భవిష్యత్తులో అధికారం రాదనుకున్న రాష్ట్రాలన్నింటినీ అడ్డగోలుగా విభజించడానికి శ్రీకారం చుడుతున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం సాయంత్రం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర జిల్లాల్లోని 9,368 గ్రామ పంచాయతీలలో గ్రామసభల ద్వారా సమైక్య తీర్మానాలు చేసి కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపామని, అలా తీర్మానాలు చేసిన పంచాయతీ సర్పంచులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఆయన చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి...
'' రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వేలమంది కార్యకర్తలు అరెస్టవుతున్నా, పోలీసు జులుంను తట్టుకుని రోడ్డెక్కి 48 గంటల పాటు రహదారుల దిగ్బంధం చేసిన ప్రతి సోదరుడికీ చేతులు జోడించి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. దీనికి సహకరించిన అన్ని వర్గాలు, ప్రజలకు కూడా చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా. ఈవాళ రకరకాలుగా పేపర్లలో చూశాం. జైరాం రమేష్ నివేదికలట, ఆ నివేదికలట, ఈ నివేదికలట. రోజుకో నివేదిక, రోజుకో లీకు చూస్తూ ఉన్నాం. వీళ్లు చేస్తున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. వారానికి అటూ ఇటూ తిరగకముందే ఏకంగా పరిష్కారాలు చూపిస్తున్నారు. బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. ఓట్లు, సీట్లు మాకు కావాలి. వాటికోసం మీ నెత్తిన వేసేస్తాం, తర్వాత మీ చావు మీరు చావండి అంటున్నారు. వాళ్లు చూపించే పరిష్కారాలు చూడండి..
జలవనరుల శాఖ మంత్రి అధ్యక్షతన ఓ మండలి పెడతారట. వాటిలో ఇద్దరు ముఖ్యమంత్రులు, సెక్రటరీలు ఉంటారట. ఆ మండలి కింద బోర్డులు వేస్తారట. మన రాష్ట్రానికి మాత్రమే ఇది ఉంటుందట. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేనప్పుడు ఇక్కడే ఎందుకలా చేస్తున్నారు? మండలి అని మీరు చెబుతున్న ఈ కార్యక్రం చేయాలనుకుంటున్నారు? పైన ఉన్నమహారాష్ట్ర, కర్ణాటకకు కూడా ఇలాంటి మండళ్లు పెట్టి మన రాష్ట్రానికి ఎందుకు నీళ్లు సరిగా ఇవ్వట్లేదు? అక్కడ ఏమీ పెట్టరు. పైన మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక దయదలిస్తే మనకు నీళ్లొస్తాయి. అదంతా చాలనట్లు మన రాష్ట్రానికే ఎక్కడా లేనట్లుగా మండలి, బోర్డులు అంటున్నారు. దాంతో మన రాష్ట్రం పూర్తిగా ఎడారి అయిపోయి, రైతన్న పరిస్థితి దారుణంగా మారుతుంది. పై రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, వాళ్లు అన్నిరకాలుగా నీళ్లు వాడుకోవచ్చు. మన రాష్ట్రంలో మాత్రం ఈ మండలి ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి, ప్రాజెక్టులు కట్టకూడదు, రాష్ట్రం ఎడారి అవుతున్నా చూస్తూ ఊరుకోవాలి.

దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రాన్ని విడగొట్టే ప్రపయత్నం చేస్తున్నారు. 274 స్థానాలతో ఎవరైనా ఢిల్లీలో అధికారంలో ఉంటే, ఏ రాష్ట్రంలో అధికారం రాదనుకుంటే ఆయా రాష్ట్రాలను వాళ్లు విడగొట్టాలనుకుంటున్నారు. ఈ విభజన ఆంధ్ర రాష్ట్రంతోనే ఆగదు. అధికారంలో ఉన్నవాళ్లు ఏ రాష్ట్రంలోనైనా విభజన చేస్తారు. బలహీనంగా ఉన్నచోటల్లా అధికారంలో ఉన్నవాళ్లు విడగొడుతూనే పోతారు.

చంద్రబాబు విభజన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దు. కిరణ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా. మోసం చేయద్దు. నష్టపోయే పరిస్థితి ఉంది. దారుణంగా ఉన్నాం. మంత్రుల బృందం (జీవోఎం) సమావేశానికి వస్తారా అని ఈరోజే ఓ లేఖ వచ్చింది. కచ్చితంగా ఆ సమావేశానికి పార్టీ ప్రతినిధిగా మైసూరా రెడ్డి గారినే పంపిస్తాను. సమైక్యంగా ఉంచాలని గట్టిగా చెప్పడమే కాదు, వాళ్లను నాలుగు తిట్లు తిట్టి, బుద్ధి వచ్చేలా చెప్పమంటాను.

16వ తేదీ నుంచి దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు కూడా వెళ్లే కార్యక్రమం కూడా మొదలుపెడతా. ప్రతి ముఖ్యమైన రాష్ట్రానికీ వెళ్లి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తా. బీజేపీ నుంచి కమ్యూనిస్టు పార్టీల వరకు ప్రతి ముఖ్యమైన పార్టీకి కూడా సమైక్యత కోసం సహకరించాలని కోరతా. 16 నుంచి 26వ తేదీ వరకు ఆయా రాష్ట్రాలు, ఢిల్లీకి వెళ్లి అందరినీ కలుస్తా. ఆంధ్ర రాష్ట్ర విభజనను చూస్తూ ఊరుకుంటే రేపు మీ రాష్ట్రాల్లో కూడా ఇదే జరుగుతుంది, ఈరోజు మీరు వ్యతిరేకించకపోతే రేపు మీదాకా వచ్చినప్పుడు మీరు వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరని వాళ్లకు నచ్చజెబుతా.

దేశంలో హిందీ తర్వాత రెండో అతి పెద్ద భాష తెలుగే. మనంతట మనం విచ్ఛిన్నం అయిపోతే ఆ తర్వాత పట్టించుకునేవాడు కూడా ఎవరూ ఉండడు. 28 రాష్ట్రాల్లో మనది మూడో స్థానం. బడ్జెట్ రీత్యా చూసినా కూడా దేశంలో మనది మూడోస్థానం. ఇప్పుడు మనం వెనకడుగు వేస్తే, రాష్ట్రం విచ్ఛిన్నం అయిపోతే భవిష్యత్తు అంధకారమేనని పేరుపేరునా చెబుతున్నా. సమైక్యయాత్ర చేస్తూ, ఓదార్పు కోసం కుటుంబాలను కూడా పలకరిస్తా. సీబీఐ వాళ్లు, కాంగ్రెస్ వాళ్లు ఒకటే అయినా, న్యాయ స్థానాలు మాత్రం వీళ్ల చేతులో లేవు కాబట్టి అనుమతి వస్తుందని భావిస్తున్నా'' అని వైఎస్ జగన్ తెలిపారు.

'విభజన పాపంలో చంద్రబాబు భాగస్వామి'

'విభజన పాపంలో చంద్రబాబు భాగస్వామి'

సమైక్య ఉద్యమం దృష్టి మరల్చేందుకే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. శుక్రవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ ప్రసంగిస్తూ... చంద్రబాబు కేసులకు భయపడే యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీని విమర్శించడం లేదని వ్యాఖ్యానించారు.

 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాపం చేశారని,  ఆ పాపంలో చంద్రబాబు కూడా భాగస్వామి అని పద్మ పేర్కొన్నారు. తన నీడను కూడా నమ్మని మనిషి చంద్రబాబు నాయుడు అని వాసిరెడ్డి పద్మ ఈ సందర్బంగా ఎద్దేవా చేశారు.

టీడీపీ టిక్కెట్‌ ఇస్తే పోటీచేస్తా: జేసీ

టీడీపీ టిక్కెట్‌ ఇస్తే పోటీచేస్తా: జేసీ
అనంతపురం: రాష్ట్ర మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖాయమయింది. టీడీపీలో చేరుతున్నట్టు జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచనప్రాయంగా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ ఇస్తే పోటీచేస్తానని తన మనసులోని మాటను బయటపెట్టారు. టిక్కెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో దిగుతానని తెలిపారు. అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి తాను టీడీపీ అభ్యర్థిగా పోటీచేయడం ఖాయమని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంతకుముందు సన్నిహితుల వద్ద స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ప్రభాకర్‌రెడ్డి సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్ వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అనుకూలంగా నిర్ణయంగా తీసుకోవడంతో ఆ పార్టీలో ఉంటే మనుగడ కష్టమని జేసీ సోదరులు భావిస్తున్నారు. దీంతో పార్టీ మారాలని వారు నిర్ణయించుకున్నట్టు సమాచారం. టీడీపీలో చేరడానికి జేసీ సోదరులు ముహూర్తాన్ని ఖరారు చేసే పనిలో నిమగ్నమయినట్టు తెలుస్తోంది.

గుంటూరు జిల్లాలో టీడీపీకి, విజయనగరం జిల్లాల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్‌

టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు భారీ షాక్!
హైదరాబాద్ : గుంటూరు జిల్లాలో టీడీపీకి, విజయనగరం జిల్లాల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలింది. తెనాలి టీడీపీ సీనియర్‌ నేత, దివంగత మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ తనయుడు శివకుమార్‌ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. తెనాలి నియోజకవర్గంలో టీడీపీ కీలకనేతగా శివకుమార్‌ వ్యవహరిస్తున్నారు. శివకుమార్‌కు తెనాలిలో ప్రముఖ విద్యాసంస్ధల ఛైర్మన్‌గా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది.
asn logo

లోటస్‌పాండ్‌లో శివకుమార్‌తో పాటు ఆయన ముఖ్య అనుచరులు కూడా జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఇదిలాఉంటే పీసీసీ అధ్యక్షుడు సొంత జిల్లా విజయనగరంలో కాంగ్రెస్‌ పార్టీకి... బొత్సా సత్యనారాయణకు ఆ జిల్లా నేత షాక్‌ ఇచ్చారు. బొత్సా ముఖ్య అనుచరుడు, చీపురుపల్లి కాంగ్రెస్‌ కీలకనేత మీసాల వరహాలనాయుడు కూడా ఈ రోజే జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. వరహలనాయుడు సతీమణి సరోజిని ఇటీవలే ఇండిపెండెంట్‌గా పోటీచేసి చీపురుపల్లి మేజర్‌ పంచాయితీ సర్పంచ్‌గా భారీ మెజార్టీతో గెలుపొందారు.

ఆంధ్ర ప్రజలను అవమానిస్తున్న కేంద్రం

 https://www.facebook.com/ysrcpofficial
ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కేంద్రం అవమానిస్తోందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం ప్రారంభమై నేటికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా అన్నట్లు గురువారం నాడు కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) సమావేశం నిర్వహించి, రాష్ట్రాన్ని ఏ విధంగా విభజించాలని, ఏయే అంశాలపై దృష్టి సారించాలని చర్చించడం ఏమిటని నిలదీసింది. విభజనకు అన్ని విధాలా సహకరిస్తూ‌ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, లేఖ ఇచ్చి వెనక్కి తీసుకోని చంద్రబాబు మద్దతు కారణంగానే కేంద్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా దూకుడుగా ముందుకు వెళుతోందని దుయ్యబట్టింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు, ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

 సీమాంధ్ర ప్రజలు, విద్యార్థులు, కుల సంఘాల వారందరూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఉద్యమిస్తున్నారని శోభా నాగిరెడ్డి తెలిపారు. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమాన్ని తలపిస్తోందని ఆమె అభివర్ణించారు. రాష్ట్రంలో దాదాపు 60 శాతం మంది ప్రజలు రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా లేదని ఆమె నిప్పులు చెరిగారు. ఉద్యమాలను గుర్తించే పరిస్థితి లేని అహంకారంతో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధి గురించి గాని, మెజారిటీ ప్రజల అభిప్రాయాలను గాని పట్టించుకోకుండా రాయల తెలంగాణను తెర మీదికి తీసుకువస్తున్న వారిని శోభా నాగిరెడ్డి తూర్పారపట్టారు. 

కేవలం సొంత రాజకీయ లబ్ధి కోసమే విభజనను కేంద్రం వేగంగా ముందుకు తీసుకువెళుతోందని ఆరోపించారు. కర్నూలు, అనంతపురంలను విభజించి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించే హక్కు జేసీ దివాకరరెడ్డి, టీజీ వెంకటేష్‌, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన మరికొందరు, ఎఐఎం ఒవైసీకి గాని ఎవరిచ్చారని ప్రశ్నించారు. మొత్తం అన్ని జిల్లాలను కలిపి తెలంగాణ అని పేరుపెట్టి సమైక్యంగా ఉంచాలని ఎందుకు డిమాండ్‌ చేయలేకపోతున్నారని నిలదీశారు. రాయలసీమలో గెలిచే అవకాశం లేని వారు రాయల తెలంగాణ అంశాన్ని తెస్తున్నారని విమర్శించారు.

 జగన్మోహన్‌రెడ్డి అనే ఒకే ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక ఇలాంటి రకరకాల డిమాండ్లను తెస్తున్నారన్నారు. ఒక సమస్యను పరిష్కరించమని కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే.. రాష్ట్రంలో రకరకాల సమస్యలు తీసుకువస్తున్నదని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. ప్రాంతాలు, జిల్లాల మధ్య విభేదాలు సృష్టించి, అశాంతి, అభద్రత కల్పించిందన్నారు. దివాకరరెడ్డికి గారి మరెవ్వరికైనా గాని రాయలసీమను విభజించమని అడిగే హక్కు లేదన్నారు. సొంత ప్రయోజనాల కోసం ఒక ప్రాంతం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ఆమె అన్నారు

YSRCP 2 days road blockade against state division successful

పర్యటనకు అనుమతించాలన్న జగన్ పిటిషన్ 12కు వాయిదా

Written By news on Thursday, November 7, 2013 | 11/07/2013

పర్యటనకు అనుమతించాలన్న జగన్ పిటిషన్ 12కు వాయిదా
హైదరాబాద్ : సమైక్యాంద్రకు మద్దతు కూడగట్టేందుకు తాను పశ్చిమబెంగాల్ తో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉందని, అందువల్ల బెయిల్ షరతులను ఆ మేరకు సడలించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సీబీఐ కోర్టు ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది.

తన బెయిల్ షరతులను సడలించిన సీబీఐ ప్రత్యేక కోర్టు... రాష్ట్రవ్యాప్తంగాను, ఢిల్లీ వెళ్లేందుకు మాత్రం అనుమతిస్తూ గతనెల 30న ఉత్తర్వులు జారీచేసిందని జగన్ తన పిటిషన్ లో తెలిపారు. అయితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా జాతీయ పార్టీల నేతలను, పార్లమెంట్ సభ్యులను కలిసి మద్దతు కూడగట్టాల్సి ఉందని వివరించారు. పార్లమెంట్ సభ్యునిగా నియోజకవర్గంతో పాటు పార్టీ అధ్యక్షునిగా ప్రజలకు సేవలు అందించే హక్కును కాలరాయకూడదన్నారు. తనపై సీబీఐ మోపినవన్నీ ఆరోపణలేనని, నేరం రుజువు కాలేదని తెలిపారు. కోర్టు విధించిన షరతులను పాటిస్తానని, రాజకీయ కారణాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో పర్యటించేందుకు వీలుగా బెయిల్ షరతులు సడలించాలని విజ్ఞప్తి చేశారు.

Bhumana Karunakar Reddy conducts road blockade in Tirupati

YS Avinash Reddy conducts road blockade in Pulivendula

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు అరెస్టు

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు అరెస్టు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రెండో రోజూ బంద్ పాటిస్తున్న ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఎన్ హెచ్ 9 ను దిగ్బంధ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేత జోగి రమేష్, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. భీమవరంగట్టు వద్ద సామినేమి ఉదయభానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా లోని పోరుమామిళ్లలో 100 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. తిరుపతిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల వైఖరిని వ్యతిరేకిస్తూ పీఎస్ ఎదుట వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
 
నెల్లూరులోని సూళ్లూరుపేటలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త సంజీవయ్య అరెస్ట్‌ చేయగా, కనపర్తిపాడు వద్ద కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌ చేశారు.పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం సిద్దాంతం వద్ద ఎన్ హెచ్ 16 దిగ్బంధనంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కూనపరెడ్డి వీర రాఘవేంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలోని గొల్లపూడిలో వైఎస్సార్ సీపీ నేత జలీల్‌ఖాన్‌ అరెస్ట్‌ చేయగా, తూర్పు గోదావరి జిల్లాలోని  అమలాపురంలో NH-216 దిగ్బంధన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొల్లా బాబురావు సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు.


కాగా,  వైఎస్సార్ సీపీ వరుసుగా రెండో రోజు కూడా నిరసన కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. వైఎస్సార్ జిల్లా గద్వేలి-కడప హైవే దిగ్బంధ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలోని వేమూరు వద్ద తెనాలి-రేపల్లే హైవే దిగ్బంధించగా, గుంటూరు- అమరావతి హైవే దిగ్బంధించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో ఎన్ హెచ్ 214 నిర్భందించగా, ఏలూరు-రాజమండ్రి హైవేను కూడా దిగ్బంధించారు. అనంతపురం-కడప హైవే దిగ్బంధించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రాష్ట్రాన్ని యధావిధిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.

సమైక్య నినాదాలతో హోరెత్తిన రోడ్లు

దారులన్నీ బంద్
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం.. ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు
సమైక్య నినాదాలతో హోరెత్తిన రోడ్లు.. కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్
రోడ్లపైనే వంటావార్పులు, మానవహారాలు, వినూత్న నిరసనలు
విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ఆందోళనకు ప్రజల మద్దతు
వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తల అరెస్టులు
నేడూ కొనసాగనున్న దిగ్బంధనం

 
సాక్షి నెట్‌వర్క్:
సమైక్యాంధ్ర నినాదాలతో బుధవారం సీమాంధ్ర జిల్లాల్లోని జాతీయ, రాష్ట్ర రహదారులు హోరెత్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళనలతో రహదారులన్నీ స్తంభించాయి.  వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో రోడ్డు రవాణా దాదాపు స్తంభించిపోయింది.  పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు నాయకులు, కార్యకర్తలు చేపట్టిన 48 గంటల రహదారుల దిగ్బంధం బుధవారం తొలి రోజు విజయవంతమైంది. ఉదయం నుంచే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి జై సమైక్యాంధ్ర.. జై జగన్ నినాదాలు మిన్నంటించారు. రోడ్లపై మానవహారాలుగా నిలబడ్డారు. వంటావార్పులు, ధర్నాలు, వినూత్న నిరసనలు చేపట్టారు. జిల్లాల మీదుగా వెళ్లే జాతీయరహదారులపై ప్రతి ఇరవై కిలోమీటర్ల దూరంలో పార్టీ కార్యకర్తలు రాస్తారోకోలు చేశారు. ఒక్కో జిల్లాలో హైవేపై కనీసంగా పాతిక, ముప్పై చోట్ల ఆందోళనలు చేపట్టారు. దీంతో జాతీయరహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. ఇక స్టేట్‌హైవేలు, పంచాయతీరాజ్ రహదారులపై వాహనాలను అటకాయించారు. వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆందోళనకు సీమాంధ్ర ప్రజ బాసటగా నిలబడింది. పల్లెప్రాంతాల్లోనూ గ్రామీణులు వేలాదిగా రోడ్లపైకి వచ్చి బైఠాయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చెట్లను నరికి రోడ్డుపై పడేసి వాహనరాకపోకలను అడ్డుకున్నారు. మరికొన్ని చోట్ల రైతులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లను రోడ్డుకు అడ్డంగా నిలిపారు. అంబులెన్సులు, 108 వాహనాలకు మాత్రం మినహాయింపునిచ్చిన పార్టీ శ్రేణులు మిగిలిన అన్ని వాహనాలనూ అడ్డుకున్నాయి. రాత్రి వేళ కూడా పార్టీ శ్రేణులు ఆందోళనలు కొనసాగించాయి. రోడ్లపై కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేపట్టాయి. పార్టీ ముందుగానే పిలుపునిచ్చిన నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో విద్యాసంస్థలు బుధవారం మూతపడ్డాయి. ఇక చాలాచోట్ల ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి కదల్లేదు. కొన్నిచోట్ల డిపోల నుంచి బయటకు వచ్చిన బస్సులు గంటలసేపు ఆలస్యంగా ప్రయాణించాయి. రాజకీయప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని యూపీఏ సర్కారు, కాంగ్రెస్ హడావుడి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ప్రజాకాంక్షను ఢిల్లీ పెద్దలకు తెలియజేసేందుకు వైఎస్సార్ సీపీ చేపట్టిన ఈ ఆందోళనకు ప్రయాణికులు, వాహనదారులూ సంఘీభావం ప్రకటించారు. పలుచోట్ల రోడ్లపై స్వచ్ఛందంగా వాహనాలు నిలిపి పార్టీ శ్రేణులతో కలిసి సమైక్యనినాదాలు చేశారు. రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించడంతో వాహనాల డ్రైవర్లు, సిబ్బంది, ప్రయాణీకులకు పార్టీ నేతలే భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో ఏ రాజకీయపార్టీ చేపట్టని విధంగా తొలిసారిగా 48గంటలసేపు రోడ్ల దిగ్బంధానికి వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. రోడ్లపైకి వచ్చిన వందలాదిమంది నేతలు, వేలాదిమంది కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేశారు. పోలీసుల తీరును ముందే ఊహించిన పార్టీ నేతలు వ్యూహాత్మకంగా ఆయా జిల్లాల్లో రాస్తారోకోలను ఒక్కచోటకే పరిమితం చేయకుండా, బృందాల వారీగా కార్యకర్తలను పలుచోట్లకు పంపి రోడ్లను దిగ్బంధం చేపట్టారు. బుధవారం ఒక్కరోజే 13 జిల్లాల్లో 3054 మంది నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేసి కేసులు నమోదు చేశారు.
 
‘అనంత’లో ఉద్రిక్తత
అనంతపురంలో రాస్తారోకో చేస్తున్న పార్టీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యంచేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఈడ్చుకెళ్లారు. మహిళలను చూడకుండా బలంవంతంగా లాక్కెళ్లి జీపులో పడేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన తేరుకున్న తర్వాత అరెస్ట్ చేసి త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే అరెస్ట్‌కు నిరసిస్తూ పార్టీ శ్రేణులు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించాయి.  కనేకల్లులో పార్టీ కార్యకర్తల అరెస్టు నిరసిస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధర్నా చేశారు. పార్టీ కార్యకర్తలు ఎస్కేయూ వర్శిటీని బంద్ చేయించి.. 205 రహదారిని దిగ్బంధించారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారుల ముట్టడి చేపట్టారు. కర్నూలు నగరంలోని  తుంగభద్ర నదిపై ఉన్న బ్రిడ్జిని దిగ్బంధించి ఇరువైపులా రాకపోకలను స్తంభింపజేశారు. నంద్యాల, ఆళ్లగడ్డల్లో 18వ నంబర్ జాతీయ రహదారిని దిగ్భందించారు. డోన్‌లో 7వ నంబర్ జాతీయ రహదారిపై ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాహనాల రాకపోకలను నిలువరించారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు-బళ్లారి రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వైఎస్సార్ జిల్లావ్యాప్తంగా 45చోట్ల రోడ్లను దిగ్బంధించారు. కడపలో కర్నూలు-చెన్నై, , కడప-రాయచోటి రహదారులపై ఉదయం 6గంటల నుంచే కార్యకర్తలు బైఠాయించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4.30 గంటల నుంచి రాకపోకలు అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బయటకు రాకుండా కార్యకర్తలు గేటు ఎదుట బైఠాయించారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాజంపేట-తిరుపతి రహదారిని దిగ్భందించారు. రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో,రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో రోడ్లను దిగ్భందించారు.
 
తిరుమలకూ రోడ్ల దిగ్బంధం సెగ
తమిళనాడు లోని వేలూరు మార్గం, కర్నాటక నుంచి వచ్చే బస్సులు, బెంగళూరు బస్సులు నిలిచి పోవడంతో తిరుమలకు భక్తుల రద్దీ తగ్గిపోయింది. చిత్తూరు జిల్లా కుప్పంలో బస్సులు కర్ణాటక సరిహద్దు వరకు వచ్చి నిలిచిపోయాయి. పుంగనూరు వద్ద ఆందోళనకారులు పెద్ద చెట్లను నరికి రోడ్డుకు అడ్డంగా వేశారు. చంద్రగిరి వద్ద జాతీయ రహదారి ట్రాక్టర్లతో నిండిపోవడంతో ఆ వైపు ఎలాంటి వాహనాలు వెళ్లలేదు. పుత్తూరు, నగరి, నాగలాపురం, నారాయణవనంలో రోడ్లను దిగ్బంధం చేయడంతో చెన్నైకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి.  తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో రాస్తారోకో చేశారు. చంద్రగిరిలో  తిరుపతి-చిత్తూరు రోడ్డుకు  50 ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి వాహనాలను అడ్డుకున్నారు.
 
హైవేపైనే వంటావార్పు
కృష్ణాజిల్లా  జగ్గయ్యపేట నియోజకవర్గం గరికపాడు అడ్డరోడ్డు వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఐదుగంటల పాటు జాతీయరహదారిని రహదారిని దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్ పెద్దఎత్తున స్తంభించింది.  ఇబ్రహీంపట్నంలో హైవేపైనే వంటావార్పు  నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నానిల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పామర్రులో రోడ్డును దిగ్బంధించి వంటావార్పు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా  కనిగిరిలో ఉదయం 5.30 గంటలనుంచే బస్సులను  అడ్డుకున్నారు. దర్శిలో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట,  మంగళగిరి, పెదకాకానిల వద్ద చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారిపై పార్టీ నేతలు, కార్యకర్తలు గంటలసేపు ఆందోళన చేపట్టడంతో కిలోమీటర్ల మేర చెన్నై హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సత్తెనపల్లిలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలోగుంటూరు-మాచర్ల రహదారిని ట్రాక్టర్లు అడ్డుపెట్టి దిగ్బంధించారు.  గుంటూరు నగరంలో  నేతలు అంకిరెడ్డి పాలెం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పార్టీ నేత ముస్తఫా జాతీయ రహదారిపై వంటా వార్పు ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాళెం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
 
రోడ్డుపైనే సాంస్కృతిక కార్యక్రమాలు
తూర్పుగోదావరి జిల్లా  రాజమండ్రి వద్ద మోరంపూడి సెంటర్‌లో జాతీయ రహదారిపై సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. అమలాపురంలో ఎర్ర వంతెన వద్ద పార్టీ నేతలు కార్యకర్తలు 216 జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.  పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, తదితరులు పాల్గొన్నారు.  పశ్చిమగోదావరి  జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉదయం 9 గంటల నుంచే టెంట్లు వేసి వాహనాల రాకపోకలకు అడ్డుపడటంతో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు, లారీలు, ఆటోలు, ఇతర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రత్తిపాడు వద్ద రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి వాహనాలను అడ్డుకున్నారు. విజయనగరం జిల్లాలో  ఉదయం నాలుగు గంటల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.   సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో నిర్వహించిన దిగ్బంధం వల్ల   ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా  కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి(ఎన్‌హెచ్-16)తో పాటు రాష్ట్రీయ రహదారులను దిగ్బంధించారు. పార్టీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే కృష్ణదాస్  ఆధ్వర్యంలో శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై కొవ్వొత్తులతో రాత్రి నిరసన ప్రదర్శన నిర్వహించారు. విశాఖ జిల్లా పాడేరులో ఉదయం 5 గంటల నుంచే పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో వారపు సంతకు వెళ్లే వాహనాలు గంటలతరబడి నిలిచిపోయాయి.  కె.కోటపాడులో రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను నిలిపి వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. నర్సీపట్నంలో రోడ్డుకు అడ్డంగా చెట్లను నరికి రహదారుల్ని దిగ్బంధించారు.  జిల్లా మీదుగా వెళ్లే 16వ నెంబరు జాతీయరహదారిపై పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టడంతో గంటలసేపు వాహనాలు నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లాలాచెరువు సెంటర్‌లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో, రావులపాలెం వద్ద  మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో 16వ  నంబరు జాతీయ రహదారిని దిగ్భంధం చేశారు.

జాతీయ పార్టీల మద్దతు కూడగట్టాలి

జాతీయ పార్టీల మద్దతు కూడగట్టాలి: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జాతీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టాల్సి ఉందని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సహా ఇతర నేతలను కలిసేందుకు వీలుగా ఇతర రాష్ట్రాల్లో పర్యటించేందుకు అనుమతించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ మేరకు బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన బెయిల్ షరతులను సడలించిన సీబీఐ ప్రత్యేక కోర్టు... రాష్ట్రవ్యాప్తంగా, ఢిల్లీ వెళ్లేందుకు అనుమతిస్తూ గతనెల 30న ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు.
 
 అయితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా జాతీయ పార్టీల నేతలను, పార్లమెంట్ సభ్యులను కలిసి మద్దతు కూడగట్టాల్సి ఉందని వివరించారు. పార్లమెంట్ సభ్యునిగా నియోజకవర్గంతోపాటు పార్టీ అధ్యక్షునిగా ముఖ్యంగా ప్రజలకు సేవలు అందించే హక్కును కాలరాయకూడదని పేర్కొన్నారు. తనపై సీబీఐ మోపినవన్నీ ఆరోపణలేనని, నేరం రుజువు కాలేదని తెలిపారు. కోర్టు విధించిన షరతులను పాటిస్తానని, రాజకీయ కారణాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో పర్యటించేందుకు వీలుగా బెయిల్ షరతులు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు... సీబీఐకి నోటీసులు జారీచేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.
 
 పాలెం వెళ్లలేకపోయా... షరతు సడలించండి
 కోర్టు విధించిన షరతు కారణంగా ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన ఓల్వో బస్సు దగ్ధమైన సంఘటన ప్రాంతానికి వెళ్లలేకపోయానని, ఈ నేపథ్యంలో హైదరాబాద్ విడిచి వెళ్లే రెండు రోజుల ముందు సమాచారం ఇవ్వాలన్న షరతును సడలించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించలేకపోయానని, ఆకస్మికంగా జరిగే సంఘటనలపై స్పందించి వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లేందుకు ఈ షరతు ఇబ్బందిగా ఉందని తెలిపారు. కొన్ని పరిస్థితుల్లో అత్యవసరంగా వెళ్లాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో నగరం విడిచి వెళ్లే రెండు రోజుల ముందు సమాచారం ఇవ్వాలన్న షరతును సడలించాలని విజ్ఞప్తి చేశారు.
 
 9, 10న కడప పర్యటన...
 ఈనెల 9, 10న వైఎస్‌ఆర్ కడప జిల్లా పర్యటనకు వెళ్తున్నట్లు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టుకు నివేదించారు. 8వ తేదీన రాత్రి బయలుదేరి వెళ్లి... 11వ తేదీ ఉదయం తిరిగి హైదరాబాద్ చేరుకుంటానని తెలిపారు. ఇదే కేసులో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డి ఈనెల 8న బెంగుళూరు వెళ్తున్నట్లు సీబీఐ కోర్టుకు సమాచారం ఇచ్చారు.

ఇటలీలో అన్నారు.. తెలుగులో అనలేరా?

రోడ్ల దిగ్బంధం విజయవంతం: రోజా
రోడ్ల దిగ్బంధం విజయవంతం
* తొలిరోజు కార్యక్రమం విజయవంతమైంది : వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి రోజా
*  ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సమైక్య ఆకాంక్షను చాటారు
* సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను దగా చేస్తున్నారు
* రాష్ట్రంలో 75 శాతం మంది ఉద్యమిస్తుంటే ఒక్కసారైనా ‘సమైక్యం’ అనరెందుకు బాబూ?
* ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా బండ రాయిలా మిగిలిపోయారు ఎందుకు?
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రహదారుల దిగ్బంధం కార్యక్రమం తొలిరోజు విజయవంతమైందని, ప్రజలు స్వచ్ఛందంగా పెద్దఎత్తున పాల్గొన్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆర్‌కే రోజా చెప్పారు. ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలిగించేలా ప్రజలందరూ సమైక్య ఆకాంక్షను కళ్లకు కట్టారన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇద్దరూ పదవులను అంట్టిపెట్టుకుని సీమాంధ్ర ప్రజలను దగా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు విధానమంటూ ఒకటి ఉందా? అని సూటిగా ప్రశ్నించారు.
 
 రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు గాను పార్టీలకు అతీతంగా అందరూ కలిసి అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సూచనను కావాలనే పెడచెవిన పెట్టారన్నారు. ఇన్నాళ్లకు చంద్రబాబు అసెంబ్లీ తీర్మానమనడం విచిత్రంగా ఉందన్నారు. ఇరుప్రాంత నేతలతో రోజుకో మాట మాట్లాడిస్తూ టీడీపీ ప్రజలను మోసగిస్తోందని దుయ్యబట్టారు. గాయం చేయమని చేతికి కత్తి ఇచ్చి, తర్వాత సమన్యాయం అంటూ డ్రామా ఆడుతున్నారని రోజా మండిపడ్డారు. సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందంటున్న సీమాంధ్ర టీడీపీ నేతలు... రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబును చొక్కా పట్టుకొని నిలదీసి, లేఖను వెనక్కు తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని నిలదీశారు.
 
 ఇటలీలో అన్నారు.. తెలుగులో అనలేరా?
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని 75 శాతం మంది ప్రజలు 90 రోజులకు పైగా ఉద్యమిస్తున్నా... చంద్రబాబు ఒక్కమారైనా ప్రజల ఆకాంక్ష మేరకు ‘సమైక్యాంధ్ర’ అని ఎందుకు అనడంలేదని రోజా ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు ఢిల్లీలో నిరాహారదీక్ష సందర్భంగా సోనియాగాంధీకి అర్థంకావడం కోసం ఇటలీ పదాలను ఉటంకించారు. రాష్ట్రం స్తబ్ధుగా ఉందంటూ ఇటలీ భాషలో ‘ఇమ్మొబిలిస్మో’ అని చంద్రబాబు అన్నారు. సోనియాకు అర్థం కావడం కోసం ఇటలీ పదాలను ఉపయోగించారుగానీ తెలుగు ప్రజల కోసం సమైక్యం అని ఒక్క మాట చెప్పలేరా?’’ అని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఉద్యమిస్తున్నా చంద్రబాబు మాత్రం బండరాయిలా మిగిలిపోయారన్నారు. ప్యాకేజీల నాయుడుగా ముద్రపడిన చంద్రబాబు తెలుగువాడిగా పుట్టినందుకైనా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చెప్పకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని రోజా హెచ్చరించారు.

ప్రకృతి కక్ష... ప్రభుత్వ ఉపేక్ష

ప్రకృతి కక్ష... ప్రభుత్వ ఉపేక్ష
sakshi: 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత, రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తుల సమయంలో కొన్ని జిల్లాలలో కొందరికి కంటితుడువుగా ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించడం మినహా, తాము వేసిన అంచనాల ప్రకారమైనా రైతులకు నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు లేవు.
 
 రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పం టలు సర్వం నాశనమైపోయా యి. వరి, పత్తి, మిరప, అరటి ఒకటేమిటి అన్ని పంటలూ వర్ష బీభత్సానికి నేలకొరిగాయి. వర దల పాలైనాయి. వారం రోజుల కుండపోత వర్షాలతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆరు లక్షల హెక్టార్లకుపైగా పంట నీటి మునిగింది. తెలంగాణ ప్రాం తం లోనూ పంటల మీద దాని ప్రభావం ఉంది. పత్తితో పాటు వరి, మొక్కజొన్న, చెరకు, కంది పంటలు నష్టానికి గురయ్యాయి. మంచి వర్షాలతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ అసాధారణ దిగుబడులు ఇవ్వగల దని ఎదురు చూస్తున్న తెలుగు రైతు ఆశలు మొత్తంగా అడియాసలయ్యాయి. సాధారణంగా రాష్ట్ర ఆహార ఉత్ప త్తులు సాలీనా రెండు సీజన్లలో 1.90 నుంచి 2 లక్షల మెట్రి క్ టన్నుల వరకు ఉంటాయి. గత ఏడాది ఈ ఉత్పత్తులు 1.98 మెట్రిక్ టన్నులు. కోస్తాలో శ్రీకాకుళం నుంచి నెల్లూ రు జిల్లా వరకు అన్నిరకాల పంటలు విపరీతమైన నష్టానికి లోనయ్యాయి. రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదు కుంటుందని ప్రకటనలు వచ్చినా ఇప్పటి వరకు ఏమీ జర గలేదు. బీమా పరిష్కారాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు అందజేస్తామని ప్రభుత్వం చెప్పు కొస్తున్నా ఆ మాటలను అన్నదాతలు నమ్మే స్థితి లేదు.
 
 రైతు గుండె చెరువు
 సర్వం కోల్పోయిన రైతులు తీవ్ర నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక ఉదాహరణ: కృష్ణాజిల్లా క్రోసూరు మండలం నుంచి 36 ఏళ్ల పత్తి రైతు తలారి పెద్దినారా యణ విషం తాగి మరణించాడు. ఈ రైతు సీజన్‌లో పడిన మంచి వర్షాలతో తన పత్తి పంట మీద అపారమైన నమ్మ కం పెట్టుకున్నాడు. తన 4 ఎకరాల కౌలు భూమిలో పం డిన తెల్ల బంగారంతో వెతలు తీరగలవనుకున్న తరుణం లో అకాల వర్షాలు పంటను ముంచాయి. మాచర్ల మం డలం, కల్వగుంట రైతు ఉడుముల సీతారామిరెడ్డి తన 6 ఎకరాల కౌలు భూమిలో ఏపుకి వచ్చిన పత్తి, మిరప పం టలు పూర్తిగా నీట మునిగిపోగా నిస్సహాయ స్థితిలో విషం తాగి, ప్రాణం వదిలాడు. నల్లగొండ, మహబూబ్‌నగర్, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా ఆత్మహత్యల ఘోష విన బడింది.
 
తనకున్న పొలాన్నంతా అమ్ముకుని పత్తి సాగులో పెట్టిన నల్లగొండ వాసి మల్లేష్ అనే రైతుదీ ఇలాంటి కథే.  మల్లేష్‌లు, పెద్ది నారాయణలు, సీతారామిరెడ్డిలు పదుల సంఖ్యలోనే ఉండవచ్చు. సర్వం కోల్పోయి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయినా, పంటి బిగువున బతుకీడు స్తూ, ప్రత్యామ్నాయ చర్యలైనా ఆదుకుంటాయేమోనని ఎదురు చూస్తున్నవారు వేలల్లో ఉన్నారు. కరీంనగర్ జిల్లా, లక్ష్మీపురం గ్రామవాసి ముక్కిన కేసవరెడ్డి, తూర్పు గోదా వరి జిల్లా పాటిచెరువు రైతు ఒకరు, ప్రకాశం జిల్లా వాసి షేక్ మౌలాలి, మహబూబ్‌నగర్ వాసులు సత్యనారా యణగౌడ్, ర్యాపని మల్లయ్య, నల్లగొండ జిల్లా వాసులు రెడ్డిమాను లెవన్, అవిలి మల్లయ్య, వరంగల్ జిల్లా మహిళా రైతు ఉప్పలమ్మ, పశ్చిమగోదావరి జిల్లా వాసి బల్లెం సుబ్బారావు ఇటువంటి వెతలతోనే ఇటీవల తను వులు చాలించారు. అవే వెతలు అవే అప్పుల రక్కసి కోర లను ఏంచేసి తప్పించుకోవాలో తెలియక దీపావళి రోజున కూడా ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారు.
 
 కళ్లుండీ చూడలేని సర్కార్
 2009లో రాజశేఖరరెడ్డి మరణం తరువాత, రాష్ట్ర ప్రభు త్వం ప్రకృతి విపత్తుల సమయంలో కొన్ని జిల్లాలలో కొందరికి కంటితుడువుగా ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించడం మినహా, తాము వేసిన అంచనాల ప్రకారమైనా రైతులకు నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు లేవు. వివిధ ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీల బకాయిలు జిల్లాల వారీగా గణాంకాలు చూస్తే ఎందుకిలా చేస్తున్నారో తల బద్దలు కొట్టుకున్నా అర్థమవదు. విజయనగరం జిల్లాలో చెల్లించవలసిన 92.86 కోట్లు అతి తక్కువగాను అనంతపురంలో చెల్లించవలసిన 31,708.04 లక్షలు అత్యంత అధికంగాను, మొత్తం 69,722.40 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బకాయిలు చూస్తుంటే రైతులు ఎంత మోసానికి గురౌతున్నారో అర్థమవుతుంది.
 
2010, 2011 సంవత్సరాల కరువు సంబంధిత నష్టపరిహారాలను ఇంత వరకు చెల్లించలేదు. కిందటి ఏడాది నీలం తుపాను తాకిడికి సుమారు రూ.1,600 కోట్ల నష్ట జరిగినట్లు సర్కా రు అంచనా వేసినా అందులో రైతులకు చెల్లించవలసిందే ఎక్కువ ఉందన్న సంగతి నిజం. నాలుగేళ్లుగా ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపుల చరిత్ర ఇంత ఘనంగా ఉన్నా, ముఖ్య మంత్రి తాజాగా నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్‌పుట్ సబ్సి డీ అందజేస్తామని చెప్పడం రైతులను పరిహసించడాని కేనా? తీర ప్రాంతాల్లోని తుపాను పీడిత వ్యవసాయ క్షేత్రా లను దర్శించిన మెగా నాయకులు ఇన్‌పుట్స్ సడ్సిడీని హెక్టారుకు పదివేలకు తగ్గకుండా రైతులకు చెల్లించేటట్టు చూస్తామని, రాష్ట్రానికి అత్యధికంగా సాయం అందించేం దుకు కేంద్ర ప్రభుత్వాన్ని తామే స్వయంగా అర్థిస్తామని చెప్పడం ఇంకా వింత. జన్మలో ఇతరులకు సాయం చేసే ఆలోచన లేని ఇటువంటి నాయకులు అన్నదాతలను మభ్యపెడుతున్నారనే చెప్పుకోవాలి. సర్వం కోల్పోయిన రైతు టీవీ చానెళ్లలో వచ్చిన వాగ్దానాలను నమ్ముతాడని అనుకుంటే పొరపాటు. కారణాలు ఏవైనా వ్యాపారులతో పాటు ప్రభుత్వాలు కూడా అన్యాయం చేస్తుంటే బక్క రైతుకు దిక్కెవరు?
 
 వినియోగదారుడికీ బాధ్యత
 ఉరుముల్లేని పిడుగుల్లా తాకుతున్న ధరాఘాతాలతో విని యోగదారులు భయభ్రాంతులవుతున్న సమయంలో దేశంలో వ్యవసాయం ఎలా సాగుతుందో ఆ భగవంతునికి కూడా అంతుబట్టేటట్టు లేదు. ఇక్కడ సామాన్య ప్రజలు, అంటే వినియోగదారులైన మనందరం విజ్ఞత ప్రదర్శిం చాలి. కూరగాయలు, ఉల్లిగడ్డల ధర రూ.50 నుంచి రూ.100 వరకు చెలరేగినా మారు మాట్లాడకుండా కొను గోలు చేస్తున్నాం. ఆ ధరల్లో సింహభాగం న్యాయంగా ఉత్పత్తిదారుడైన రైతుకు చెందాలి. కానీ 10 శాతం కూడా చెందడం లేదు. ఈ పరిణామం గురించి అతి తక్కువ మంది ప్రశ్నిస్తున్నారు, తాము చెల్లించే విలువలో ఏ మాత్రం రైతుకు చెందుతున్నదనే అవగాహన వినియోగ దారునికి లేదు. రాజకీయ నాయకులు తాము వినియోగ దారుల ప్రయోజనాల పరిరక్షణ పేరిట అటు వినియోగదా రుడినీ ఇటు రైతునీ కూడా మోసగిస్తున్నారు. కష్టంగానో నష్టంగానో ధరాఘాతాన్ని భరిస్తున్న వినియోగదారుడు, ఆ విలువలో సింహభాగం రైతుకు చెందేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తే సంతోషిస్తాడు. అన్నదాతలు తమ కుటుంబాలతో సహా రక్తమాంసాలను వెచ్చిస్తుంటే, వ్యాపారులు, దళారులు ఫోన్ల ముందు కూర్చుని ఆ ప్రతి ఫలాన్ని వారికి చెందకుండా చేస్తుంటే మన వ్యవస్థ తమాషా చూడటం ఈ నాటిది కాదు.
 
 ఏ హక్కూలేని రైతాంగం
 ఉద్యోగులు సమ్మెకు దిగితే ప్రభుత్వం దిగి వచ్చి, చర్చలు జరుపుతుంది. విద్యార్థులు సమస్యల మీద నడుం బిగిస్తే బుజ్జగిస్తుంది. అదే రైతుల విషయంలో మధ్యవర్తులు, ప్రజా సంఘాలు లేదా సాంఘిక కార్యకర్తలు మాత్రమే మాట్లాడతారు. వారికై వారుగా నేరుగా ప్రభుత్వంతో సంప్రదించే పరిస్థితులే లేవు. మన రాష్ట్రంలోనే కాదు, దేశమంతా కూడా అన్యాయాలను ప్రశ్నించలేని బడుగు రైతులే 90 శాతం పైగా ఉన్నారు. రైతులు తాము పండిం చిన పంటలకు గిట్టుబాటు ధరలు పొందే అవకాశం, హక్కు స్వరాజ్యం వచ్చి 66 ఏళ్లు దాటినా ఇప్పటికీ లేదు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు కూడా దక్కకుండా చేయగల దళారీ వ్యవస్థ ఈ దేశంలో మాత్రమే ఉండటం రైతుకు పెద్ద శాపం.

 అక్షరానికి చేరువ కావాలి

 ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా రైతు సమస్యలకు పరి ష్కారాలు కనుగొనలేకపోవడానికి కారణాలు ఈ వ్యవస్థ లోనే ఉన్నాయి. రైతుకు వాటిల్లుతున్న నష్టాల మీద, అన్యా యాల మీద అనేక వర్గాల ప్రజలు, విద్యావంతులకే అవ గాహన కొరవడిన ప్రస్తుత సమయంలో సామాన్య ప్రజా నీకానికి ఈ అంశం మీద సామాజిక స్పృహ కలిగి ఉండ టం అసాధ్యం. అందుకే అన్నదాతలు విద్యావంతులు కావాలి.
 
తమకు జరుగుతున్న అన్యాయాన్ని సంఘటి తంగా తామే ప్రశ్నించనంత కాలం తమ హక్కులను సాధించుకోవడం అంత సులభం కాదు. సమాజానికి కూడా తామే ఒక ఉత్ప్రేరకం కావాలంటే తమను తాము ఉత్తేజపరచుకోవాలి. అప్పడే సమాజం స్పందిస్తుంది. చర్చ ఉద్భవిస్తుంది. తద్వారా సంస్కరణలూ పరిష్కారా లూ వెలువడతాయి, ఆత్మహత్యలు ఆగిపోగలవు. అన్నిం టికన్నా ముఖ్యంగా వ్యవసాయం రాజశేఖరరెడ్డి కోరుకు న్నట్లుగా ఒక పండుగవుతుంది. అటువంటి పండుగ రోజు లు మన రైతుకు త్వరలోనే రావాలని కోరుకుందాం.
 -డా॥బలిజేపల్లి శరత్‌బాబు,
 ప్రధాన శాస్త్రవేత్త, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, హైదరాబాద్

షరతును సడలించండి

పాలెం వెళ్లలేకపోయా... షరతు సడలించండి
 కోర్టు విధించిన షరతు కారణంగా ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన ఓల్వో బస్సు దగ్ధమైన సంఘటన ప్రాంతానికి వెళ్లలేకపోయానని, ఈ నేపథ్యంలో హైదరాబాద్ విడిచి వెళ్లే రెండు రోజుల ముందు సమాచారం ఇవ్వాలన్న షరతును సడలించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించలేకపోయానని, ఆకస్మికంగా జరిగే సంఘటనలపై స్పందించి వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లేందుకు ఈ షరతు ఇబ్బందిగా ఉందని తెలిపారు. కొన్ని పరిస్థితుల్లో అత్యవసరంగా వెళ్లాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో నగరం విడిచి వెళ్లే రెండు రోజుల ముందు సమాచారం ఇవ్వాలన్న షరతును సడలించాలని విజ్ఞప్తి చేశారు.
 
 9, 10న కడప పర్యటన...
 ఈనెల 9, 10న వైఎస్‌ఆర్ కడప జిల్లా పర్యటనకు వెళ్తున్నట్లు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టుకు నివేదించారు. 8వ తేదీన రాత్రి బయలుదేరి వెళ్లి... 11వ తేదీ ఉదయం తిరిగి హైదరాబాద్ చేరుకుంటానని తెలిపారు. ఇదే కేసులో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డి ఈనెల 8న బెంగుళూరు వెళ్తున్నట్లు సీబీఐ కోర్టుకు సమాచారం ఇచ్చారు.

తెలుగువారి క్షేమం కోరుకోవడంలో జగనే బెటరు (గ్రేట్ ఆంధ్ర)

Written By news on Wednesday, November 6, 2013 | 11/06/2013

రాష్ట్ర విభజన విషయంపై రగులుతున్న రాజకీయంలో జగనే బెటరు అన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో చిన్న వాడైనా, రాష్ట్రం లో నెలకొన్న సమస్యలపై చంద్రబాబు, కిరణ్‌ వంటి వారితో పోల్చుకుంటే చాలా తక్కువ అవగాహన ఉన్న వాడైనా సరే, తెలుగువారి క్షేమం కోరుకోవడంలో జగనే చాలా క్లియర్‌, బెటర్‌ నిర్ణయం తీసుకున్నాడు అన్న భావం రాజకీయ వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది.
జిఓఎం కు లేఖ విషయంలో జగన్‌ తీసుకున్న తాజా నిర్ణయం తో పాటు, రాష్ట్రాన్ని విభజిస్తూ సిడబ్ల్యూసి నిర్ణయం ప్రకటించినప్పడు మూకుమ్మడి రాజీనామాలు, తర్వాత చేసిన ఆమరణ దీక్షలు, మీడియా సమావేశాల్లో తెలిపిన అభిప్రాయాలు ఇలా అన్నింటిలో కూడా డొంక తిరుగుడు కాకుండా సూటిగా తన అభిప్రాయాలు, తమ వాదనను ముక్కుసూటిగా చెప్పాడు అయినా ఇంకా తెలుగుదేశం పార్టీ, దాని 'పచ్చ'పాత పత్రికలు జగన్‌ వెనుక రహస్య ఎజెండా వుందని, సమైక్య వాది కాదని ప్రచారాలు సాగిస్తూనే వున్నాయి. తెలంగాణ ప్రకటించినప్పుడు డైరెక్టుగా తాము విభజనకు వ్యతిరేకం అంటూ మూకుమ్మడి రాజీనామాలు చేసి తమది సమైక్యం అంటూ నిక్కచ్చిగా తన స్టాండును చెప్పాడు జగన్‌. తూచ్‌..కాంగ్రెస్‌ ముందుగా హింట్‌ ఇస్తే, రాజీనామాలు చేసారంటూ విమర్శలు కురిపించారు. తరువాత మళ్లీ వాదన మార్చి జగన్‌ సమైక్యవాది కాదు, కొన్ని జిల్లాలకే పరిమితం అంటూ కొత్తవాదన ప్రారంభించారు. అదీ చాలక, అతగాడు వెళ్లి కాంగ్రెస్‌ కలుస్తాడంటూ గోల పెట్టడం ప్రారంభించారు. జగన్‌ మాత్రం పదేపదే నేను సమైక్యవాదిని అంటూ చెబుతూనే వస్తున్నాడు. అదే మాట జిఓఎమ్‌ కు చెప్పాడు, రాష్ట్రపతికి చెప్పాడు. 
కానీ ఈ 'పచ్చ'పాత పత్రికలకు మాత్రం చంద్రబాబు గోడమీది పిల్లి వాటం కనిపించడం లేదు. చంద్రబాబు లేఖలోని చిత్రమైన అంశాలు కనిపించడం లేదు. నిజానికి పరోక్షంగా చంద్రబాబు తనది సమైక్యవాదం అని నిరూపించుకుంటున్నాడు. మొదట తనది  తెలంగాణ వాదమే అన్నాడు. కానీ ప్రధానికి రాసిన లేఖలో అసెంబ్లీ తీర్మానం, అన్ని వర్గాలతో చర్చలు వంటి సాధ్యంకాని విషయాలు ప్రస్తావంచి, తెలంగాణకు తాను మోకాలు అడ్డినట్లే అని స్పష్టం చేసాడు.  జగన్‌ మాత్రం తను తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణలో పార్టీ పూర్తిగా పోతుందని తెలిసి కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న బలమైన కోరికతో రాజకీయ ప్రయోజనాన్ని కూడా వదులుకుని గోడమిద పిల్లిలా కాకుండా సూటిగా తన స్టాండ్‌ చెప్పేసాడు. ఆ పాటి ధైర్యం తెలుగుదేశం చేయలేకపోతోంది. 
అంతెందుకు ఇప్పుడు జిఓఎం, అఖిల పక్షం సమావేశం వంటి విషయాల్లో చంద్రబాబు, కాంగ్రెస్‌ వంటి పార్టీలు చివరి వరకు తెగ మథనం చేసాయంటే దానర్థం ఆ రెండు పార్టీలలో ఇంకా రాష్ట్ర విభజన విషయంలో ఎలాంటి ఖచ్చితమైన అభిప్రాయం లేనట్టే కదా... కాని జగన్‌ తడుముకోకుండా నిర్ణయం ప్రకటించేసాడు. మంత్రుల బృందం ఏర్పాటు చేసిందే విభజన కోసం, తాము కోరుకుంటున్నది సమైక్య రాష్ట్రం ఉండాలని అలాంటప్పుడు దానికి లేఖ రాయాల్సిన అవసరం లేదన్నారు. విభజన అన్న దానికే తాము వ్యతిరేకమన్నారు జగన్‌. అంతే కాదు అఖిల పక్ష సమావేశం విషయంలో అదే క్లియర్‌ స్టాండ్‌ తీసుకున్నాడు, ప్రధానికి రాసిన లేఖలో, రాష్ట్రపతికి నివేదించిన వినతి పత్రంలో కూడా ఒకటే మాట రాష్ట్రాన్ని విడగొట్టవద్దన్నదే తమ స్టాండ్‌ అని చెప్పేసాడు. కాని చంద్రబాబు ఇప్పటికి గోడమీద పిల్లిలాలాగానే ఉన్నాడంటే అందరి కంటే జగనే బెటర్‌ అన్నట్టు కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఎప్పుడు మాట్లాడినా, ఎవరు ప్రశ్నలడిగినా టిడిపి అధినేత తడుము కోకుండా చెప్పే జవాబు తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్లు, తనది రెండు కళ్ల సిద్దాంతం అని. కాని దాని వెనుక అసలు రహస్యం తెలిసిన వారికి మాత్రం క్లియర్‌ గా అర్థం అయ్యేది ఏంటంటే ఆయన చేసే పని తెలంగాణ ఏర్పాటు కాకుండా అడ్డుకోవడమే అని. కాని ఈ విషయం డైరెక్టుగా చెప్పకుండా తన చేతలు, వ్యవహారంతో అదే పని చాపకింద నీరులా చేసుకుపోతున్నాడు. అంతెందుకు దీనికి బలమైన ఉదహరణ తెలంగాణ ఇస్తానంటే అప్పట్లో బిజేపిని అడ్డుకున్నది నేనే అని చంద్రబాబే చెప్పడం. అంటే ఆయనకు తెలంగాణ ఏర్పడడం అస్సలు ఇష్టం లేదన్న మాట. ఇది తాజాగా ఆయన చేస్తున్న పనులు, వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు కూడా చంద్రబాబు తెలంగాణ ఏర్పడకుండా అడ్డుకుంటున్నాడన్న విషయం క్లియర్‌ గా అర్థం అవుతోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఆయన మంత్రుల బృందానికి లేఖ ను ఇవ్వనని దానిని బహిష్క రించారు, అఖిల పక్షం సమావేశానికి వెల్లనని చెప్పేసారు. అంటే ఇవి రెండు కూడా తెలంగాణ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసినవన్న విషయం అందరికి తెలిసిందే కదా. అంటే జిఓఎం కు లేఖ ఇచ్చినా తెలంగాణ ఎలా ఏర్పాటు చేయాలన్న దానిపై ఇవ్వాలి. అఖిల పక్షం సమావేశానికి హాజరయితే కూడా చెప్పాల్సింది తెలంగాణ ఏర్పాటు విదానం చెప్పడానికి అందుకే ఆయన ఆ రెండింటిని బహిష్కరించారు. అంటే చాలా క్లియర్‌ గా చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకి అన్నది అర్థమవుతోంది .
సరే ఈ రెండింటిని బహిష్కరించి, తన పార్టీకి చెందిన రెండు ప్రాంతాల నేతలను ఒప్పించేందుకు ప్రధానికి లేఖ రాసారు. ఇక అది ఎలా రాసారో చూద్దాం.... విభజన అనేది రాష్ట్రంలోని మొత్తం జనాల ఆమోదం పొందాలి, ఇదెలా తెలుసుకోవాలంటే కూడా మార్గం చెప్పాడు తెలంగాణ, సీమాంద్రలకు చెందిన అన్ని జేఏసిలను, విద్యార్థి, రైతు, ఉద్యోగ సంఘాలను పిలిచి ఒకే చోట సమావేశ పరిచి అందరి ఆమోదం విభజనకు అనుకూలమైతే విభజించాలి అన్నాడు. ఇరు ప్రాంతాల్లో జాయింట్‌ ఆక్షన్‌ కమిటీలు ఎందుకు ఏర్పడ్డాయి, అంటే ఎవరైనా సరే చెప్పే జవాబేంటి, సమైక్యం కోసం ఓ చోట, ప్రత్యేకం కోసం మరోచోట అని చెబుతారు. ఇక వారందరిని కూర్చో బెడితే విభజనకు అనుకూలంగా అభిమతం ఎలా వస్తుంది అన్నది చిన్నపిల్లోడికైనా తెలిసిన విషయం.
ఇక అన్ని పార్టీలకు చెందిన ఇరుప్రాంతాల నాయకులు, ప్రజా ప్రతినిధులను కూడా కూర్చోబెట్టి ఏకాభిప్రాయం తీసుకోవాలట. నవ్విపోతే నాకేటి సిగ్గు అన్నట్టు కాకపోతే తన పార్టీలోని ఇరు ప్రాంతాల నేతలతో కలిసి ఎన్నో రోజులుగా చర్చలు జరిపినా కూడా ఏకాభిప్రాయం రాలేదు. అలాంటిది అన్ని పార్టీల ఇరు ప్రాంతాల నేతల్లో ఏకాభిప్రాయం ఎలా వస్తుంది. పైగా అసెంబ్లీ నుంచి ప్రతిపాదన రావాలట. అంటే ఇది సాధ్యమా? దీన్ని బట్టి చూస్తే , చంద్రబాబు చెప్ప దల్చుకున్నదేమిటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయవద్దనే కదా.. కాని డైరెక్టుగా చెప్పకుండా ఇలా మెలికలు పెడుతున్నాడన్న మాట. దీన్ని బట్టి చూస్తే తెలంగాణపై కుండ బద్దలు కొట్టిన జగనే బెటరు కదా.

http://telugu.greatandhra.com/politics/gossip/jagan-is-better-47900.html

Popular Posts

Topics :