22 December 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

2013 - జగన్ అలుపెరుగని పోరాటం

Written By news on Saturday, December 28, 2013 | 12/28/2013

2013 -  జగన్ అలుపెరుగని పోరాటం
ఈ ఏడాది మన రాష్ట్రంలో ఉవ్వెత్తున లేచిన ఉద్యమ కెరటం వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రస్థాయిలో సాగుతోంది. సమైక్య శంఖారావం పూరించి అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైన నేతగా జగన్ నిలిచారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల దుర్మరణం తరువాత ఆయన ఆశయాల సాధనకు, ఆయన ప్రారంభించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల కొనసాగింపునకు అనివార్యంగా జగన్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. జననేతగా జగన్ రోజురోజుకు ఎదిగే క్రమంలో లేనిపోని అభాండాలన్నీ మోపి అతనిని 2012 మే 27న  అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.

ఈ ఏడాదే సమైక్య ఉద్యమం ఊపందుకుంది.  ఉద్యమానికి జైలు నుంచే జగన్ మద్దతు పలికారు. అంతేకాకుండా జైలులో ఉండే సమైక్య రాష్ట్రం కోసం నిరవధిక దీక్ష చేశారు. జనానికి ఇంకా చేరువయ్యారు. న్యాయం జగన్ పక్షాన ఉండటంతో ఎంతకాలం జైలులో ఉంచగలరు? ఈ ఏడాది అక్టోబరు 24న  బెయిలుపై విడుదలయ్యారు. పడిన కెరటం మళ్లీ పైకి లేచింది.  సమైక్య శంఖారావం పూరించారు. సమైక్యవాదులకు అండగా నిలిచారు. ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. రాష్ట్ర రాజధాని  హైదరాబాద్లో అక్టోబరు 26న భారీ స్థాయిలో సమైక్య శంఖారావం బహిరంగ సభ విజయవంతంగా నిర్వహించారు. సమైక్యవాదుల ఆశాజ్యోతిగా నిలిచారు.  జాతీయ స్థాయిలో సమైక్యవాణి వినిపించారు. దేశమంతటా పర్యటించి జాతీయ నాయకులను కలిశారు. సమైక్యతకు మద్దతు కూడగట్టారు.  దేశమంతా రాష్ట్రం వైపు చూసే విధంగా లోక్సభలో ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయం గురించి ఎలుగెత్తి చాటారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నిజాయితీగా, పట్టుదలతో పోరాడుతున్న ఏకైక నేత జగన్.

 రాష్ట్రం విడిపోతే తలెత్తే సమస్యలు నదీ జలాలు - ఉద్యోగులకు జీతాలు - యువతకు ఉద్యోగాలు - కొత్త రాజధాని ఏర్పాటు.... వంటి సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టారు. రాష్ట్రం విడిపోతే రెండు రాష్ట్రాలు నష్టపోతాయని హెచ్చరించారు. నీటి కోసం నిత్యం తన్నుకునే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సమైక్యంగా ఉంచడం కోసం చివరి క్షణం వరకు పోరాడతానని శపథం చేశారు. ఆ శపథానికి కట్టుబడి ముందుకు సాగుతున్నారు

ప్రమాదాలపై కమిషన్ లే తప్ప ఫలితంలేదు

ప్రమాదాలపై కమిషన్ లే తప్ప ఫలితంలేదు:జగన్
పుట్టపర్తి: రైలు ప్రమాదాలు, వోల్వో బస్సు ప్రమాదాలు జరిగిన తరువాత కమిషన్లు వేస్తున్నారు గానీ, ఫలితం ఉండటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  బెంగళూరు నుంచి నాందేడ్ వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలు   అనంతపురం జిల్లా కొత్తచెరువు సమీపంలోకి వచ్చిన తరువాత  బి ఒన్ ఏసి కోచ్ లోమంటలు వ్యాపించి 26 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ప్రమాద వార్త తెలిసిన వెంటనే  తీవ్ర దిగ్భ్రాంతి చెందిన జగన్‌  కొత్తచెరువుకు చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించారు. క్షతగాత్రులను, మృతి చెందిన వారి కుటుంబీకులను  పరామర్శించారు. అనంతరం పుట్టపర్తి రైల్వే స్టేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

16 నెలల వ్యవధిలో మూడు రైలు ప్రమాదాలు జరిగాయి. అనేక మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే  విచారణకు కమిషన్ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తుంది. మళ్లీ మళ్లీ మూడు రైలు ప్రమాదాలు జరిగాయి. విచారణ నివేదికలు లేవు. ప్రమాదాలు ఎలా జరిగాయో తెలియదు. వివరాలు వెల్లడించరు. మళ్లీ ఈరోజు కూడా కమిషన్ వేస్తామంటారు. పలాన సమస్య వల్ల ఇంతమంది చనిపోయారు అని తెలియజేయరు. మళ్లీ ఆ సమస్య తలెత్తకుండా పరిష్కరించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడంలేదు. పాత  బోగీలు వాడుతున్నారని విమర్శించారు. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఓల్వో బస్సు ప్రమాదాలు నాలుగు జరిగాయి. నడిరోడ్డుపై నాలుగు ఓల్వో బస్సు లు దగ్ధమయ్యాయి. అనేక మంది చనిపోయారు. ఎన్ని ప్రమాద సంఘటనలు జరిగినా కారణాలు తెలియజేయడంలేదు. ఈ రకంగా ఇంతమంది చనిపోతుంటే కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాయని జగన్ ప్రశ్నించారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకుండా వారికి రక్షణ కల్పించాలని, భరోసా ఇవ్వాలని కోరారు.

విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎక్స్ గ్రేషియా ఎంత ఇచ్చారనేది కాదన్నారు. 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదని విమర్శించారు. ఎక్స్ గ్రేషియా 5 లక్షలలా, పది లక్షలా, 20 లక్షలా అనేది కాదని, ప్రజలకు భద్రత కల్పించమని కోరుతున్నామని చెప్పారు.

రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ


రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ
అనంతపురం : నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందిన వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా కొత్తచెరువుకు చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను, మృతిచెందిన వారి కుటుంబీకులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న మృతుల బంధువులు, కుటుంబాలను ఆయన ఓదార్చారు. ఈరోజు తెల్లవారుజామున కొత్తచెరువు వద్ద నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ మంటలు చెలరేగడంతో 26మంది సజీవదహనయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Jagan's speech in Appanapalli

జగన్ నేటి సమైక్య శంఖారావం యాత్ర రద్దు

 చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన  సమైక్య శంఖారావం యాత్ర నేడు రద్దు అయ్యింది. ఆదివారం నుంచి యాత్ర యథాతథంగా జరుగుతుందని ఆపార్టీ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
అనంతపురం జిల్లా కొత్తవలస వద్ద ఈరోజు తెల్లవారుజామున నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో ఘోర  ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనా స్థలానికి  ఆయన బయల్దేరి వెళ్లారు. బాధితులను జగన్ పరామర్శించనున్నారు. ఈనేపథ్యంలో సమైక్య శంఖారావం యాత్ర వాయిదా పడింది.

ఈ శాపం పాలకుల పాపం

ఈ శాపం పాలకుల పాపం

విశ్లేషణ:  ఎమ్‌వీఎస్  నాగిరెడ్డి,  వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర వ్యవసాయ విభాగ కన్వీనర్

 ఈ ఏడాది ముంగారు వర్షాలు రైతును మురిపించాయి. వారం రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా అలుముకున్న రుతుపవనాలు పుడమి తల్లిని పులకరింప చేశాయి. ఈ ఏడాదైనా మంచి పంట రాకపోతుందా అన్న ఆశతో.. నిరుటి ‘నీలం’ గాయాలను లెక్క చేయకుండా  రైతు కాడి పట్టాడు. అదనుకు బ్యాంకులు రుణాలివ్వకపోయినా.. అప్పో సప్పో చేసి పదును పోకముందే విత్తనాలు విత్తాడు. ఐదారెళ్లలో ఎప్పుడూ లేనంతగా సాగు విస్తీర్ణం పెరిగింది. చేలో పచ్చదనం.. రైతు ముఖంలో సంతోషం.. మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. అర్రొంచిన వరి, కళ్లంలో మొక్కజొన్న, అప్పుడప్పుడే విచ్చుకుంటున్న ‘తెల్ల బంగారం’ ఒక్కసారిగా కకావికలయ్యాయి. తీరా పంట చేతికొచ్చే దశలో సర్వం తుడిచిపెట్టుకుపోయి రైతు యథావిధిగా కట్టుబట్టలతో మిగిలిపోయాడు. నెత్తిపై అప్పులకుప్ప.. వచ్చిపోయే నాయకుల కల్లబొల్లి మాటలు మాత్రమే మిగిలాయి. ‘పంట నష్ట పరిహారం’ అందని ద్రాక్షయ్యింది. కౌలు రైతు పరిస్థితి మరీ ఘోరం. బ్యాంకులో అప్పు పుట్టదు... పంట పరిహారమూ రాదు. చావే బతుకుకన్నా నయమన్న దశకు చేరువవుతున్న కౌలు రైతును ప్రభుత్వం గాలికొదిలేసింది. బ్యాంకు రుణాల్లో ఒక్క శాతం వాటా కూడా కౌలు రైతుకు దక్కని పరిస్థితి. ప్రకృతి కన్నెర్ర ... పాలకుల నొసటి వెక్కిరింతల మధ్య 2013 రైతన్నను ఉక్కిరిబిక్కిరి చేసింది. కన్నీరు తుడిచే నాయకుడు, రైతుకు.. నేనున్నానంటూ భరోసా ఇచ్చే నేత... ‘వ్యవసాయాన్ని పండగ’గా మార్చే ప్రభుత్వం రాకపోతుందా అన్న ఆశే రైతును 2014లోకి నడిపిస్తోంది.

 కడగండ్ల సాగు

 మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ) వ్యవసాయ రంగం వాటా 14.5 శాతం కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీలో 21 శాతం. అంటే వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మొత్తంగా ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటాయి. రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో 120 లక్షల హెక్టార్లలో వివిధ పంటలసాగు జరుగుతుంది. ఇందులో 40 లక్షల హెక్టార్లు వరి. 21.5 లక్షల హెక్టార్లలో పత్తి, 22 లక్షల హెక్టార్లలో నూనె గింజలు. 70 శాతంగా ఉన్న ఈ మూడు పంటల సాగే వ్యవసాయ రంగానికి ఆయువుపట్టు. ఈ మూడు పంటల సాగులో 70 శాతం కౌలు రైతులు, చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు చేసేదే. నేటి పాలకులు చెబుతున్న 0 శాతం వడ్డీ రుణాలు వీరికి చేరడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నది కూడా వీరే. ప్రకృతి కన్నెర్రకు తోడు ప్రభుత్వ అలసత్వంతో 2013 కౌలు రైతుకు శాపంగా మారింది.  నీలం తుఫానుకు తడిసి, రంగుమారిన పత్తి కొనుగోలుకు ప్రభుత్వం చొరవ చూపలేదు. కూలి ఖర్చులు గిట్టని ధరకు తడిసిన పత్తిని అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక మంచి పత్తి విషయానికి వస్తే అధికారిక లెక్కల ప్రకారమే క్వింటాలుకి ఉత్పత్తి ఖర్చు రూ. 5,760 కాగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 3,900. వాస్తవంగా అమ్ముడుపోయింది మాత్రం రూ. 3,400-3,500కే. సీసీఐ సెంటర్లు దళారులకే తప్ప రైతులకు ఉపయోగపడలేదు. రైతుల ఉత్పత్తి మొత్తం వ్యాపారుల దగ్గరకు చేరిన తరువాతే ఎగుమతులను అనుమతించడంతో మేలో పత్తి ధర రూ. 5,000కు పైకి చేరింది.  రైతుకు పెట్టుబడి రాలేదుగానీ వ్యాపారులకు 20 నుంచి 30 శాతం లాభించింది. అలాగే ధాన్యం అమ్మకంలోనూ రైతులకు కనీస పెట్టుబడి రాలేదు. వరి పంటకు నష్టం వాటిల్లిన ప్రాంతాన్ని తగ్గించి నమోదు చేసి ఇన్‌పుట్ సబ్సిడీని మేమే పెంచాం అని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. ఇన్‌పుట్ సబ్సిడీ అంటే ఒక పంట నష్టపోయిన రైతుకు వెంటనే రెండవ పంట విత్తనాలకు, ఎరువుల కొనుగోలుకు ఇచ్చే సబ్సిడీ సదుపాయం. పైలిన్, హెలెన్, లెహర్ తుఫానుల తరువాత గత ఏడాది నాటి నీలం తుఫాను నష్టపరిహారాన్ని రైతులకు ఇప్పుడు చెల్లించే ప్రయత్నాన్ని చే స్తున్నారు. రబీకి మినుము సాగు డెల్టా కౌలు రైతులకు ప్రధాన ఆధారం. దీనికి ప్రభుత్వ మద్దతు ధర రూ. 4,300 కాగా మార్కెట్‌లో రూ. 3,500కు  కొనేవారు లేక రైతాంగం రోడ్డెక్కింది. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామంటూ తెలంగాణలో ఒకటి, కోస్తాంధ్రలో ఒకటి కొనుగోలు సెంటర్లను ప్రారంభించి, పది రోజులకే మూసివే శారు. పసుపు, మిర్చి, పెసర, కంది, జొన్న, సజ్జ ధరలు కుప్ప కూలి కనీస పెట్టుబడి కూడా తిరిగి రాలేదు.

 పాలకుల వెక్కిరింత

 ఏప్రిల్, మే నెలల్లో వచ్చిన వడగళ్ల వానలకు నిజామాబాద్ జిల్లాలో వరి పంట మొత్తం నేలపాలైంది. గాలివానలకు కడప జిల్లాలోనూ, మరికొన్ని చోట్ల అరటి తోటలు నేలపాలయ్యాయి. ఖరీఫ్ సీజన్‌లో కృష్ణా డెల్టాకు ఆగస్టు 6 వరకూ నీరు విడుదల కాకపోయినా ఖరీఫ్‌కు ప్రకృతి అనుకూలించింది. అనంతపురం సహా అన్ని జిల్లాల్లోనూ మంచి వర్షవర్షపాతం నమోదైంది. అన్ని పంటల సాగు పెరిగింది. కానీ అదే సమయంలో మహోధృతంగా వచ్చిపడ్డ పైలిన్ తుఫానుకు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు దెబ్బతిన్నాయి. అక్టోబర్ 20 వరకు రాష్ట్ర రైతాంగం  సంతోషంగానే ఉంది. అయితే అక్టోబర్ 22- 26 హెలెన్ తుఫానుకు కృష్ణా, గోదావరి డెల్టాలలోని వరి పైరు కొంత వరకూ ముంపునకు గురైంది. అత్యధికంగా తీతకు వచ్చిన పత్తి తడిసి, కాయలు కుళ్లి, పూత రాలి ఎకరానికి కనీసం 3 నుండి 5 క్వింటాళ్ల దిగుబడిని రైతులు నష్టపోయారు. రాష్ట్రంలో మొత్తం పత్తి ఉత్పత్తిలో 3/4వ వంతు తెలంగాణ జిల్లాల్లో పండుతుంది. అలానే మొక్కజొన్న కూడా. ఈ తుఫానుకు పత్తి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హెలెన్ తెరిపిచ్చేసరికి లెహర్ తుఫాను ముంచుకొచ్చింది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో కోతకు వచ్చిన వరి పైరు నేలవాలి, గింజలు మొలకెత్తి తీవ్ర నష్టం సంభవించింది. గత ఏడాది బీపీటీ 5204 (సోనామసూరి) రకానికి అధిక ధర పలకడంతో ఈ ఏడు అనేక జిల్లాల్లో దాన్నే ఎక్కువగా సాగుచేశారు. చిన్న వర్షానికి, గాలికి కూడా పడిపోయి,  తొందరగా మొలకెత్తే లక్షణమున్న ఈ రకం వేసినందువల్ల 50 నుంచి 65 శాతం వరకు పంట నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులే కౌలు రైతులుగా 75 శాతం సాగును చేస్తున్నారు. ప్రకటనలు తప్ప వీరికి ప్రభుత్వం నుండి అందిన సహాయం సున్నా. ధాన్యం పంటకు కోస్తాలాగా వేరుశనగ పంటకు అనంతపురం జిల్లా ప్రసిద్ధి. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం ఎంత వేరుశనగ సాగవుతుందో అంత ఒక్క అనంతపురం జిల్లాలోనే సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వర్షపాతం బాగున్నా తీత సమయంలో వచ్చిన తుఫాను, వర్షాలకు 60 శాతం వేరుశనగ పంటకు నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కోనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. వరుస తుఫానుల వల్ల పని పెరిగి, కూలి రేట్లు బాగా పెరిగిపోయాయి. సకాలంలో కూలీలు దొరక్క రైతులు వ్యవసాయమంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభావం కూడా ఎక్కువగా వ్యవసాయ కార్మికులైన కౌలు రైతులపైనే పడింది. కూలి చెల్లించాలంటే పంటను ఏదో ఒక ధరకు తక్షణం అమ్ముకోవలసిందే. క్వింటాలు ధాన్యం  ఉత్పత్తి ఖర్చు అధికారిక లెక్కల ప్రకారమే రూ. 1,760. అయితే ప్రభుత్వం ప్రకటించిన ధర రూ. 1,310 మాత్రమే. రంగుమాసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నేటికీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. నష్టాననికి గురైన నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పత్తి సాగుకు, కృష్ణా, గోదావరి డెల్టాల్లో వరికి నేటికీ నిబంధనలు సడలించలేదు.

 ‘కోతల’ క్షోభ

 ప్రస్తుతం మరలా రబీ సీజన్ నడుస్తోంది. రబీ వ్యవసాయం ఎక్కువగా విద్యుత్ పంపు సెట్లపై ఆధారపడే సాగుతుంది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 252 మిలియన్ యూనిట్లు ఉండగా, ఉత్పత్తి 241.199 మిలియన్ యూనిట్లుగా (డిసెంబర్ 23) ఉన్నది. కేవలం 5 శాతం విద్యుత్ కొరత ఉంటే వ్యవసాయరంగానికి విద్యుత్ సరఫరాను 7 గంటల నుండి 5 గంటలకు తగ్గించారు. అది కూడా సరిగా అందడం లేదని అప్పుడే సబ్‌స్టేషన్‌ల వద్ద రైతాంగం ధర్నాలు చేస్తున్నారు. ఏపాటి కొద్దిగ విద్యుత్ కొరత ఏర్పడ్డా వ్యవసాయ పంపు సెట్లకు కోత పెట్టడం అమానుషం. బోరుకు 7 గంటల పాటు కరెంట్ వస్తుందనే లెక్కన సాగుకు దిగిన రైతులకు ఏప్రిల్ నెలల్లో 4 గంటలు కూడా విద్యుత్ సరఫరా జరగక రైతులు పూర్తిగా నష్టపోయారు. రైతు ఒక ఎకరం సాగుతో 50 నుండి 60 మందికి పని కల్పిస్తున్నాడు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా రూ. 4 వేల నుండి 6 వేల వరకూ ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. నిజానికి ఇది సబ్సిడీ పథకం కానేకాదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు,  ఆహార భద్రతకు తప్పనిసరి కార్యక్రమం. అలాంటి విద్యుత్ సరఫరా సమయాన్ని కుదించి, దాన్ని కూడా నిరంతరం సరఫరా చేయకపోవడం మూలంగా రైతు ఆర్థికంగా కుదేలవుతున్నాడు. అటు ప్రకృతి కన్నెర్ర చేయగా నడ్డి విరిగిన రైతాంగానికి ప్రభుత్వ వైఖరి పెను శాపంగా మారింది. దీంతో రైతు ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ప్రాంతాలు కళ తప్పి వెలవెలబోతున్నాయి.          
http://www.sakshi.com/news/opinion/leaders-negligence-on-agriculture-92216

జన నీరాజనం

=దారి పొడవునా స్వాగతం
 =కర్ణాటక సరిహద్దు నుంచే పెల్లుబికిన అభిమానం
 =అందరితో ఆప్యాయంగా మాట్లాడిన జగన్

 

జననేతను చూసేందుకు పల్లెలన్నీ వెల్లువెత్తాయి. ఆత్మీయ నాయకుడికి ఆనందంగా స్వాగతం పలికాయి. జగన్‌ను చూడగానే జనం ఉప్పొంగారు. పసిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు జేజేలు పలికారు.
 
సాక్షి, తిరుపతి: జిల్లాలో జననేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం పలమనేరు నియోజకవర్గంలో చేపట్టిన రెండో విడత సమైక్య శంఖారావానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రోడ్లపై గంటల తరబడి జననేత కోసం ఎదురు చూశారు. ఆయన రాగానే బాణా సంచా పేల్చి, పూలమాలలు వేసి అభిమానం చాటుకున్నారు. ఆయన ఏ గ్రామం వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
 
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కోసం కర్ణాటక సరిహద్దు గ్రామం నంగిలి వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో గజమాలతో ఎదురు చూశారు. సరిగ్గా 11.15 గంటలకు ఆయన నంగిలి చేరుకోగానే బాణా సంచా పేల్చి ఆహ్వానించారు. కర్ణాటకకు చెందిన జనతాదళ్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు జగన్‌మోహన్‌రెడ్డిని అక్కున చేర్చుకున్నారు. శనిగపల్లి సర్పంచ్ ప్రకాష్ రెడ్డి, మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాసులుతో పాటు, రెడ్డీస్ యూత్ అసోసియేషన్ మోహన్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

అక్కడి నుంచి బయలుదేరి ఆంధ్ర సరిహద్దు జంగాలపల్లె వద్దకు చేరుకోగానే ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ఏఎస్.మనోహర్, సుబ్రమణ్యంరెడ్డి, షమీమ్ అస్లాం, ఆదిమూలం, బియ్యపు మధుసూదన్ రెడ్డి, తిరుపతి పార్లమెంటరీ పరిశీలకుడు వరప్రసాదరావు, కాణిపాకం మాజీ ఈవో కేశవులు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ రెడ్డెమ్మ తదితరులు స్వాగతం పలికారు. అప్పటికే జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి బెంగళూరు నుంచి కాన్వాయ్‌లో వచ్చారు.

అక్కడి నుంచి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం యాత్రను జననేత ప్రారంభించారు. గంగవరం మండలం ఆలకుప్పం గ్రామం వద్ద వేచి ఉన్న అభిమానులను అప్యాయంగా పలకరించారు. ఆయనకు పార్టీ నాయకులు రాజప్ప, కిశోర్‌నాయుడు స్వాగతం పలికారు. సమీపంలోని హెచ్2 అప్పిరల్స్ పరిశ్రమ వద్దకు చేరుకుని, అక్కడ పని చేస్తున్న వారిని పలకరించారు. అనంతరం పెద్దఊగిని గ్రామంలో వేచి ఉన్న ముస్లిం మహిళల వద్ద వాహనం దిగి  మాట్లాడారు. గుండ్రాజుపల్లె ఏబీ ఇండ్ల దగ్గర భాస్కర్, రాజన్న తదితరులు ఓంశక్తి మాల వేసుకున్న మహిళలతో కలసి హారతులతో స్వాగతం పలికారు.

పొన్నమాకులపల్లె వద్ద భారీ ఎత్తున  బాణా సంచా పేల్చారు. అక్కడ పార్టీ జెండా ఆవిష్కరించారు. కేలపల్లె క్రాస్ వద్ద సైతం జనం గుమిగూడారు. పత్తికొండకు చేరుకుని అక్కడ వైఎస్‌ఆర్ విగ్రహవిష్కరణ చేసి, సభలో ప్రసంగించారు. పార్టీ నాయకుడు కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సభకు వేలాది మంది హాజరయ్యారు. అటుకుమాకులపల్లె వద్ద వికలాంగ అభిమానులను పలకరించారు. క్యాటల్ ఫాం వద్ద వేలమంది జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. అక్కడే ఎమ్మాసిస్ ఫ్యాక్టరీ కార్మికులను, పాలిటెక్నిక్, వెటర్నరీ విద్యార్థులను పలకరించారు. ‘బాగా చదువుకోవాలి’ అని విద్యార్థులకు సూచనలిచ్చారు.

అక్కడి నుంచి ప్రతి వంద అడుగులకు ఒక బృందం నిల్చుని, జగన్‌మోహన్‌రె డ్డి కాన్వాయ్‌ని అడ్డుకుని మాట్లాడి పంపించారు. నక్కపల్లి వద్ద మహానేత వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పలువురు వృద్ధులు జననేతతో మాట్లాడే యత్నం చేశారు. అక్కడి నుంచి గాంధీనగర్ మీదుగా కొలమాసనపల్లె చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున టపాకాయలు పేల్చారు. కొద్దిసేపు అభిమానులను ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు.

చిన్న పిల్లలు, విద్యార్థుల తలపై చేతులు పెట్టి ఆశీర్వదించడంతో వారు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. సమీపంలో ఉన్న పార్టీ నాయకురాలు రత్నారెడ్డి ఇంటికి వెళ్లి కాసేపు విరామం తర్వాత శంకర్రాయలపేటకు చేరుకున్నారు. అక్కడ ఉన్న అభిమానులతో కొద్దిసేపు గడిపి, అప్పినిపల్లె చేరుకుని, చేలూరి జగన్నాథం కుటుంబాన్ని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఓవీ.రమణ, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, డాక్టర్ సునీల్ కుమార్, రవిప్రసాద్, పుణ్యమూర్తి, పూర్ణంతో పాటు యువజన కన్వీనర్ ఉదయకుమార్, చిందేపల్లి మధుసూదన్ రెడ్డి, వైఎస్‌ఆర్ సేవాద ళ్ నాయకుడు చొక్కారెడ్డి జగదీశ్వరరెడ్డి, హర్ష, వై.సురేష్ పాల్గొన్నారు.
 

ప్రసంగించిన ప్రతి చోటా అపూర్వ ఆదరణ

సాక్షి, తిరుపతి: సమైక్య శంఖారావం పర్యటనలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కర్ణాటక నుంచి జిల్లాలోకి ప్రవేశించిన ఆయన పత్తికొండలో తొలి ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే యువకులు ఉద్యోగాలకు ఎక్కడకు వెళ్లాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కాలర్ పట్టుకుని అడగాలన్నారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

రాష్ట్రం విభజించవద్దని, తెలుగువారిని చీల్చవద్దని సోని యా గాంధీకి వినబడేలా అరవాలని కోరడంతో, గట్టిగా ‘వద్దు వద్దు’ అని అరిచారు. అయితే సోనియా గాంధీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుగులో చెబితే అర్థం కాదని, ఇంగ్లిషులో  ‘నో’ చెప్పాలని, చేతులెత్తి అరవాలని అనడంతో ప్రజలు ‘నో’ అంటూ గట్టిగా అరిచారు. రెండు చేతులు పెకైత్తి నినాదాలు చేశారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ఎడారిలా మారిపోతుందని, దీంతో ప్రజలు ఎలా బతకాలని జననేత ప్రశ్నించినపుడు ప్రజలు హోరుమని అరిచి, ఆయన ప్రసంగానికి మద్దతు పలికారు.

మరో సభ అప్పినిపల్లిలో జరగగా, అక్కడ కూడా ఆయన ప్రసంగానికి విశేష ఆదరణ లభించింది. వైఎస్ మరణించి, నాలుగేళ్లు గడుస్తున్నా, ఆయనను గుండె ల్లో పెట్టుకుని, రాత్రి సమయంలో కూడా తన సభకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలపగా, దానికి ప్రజల నుంచి ‘వైఎస్ ఎప్పటికీ మా గుండెల్లో ఉంటాడు’ అన్నారు. రాష్ట్రాన్ని విభజించినా పర్వాలేదని, ఇప్పుడు మన పిల్లలు చెన్నైలోను, బెంగళూరులోను ఉద్యోగాలు చేయడం లేదా అని ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు లాంటి వారు మన నాయకులా అని జననేత ప్రశ్నిస్తే ‘కాదు కాదు’ అని సమాధానం చెప్పారు.

చెన్నైలో, బెంగళూరులో ఆంధ్ర  రిజిస్ట్రేషన్‌తో వాహనాలు కనిపిస్తే వారి పట్ల ఏ విధం గా అక్కడి వారు ప్రవర్తిస్తారో చంద్రబాబు నాయుడుకు తెలియదా అని జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.


ప్రసంగించిన ప్రతి చోటా అయనకు అపూర్వ ఆదరణ లభించింది. కొన్ని చోట్ల ఆయన ప్రసంగం లేక పోయినా, ప్రజలు కోరడంతో మాట్లాడారు. నక్కనపల్లి, కొల మాసనపల్లెలో సైతం ప్రసంగించారు.

బాబూ.. అఫిడవిట్లు ఎందుకివ్వలేదు?

బాబూ.. అఫిడవిట్లు ఎందుకివ్వలేదు?
విభజన బిల్లుపై ‘సమైక్య సింహం’ సంతకమెందుకు చేశారు?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ధ్వజం


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి అఫిడవిట్లు ఎందుకు ఇవ్వలేదని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎవరినీ వెంట తీసుకెళ్లకుండా చంద్రబాబు ఒక్కరే రాష్ట్రపతిని కలిశారంటే రాష్ట్రాన్ని విభజించమని చెప్పడానికేనని అనుమానం వ్యక్తం చేశారు. ‘సమైక్య సింహం’ అని తన తాబేదార్లతో పొగిడించుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజన బిల్లు వస్తే దానిని తిప్పి పంపకుండా సంతకమెందుకు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు.
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే చిత్తశుద్ధి ఉంటే బాబు, కిరణ్ తో పాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తమ ఎమ్మెల్యేల చేత అఫిడవిట్లు ఇప్పించి ఉండేవారన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చారని.. అయితే సీఎం, స్పీకర్, బాబు మాత్రం అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరగాలని కోరుకుంటున్నారని విమర్శించారు. బిల్లుపై చర్చలో పాల్గొనడం అంటే రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లే కదా అని ఆయన ప్రశ్నించారు.
విభజన ప్రక్రియ ముందుకు పోతుంటే ఏ దశలోనైనా కిరణ్ అడ్డుకునేందుకు ప్రయత్నించారా అని ప్రశ్నిం చారు. చంద్రబాబు విభజన కోరుకుంటున్నారో, సమైక్యం కావాలనుకుంటున్నారో తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. స్పీకర్‌కు బుద్ధి, జ్ఞానం ఉందా అని తమ నాయకుడు జగన్ అంటే కొందరు సభాహక్కుల తీర్మానం పెడతామని బయలుదేరారని, కానీ ఆయన అడిగినదాంట్లో తప్పేమీ లేదన్నారు. బుద్ధి, జ్ఞానం అనే మాటలు బూతు పదాలేమీ కావన్నారు. కాంగ్రెస్ అధిష్టానం స్పీకర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని, వారు చెప్పినట్టే స్పీకర్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి అక్కడ విభజనపై చర్చ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్న స్పీకర్‌కు అక్కడి అసెంబ్లీ విభజనకు ముందుగానే ఏకగ్రీవ తీర్మానం చేసిన సంగతి గుర్తు చేస్తూ.. బుద్ధి, జ్ఞానం ఉందా అని తమ నాయకుడు ప్రశ్నించారని, దీనిని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని అంబటి కోరారు. అసలు ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నాయకునికీ బుద్ధి, జ్ఞానం ఉందా? ఉంటే ఇంత అడ్డగోలుగా జరుగుతున్న విభజనకు సహకరిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. సభా హక్కుల తీర్మానాలకు తాము బెదరబోమని, రాష్ట్ర సమైక్యత కోసం సర్వశక్తులూ ఒడ్డుతామని అంబటి చెప్పారు.
 

నేడు జగన్ పర్యటన ఇలా

నేడు జగన్ పర్యటన ఇలా
పలమనేరు, న్యూస్‌లైన్ : రెండో విడత సమైక్య శంఖారావంలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలంలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వా మి, పార్టీ ప్రోగ్రామ్ కన్వీనర్ తలశిల రఘురామ్ పేర్కొన్నారు.

శనివారం ఉదయం పెద్దవెలగటూరు నుంచి పర్యటన సాగుతుంది. రాజుపల్లె, కరసనపల్లె కాలనీ, కరసనపల్లె, ముతుకూరు, పలమనేరు మెయిన్ రోడ్డు క్రాస్, తులసమ్మ గుడి, లింగాపురం క్రాస్‌లో రోడ్‌షో ఉంటుంది. పెద్దపంజాణిలో మహా నేత విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. బసవరాజుకండిగ, కోగిలేరు, గుడిపల్లె క్రాస్‌లో రోడ్‌షో నిర్వహిస్తారు.

రాయలపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కమ్మపాళెంలో డోలు నాగరాజు కుటుంబాన్ని ఓదారుస్తారు. అక్కడి నుంచి  కొళత్తూరు, తుర్లపల్లె క్రాస్, తుర్లపల్లె, కొత్తూరుల్లో రోడ్‌షో జరుగనుంది. పుంగనూరు నియోజకవర్గంలోని బత్తాలపురంలో ఓదార్పు జరుగుతుంది. ఆపై తిరిగి కొళత్తూరుకు వచ్చి కెళవాతిలో జగన్‌మోహన్‌రెడ్డి బస చేస్తారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్యశంఖారావం 2013-12-27 photos

Written By news on Friday, December 27, 2013 | 12/27/2013




















వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం


http://www.ysrcongress.com/image_gallery2/Sri-YS-Jagan-Mohan-Reddy-Samaikya-Sankharavam-2013-12-27/

మన మహానగరం మనకు ఉండాలి: జగన్

మన మహానగరం మనకు ఉండాలి: జగన్
చిత్తూరు: :  దశాబ్దాల తరబడి నిర్మించుకున్న మన మహానగరం మనకు ఉండాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జగన్ సమైక్య శంఖారావం యాత్రను శుక్రవారం చిత్తూరు జిల్లాలో కొనసాగిస్తున్నారు.

నీటి కోసం నిలదీయాల్సిందిపోయి టీడీపీ అధ్యక్షుడు విభజనకు సహకరిస్తున్నారని విమర్శించారు. నీళ్ల కోసం ప్రజలు చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిల చొక్క పట్టుకుని అడిగితే ఏం సమాధానం చెబుతారని జగన్ ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓట్ల కోసం, సీట్ల కోసం మన పిల్లల భవిష్యత్ తో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలకు దమ్ము, దైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలవాలని జగన్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా సమైక్య నినాదం వినిపించే దమ్ము, ధైర్యం తనకుందని జగన్ అన్నారు.

YS Jagan speech in Nakkalapalli, Chittoor district

YS Jagan only can keep the state united

మోత్కుపల్లి నోరు అదుపులో పెట్టుకో:గట్టు

మోత్కుపల్లి నోరు అదుపులో పెట్టుకో:గట్టు
హైదరాబాద్:టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులుపై వైఎస్సార్ సీపీ నేత గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. మోత్కుపల్లి నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని హెచ్చరించారు. తప్పుడు కూతలు కూయడంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గర ప్రతేక శిక్షణ పొందావా?అని గట్టు ప్రశ్నించారు. ఆకాశంపైకి ఉమ్మెస్తే ఏం జరుగుతుందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. అధ్యక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు విభజన వాదా?సమైక్యవాదా?చెప్పగలవా అని గట్టు నిలదీశారు. గతంలో బాబును తిట్టిన తిట్లు నీకు గుర్తులేవా?అని ప్రశ్నించారు.

CM, Naidu immune to people's voice: Jagan

నీళ్లు, ఉద్యోగాల కోసం ఎక్కడికెళ్లాలి: వైఎస్ జగన్

నీళ్లు, ఉద్యోగాల కోసం ఎక్కడికెళ్లాలి: వైఎస్ జగన్
రాష్ట్రాన్ని విభజిస్తే.. నీళ్ల కోసం ఎక్కడికెళ్లాలో చంద్రబాబును, ఉద్యోగాల కోసం ఎక్కడికెళ్లాలో కిరణ్ కుమార్ రెడ్డిని అడగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పత్తికొండలో సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. అసలు చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్రకు అనుకూలంగా ఎందుకు లేఖ ఇవ్వట్లేదని ఆయన నిలదీశారు.

మనమంతా ఒక్కటైనప్పుడే సమైక్యాంధ్ర సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో మనందరం ఒకే తాటిపై నడుద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. 30 ఎంపీ స్థానాలను మనమే గెలిపించుకుందామని, అప్పుడు రాష్ట్రాన్ని ఎలా విడగొడతారో చూడొచ్చని తెలిపారు.

బుద్ధి, జ్ఞానం అంటే బూతు మాటలా ?

బుద్ధి, జ్ఞానం అంటే బూతు మాటలా ?: అంబటి
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పట్ల ప్రశ్నించడం తప్పవుతుందా? అని ఆయన అన్నారు. బుద్ధి, జ్ఞానం అన్న మాటలు బూతు పదాలా? అని అంబటి ఘాటుగా ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సీపీ గతంలో పెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసిన ఎమ్మెల్యేల విషయంలో కుట్ర జరగలేదా? అని ఆయన మండిపడ్డారు. ప్రజల హక్కులను కాలరాసేలా నిర్ణయం తీసుకుంటే ఎవరినైనా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని అంబటి చెప్పారు.

రాష్ట్రపతిని కలిసిన అనంతరం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు చేసిన వ్యాఖ్యల్లో పెద్ద వ్యత్యాసం లేదని ఆయన అన్నారు. టీడీపీ, టీఆర్‌ఎస్‌లది ఒకే వైఖరిగా ఉందని చెప్పారు. చంద్రబాబు తమరు ఎందుకు రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇవ్వడం లేదని అంబటి రాంబాబు అడిగారు. అలాగే సమైక్య సింహం అంటున్న సీఎం కిరణ్‌ విభజన బిల్లును ఎందుకు తిప్పిపంపలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. స్పీకర్‌ మనోహర్ అధిష్టానం ఆదేశాలమేరకే నడుస్తున్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, స్పీకర్‌కే కాదు సామాన్య ప్రజలకు కూడా ప్రివిలైజ్ ఉంటుందని అంబటి రాంబాబు చెప్పారు.

జగన్ స్ఫూర్తితో అఫిడవిట్లు ఇస్తాం: జేసీ

అనంతపురం : సమైక్యాంధ్ర సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ స్ఫూర్తితో తాము కూడా సమైక్య అఫిడవిట్లు ఇస్తామని ఆయన తెలిపారు.

జగన్ కి సమైక్యవాదుల ఘన స్వాగతం

జగన్ ను సమైక్యవాదుల ఘన స్వాగతంవీడియోకి క్లిక్ చేయండి
పలమనేరు :  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమైక్యవాదులు చిత్తూరు జిల్లాలో ఘన స్వాగతం పలికారు. రెండో విడత సమైక్య శంఖారావంతో పాటు ఓదార్పు యాత్రను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అంతకు ముందు జగన్ కు జంగాలపల్లె వద్ద భారీ స్వాగతం లభించింది. పలమనేరు నియోజకవర్గం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అమరనాథ రెడ్డి, జిల్లా కన్వినర్ నారాయణస్వామి, అభిమానులు, పార్టీ నేతలు, సమైక్యవాదులు ఘన స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు, పార్టీ పతాకాలను ఏర్పాటు చేశారు.

జగన్ పర్యటన వివరాలు :
జగన్‌మోహన్‌రెడ్డి బెంగళూరు నుంచి శుక్రవారం ఉదయం  జంగాలపల్లెకు చేరుకున్నారు. అక్కడ నుంచి పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని గండ్రాజుపల్లె, నాలుగురోడ్ల కూడలి మీదుగా పత్తికొండకు వస్తారన్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు.
అనంతరం మామడుగులో రోడ్‌షో నిర్వహించి ఆర్‌టీఏ చెక్‌పోస్టు మీదుగా పలమనేరు మండలంలోని నక్కపల్లెకు చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి కొలమాసనపల్లె రోడ్‌షోల్లో పాల్గొంటారు.

 అక్కడ నుంచి పెద్దపంజాణి మండలంలోని శంకర్రాయలపేట మీదుగా వెళ్లి అప్పినపల్లెలో చేలూరి జగన్నాథం కుటుంబాన్ని ఓదారుస్తారు. అనంతరం అక్కడి నుంచి కుంబార్లపల్లె, సంపల్లె మీదుగా పర్యటన సాగుతుంది. పెద్దవెలగటూరు గ్రామంలో రోడ్‌షో నిర్వహించి అక్కడే జగన్‌ రాత్రికి  బస చేస్తారు.

శనివారం ఉదయం రాజుపల్లె, కరసనపల్లె, ముతుకూరు, పెద్దపంజాణి, బసవరాజు కండిగ, కోగిలేరుల మీదుగా వెళ్లి రాయలపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కమ్మపాళెంలో డోలు నాగరాజు కుటుంబాన్ని ఓదారుస్తారు. అక్కడి నుంచి కొళత్తూరు, తుర్లపల్లె, కొత్తూరుల మీదుగా వెళ్లి కెళవాతిలో రాత్రి బస చేస్తారు. 29వ తేదీన వీరప్పల్లె మీదుగా వెళ్లి చౌడేపల్లె మండలంలోని దాదేపల్లె, దుర్గ సముద్రంలో తోటి సంకరమ్మ కుటుంబాన్ని ఓదారుస్తారు.

అలాగే చారాలలో వైఎస్సార్ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. అక్కడి నుంచి శెట్టిపల్లె చౌడేపల్లె, ఠాణాఇండ్లు, పుదిపట్ల మీదుగా లద్దిగం చేరుకుని, అక్కడ అంజప్ప కుటుంబాన్ని ఓదారుస్తారు.. చదళ్ల, భగత్‌సింగ్ కాలనీల మీదుగా పుంగనూరుకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు రాత్రికి అక్కడే బస చేసి 30వ తేదీ రాంపల్లె, సుగాలీమిట్ట, ఈడిగపల్లె, మొలకలదిన్నెల మీదుగా మదనపల్లెకు చేరుకుంటారు. గొల్లపల్లెలో జరిగే ఓదార్పులో పాల్గొంటారు.  తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెల 29వ తేదీన తొలివిడత సమైక్య శంఖారావం ప్రారంభించిన విషయం తెలిసిందే.

నేటి నుంచి రెండో విడత సమైక్య శంఖారావం

నేటి నుంచి రెండో విడత సమైక్య శంఖారావం
=రెండు కుటుంబాలకు ఓదార్పు
 =భారీ స్వాగత ఏర్పాట్లు

 
సాక్షి, తిరుపతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రెండవ విడత సమైక్య శంఖారావం జిల్లాలో శుక్రవారం ప్రారంభం కానుంది. బెంగళూరు నుంచి ఉదయం పలమనేరు సమీపంలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు చేరుకునే ఆయనకు జంగాలపల్లె వద్ద భారీ స్వాగత ఏర్పాట్లు చేపట్టారు. పలమనేరు నియోజకవర్గం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అమరనాథ రెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తదితరులు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఆయనకు పలు ప్రాంతాల్లో స్వాగత ఏర్పాట్లు చేపట్టారు. భారీ ఎత్తున ఫ్లెక్సీలు, పార్టీ పతాకాలను ఏర్పాటు చేశారు.

వీరితో పాటు జిల్లాలోని అన్ని నియోజక వర్గాల సమన్వయకర్తలు జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలుకనున్నారు. నాలుగు రోడ్ల వద్ద మధ్యాహ్నం 12 గంటలకు జరిగే బహిరంగ సభలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. సభకు హాజరయ్యేందుకు పలమనేరు నుంచే కాకుండా సరిహద్దు నియోజకవర్గాలైన చిత్తూరు, పుంగనూరు లాంటి ప్రాంతాల నుంచి  అభిమానులు చేరుకుంటున్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పంలో గత నెల 29వ తేదీన తొలివిడత సమైక్య శంఖారావం ప్రారంభించిన విషయం తెలిసిందే.

సమైక్య శంఖారావానికి ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. మూడు రోజుల పాటు జరిగిన ఆ యాత్ర పలమనేరు నియోజకవర్గంలోని బెరైడ్డిపల్లెలో ముగిసింది. రెండవ విడత యాత్ర అదే నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నారు. పలమనేరు, పుంగనూరు నుంచి మదనపల్లి వరకు ఈ యాత్ర కొనసాగే అవకాశం ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు.

సమైక్య శంఖారావంతో పాటు, వైఎస్.రాజశేఖరరెడ్డి మరణించడాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను  జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్చుతారు. పలమనేరు నియోజకవర్గంలో రెండు కుటుంబాలను ఓదార్చనున్నారు. రెండవ విడత సమైక్య శంఖారావంలో నాలుగురోడ్ల జంక్షన్ వద్ద బహిరంగ సభ ముగించుకుని, పత్తికొండ, మామడుగు, ఆర్‌టీఏ చెక్‌పోస్టు, నక్కపల్లి, కొలమాసన పల్లి, శంకర్రాయలపేట, అప్పినపల్లి, పెద్దవెలగటూరులలో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తారు. ఈ కార్యక్రమాలతో పాటు వైఎస్‌ఆర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.
 

విభజన ఆపండి

 రాష్ట్రపతికి జగన్ వినతి
* సమైక్య అఫిడవిట్లు ఇచ్చిన పార్టీ ప్రజాప్రతినిధులు
* ఆంధ్రప్రదేశ్‌ను విభజించటానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు
* రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారు
* సార్వత్రిక ఎన్నికలకు ముందు విభజన ఏమాత్రం సరికాదు
* తెలంగాణలో కొన్ని సీట్ల కోసమే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది
* సర్కారియా, పూంచీ కమిషన్ల సిఫారసులను విస్మరించింది
* విధివిధానాలు, కనీస సంప్రదాయాలను పక్కనపెట్టింది
* రాష్ట్రాన్ని కలిపి ఉంచటమే మేలన్న శ్రీకృష్ణ కమిటీ సిఫారసులనూ పట్టించుకోలేదు.. వీటిపై రాష్ట్ర ప్రజలతో చర్చించనూ లేదు
* దీర్ఘ కాలికంగా ఉన్న ఇతర ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లను పక్కనపెట్టి.. తెలంగాణ అంశాన్ని మాత్రమే కేంద్రం తెరపైకి తెచ్చింది
* గతంలో ‘విదర్భ’ను మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల వారు వ్యతిరేకిస్తున్నారని పక్కనపెడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది
* విభజనపై కేంద్రం చర్యలు ఏ మాత్రం చెల్లుబాటు కావు
* రాజ్యాంగాధినేతగా విభజనను ఆపివేయాలని కోరుతున్నాం
* ప్రణబ్‌కు జగన్ సహా వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధుల వినతిపత్రం
 
సాక్షి, హైదరాబాద్: ఒక ప్రాతిపదిక, పద్ధతి లేకుండా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించటాన్ని ఆపివేయాలని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విన్నవించింది. ఒక సంప్రదాయం, విధానమంటూ ఏదీ అనుసరించకుండా.. అదీ మరికొద్ది కాలంలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన తరుణంలో రాష్ట్రాన్ని విభ జించాలన్న నిర్ణయానికి రావడం ఏమాత్రం సమంజసం కాదని విజ్ఞప్తి చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్‌ముఖర్జీని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని సమర్పించింది.

విభజన అంశంలో రాజ్యాంగపరమైన అంశాలు, గతంలో పాటించిన విధివిధానాలన్నింటినీ తెలియజేస్తూ ఈ సందర్భంగా నాలుగు పేజీల వినతిపత్రాన్ని రాష్ట్రపతికి అందజేసింది. దాంతో పాటుగా.. జగన్‌తో కలిసి వెళ్లిన ప్రజాప్రతినిధులు విభజనకు వ్యతిరేకంగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ స్వీయ అఫిడవిట్లను రాష్ట్రపతికి అందజేశారు. వినతిపత్రంతో పాటు స్వీయ అఫిడవిట్లను రాష్ట్రపతి సావధానంగా పరిశీలించారు. ముందుగా తన వెంట వెళ్లిన ప్రజాప్రతినిధులను పరిచయం చేసిన అనంతరం రాష్ట్రపతికి జగన్ వినతిపత్రాన్ని సమర్పించారు.

రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారని, మెజారిటీ ప్రజల అభిమతానికి భిన్నంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ విభజనను ఎందుకు వ్యతిరేకిస్తున్నామనే అంశంతో పాటు.. రాష్ట్రాల విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వాలు గతంలో పాటించిన పద్ధతులు, ఏదైనా ఒక కమిషన్, కమిటీ సిఫారసుల మేరకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను ఉపయోగించి రాష్ట్రాలను విభజించాలన్న జస్టిస్ పూంచీ కమిషన్ సూచనలు, ఇతర అంశాలను వినతిపత్రంలో పొందుపరిచారు. అందులోని ముఖ్యాంశాలివీ...
ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉన్న రాష్ట్రాల్లో ఒకటని కేంద్రం ఏర్పాటు చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తేల్చింది. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు, మెజారిటీ ఎమ్మెల్యేలు విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. క్రమంగా పార్టీ పరపతి కోల్పోతూ ఒకదాని తరువాత మరొక  రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటమి పాలవుతూ వస్తున్న కాంగ్రెస్.. తెలంగాణలో కొన్ని సీట్ల కోసం ఈ విభజనకు నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించాలని చూస్తోంది.

కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన జస్టిస్ సర్కారియా కమిషన్, జస్టిస్ పూంచీ కమిషన్‌లు చేసిన సిఫారసులను, రాజ్యాంగపరంగా నెలకొల్పిన సంప్రదాయాలను కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తూ సమాఖ్య స్ఫూర్తిని విస్మరించింది. రాష్ట్రాల విభజనకు వీలు కల్పించే రాజ్యాంగంలోని మూడో అధికరణ కింద చర్యలు తీసుకునే ముందు ఏదైనా కమిషన్, కమిటీ చేసిన సిఫారసులను ప్రాతిపదికగా తీసుకోవటం కానీ, లేదా విడగొట్టాలనుకున్న రాష్ట్ర అసెంబ్లీ నుంచి విభజనకు అనుకూలంగా తీర్మానం కానీ తీసుకోవాల్సి ఉంటుందని ఈ 2 కమిషన్లు చేసిన సిఫారసులను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు.

ఇతర రాష్ట్రాల విభజన సందర్భంగా గతంలో పాటించిన సంప్రదాయాలు, విధానాలను ఒక్క ఆంధ్రప్రదేశ్ విషయంలోనే ఎందుకు పక్కన పెట్టి కుతంత్రాలు పన్నుతోంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై అధ్యయనం చేసి 461 పేజీల నివేదిక ఇచ్చిన శ్రీకృష్ణ కమిటీ కూడా రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని గట్టిగా చెప్పింది. (శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో రాష్ట్రాన్ని కలిపి ఉంచడమే మేలన్న విషయాన్ని నొక్కి చెప్పిన విషయాన్ని ఇక్కడ పొందుపర్చారు.)

శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన ఇంతటి ప్రాధాన్యం గల నివేదికపై ఆయా ప్రాంతాల వారితో విస్తృతంగా చర్చించకపోవడం దురదృష్టకరం. కనీసం అసెంబ్లీ నుంచి తీర్మానం కూడా తీసుకోకుండా ఉన్నపళంగా అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. న్యాయపరమైన ఈ కమిటీ నివేదికను కేంద్రం ఎందుకు విస్మరించిందో ఊహలకు అందని విధంగా ఉంది. కమిటీ చేసిన సిఫారసులు కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయనే ఉద్దేశంతోనే కాదా?

*  దీర్ఘ కాలికంగా కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఉన్నప్పటికీ ఒక్క తెలంగాణను మాత్రమే కేంద్ర ప్రభుత్వం తెరమీదకు తీసుకురావడం కలవరపాటుకు గురిచేస్తున్న అంశం. నాగపూర్‌ను రాజధానిగా చేస్తూ విదర్భ రాష్ట్రం ఏర్పాటు చేయాలని తొలి రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిటీ 1956లో సిఫారసు చేసింది. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని అక్కడి అసెంబ్లీ మూడేళ్ల కిందట తీర్మానం చేసి పంపిన విషయాన్ని కేంద్రం పక్కనపెట్టింది.

కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అప్పటి వరకూ అనుసరిస్తూ వచ్చిన విధానాలను కూడా విస్మరించారు. 2000 సంవత్సరంలో విదర్భ అంశం ప్రస్తావనకు వచ్చినపుడు అప్పటి కేంద్ర హోంమంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటనలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు తాము అనుసరిస్తున్న విధానాలను పేర్కొంటూ విదర్భ రాష్ట్రం కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నా మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల ప్రజలు మాత్రం వ్యతిరేకిస్తున్నారని వివరించారు. అందువల్ల దానిని పక్కనపెడుతున్నామని వెల్లడించారు.

*  పైన పేర్కొన్న రాజ్యాంగపరమైన సంప్రదాయాల నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం చెల్లుబాటు కావు. ప్రజాస్వామ్యానికి, చట్టానికి కట్టుబడి ఉన్న ఒక రాజకీయ పార్టీగా మేము ఇటీవల దేశ ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి అనేకసార్లు ఈ అప్రజాస్వామిక విభజనను అడ్డుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్‌లను కూడా అసెంబ్లీని సమావేశ పరచి రాష్ట్ర విభజనపై అభిప్రాయం తీసుకోవాల్సిందిగా కోరాం. కానీ దురదృష్టవశాత్తూ విభజన ప్రక్రియ మాత్రం ఎలాంటి సంప్రదాయాలు, విధానాలు పాటించకుండా ముందుకే పోతోంది.

*  ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (2013) ముసాయిదాను పూర్తి తొందరపాటుతో చేసినట్లుగా స్పష్టమవుతోంది. అసెంబ్లీకి కూడా అంతే వేగంగా పంపారు. బిల్లు ఉద్దేశాలు, కారణాలు కూడా పొందుపరచకుండా, అనేక ప్రధాన అంశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా బిల్లును పంపారు. దీనిని బట్టి కేంద్రం దీనిపై ఎలాంటి చర్చా విపులంగా జరగకూడదని భావించినట్లుగా ఉంది. ఇలా చర్చ జరగకపోవడం వల్ల 8.4 కోట్ల మంది ప్రజలు గల రాష్ట్రంపై ఆ ప్రభావం పడుతుంది.

*  ఇంతటి ముఖ్యమైన అంశం మీద రాష్ట్రంలోని సీనియర్ నాయకులకు మెజారిటీ శాసనసభ, శాసనమండలి సభ్యుల అభిప్రాయాలపై ఏ మాత్రం గౌరవం లేనట్లుగా వారి ప్రకటనలనుబట్టి అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే అసెంబ్లీ తీర్మానం గురించి అసలు పట్టించుకోవడం లేదు. అందుకే మేం విభజనను గట్టిగా వ్యతిరేకిస్తూ అత్యున్నతమైన రాజ్యాంగ అధినేత అయిన మీకు అఫిడవిట్లను సమర్పిస్తున్నాం.

*  మా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్లు వేసి అనర్హతకు గురైన ఎమ్మెల్యేలం.. రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకిస్తూ అఫిడవిట్లను సమర్పిస్తున్నాం. అవిశ్వాసంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేసిన ఎమ్మెల్యేలను వెంటనే అనర్హతకు గురి చేయకుండా.. కొంత కాలం సాగదీసి వారిని ఎమ్మెల్యేలుగా లేకుండా చేసేందుకు ఆలస్యంగా నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తున్నాం. ఉపఎన్నికలు జరిగి ఉంటే వారంతా తిరిగి ఎన్నికైతే రాష్ట్ర విభజనను వ్యతిరేకించే వారేనని మనవి చేస్తున్నాం. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఈ రాష్ట్ర విభజనను నిలిపి వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
 
సావధానంగా ఆలకించిన ప్రణబ్
రాష్ట్రపతి ప్రణబ్.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో 15 నిమిషాలకు పైగా భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అందించిన వినతిపత్రాన్ని, ప్రజాప్రతినిధులు అందించిన స్వీయ అఫిడవిట్లను స్వీకరించారు. రాష్ట్ర విభజన ఏ మాత్రం శ్రేయస్కరంకాదని జగన్ వివరిస్తున్నపుడు ప్రణబ్ సావధానంగా వింటూ అఫిడవిట్‌లోని అంశాలను సాంతం పరిశీలించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ప్రణబ్ పలుకరించి క్షేమసమాచారాలు అడిగారు.

రాష్ట్రపతిని కలిసిన వారిలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, ఎమ్మెల్సీలు సి.నారాయణరెడ్డి, మేకా శేషుబాబు, బొడ్డు భాస్కరరామారావు, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి, కె.శ్రీనివాసులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కె.చెన్నకేశవరెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పినిపె విశ్వరూప్, రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యేలు సుజయ కృష్ణరంగారావు, పేర్ని వెంకటరామయ్య, తానేటి వనిత, జోగి రమేష్, కొడాలి నాని, గొట్టిపాటి రవికుమార్ , ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మద్దాల రాజేష్ తదితరులు ఉన్నారు.

Jagan press meet on 26th December 2013

Written By news on Thursday, December 26, 2013 | 12/26/2013

జగన్ పై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

`జగన్ పై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం`
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఓ ఛానెల్ వక్రీకరించి దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు.వైఎస్ జగన్ పై ఓ ఛానెల్ పనిగట్టుకుని విషప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. ఉద్యోగ సంఘాల గురించి వైఎస్ జగన్ ఆయన అనని వ్యాఖ్యలను, అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని గట్టు రామచంద్రరావు ఆరోపించారు.

ఆనం సోదరులకు షాక్

ఆనం సోదరులకు షాక్ : వైఎస్ఆర్ సిపిలో చేరిన పెంచల్ రెడ్డి
హైదరాబాద్: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోదరులకు నెల్లూరులో పెద్ద షాక్ తగిలింది. వారి ప్రధాన అనుచరుడు సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రాష్ట్ర వంటనూనె వర్తకుల సంఘం అధ్యక్షుడైన పెంచల్‌ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి, ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి సమక్షంలో ఈ రోజు పార్టీలో చేరారు. ఆయనతోపాట వివిధ వ్యాపార సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు  కూడా వైఎస్ఆర్ సిపిలో చేరారు.

Jagan press meet video

పార్టీలకతీతంగా సమైక్యానికి మద్దతివ్వండి: వైఎస్ జగన్

పార్టీలకతీతంగా సమైక్యానికి మద్దతివ్వండి: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ :
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ..తాను, మరో ఇద్దరు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, 23 ఎమ్మెల్యేలందరూ, డిస్ క్వాలిఫై అయిన 13 మంది తాజా మాజీ ఎమ్మెల్యేలమందరం కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి  అఫిడవిట్ ను అందచేశామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేంద్రకార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.  సమైక్యానికి తోడుగా నిలబడుతారనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలపై ఆలస్యంగా వేటు వేశారని జగన్ అన్నారు. 
 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినపుడు అనర్హత వేటు వేయకుండా.. ఒక సంవత్సరంలోపూ అయితే ఉప ఎన్నికలు జరుగవు అనే విషయం తెలుసుకున్న తర్వాతే ఆలస్యంగా అనర్హత వేటు వేశారని జగన్ తెలిపారు. అలా డిస్ క్వాలిఫై అయిన ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రపతిని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరినట్టు జగన్ తెలిపారు. 
 
సకాలంలో అనర్హత వేటు వేస్తే.. సకాలం ఎన్నికలు జరిగితే ఎమ్మెల్యేలుగా గెలిచి. సమైక్యానికి మద్దతు తెలుపుతారనే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారన్నారు. తాజా ఎమ్మెల్యేలు కూడా అఫిడవిట్లు దాఖలు చేశారు. తాము సమర్పించిన విధంగానే ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పార్టీల కతీతంగా వెళ్లి అఫిడవిట్లు దాఖలు చేయాలని జగన్ సూచించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను అఫిడవిట్లు ఇవ్వకుండా చంద్రబాబు ఆపుతున్నారన్నారు. చంద్రబాబు, కిరణ్ మాట వినకుండా ఎమ్మెల్యేలు తమ ఆత్మసాక్షిగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రార్ధిస్తున్నానని జగన్ అన్నారు. చంద్రబాబు సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని జగన్ సూచించారు.
 
రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని చెబుతూనే ఇటీవల సచివాలయంలోని 56 డిపార్ట్ మెంట్లకు ముఖ్యమంత్రి నోట్ పంపించారు.  విభజనకు సంబంధించిన అంశాలను సేకరించడానికి ఉద్యోగులందరూ నివేదిక అందించాలని నోట్ పంపించారు. ఎలాంటి చర్చ జరగకుండానే విభజన చేయాలని కిరణ్ కోరుకుంటున్నారు. విభజనపై స్పీకర్ నాదెండ్ల మనోహర్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు ఎందుకు తొందరపడుతున్నారని వైఎస్ జగన్ నిలదీశారు.   గతంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన విభజన గురించి స్పీకర్, ముఖ్యమంత్రిలకు అవగాహన ఉందా అని ప్రశ్నించారు 
 
రాష్ట్రాన్ని విడిగొట్టిన పరిస్థితులు కిరణ్, స్పీకర నాదెండ్ల మనోహర్ లను తెలుసా అని ప్రశ్నించారు. లక్నో పర్యటనకు వెళ్లిన స్పీకర్‌ను ఒక విషయం అడగదలుచుకున్నాను అని అన్నారు. ఉత్తరాఖండ్‌ ఏర్పడినప్పుడు ఏం జరిగిందో ఆమేరకు అవగాహన స్పీకర్‌కు ఉందా? అని అడగదలుచుకున్నా అని జగన్‌ అన్నారు. ఆమేరకు స్పీకర్, సీఎంలకు బుద్ధి, జ్ఞానం వీరికి ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నా అని: వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ఉత్తరాఖండ్‌ను విడగొట్టడానికి అభ్యంతరం లేదని యూపీ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతనే రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇవాళ తీర్మానం అనే పదానికి అర్థంలేకుండా చేశారు జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  అక్కడకు, ఇక్కడకు తేడా తెలియదా? అని అడగదలుచుకున్నా అన్నారు.  అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయకుంటే సీఎం కిరణ్‌, ప్రతిపక్షనేత చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు వైఎస్‌ జగన్‌ అన్నారు.  సభలో ఆమోదం తెలిపిన తర్వాత విభజన కోసం డ్రాఫ్ట్ బిల్లు రూపొందాలని .. ఎలాంటి తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలు విభజన చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. 
 
అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేస్తే దానిని కోర్టు ముందు ఉంచుతాం అని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం లేకుండానే చర్చ చేపడుతారా అని అన్నారు. కిరణ్, చంద్రబాబుల మాటలు వినకుండా అందరూ ఎమ్మెల్యేలు సమైక్యం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సమైక్య తీర్మానం చేస్తే పార్లమెంట్ లో మన బలం పెరుగుతుంది. రాష్ట్రాన్ని విభజన చేయకుండా ఆపే శక్తి మనకు వస్తుంది అన్నారు. 
 
రాష్ట్రం విడిపోతే మనం సర్వనాశనం అవుతామని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మన రాష్ట్రానిది అతిపెద్ద మూడవ బడ్జెట్ అని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తామ చేసిన విజ్క్షప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి దేవుడ్ని ప్రార్ధిస్తున్నాం అని అన్నారు. ప్రధాని పీఠంపై కూర్చోడవడానికి సహకరించిన రాష్ట్రంతోనే కాంగ్రెస్ హైకమాండ్ ఆడుకుంటుందని  వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 

Popular Posts

Topics :