2న ఇడుపులపాయలో ప్లీనరీ,ప్లీనరీకి ముందే సంస్థాగత ఎన్నికలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 2న ఇడుపులపాయలో ప్లీనరీ,ప్లీనరీకి ముందే సంస్థాగత ఎన్నికలు

2న ఇడుపులపాయలో ప్లీనరీ,ప్లీనరీకి ముందే సంస్థాగత ఎన్నికలు

Written By news on Tuesday, January 28, 2014 | 1/28/2014

2న ఇడుపులపాయలో వైఎస్ ఆర్ సీపీ ప్లీనరీ
హైదరాబాద్: వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వచ్చే నెల 2న వైఎస్ ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో నిర్వహించనున్నారు. ప్లీనరీకి ముందే సంస్థాగత ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్టు పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

ఫిబ్రవరి 1న వైఎస్ ఆర్ సీపీ సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు సీజీసీ భేటీ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారు. 3 నుంచి 4 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. సాయంత్రం 4 నుంచి 4:30 గంటల వరకు నామినేషన్లను పరిశీలించి 5 గంటలకు ఆమోదిత నామినేషన్లను ప్రకటిస్తారు. ఆ మరుసటి అంటే ఫిబ్రవరి 2న ఉదయం 8:30 నుంచి 11:30 వరకు పోలింగ్‌ జరగనుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి 12:30కు గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు.

వైఎస్ ఆర్ జయంతి రోజు.. పార్టీ ప్లీనరీ: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరపాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ చెప్పారు. ప్లీనరీకి దాదాపు 9వేల మందిని ఆహ్వానించినట్టు తెలిపారు. ఫిబ్రవరి 2న ఉదయం 8 గంటల లోపే హాజరుకావాలని సూచించారు
Share this article :

0 comments: