ఫిబ్రవరి 1న వైఎస్ ఆర్ సీపీ సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు సీజీసీ భేటీ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారు. 3 నుంచి 4 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. సాయంత్రం 4 నుంచి 4:30 గంటల వరకు నామినేషన్లను పరిశీలించి 5 గంటలకు ఆమోదిత నామినేషన్లను ప్రకటిస్తారు. ఆ మరుసటి అంటే ఫిబ్రవరి 2న ఉదయం 8:30 నుంచి 11:30 వరకు పోలింగ్ జరగనుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి 12:30కు గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు.
వైఎస్ ఆర్ జయంతి రోజు.. పార్టీ ప్లీనరీ: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరపాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ చెప్పారు. ప్లీనరీకి దాదాపు 9వేల మందిని ఆహ్వానించినట్టు తెలిపారు. ఫిబ్రవరి 2న ఉదయం 8 గంటల లోపే హాజరుకావాలని సూచించారు
0 comments:
Post a Comment