44 రోజుల తరువాత మేల్కొన్న సిఎం కిరణ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 44 రోజుల తరువాత మేల్కొన్న సిఎం కిరణ్

44 రోజుల తరువాత మేల్కొన్న సిఎం కిరణ్

Written By news on Saturday, January 25, 2014 | 1/25/2014

44 రోజుల తరువాత మేల్కొన్న సిఎం కిరణ్గట్టు రామచంద్ర రావు
హైదరాబాద్: తెలంగాణ బిల్లు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 44 రోజుల తరువాత మేల్కొన్నారని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బిల్లు తిప్పిపంపాలని స్పీకర్ కు తిరస్కరణ నోటీస్ బిల్లు తిప్పిపంపేందుకు సభలో తీర్మానం చేయాలని మంత్రి శైలజానాథ్ ద్వారా స్పీకర్ కు నోటీస్ ఇచ్చారు. ఇన్నాళ్లు సమైక్యత అని వైఎస్ఆర్ సిపి నెత్తినోరు కొట్టుకున్న కిరణ్ వినలేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా అసలు సిసలు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.

డిసెంబర్ 12నే ఈ తీర్మానం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు. ఇదే అంశంపై డిసెంబర్‌ 16న మరో లేఖ ఇచ్చినట్లు చెప్పారు. ఆయనకు సడన్ గా సమైక్యత గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: