సమైక్యాంధ్ర కోసం చంద్రబాబుని అడగండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్యాంధ్ర కోసం చంద్రబాబుని అడగండి

సమైక్యాంధ్ర కోసం చంద్రబాబుని అడగండి

Written By news on Sunday, January 12, 2014 | 1/12/2014


'సమైక్యాంధ్ర కోసం చంద్రబాబుని అడగండి'
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించడంపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. జగన్ సమైక్యతను శంకిస్తే ఆకాశం ఉమ్మేసినట్లేనన్నారు. టీడీపీ నేతల విమర్శలపై మీడియాతో మాట్లాడిన ఆమె.. సమైక్యాంధ్ర కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడ్ని అడగటం చేతగాని ఆ పార్టీ నేతలకు జగన్ విమర్శించే స్థాయి లేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని ముందు చంద్రబాబు నిలదీయమని ఆమె సూచించారు.

కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన సంస్కారానికే వదిలేస్తున్నామన్నారు. ఆ వ్యాఖ్యలతో ఆయన స్థాయి తగ్గించుకున్నారని ఆమె తెలిపారు. మారెప్ప తీరు చూస్తుంటూ వైఎస్ జగన్ వ్యతిరేక శక్తులకు కీలుబొమ్మ మారారని స్పష్టమవుతుందన్నారు. తగిన సమయంలో ఆయనపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు
Share this article :

0 comments: