సమైక్య తీర్మానం ఓటింగ్ కు వైసీపీ పట్టు, అసెంబ్లీ అరగంట వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్య తీర్మానం ఓటింగ్ కు వైసీపీ పట్టు, అసెంబ్లీ అరగంట వాయిదా

సమైక్య తీర్మానం ఓటింగ్ కు వైసీపీ పట్టు, అసెంబ్లీ అరగంట వాయిదా

Written By news on Monday, January 27, 2014 | 1/27/2014

సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. దాంతో సమైక్య తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. మరోవైపు సీఎం ఇచ్చిన నోటీసు తిరస్కరించాలని, ఓటింగ్ నిర్వహించరాదని తెలంగాణ ప్రాంత సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో సభ దద్దరిల్లింది. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సమావేశాలను అరగంటపాటు వాయిదా వేశారు.
Share this article :

0 comments: