నిజమైన సమైక్య ఉద్యమ నేత జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిజమైన సమైక్య ఉద్యమ నేత జగన్

నిజమైన సమైక్య ఉద్యమ నేత జగన్

Written By news on Saturday, January 4, 2014 | 1/04/2014

వీరవాసరం, న్యూస్‌లైన్ :
 నిజమైన సమైక్యాంధ్ర ఉద్యమ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని వైఎ స్సార్ సీపీ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. వీరవాసరం తూర్పు చెర్వు సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు సమైక్యాంధ్ర కోసం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు చెప్పారు. న్యాయపరంగా పోరాడి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ధీమా వ్యక్తం చేశారు. భీమవరం నియోజకవర్గ ఇన్‌చార్జి గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ, బీజేపీలను వచ్చే ఎన్నికల్లో బంగాళా ఖాతంలో కలపాలని నినదించారు. పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయ సాధన జగన్ వల్లే సాధ్యమన్నారు.
 
  వీరవాసరం గ్రామానికి చెందిన వెలమ యూత్, విశ్వ బ్రహ్మణ సంఘం, తెలగా సంఘ యూత్, చినపేట, పెదపేటకు చెందిన పలువురు టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రఘురామకృష్ణంరాజు, గ్రంధి శ్రీనివాస్‌లు వారికి పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అల్లు వెంకట సత్యనారాయణ, మేడిద జాన్సన్, వేగేశ్న కనకరాజు సూరి, గుణ్ణం నాగబాబు, ఆకెన వీరాస్వామి, కోటిపల్లి బాబు, నాగరాజు వెంకట శ్రీనివాసరాజు, గూడూరి ఓంకా రం, నేతల జ్ఞానసుందరరాజు, చికిలే మంగతాయారు, అమిరపు నాగభూషణశర్మ, నూకల కనకారావు, నాగరాజు సత్యనారాయణరాజు, కోడే యుగంధ ర్, రేవూరి గోగురాజు, పేరిచర్ల నరసిం హరాజు, మద్దాల రమణ, ముదునూరి రామకృష్ణంరాజు,కాటం స్టాన్లీరాజు, రెడ్డి రాంబాబు, పెద్దిరెడ్డి రామారావు, పైడికొండల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Share this article :

0 comments: