ఆదర్శ రైతులను ఆదుకోవాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆదర్శ రైతులను ఆదుకోవాలి

ఆదర్శ రైతులను ఆదుకోవాలి

Written By news on Wednesday, January 22, 2014 | 1/22/2014

ఇందిరా పార్కు వద్ద ధర్నాలో పార్టీల నేతల డిమాండ్
 హైదరాబాద్, న్యూస్‌లైన్: వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ఎంతో కృషి చేస్తున్న ఆదర్శ రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వివిధ పార్టీలకు చెందిన నేతలు డిమాండ్ చేశారు. తమకు కనీస వేతన చట్టం ప్రకారం రూ. 6,900 జీతం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బీమా తదితర డిమాం డ్లతో ఆదర్శ రైతులు ఇక్కడి ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మంగవాళం ధర్నా చేశారు. దీనికి పలు పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు, ప్రభుత్వ అధికారులకు అనుసంధానం చేయడానికి వైఎస్ ఆదర్శ రైతుల వ్యవస్థను తీసుకొచ్చారని తెలిపారు. ఆ తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు.
Share this article :

0 comments: