అక్కినేని మరణంపై జగన్ దిగ్ర్భాంతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అక్కినేని మరణంపై జగన్ దిగ్ర్భాంతి

అక్కినేని మరణంపై జగన్ దిగ్ర్భాంతి

Written By news on Wednesday, January 22, 2014 | 1/22/2014

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మరణం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అక్కినేని కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏఎన్నార్ మృతికి ప్రముఖులు సం
తాపం తెలియచేశారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరారెడ్డి, డీకే అరుణ, తమిళనాడు గవర్నర్ రోశయ్య తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
మరోవైపు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రముఖులు.... అక్కినేని భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.


 వైఎస్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అక్కినేని పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆమెతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు సుచరిత, శోభా నాగిరెడ్డి ఉన్నారు. 
Share this article :

0 comments: