వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ

వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ

Written By news on Monday, January 27, 2014 | 1/27/2014

ఇడుపులపాయలో ఈనెల ఫిబ్రవరి 2 తేదీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు.

 ఆదివారం సాయంత్రం స్థానిక వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  పార్టీ క్రమశిక్షణా కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి, సీజీసీ సభ్యుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పులివెందుల సమన్వయకర్త వైఎస్ అవినాష్‌రెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కె.బ్రహ్మనందరెడ్డి, కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌బి అంజాద్‌బాషా,  స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. మొదటిరోజు ప్లీనరీకి హాజరు కానున్న ఎంపీలు,  ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సమన్వయకర్తలు, సీజీసీ సభ్యులు, సీఈసీ సభ్యులు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు,రాష్ట్ర అనుబంధ విభాగాల కన్వీనర్లకు సమకూర్చాల్సిన భోజన, వసతి సౌకర్యాలపై సుదీర్ఘంగా చర్చించారు.  

 వైఎస్సార్‌టీఎఫ్ కార్యాలయం ప్రారంబం
 నగరంలోని జెడ్పీ కార్యాలయ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ఎస్.రఘురామిరెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి ప్రారంభించారు. వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సజ్జల వెంకట రమణారెడ్డి, రాష్ర్ట కౌన్సిలర్లు రెడ్డెప్పరెడ్డి, చల్లా ప్రసాద్, మస్తాన్‌వలీ,  నాగిరెడ్డి పాల్గొన్నారు.
Share this article :

0 comments: