విభజన బిల్లుపై చర్చలో మేము పాల్గొనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విభజన బిల్లుపై చర్చలో మేము పాల్గొనం

విభజన బిల్లుపై చర్చలో మేము పాల్గొనం

Written By news on Thursday, January 16, 2014 | 1/16/2014

'విభజన బిల్లుపై చర్చలో మేము పాల్గొనం'
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై జరిగే చర్చ్లల్లో తాము పాల్గొనమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలుగా సభలో అభిప్రాయాన్ని మాత్రమే చెబుతామని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ ముఖ్యనేతల సమావేశం ముగిసిన అనంతరం భూమన మీడియాతో మాట్లాడారు. విభజన బిల్లుపై చర్చలో పాల్గొనకుండా ఉండాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. విభజన అంశంపై రేపు జరిగే సభలో ఓటింగ్ కోసం పట్టుబడతామని ఆయన తెలిపారు. విభజన ప్రక్రియను వైఎస్సార్ సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్ని విషయాన్ని భూమన మరోసారి గుర్తు చేశారు.
 
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కలిసి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారని విమర్శించారు.  వారివురూ అసెంబ్లీకి వచ్చిన బిల్లును సజావుగా వెనక్కు పంపేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. తిరుమల దైవ సన్నిధికి వచ్చిన భక్తులపై టీటీడీ కేసులు పెట్టడాన్ని భూమన తీవ్రంగా ఖండించారు. వారిపై కేసులు పెట్టడం సరికాదని తెలిపారు.
Share this article :

0 comments: