ఓట్లు, సీట్లు కోసం దిగజారి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. సోనియా తన కొడుకు పదవి కోసం విభజనకు దిగితే... ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సోనియాను ప్రశ్నించకుండా ప్యాకేజీలడుగుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని విభజించిన సోనియాకు చంద్రబాబు అమ్ముడుపోయారని విమర్శించారు. కీలకమైన అంశంపై అసెంబ్లీలో దారుణంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కనపడకుండా డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు సీమాంధ్ర నేతలతో సమైక్యమనిపిస్తూ...మరోపక్క తెలంగాణ ప్రాంత సభ్యులతో విభజించమని కోరమంటున్నారన్నారు. బాబు, కిరణ్ లు ఈ గడ్డపై పుట్టి.... ఈ గడ్డ ప్రజలనే మోసం చేస్తున్నారని జగన్ అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉద్యోగానికి వెళితే... ఎన్నిక కష్టాలు పడాలో చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రం కలిసున్నప్పుడే నీళ్ల కోసం కొట్టుకుంటున్నామని... విడిపోతే రైతుల పరిస్థితి ఏంటన్నారు.
అసెంబ్లీలో సమైక్య తీర్మానం కోరితే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమైక్యాంధ్ర అన్నందుకా జైల్లో పెట్టారన్నారు. చంద్రబాబు నాయుడు నోట సమైక్యమన్న మాటే రావటం లేదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గీసిన గీత దాటకుండా డ్రామాలాడుతున్నారని జగన్ మండిపడ్డారు.
0 comments:
Post a Comment