కాంగ్రెస్-టీడీపీలకు సమైక్యంపై చిత్తశుద్ధి లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్-టీడీపీలకు సమైక్యంపై చిత్తశుద్ధి లేదు

కాంగ్రెస్-టీడీపీలకు సమైక్యంపై చిత్తశుద్ధి లేదు

Written By news on Friday, January 10, 2014 | 1/10/2014


                                                                                         వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీలపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆ రెండు పార్టీలకు సమైక్యంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్-టీడీపీలు కలిసి సాగిస్తున్న కుయుక్త రాజకీయాలను ఎండగట్టారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచేందుకు వారు ప్రయత్నించడం మానేసి, కొత్త నాటకానికి తెరలేపుతున్నారన్నారు. సమైక్య నినాదం వినిపించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేయడాన్ని తప్పుబట్టారు. కిరణ్ , చంద్రబాబులు కలిసి విభజనకు సహకరించడం కొరకే ఎమ్మెల్యేలపై వేటువేశారన్నారు. వైఎస్సార్ సీపీ మాత్రం ఎప్పటికీ సమైక్య బాటలోనే పయనిస్తుందని అంబటి తెలిపారు.

కాంగ్రెస్‌-టీడీపీలు కలిసి వైఎస్సార్ సీపీ విషప్రచారం చేస్తున్నాయన్నారు. సమైక్యవాదం వినిపిస్తున్న అసలుసిసలైన పార్టీ వైఎస్సార్ సీపీనే అని అంబటి తెలిపారు. విభజన బిల్లు ప్రతులను భోగి మంటల్లో వేసి తగలబెట్టాలని ఏపీఎన్జీవో నేతలు అంటున్నారని, అటువంటప్పుడు విభజన బిల్లుపై చర్చకు ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు.  విభజన బిల్లు అసెంబ్లీకి వస్తే అసెంబ్లీని ముట్టడిస్తామన్న నేతలు ఇప్పుడెందుకు ఆ పని చేయలేదని అంబటి నిలదీశారు. చర్చలో పాల్గొన్న వారే సమైక్య వాదులైతే...టీఆర్‌ఎస్ కూడా సమైక్యవాద పార్టీనేనా? అని అడిగారు. దయచేసి నిప్పులతో చెలగాటం ఆడొద్దన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గజినిలా మారారని అంబటి ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: