సుభాన్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సుభాన్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్

సుభాన్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్

Written By news on Sunday, January 5, 2014 | 1/05/2014

వీడియోకి క్లిక్ చేయండి
చిత్తూరు : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన సుభాన్‌ సాహెబ్‌ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదివారం పరామర్శించారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియెజకవర్గంలోని శంకరాపల్లిలో సుభాన్ నివాసానికి వైఎస్ జగన్ వెళ్లారు.

సుభాన్‌ సాహెబ్‌ కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సుభాన్ కుటుంబ సభ్యులకు హితువు పలికారు. తమ ఇంటికి  వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి రావడం పట్ల సుభాన్ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: