తమ పార్టీ ఎప్పటికి సమైక్యాంధ్రానే కోరుకుంటుందని ఆమె స్పష్టం చేశారు. కేంద్రం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోరాదని, విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలన్నారు. బెంగాల్ విభజన సమయంలో అసెంబ్లీ తీర్మానానికి విలువ నిచ్చారని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసెంబ్లీ అభ్యంతరంతో విభజనను ఆనాడూ నిలిపివేశారన్నారు.
కేంద్రం ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేయరాదన్నారు. విభజనకు ఓ విధానం ఉండాలి తప్ప, అడ్డగోలుగా విభజన తగదన్నారు. తాము చివరివరకూరాష్ట్రం సమైక్యంగా ఉండేందుకే కట్టుబడతామని విజయమ్మ స్పష్టం చేశారు. విభజనకు తాము వ్యతిరేకమని...సమైక్యాంధ్రతో అభివృద్ధి సాధ్యమన్నారు. కీలకమైన సమయంలో ముఖ్యమంత్రి కానీ, ప్రధాన ప్రతిపక్ష నేతకానీ సభలో ఉండరని విజయమ్మ అన్నారు.
0 comments:
Post a Comment