రెవెన్యూ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, బాబురావు, శ్రీనివాసులు హెచ్చరించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం వారు మాట్లాడారు. దివంగత మహానేత, ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యం వల్లే ఈ స్థాయిలో ఉన్నానన్న విషయాన్ని మరచిపోవద్దని వారు ఆనంకు గుర్తు చేశారు.
మరోసారి నోరు జారితే చూస్తూ ఊరుకోమన్నారు. తెలుగుదేశం పార్టీ నేత పయ్యావులకు తమను విమర్శించే అర్హత లేదన్నారు. విభజనపై మీ విధానమేంటో మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును అడగాలని వారు సూచించారు. కాంగ్రెస్ తో కుమ్మక్కైన తెలుగుదేశం పార్టీ తమ పార్టీని విమర్శించే హక్కు లేదని అమర్నాథ్రెడ్డి, బాబురావు,శ్రీనివాసులు తెలిపారు.
మరోసారి నోరు జారితే చూస్తూ ఊరుకోమన్నారు. తెలుగుదేశం పార్టీ నేత పయ్యావులకు తమను విమర్శించే అర్హత లేదన్నారు. విభజనపై మీ విధానమేంటో మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును అడగాలని వారు సూచించారు. కాంగ్రెస్ తో కుమ్మక్కైన తెలుగుదేశం పార్టీ తమ పార్టీని విమర్శించే హక్కు లేదని అమర్నాథ్రెడ్డి, బాబురావు,శ్రీనివాసులు తెలిపారు.
0 comments:
Post a Comment