తెలుగుదేశం రెండు కళ్ల సిద్దాంతం ఆ పార్టీ నేతలను మా చెడ్డ చికాకుకు గురి చేస్తున్నట్లుంది. బిజెపి అగ్రనేత,లోక్ సభలో ప్రతిపక్ష నేత సుష్మ స్వరాజ్ మాట్లాడిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ప్రత్యేకించి టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు బిజెపి అద్యక్షుడు రాజ్ నాద్ సింగ్ ను అప్పాయింట్ మెంట్ లేకుండా కలిశారట. ఆ విషయం అప్పట్లో కొందరు చెప్పినా ,నిజమా అనిపించింది. కాని సుష్మ స్వయంగా టిడిపి నేతలను ఆ సంగతి కూడా ప్రస్తావించారట.తమ అధ్యక్షుడు అనారోగ్యంతో ఉంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోకుండా ఆయన నివాసంలోకి వెళ్లడం ఏం మర్యాద? ఇది సరైన సంప్రదాయమేనా? సుష్మ టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావును ప్రశ్నించారట. మొన్న మీరే ఒక బృందంతో వచ్చి సమైక్యాంధ్ర కావాలన్నారు. ఇప్పుడు మళ్లీ వచ్చి రాష్ట్ర విభజన చేయాలంటున్నారు. అసలు మీ పార్టీ వైఖరేంటీ?అని ఆమె ప్రశ్నించడంతో ఇబ్బంది పడడం టిడిపి నేతల వంతు అయింది. సుష్మ ఇలా అడిగారట కదా అని టిడిపి నేత మండవ వెంకటేశ్వరరావును ప్రశ్నిస్తే , కొంతవరకు వాస్తవమేనని,అయితే బిజెపిలో కూడా ఇప్పుడు అదే తరహా పరిస్థితి ఉందని చెప్పామని ,పార్టీలవారీగా కాకుండా ప్రాంతాల వారీ చీలికలు రావడమే దీనికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు
http://kommineni.info/articles/dailyarticles/content_20140212_10.php
0 comments:
Post a Comment