చావలి(వేమూరు)
రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్.జగన్మోహన్రెడ్డితోనే స్వర్ణయుగం రాబోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మేరుగ నాగార్జున అన్నారు. మండలంలోని చావలి గ్రామంలో బుధవారం గడపగడపకూ వైఎస్సార్సీపీ ప్రచారం నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కళ్లల్లో ఆనందం చూడాలంటే జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. సమైక్యాంధ్ర సాధన కోసం ఆది నుంచి పట్టువీడని విక్రమార్కుడిలా పోరాడుతున్న ఏకైక వ్యక్తి కూడా జగన్మోహన్రెడ్డి ఒక్కరేనన్నారు.
గ్రామంలో పార్టీ కరపత్రాలు పంచారు. కార్యక్రమంలో వేమూరు, భట్టిప్రోలు మండలాల పార్టీ కన్వీనర్లు చందోలు డేవిడ్విజయ్కుమార్, పడమట వెంకటేశ్వరరావు, మండల యువజన కన్వీనర్ గాజుల భాను, పార్టీ నాయకులు గాజుల పట్టాభిరామయ్య, మాజీ సర్పంచ్ చవ్వాకుల రాఘవరావు, బిట్రగుంట సత్యనారాయణ, గోపాలం రాము, ఉప సర్పంచ్లు సోమరౌతు సాంబశివరావు, ఈపూరి కృపావరప్రసాదు, తలతోటి జిగినిబాబు, విష్ణుమొలకల వెంకటేశ్వరరావు, దొప్పలపూడి జ్యోతిబాబు, కూచిపూడి రవిబాబు, బోడపాటి రాంబాబు, తోటకూర సత్యనారాయణ, నీటి సంఘాల మాజీ అధ్యక్షుడు యక్కటి పాములు, సోమరౌతు సాంబశివరావు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు యల్లమాటి దేవసహాయం, కూచిపూడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
గడపగడపకూ వైఎస్సార్సీపీ ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి చావలిలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ మేరుగ నాగార్జున సమక్షంలో 500 మంది గ్రామస్తులు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో గ్రామ ఉపసర్పంచ్ సోమరౌతు సాంబశివరావు, యల్లమాటి సునంద, చావలి నీలిమ, బొర్రా శ్రీనివాసరావు, బలగాని వీరాంజనేయులు, చొప్పర ఆనందపాల్, విష్ణుమొలకల వెంకటేశ్వరరావు, తోటకూర సత్యనారాయణ తదితరులు చేరారు.
0 comments:
Post a Comment