లోక్ సభలో వైఎస్ఆర్ సీపీ అవిశ్వాస తీర్మానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లోక్ సభలో వైఎస్ఆర్ సీపీ అవిశ్వాస తీర్మానం

లోక్ సభలో వైఎస్ఆర్ సీపీ అవిశ్వాస తీర్మానం

Written By news on Thursday, February 13, 2014 | 2/13/2014

లోక్ సభలో వైఎస్ఆర్ సీపీ అవిశ్వాస తీర్మానం
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి  యుపిఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి అవిశ్వాస తీర్మానం నోటీసును గురువారం స్పీకర్ కు అందజేశారు. మరోవైపు టీడీపీ సీమాంధ్ర ఎంపీలు కూడా సభలో అవిశ్వాస తీర్మానం ఇచ్చారు.
నర్సరావు పేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నివాసంలో ఎంపీలు భేటీ అయ్యారు. సభలో తెలంగాణ బిల్లును అడ్డుకునే అంశంపై చర్చించారు. సభలో బిల్లును అడ్డుకుంటామని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ సాయి ప్రతాప్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఇచ్చారు.
Share this article :

0 comments: