హైదరాబాద్: రాజ్యసభ సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు జాతిని దారుణంగా అవమానించారని, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన స్ర్కీప్టు చదివిన చిరంజీవికి వైఎస్ఆర్సీపీని విమర్శించే అర్హత లేదని వాసిరెడ్డి పద్మ అన్నారు.
చిరంజీవి కాంగ్రెస్కు హోల్సెల్గా పార్టీని అమ్ముకున్నారని, సభలో సీమాంధ్ర కేంద్రమంత్రులు దద్దమ్మలా కూర్చున్నారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశమని పార్టీ పేరు పెట్టుకుని, తెలుగు ప్రజలకు ద్రోహం చేశారు అని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన నేరం క్షమించరానిదని అన్నారు.
బీజేపీ నేత సుష్మాస్వరాజ్ చిన్నమ్మ కాదు..విచ్ఛిన్నమ్మ అని.. వెంకయ్యనాయుడు కాదు..వేర్పాటునాయుడు అని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తీవ్ర ఆవేదనతో వాసిరెడ్డి పద్మ కంటతడి పెట్టారు.
0 comments:
Post a Comment