రేపు రాష్ట్ర బంద్ కు జగన్ పిలుపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు రాష్ట్ర బంద్ కు జగన్ పిలుపు

రేపు రాష్ట్ర బంద్ కు జగన్ పిలుపు

Written By news on Thursday, February 13, 2014 | 2/13/2014


తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్ర బంద్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రకటన చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 సెకన్లలో తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టేశారని ఆయన తెలిపారు.

బిల్లు పెట్టడానికి ఎవరూ ఆమోదం తెలపకపోయినా కాంగ్రెస్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టేందుకు కలిసి రావాలని ప్రచార సాధనాలు, ప్రతిపక్షాలను కోరారు.

బిల్లు ప్రవేశపెట్టిన తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని జగన్ తెలిపారు. విభజన బిల్లును అడ్డుకోవడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. బిల్లు ఓటింగ్‌కు వచ్చేంతవరకూ దాన్ని అడ్డుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని చెప్పారు. ఇందుకోసం ప్రతి ఎంపీ సహకారాన్ని అర్థిస్తామని జగన్ తెలిపారు.

Share this article :

0 comments: