కువైట్: కువైట్ లో ఉన్న జహర ప్రాంతములో సోమవారము శుక్ర వారం సాయంత్రం చింతకుంట ఖాసిం సాహెబ్ మరియు కె బుజ్జయ్య యాదవ్ గారి ఆధ్వర్యములో సీనియర్ వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొత్త బాస్కర్ రెడ్డి సమక్షములో మైదుకూరు, బద్వేల్ నియోజక వర్గనికి చెందిన తెలుగు దేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభిమానులు సి మహ్మద్ ఆలీ, వై సుబ్బా రెడ్డి, గౌస్, రమణయ్య, కె నరసింహులు, ఎ జయ వర్ధన్, యమ్ సుబ్బ రాయుడు, తదితరులు భారీ ఎత్తునా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈ సందర్భముగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవింద్ నాగరాజ్, నాయని మహేశ్వర్ రెడ్డి, తెట్టు రఫీ, రమణ యాదవ్, రహిమాన్ ఖాన్ ,కె వాసు దేవా రెడ్డి ,మరియు నాయకులు వై గజేంద్ర రెడ్డి,యమ్ మల్లి ఖర్జ్ఞనా రెడ్డి ,ఈశ్వర్ రెడ్డి ,యం యానాది రెడ్డి బత్తిన సుబ్రమణ్యం రెడ్డి లు వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగాపార్టీ లోకి ఆహ్వానించారు, కమిటి సభ్యులు మాట్లాడుతూ గల్ఫ్ లో ఉన్నా ప్రవాసాంధ్రులు జన నేత జగన్ గారికి తమ పూర్తి మద్దతు తెలుపుతున్నరని. గల్ఫ్ లో ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలుగు దేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు గాని అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు గాని ఇక్కడి సమస్యలను పట్టించుకోలేదని కేవలం మహానాయకుడు దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకముగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా విదేశంగా శాఖను ఏర్పాటు చేసి షబ్బీర్ అలీ గారిని రెండు సార్లు గల్ఫ్ కు పంపించడము జరిగిందని వారి మరణాంతరము మా సమస్యలను పట్టించుకునే నాధుడే లేడని. జన నేత జగన మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మా సమస్యలు తీరుతాయని నమ్మతున్నరన్నారు మా ఎన్. ఆర్. ఐ రాష్ట్ర అధ్యక్షులు మేడపాటి వెంకట్ గారు మరియు కువైట్ కో ఆర్డినేటర్ ఇలియాస్ గారు మరియు ముమ్మడి బాలిరెడ్డి గారు గల్ఫ్ సమస్యలు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారికి ప్లీనరీ లో కలసి వివరించినట్లు దానికి వారు సానుకూలంగా స్పందించి మేము అధికారంలో వస్తే తప్పకుండా గల్ఫ్ సమస్యలపై దృష్టి పెడతామని హామీ ఇచ్చరన్నారు.
Home »
» ప్రవాసాంధ్రులు జన నేత జగన్ వెంటే
ప్రవాసాంధ్రులు జన నేత జగన్ వెంటే
Written By news on Tuesday, February 4, 2014 | 2/04/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment