ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల మేరకు కాంగ్రెస్ ను వీడానని చెప్పారు. టీడీపీలోకి చేరనా అని అడిగితే వద్దన్నారని చెప్పారు. కాంగ్రెస్ లో కొనసాగనా అంటే వద్దేవద్దన్నారని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డితో వెళ్లనా అంటే వెళ్లూ వెళ్లూ అన్నారని తెలిపారు.
రాష్ట్ర విభజనతో నష్టాలే ఎక్కువని ధర్మాన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. చంద్రబాబు ఈరోజుకి కూడా తన అభిప్రాయాన్ని చెప్పలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. ఆయనకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. జగన్ అహంకారి అంటూ కొంత మంది నాయకులు అభూత కల్పనలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పై చేస్తున్న అసత్య ప్రసారాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
0 comments:
Post a Comment