అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం నైతికంగా సరికాదని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనను తాము వ్యతిరేకిస్తున్నామని, అసలు విభజన అప్రజాస్వామికమని ఆయన అన్నారు. బిల్లు విషయంలో రాజ్యాంగ విలువలను పాటించాలని కోరారు. పార్లమెంటు సహా అన్ని వేదికలపైనా తాము విభజనను వ్యతిరేకించామని, ఇకపై కూడా వ్యతిరేకిస్తూనే ఉంటామని ఆయన స్పీకర్ మీరాకుమార్ కు లేఖ రాశారు.
కాగా, బుధవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలవనున్నారు. పార్టీకి చెందిన ఎంపీలు,
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వెళ్లి ఆయన రాష్ట్రపతిని కలుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనను ఆమోదించవద్దని ప్రణబ్ ముఖర్జీని వైఎస్ జగన్ కోరే అవకాశముంది.
0 comments:
Post a Comment