న్యూఢిల్లీ: సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని బీహార్ సీఎం నితీష్కుమార్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. నితీష్ కు వైఎస్ జగన్ ఫోన్ చేసి సమైక్యాంధ్రకు మద్దతు తెలపమని అడిగారు. నిబంధనలకు విరుద్దంగా బిల్లు ప్రవేశపెట్టినందుకు వ్యతిరేకించిన ఎంపీలపై సస్పెన్సన్ వేటు వేసిన అంశాన్ని నితీష్ దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీలపై విధించిన సస్సెన్షన్ వేటు ఎత్తివేతకు సహకరించాలని వైఎస్ జగన్ విజ్క్షప్తి చేశారు. వైఎస్ జగన్ విజ్క్షప్తికి నితీష్ కుమార్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని దేశ రాజధానిలో వైఎస్ జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. సమైక్యాంధ్ర కోసం పలు రాజకీయ పార్టీల నేతలను వైఎస్ జగన్ కలుస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతు కూడగట్టే ప్రక్రియలో భాగంగా బీహార్ సీఎం నితీష్ కు వైఎస్ జగన్ ఫోన్ చేశారు.
0 comments:
Post a Comment