గతంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంగన్ వాడీ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలను విజయమ్మ ఈ సందర్బంగా గుర్తు చేశారు. త్వరలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామని విజయమ్మ ఈ సందర్భంగా అంగన్ వాడీ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని వారికి భరోసా ఇచ్చారు.
వైఎస్ విజయమ్మతోపాటు ఆ పార్టీ నేతలు శోభానాగిరెడ్డి, గట్టు రామచంద్రరావులు అంగన్ వాడి ఉద్యోగులను కలసిన వారిలో ఉన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోరుతూ గత నాలుగు రోజులుగా అంగన్ వాడీ ఉద్యోగులు ఇందిరా పార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.
0 comments:
Post a Comment