రాష్ట్రపతి భవన్ చేరుకున్న వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రపతి భవన్ చేరుకున్న వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్ చేరుకున్న వైఎస్ జగన్

Written By news on Wednesday, February 5, 2014 | 2/05/2014

రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశ రాజధానిలో శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,  పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కాసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. వీరు ఇప్పటికే రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. జగన్ తో సహా ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాష్ట్రపతితో సమావేశమవుతారు. సాయంత్రం 6:30 గంటలకు అపాయింట్ మెంట్ లభించింది.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం రాష్ట్రపతిని కోరనునుంది. అసెంబ్లీ వ్యతిరేకించిన తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని వారు విన్నవించనున్నారు.
Share this article :

0 comments: