కాంగ్రెస్ హైకమాండ్ డైరెక్షన్ లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నడుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎక్కువ మంది జాతీయ నేతలు విభజనను వ్యతిరేకిస్తున్నారు అని అంబటి అన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ నేతలను ముందే కలిశారని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇక ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు విధానం ఎంటో ఎవరికి అర్ధం కావడం లేదు అని అంబటి అన్నారు. బీజేపీ పార్టీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment