మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన వైఎస్ ఆర్ సిపి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన వైఎస్ ఆర్ సిపి

మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన వైఎస్ ఆర్ సిపి

Written By news on Wednesday, February 12, 2014 | 2/12/2014

మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన వైఎస్ ఆర్ సిపిమేకపాటి రాజమోహన రెడ్డి
న్యూఢిల్లీ: యుపిఏ ప్రభుత్వంపై వైఎస్ఆర్ సిపి మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి నోటీస్ ను స్పీకర్ కు అందజేశారు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఒక్క సభ్యుడు ఇచ్చినా స్పీకర్ స్వీకరిస్తారు. అయితే అవిశ్వాస తీర్మానానికి సభలో కనీసం 55 మంది మద్దతు ఉంటే తప్పనిసరిగా చర్చకు అనుమతిస్తారు.

 గతంలో  మేకపాటి  ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీస్ ను  స్పీకర్ మీరాకుమార్  లోక్ సభలో   చదివి వినించారు. సభ సజావుగా లేనందున అవిశ్వాస తీర్మానం చేపట్టలేకపోతున్నట్లు ఆమె తెలిపారు. సభ సజావుగా జరిగితే ఈ రోజు ఇచ్చిన నోటీస్ ను మధ్యాహ్నం చర్చకు స్వీకరించే అవకాశం ఉంటుంది.
Share this article :

0 comments: