రాష్ట్రపతితో వైఎస్ జగన్, విజయమ్మ భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రపతితో వైఎస్ జగన్, విజయమ్మ భేటీ

రాష్ట్రపతితో వైఎస్ జగన్, విజయమ్మ భేటీ

Written By news on Wednesday, February 5, 2014 | 2/05/2014

రాష్ట్రపతితో వైఎస్ జగన్, విజయమ్మ భేటీ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశ రాజధానిలో శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,  పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. జగన్ తో సహా ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాష్ట్రపతితో సమావేశమయ్యారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం రాష్ట్రపతిని కోరనునుంది. అసెంబ్లీ వ్యతిరేకించిన తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టకుండా తిరస్కరించాలని వారు విన్నవించనున్నారు. జగన్ ఇంతకుముందు పలువురు జాతీయ,  ప్రాంతీయ పార్టీ నాయకులను కలసి సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే.
Share this article :

0 comments: