అనంతరం బస్టాండు కూడలిలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు. నియంత సోనియాగాంధీ, మన్మోహన్సింగ్ల పాలనలో హైదరాబాద్ను కోల్పోయినట్టే ఆల్ ప్రీ చంద్రబాబు మాటలు వింటే సర్వం కోల్పోవాల్సివుంటుందన్నారు. రాష్ట్రాన్ని కిరణ్, చంద్రబాబు సహకారంతో యూపీఏ ప్రభుత్వం రెండు ముక్కలుగా చేసిందన్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు, తాగునీరు, సాగునీరు, విద్యుత్ను కోల్పోయి జీవితాంతం సమస్యలతో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తప్పడు కేసులు బనాయించి వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని జైలులో ఉంచారన్నారు. అయి నా ఆయన ప్రజల పక్షాన నిలి చార న్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. రాజన్న పాలన తిరిగి రావాలంటే వైఎస్సార్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సదాశివారెడ్డి, ప్రచార కార్యదర్శి ఈతకట్టు చంద్రశేఖర్, సింగిల్విండో అధ్యక్షులు రెడ్డిశేఖర్రెడ్డి, సర్పంచ్లు నాగరాజ, వెంకటరమణ, రుఖియాబేగం, బాబు, ప్రవీణ్కుమార్, ప్రసన్న లక్ష్మీ, చిన్నరెడ్డెప్పరెడ్డి, గంగాధర్, మదనపల్లె నాయకులు ిపీఎస్ఖాన్, మాజీ కౌన్సెలర్ జింకా వెంకటాచలపతి, సురేంద్ర, వైజయంతి, మల్లిక, ఈశ్వ ర్, ఎర్రయ్య, మునిరత్న, మదన్మోహన్రెడ్డి, జనార్ధన్రెడ్డి మహిళలు, రైతులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment