నేటి నుంచి వైఎస్సార్ జనభేరి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి నుంచి వైఎస్సార్ జనభేరి

నేటి నుంచి వైఎస్సార్ జనభేరి

Written By news on Saturday, March 1, 2014 | 3/01/2014

నేటి నుంచి వైఎస్సార్ జనభేరి
 ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న జగన్
 
 సాక్షి, హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం ‘వైఎస్సార్ జనభేరి’ మోగించనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే గుంటూరు, నల్లగొండ జిల్లాల్లో ఓదార్పుయాత్ర కూడా నిర్వహించనున్నారు. జగన్ శనివారం నుంచి పూరించనున్న జనభేరి, ఓదార్పుయాత్ర కార్యక్రమాల వివరాలను పార్టీ పోగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
 
     మార్చి 1, 2014: జగన్ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుపతిలో సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు.
 రాత్రికి తిరుమల లో బస చేస్తారు.
     మార్చి 2,2014: తిరుమల నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
 
     మార్చి 3, 2014: హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. సా. 4గంటలకు ఏలూరు బహిరంగసభలో ప్రసంగిస్తారు.
 
     మార్చి 4, 2014: సా.4 గంటలకు నిడదవోలు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
 
     మార్చి 5, 2014: సా.4 గంటలకు ఖమ్మం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
 
     మార్చి 6, 2014: సాయంత్రం 4 గంటలకు గుంటూరు జిల్లా నరసరావుపేట బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
 
     మార్చి 7, 8, 2014: గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తారు.
 
     మార్చి 9 నుంచి నల్లగొండ జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తారు
Share this article :

0 comments: