ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలకు ముందు 2012 మే 2న బుధవారం తిరుమలకు వచ్చా రు. 3న గురువారం మరోసారి శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుని వెళ్లారు. కడప పార్లమెంట్ స్థానంలో తాను రికార్డు స్థా యి మెజారిటీతో గెలుపొందడమే కాకుండా 18 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 16 స్థానాలను గెలిపించారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తన పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తం గా పర్యటించనున్నారు.
ఇందులో భాగంగానే శనివారం తిరుమలకు వచ్చి స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని వైఎస్.జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు తిరుపతిలో పర్యటిస్తారు. రాత్రికి తిరుమలకు చేరుకుని ఇక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుని తిరుగుప్రయాణమవుతారు. ఆ తర్వాత ఎన్నికల జనభేరి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు
0 comments:
Post a Comment