కువైట్: మలియా ప్రాంతములో జాయింట్ కో ఆర్డినేటర్ ముమ్మడి బాలిరెడ్డి గారి ఆధ్వర్యములో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 4వ ఆవిర్భావ దినాన్ని కమిటి సభ్యులు మరియు యన్ ఆర్ ఐ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కోడూరు చిన్నంపల్లె యూత్ భారీగా అభిమానులు తో కలిసి కేక్ కట్ చేసినారు.
ఈ సందర్భముగా బాలిరెడ్డి గారు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి ప్రజా సంక్షేమం కోరకుప్రజల పక్షనా పోరాడుతున్నా ఏకైక పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని తెలుగు ప్రజలందరు కలిసి ఉండాలని రాష్ట్రం సమైక్యాముగా ఉండాలని నిబద్ధతో ఉద్యమం చేసిన పార్టీ వైయాస్సార్ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు నుంచి ప్రజలలో లేకుండా చేయాలనీ ఎన్నో కుట్రలు డిల్లీ నుంచి గల్లి వరకు పాలక మరియు ప్రతిపక్షం ఎన్నో కుమ్మక్కు రాజకీయాలు చేసిన్నారు కానీ తెలుగు ప్రజలు వై యస్ కుటుంభానికి అండగా నిలబడి ప్రతి ఎన్నికలలో అఖండ విజయాని వై యస్ కాంగ్రెస్ పార్టీ కి ఇచ్సినందుకు తెలుగు ప్రజలకు వై యస్ ఆర్ కాంగ్రెస్ కువైట్ తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నాము . అలాగే రాష్ట్రంలో జరిగే సార్వత్రిక, స్థానిక ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ముందుండి కృషి చేయాలి కార్య కర్తలకు పిలుపునించారు. నాయకుడు అంటే ఇలా ఉండాలి నాయకత్వం అంటే ఇలా ఉండాలి పార్టి అంటే ఇలా ఉండాలి నిత్యం ప్రజలతో ప్రజల తరుపున నిల్చివ్యక్తీ జగన్ గారు సిమాంధ్ర అభివృద్ధి కొరకు తెలంగాణ పుణ నిర్మాణాకి ప్రజా బలం గల వై.యస్. జగన్ గారి అధినాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవసరమన్నారు ఈ కార్యక్రమములో కార్య కర్తలు మరియు అభిమానులుభారీగా పాల్గోన్నారు.
0 comments:
Post a Comment