ధరలు పెంచని ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ దే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ధరలు పెంచని ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ దే

ధరలు పెంచని ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ దే

Written By news on Thursday, March 20, 2014 | 3/20/2014

ధరలు పెంచని ఏకైక ప్రభుత్వం వైఎస్ దేవీడియోకి క్లిక్ చేయండి
చీమకుర్తి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఒక్క రూపాయి కూడా ధరలు పెంచలేదని వైఎస్ఆర్ సీపీ నాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు. ధరలు, పన్నులు పెంచని ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ దేనని ఆమె చెప్పారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో నిర్వహించిన జనపథం రోడ్ షోకు అశేష సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి వైఎస్ షర్మిల మాట్లాడారు.

నిరంతరం ప్రజల గురించి, వారి సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించిన వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత వరుసగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం పన్నుల మీద పన్నులు వేసి ప్రజల నడ్డి విరిచాయన్నారు. కిరణ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు తన భుజాలపై పెట్టుకుని మోశారని, ధరల విషయంలో గానీ, మరే విషయంలో గానీ ఏనాడూ ప్రభుత్వాన్ని నిలదీసిన పాపాన పోలేదని మండిపడ్డారు. సంక్షేమ ప్రభుత్వం రావాలన్నా.. ధరలు అదుపులోకి రావాలన్నా.. నాటి రాజన్న రాజ్యాన్ని మళ్లీ చూడాలన్నా వైఎస్ఆర్ సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని, పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు.
Share this article :

0 comments: