నూజివీడు, గిద్దలూరు : మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ నాయకుల పట్ల పోలీసులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో పోలీసులే దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్కడి 24వ వార్డు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి చందన్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఎస్ఐ స్వయంగా ఆయనను కాలర్ పట్టుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. దీంతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై పోలీసుల జులుం కొనసాగుతోంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అన్నారం బాబు వర్గీయులు దొంగ ఓట్లు వేస్తుండగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే, బాబు వర్గీయులను ఏమీ అనకుండా.. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై ఎస్ఐ దాడి చేశారు. ఇక మరోవైపు అద్దంకి మున్సిపాలిటీ 18వ వార్డు వద్ద క్యూలో ఒక ఓటరు సొమ్మసిల్లి పడిపోయారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై పోలీసుల జులుం కొనసాగుతోంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అన్నారం బాబు వర్గీయులు దొంగ ఓట్లు వేస్తుండగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే, బాబు వర్గీయులను ఏమీ అనకుండా.. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై ఎస్ఐ దాడి చేశారు. ఇక మరోవైపు అద్దంకి మున్సిపాలిటీ 18వ వార్డు వద్ద క్యూలో ఒక ఓటరు సొమ్మసిల్లి పడిపోయారు.
0 comments:
Post a Comment