జగన్ ఫ్లెక్సీలతో నిండిన ఖమ్మం పట్టణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ఫ్లెక్సీలతో నిండిన ఖమ్మం పట్టణం

జగన్ ఫ్లెక్సీలతో నిండిన ఖమ్మం పట్టణం

Written By news on Wednesday, March 5, 2014 | 3/05/2014

జగన్ ఫ్లెక్సీలతో నిండిన ఖమ్మం పట్టణం
ఖమ్మం : ఖమ్మంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ జనభేరి సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మం పెవీలియన్ గ్రౌండ్స్‌లో వంద అడుగుల భారీ వేదికను తీర్చిదిద్దారు. సుమారు 2 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని పార్టీ నేతలు ప్రకటించారు. బడుగు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా, తండ్రి చూపిన బాటలో అహర్నిశలు  పేద ప్రజల కోసం శ్రమిస్తున్న జగన్ బుధవారం ఖమ్మంలో నిర్వహించే ‘జనభేరి’ బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి.

ఎన్నికల ప్రచారంలో భాగంగా... తెలంగాణలో తొలిసారి ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సభకు భారీగా ప్రజలు హాజరవుతారని అంచనా. ఈ సభను విజయవంతం చేసేందుకు నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  వైఎస్సార్‌సీపీ నేతలు ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలతో ఖమ్మం కళకళలాడుతోంది.

మరోవైపు  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి స్వాగతం పలికేందుకు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. వైఎస్ఆర్‌ చేపట్టిన పథకాల అభివృద్ధి ఫలాలు అందుకున్న వారిగా వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలుకుతామన్నారు.  ఇప్పటికే ఖమ్మం పట్ణణం మొత్తం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఎక్కడా చూసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాలే కనిపిస్తున్నాయి. తెలంగాణలోని రాజన్న అభిమానులు ఖమ్మం సభకు తరలిరావాలని వైఎస్‌ఆర్‌ అభిమానులు పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: