వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను ఓదర్పుయాత్ర చేయొద్దనడం నుండి రాష్ట్ర విభజన వరకు కాంగ్రెస్ ఎన్నో తప్పులు చేస్తూ పోతే, దానికి టీడీపీ పునరావాసం అయిందన్నారు. చంద్రబాబుకు ప్రజల కోసం పాటుపడడానికి ఏనాడు చేతులు రాలేదు కాని, ఈ రోజు పార్టీలో చేరిన వారికి పచ్చ జెండాలు కప్పడానికి మాత్రం చేతులు వస్తున్నాయని విమర్శించారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీడీపీని ఎవరూ నమ్మడం లేదని వాసిరెడ్డి పద్మ తెలిపారు.
కాంగ్రెస్ నేతలను చేర్చుకునేందుకు బాబు చేస్తున్న హడావిడి చూస్తుంటే జాలేస్తుందన్నారు. కాంగ్రెస్ లీడర్లకు పునరావాస కేంద్రంగా టీడీపీ మారిందన్నారు. లీడర్లు తప్ప కేడర్ లేని పార్టీ కాంగ్రెస్ అని ఆమె అభివర్ణించారు. చంద్రబాబూ... మీకు కాంగ్రెస్ వాళ్లంటే ఎందుకంత మమకారం? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. సోనియా గాంధీ. చంద్రబాబులది ఒకే విధానమని, జగన్ను ఎలా ఎదుర్కోవాలన్నదే వీరి సిద్ధాంతమని తెలిపారు. చంద్రబాబు ఇంకా ఊతకర్రలతో నడవాలనుకుంటున్నారని, 65ఏళ్లు వచ్చినా అధికారంపై ఆశ చావలేదని పద్మ విమర్శించారు.
0 comments:
Post a Comment