Home »
» జగన్ వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: ముత్యాల పాప
జగన్ వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: ముత్యాల పాప
కాకినాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ది ఒక్క వైఎస్ జగన్ వల్లే సాధ్యమని నర్సీపట్నం ఎమ్మెల్యే ముత్యాల పాప స్పష్టం చేశారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ముత్యాల పాప పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ముత్యాల పాప మాట్లాడుతూ... స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమన్నారు. ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ కూడా పాల్గొన్నారు.
0 comments:
Post a Comment