మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే గండికోట ప్రాజెక్టు పూర్తయిందని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పాతబస్టాండ్లో నిర్వహించిన సభలో వైఎస్ విజయమ్మ మాట్లాడారు. ఎన్టీఆర్ హయాంలో గండికోటకు శంకుస్థాపన జరిగిందన్నారు. తొమ్మిదేళ్లపాటు పాలన చేసిన చంద్రబాబు గండికోటను ఏనాడూ పట్టించుకోలేదన్నారు.
వైఎస్ హయాంలోనే గండికోట నిర్మాణం పూర్తి చేసుకుందన్నారు. కరవు జిల్లాలో ఉద్యోగావకాశాలను కల్పించాలని 2007లో బ్రహ్మణి ఫ్యాక్టరీకి వైఎస్ శ్రీకారం చుట్టారన్నారు. వైఎస్ అకాలమృతితో బ్రహ్మణి ఆగిపోయిందని, దీని గురించి పట్టించుకునే నాధుడే లేడన్నారు. వైఎస్ ఆశయాలను జగన్బాబు కొనసాగిస్తారన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే నియోజకవర్గంలో అర్హులైన వారికి ఇళ్లు, పెన్షన్లు అందిస్తామన్నారు. అలాగే చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు.
వైఎస్ హయాంలోనే గండికోట నిర్మాణం పూర్తి చేసుకుందన్నారు. కరవు జిల్లాలో ఉద్యోగావకాశాలను కల్పించాలని 2007లో బ్రహ్మణి ఫ్యాక్టరీకి వైఎస్ శ్రీకారం చుట్టారన్నారు. వైఎస్ అకాలమృతితో బ్రహ్మణి ఆగిపోయిందని, దీని గురించి పట్టించుకునే నాధుడే లేడన్నారు. వైఎస్ ఆశయాలను జగన్బాబు కొనసాగిస్తారన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే నియోజకవర్గంలో అర్హులైన వారికి ఇళ్లు, పెన్షన్లు అందిస్తామన్నారు. అలాగే చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు.
0 comments:
Post a Comment