గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీవారికి చాలా సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ మహానేత తనయుడిగా జగన్ కు వారసత్వం రాదా అని ఆయన ఎల్లో మీడియాను ప్రశ్నించారు. శ్రీవారి దర్శనం చేసుకున్న జగన్ అంశాన్ని వివాదస్పదం చేసి ఎల్లో మీడియా పాపం మూట కట్టుకుందన్నారు. ఆ పాపం ఎల్లో మీడియాకు తగలక మానదన్నారు. వచ్చే ఐదేళ్లు సీఎంగా వైఎస్ జగన్ ప్రతి సంవత్సరం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని జోస్యం కురుణాకర్ రెడ్డి చెప్పారు.
తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున విఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం జగన్ రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ బయలుదేరారు.
0 comments:
Post a Comment