పురపాలక సంఘంలో వైఎస్సార్‌సీపీ బోణీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పురపాలక సంఘంలో వైఎస్సార్‌సీపీ బోణీ

పురపాలక సంఘంలో వైఎస్సార్‌సీపీ బోణీ

Written By news on Saturday, March 15, 2014 | 3/15/2014

వైఎస్సార్‌సీపీ  బోణీ కొట్టింది!
గూడూరు పురపాలక సంఘంలో వైఎస్సార్‌సీపీ బోణీ కొట్టింది. ఎన్నికల నామినేషన్ ఘట్టం శుక్రవారంతో పూర్తయింది. 33 వార్డుకు వైఎస్సార్‌సీపీ తరపున ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఆ పార్టీ బోణీ కొట్టినట్లుగా చెప్పవచ్చు. పట్టణంలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న 33వ వార్డును జనరల్ మహిళకు కేటాయించారు. ఆ వార్డులో తాళ్ల సుబ్బమ్మ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
ఆమెకు డమ్మీ అభ్యర్థిగా రామాబత్తిన వాసవి నామినేషన్ దాఖలు చేసింది. స్క్రూట్నీ, ఉపసంహరణ అనంతరం ఆ వార్డు నుంచి తాళ్ల సుబ్బమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించడం లాంఛనమే. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఆ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆ వార్డు నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.
Share this article :

0 comments: