న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసి) రేపు ఉదయం సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఈసి రేపు ఉదయం 10.30 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు మీడియాకు సమాచారం అందించింది. దేశవ్యాప్తంగా లోక్ సభకు ఎన్నికలు నిర్వహిస్తారు. మన రాష్ట్రంలో లోక్ సభతోపాటు శాసనసభకు కూడా ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్ని విడతలలో ఎన్నికలు నిర్వహించేది రేపు తెలుస్తుంది. ఆరు లేక ఏడు విడతలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మాత్రం చివరి విడతలో జరుగుతాయని తెలుస్తుంది.
దేశంలో ఆయా ప్రాంతాలలో వాతావరణం, పండుగలు, పరీక్షలు ...అన్నింటిని దృష్టిలోపెట్టుకొని ఈసి ఎన్నికల తేదీలను ప్రకటిస్తుంది. షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. తొలివిడతలో ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహిస్తారు. మన రాష్ట్రంలో చివరి విడతలో మే మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ఎన్నికలను మే 15కు పూర్తి చేస్తారు.
ఎన్నికలకు కావలసిన పోలీస్, రక్షణ, ఎన్నికల నిర్వహణ సిబ్బందిని ఈసి సిద్దం చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా 8 లక్షల పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేస్తారు. గత సాదారణ ఎన్నికలతో పోల్చితే పది కోట్ల మంది కొత్త ఓటర్లు చేరారు. ఈ యువకులను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని 40 లక్షల రూపాయలకు పెంచారు.
దేశంలో ఆయా ప్రాంతాలలో వాతావరణం, పండుగలు, పరీక్షలు ...అన్నింటిని దృష్టిలోపెట్టుకొని ఈసి ఎన్నికల తేదీలను ప్రకటిస్తుంది. షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. తొలివిడతలో ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహిస్తారు. మన రాష్ట్రంలో చివరి విడతలో మే మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ఎన్నికలను మే 15కు పూర్తి చేస్తారు.
ఎన్నికలకు కావలసిన పోలీస్, రక్షణ, ఎన్నికల నిర్వహణ సిబ్బందిని ఈసి సిద్దం చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా 8 లక్షల పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేస్తారు. గత సాదారణ ఎన్నికలతో పోల్చితే పది కోట్ల మంది కొత్త ఓటర్లు చేరారు. ఈ యువకులను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని 40 లక్షల రూపాయలకు పెంచారు.
0 comments:
Post a Comment