మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలకు తోడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన కూడా వెలువడనున్న నేపథ్యంలో... పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్య నేతలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యవసరంగా సమావేశం కానున్నారు. లోటస్ పాండ్ లో శనివారం ఉదయం పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన భేటీ అవుతారు. కాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో గుంటూరు జిల్లాలో పర్యటన ముగించుకుని జగన్ గత రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.
కాగా జగన్ మోహన్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన వాయిదా పడింది. గుంటూరు జి్లా మాచర్లలో శనివారం రెండోరోజు ఓదార్పు యాత్ర ముగించుకుని ఆదివారం నుంచి ఆయన నల్గొండ జిల్లాలో యాత్ర చేయాల్సి ఉంది. అయితే మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ఇప్పటికే వెలువడటం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన కూడా వెలువడుతున్న నేపథ్యంలో జగన్ పార్టీ ముఖ్యనేతలతో అత్యవసరంగా భేటీ అవుతున్నారు. మళ్లీ ఏ తేదీల్లో జగన్ నల్గొండ జిల్లాలో పర్యటించేది తరువాత ప్రకటిస్తామని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు.
కాగా జగన్ మోహన్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన వాయిదా పడింది. గుంటూరు జి్లా మాచర్లలో శనివారం రెండోరోజు ఓదార్పు యాత్ర ముగించుకుని ఆదివారం నుంచి ఆయన నల్గొండ జిల్లాలో యాత్ర చేయాల్సి ఉంది. అయితే మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ఇప్పటికే వెలువడటం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన కూడా వెలువడుతున్న నేపథ్యంలో జగన్ పార్టీ ముఖ్యనేతలతో అత్యవసరంగా భేటీ అవుతున్నారు. మళ్లీ ఏ తేదీల్లో జగన్ నల్గొండ జిల్లాలో పర్యటించేది తరువాత ప్రకటిస్తామని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు.
0 comments:
Post a Comment